Friday, January 19, 2018

శుభోదయం.

ఎప్పుడూ ఎక్కువ అహాన్ని...గర్వాన్నీ
తలకెక్కించుకోకూడదు... ఎందుకంటే
పరుగుపందెంలో మొదటి బహుమతి
పొందినవారు బంగారుపతకం కోసం
తల దించవసిందే !!!

ఆశ మనిషిని బ్రతికిస్తుంది 
ఇష్టం మనిషిచేత ఏదైనా చేయిస్తుంది 
కానీ... అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది.

చదువుందని గర్వపడకు 
చదువులేదని భాధ పడకు 
చదువున్న లేకున్నా...
సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తాం.

మనిషిని సంస్కరించి,కుటుంబ వ్యవస్థని చక్కదిద్ది,
ఇంటిని ప్రశాంత నిలయంగా మార్చి,
తద్వారా సమాజాన్ని ఆనంద నిలయంగా 
మార్చుకొమ్మని తెలిపింది సనాతన ధర్మం.

తల్లి తండ్రుల పుణ్య ఫలం వలన 
మంచి గుణాలు,చతురత పొందుతాము.
వంశం వలన ఉదారత్వం లభిస్తుంది.
కాని స్వంత పుణ్యం వలననే అదృష్టవంతులం కాగలం.
అందుకే అందరం సత్కర్మలను చెయ్యాలి.
అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్య కార్యాలు చెయ్యాలి.

No comments:

Post a Comment