Saturday, May 16, 2020

"వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు "

దేనిమీదైనా విరక్తి పుట్టవచ్చేమోగానీ, జీవితం మీద విరక్తి కలగకూడదు. బతుకు తీపి అనేదే ఒక అద్భుతం. మనం అల్పం అనుకున్న క్షుద్రజీవిలో సైతం ఈ తీపి ఉంటుంది. చీమ మొదలు సార్వభౌముని వరకు సమానంగా విస్తరించినది ఈ బతుకు తీపి. జీవితానికి ఉన్న విలువ అపారం-లౌకికమైన ప్రయోజనాలతోపాటు అలౌకికమైన పరమార్థాన్ని సాధించే గొప్పతనం ` జీవితం ' అనే అంశంలో ఇమిడి ఉంది. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సమృద్ధిగా అనుభవించడానికి కావల్సిన నైతికసూత్రాలు, నియమాలుం అభ్యాసాలు ఏర్పరచారు మన మహర్షులు. "ఆరోగ్యవంతమైన శరీరంలో మంచి మనస్సు ఉండాలి. ఈ రెండింటినీ సాధించడమే అసలైన ప్రయోజనం " అన్నది స్పష్టమైన నిర్వచనం. అందుకే ఎప్పుడూ జీవితంపై రోత కలగకూడదు. ఈ అవగాహన లేక క్షణికోద్రేకాలకు లోనైనవాడు బతుకునే పూర్తిచేసుకోవాలనుకుంటాడు. ఈ ఆత్మహత్యా ప్రయత్నధోరణి ఉద్రేకం వల్ల, ఒత్తిడివల్ల కలుగుతుంటుంది. జీవితంలో అర్థంలేని పరుగులు పెడుతూ, `ప్రశాంతత ' అనే స్వాభావిక స్థితిని కోల్పోవడం చేత అవగాహన అనేది లేకుండా బతుకు సంపదని పోగుట్టుకుంటున్నాం.
హనుమంతునికి సీతాదేవి జాడ తెలియక నిరాశతో తిరిగివెళ్ళడంకన్నా ఆత్మహత్య చేసుకుంటే మేలు అనుకుంటాడు. కానీ బుద్ధిమంతుడు కనుక తక్షణం ఆ బలహీనత నుంచి బయట పడ్డాడు. సక్రమంగా అలోచించాడు. "వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు ".. ఇది హనుమంతుని మాట. ఈ ఒక్క వాక్యాన్ని మంత్రంలా మననం చెస్తే చాలు. నేటితరం అంతా వాళ్ళ గది గోడల మీదనో, డైరీ మొదటి పేజీలోనో మొత్తానికి హృదయఫలకంపై బలంగా లిఖించుకోదగిన వాక్యమిది. "చనిపోవడంలో చాలా దోషాలున్నాయి. జీవించి ఉంటే చాలు శుభాలను చూడవచ్చు " ఒక్కొక్కసారి అంతా శున్యమే అనిపిస్తుంది. కానీ ఆ క్షణం దాటితే అంతా మేలే కలగవచ్చు. ఈ లోపల తొందరపడి మృత్యువుని స్వాగతిస్తే, ఆ శుభాలన్నీ అందుకొనే అవకాశమే మిగలదు. ఈ వాక్యంతో ఆత్మబలాన్ని పుంజుకున్న హనుమ ఆశావాదం ఫలించింది. అశోకవనంలో సీతజాడ దొరికింది. ఆశావాదానికున్న సత్ఫలం అది.
"అలలా వచ్చిన దిగులే అంతాకాదు".
తనకుమారులందరూ విశ్వామిత్రుని కారణంగా మరణించాక వసిష్ఠునికి దు:ఖోద్రేకం కలుగుతుంది. కొండపైనుండి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడు. ఈ లోపల భూదేవి ఆయనను చేతితో పట్టి కాపాడి మందలిస్తుంది-" ఓ వెర్రీ! చచ్చిపొతే జీవితం తీరిపోతుందా?" అని ప్రశ్నిస్తుంది. ఇది చాలా సూటి ప్రశ్న. మరణిస్తే దేహాన్ని కోల్పోతాం. కానీ మరో ఉపాధితో జీవించక తప్పదు. అప్పుడు ఇప్పటి ఆత్మహత్యాపాపఫలాన్ని సైతం అనుభవించవలసిందే. నిజంగా జీవితం పై విరక్తి వస్తే `శాశ్వతశాంతి ' కి చేరువయ్యేందుకు ఈ జీవితాన్ని వినియోగించుకోవాలి. ఙ్ఞానాన్ని సంపాదించాలి. దీనితో తపస్సుచేసి బ్రహ్మఙ్ఞానంతో సుస్థిర శాంతిని పొందుతాడు. ఈ కథలో జీవుని పరంగా తాత్త్విక స్పృహతో ఆత్మహత్యా ప్రయత్నం అవివేకం అని స్పష్టపరచారు.
ఇలా ధార్మికంగా, లౌకికంగా, తాత్త్వికంగా ఆలోచించినా జీవితానికన్నా విలువైనది లేదు. ముందు మనం-అటు తరువతే లోకం. బయట వస్తువులపై, వ్యక్తులపై మమకారం, ఆశా పెంచుకొని అవికోల్పోతే బతుకునే బలి చేసుకొనడం మూర్ఖత్వం. బయట వస్తువు లభించక ముందూ మనం ఉన్నాం. అది పోయినా ఉంటాం. మనల్ని నాశనం చేసుకొనే హక్కు మనకే లేదు. " ఓర్చినమ్మకి తేటనీరు ' అన్నట్లు సహనానికి ఫలం సౌభాగ్య

No comments:

Post a Comment

Total Pageviews