Sunday, March 15, 2015

మా తాత గారై కీ. శే . శ్రీ విస్సా వేంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు:- 41వ పద్యం .-


41వ పద్యం .
స్వార్ధపు చింతవీడి నిజశక్తిని  మానవసేవ సల్పుచున్ 
అర్ధము కామ మోహముల నన్ని జయించియు సత్వచిత్తుడై
వ్యర్ధపులోక వాసనల వాంఛల నెల్లపరిత్యజించి మో
క్షార్ధిగదైవ చింతనల సల్పెడు భక్తులు ధన్యులేగదా!!! 
42) కన్నులు రెండు పాపులట కానగలేవట నీదుతేజమున్
కన్నులు మూసి ధ్యానమున కానగావచ్చని నీదు రూపమున్ 
సన్నుతిచేయుచుంటి జలజాతవిలోచన నాదుదృష్టికిన్ 
తిన్నగా దర్శనంబోసగి దీవెనలీగదే వెంకటేశ్వరా !!!  
43) పుట్టుకనిచ్చి పెంచి తగుపోషణ కల్పన జేసినట్టి నీ
పట్టున భక్తి యేర్పడెను భావమునందున నిన్ను నిల్పి నే
గుట్టుగా నెల్ల వేళలను కొల్చుచునుంటి మహానుభావ! నే
పట్టినపట్టు వీడనిక పంతము సేయక కానరాగదే!!
44) అందముకెల్ల మూలమయి, ఆభరణములంబుకన్న మిన్నయై 
విందును గూర్చెడిన్ కురుల వేడుకనిత్తురు మ్రోక్కుగానటన్
పొందుగ భక్తితత్పరత పూరుషులున్ మగువల్ వినమ్రులై 
అందున పుణ్యమేమొగద అర్పణ చేయగకుంతల్లమ్ములన్!!! 
45) 

No comments:

Post a Comment