Wednesday, November 29, 2017

🙏తెలుగు భాషాభిమానులందరికి🙏

ఒక అవధానిగారు అవధానం చేస్తుండగా తెలివైన పృఛ్ఛకుడు అడిగిన విషయమిది.

దత్తపది!
తమన్నా - సమంతా - త్రిష - కాజల్
(ఈ పదాలన్నీ వచ్చేలా పద్యం చెప్పాలి)

అవధానిగారి పూరణ!
భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో...

తేటగీతి:
తాతమన్నన బొందిన ధన్యుడీవు
దోసమంతగ నెంచడు - కాశి రాజ
పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము

🙏తెలుగు భాషాభిమానులందరికి🙏

No comments:

Post a Comment

Total Pageviews