Sunday, March 8, 2015

శుభోదయం!! దిష్టి ఎందుకు తీస్తారు?

                                       శుభోదయం!!
                                 దిష్టి ఎందుకు తీస్తారు?
               
               చిన్నారుల పుట్టినరోజు, పండగ వేడుకలలో, శుభకార్యాలలో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ దిష్టిని విభిన్నపద్దతుల్లో తీస్తూ వుంటారు. పిల్లలూ, పెద్దలూ ఘన విజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు, అతిగా నీరసించి డీలా పడినప్పుడు దిష్టితీస్తారు. అదేవిధంగా పిల్లలకి బయటిజనం దృష్టిదోషం తగలకుండా వుండాలని, నిద్రలో కలవరింతలు, ఉలికిపాట్లు  లేకుండా నిద్రపోవాలని, పసుపూ,సున్నం కలిపిన నీటితో  దిష్టి తీస్తారు.
                     చిన్నపిల్లలు లేదా పెద్దలు ఎవరైనా కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనటంవల్ల వారి చుట్టూ అంటా చేరటంవల్ల కొంతమంది అస్వస్థతకు గురిఅవుతారు. అందుకే వివాహవేడుకలలోను,పుట్టినరోజు వేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరిలో ఎర్రనీళ్ళతో దిష్టితీస్తారు.ఎరుపురంగు పదేపదే చూడటంవల్ల అనేక రోగాలు సమసిపోయి మనసుకు ప్రశాంతతతోపాటు ధైర్య గుణం వస్తుంది.
                                           ../\..  

No comments:

Post a Comment

Total Pageviews