Friday, November 27, 2015

శివుడు అభిషేక ప్రియుడు


శివుడు అభిషేక ప్రియుడు అంటారు ఎందుకు?

విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి. " అప ఏవ ససర్జాదౌ " అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.
మంత్రంపుష్పంలోని " యోపా మాయతనంవేద " ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతున్ని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.

"ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్" అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పటిస్తూ అభిషేకం చేయాలి." పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ " పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.





వేంకటాచల నిలయా... వైకుంటపుర వాసా పంకజనేత్రా... పరమ పవిత్రా శంఖ చక్రధర చిన్మయ రూపా నమో నమః


వేంకటాచల నిలయా... వైకుంటపుర వాసా
పంకజనేత్రా... పరమ పవిత్రా 
శంఖ చక్రధర చిన్మయ రూపా 
నమో నమః



Thursday, November 26, 2015

మంచిమాట!!


మంచిమాట!!

మన నాశనం కోరుకున్నవారికి 
మనం మంచి చేయాలి 
అదే మనం వారికి ఇచ్చే శిక్ష 


ఓం శ్రీ మాత్రే నమ:


ఓం శ్రీ మాత్రే నమ:

పదునాలుగు లోకాల మంగళ మూర్తీ .. సతతం నీకు నమస్కరిస్తున్నాము 
గాడర భక్తితో నీముందు నిలుచున్నాము .. నీ మహాశక్తిలోని తేజస్సు మమ్ము ఆవహించుగాక  నిన్ను కొలచినవారు  సౌభాగ్యవంతులు ... నిన్ను మరచిన వారు అభాగ్యులు.నీ అనుగ్రహం సదా మాపై ఉండాలని కోరుకొంటున్నాము.



Wednesday, November 25, 2015

విభూతి శివునికి యిష్టం


విభూతి శివునికి యిష్టం 


             విభూతి శివునికి యిష్టం.విభూతిని నుదట ధరిస్తే, చెమటను పీలుస్తుంది. శరీరంలోని ఉష్ణాన్ని అదుపుచేస్తుంది. విభూతిని మెడ, భుజాలు, చేతులకు రాసుకుంటారు. విభూతి శివునికి యిష్టం. దేహంలోని నరాలు ఉబ్బటం, బాధపెడుతుంటాయి. విభూతి సక్రమంగా రాస్తే, వీటిని అరికట్టవచ్చు. మన శరీరంలో 72,000 నరాలుంటాయి.

                               హోమంలో విభూతిని, ఆవునెయ్యి, ఔషధమొక్కలతో హోమంలో వేస్తుంటారు. ఈ విధంగా చేస్తే, వాతావరణ కాలుష్యం బారినుండి రక్షించుకోవచ్చు. సంస్కృతిలో విభూతిని భస్మం అంటారు. 'భాసతియత్‌ తత్‌ భస్మ' అని బ్రహ్మపురాణం చెబుతుంది. శైవపురాణం ' భస్మకల్మష భక్షనాత్‌' అని పేర్కొంది. అంటే భస్మం పాపాలను హరిస్తుంది. 'భక్షణత్‌ సర్వపాపానామ్‌ భస్మేతి పురికీర్తితమ్‌' పాపనాశిని కాబట్టే, దానిని భస్మమ్‌ అని కొనియాడారు.విభూతికి భారతీయ సంస్కృతిలో విశిష్టస్థానముంది అని పెద్దలు చెపుతారు.



శుభోదయం

శుభోదయం 

అజ్ఞానపు చీకట్లను తొలగించుటకై
జ్ఞానమనే జ్యోతులను వెలిగించుటకై
ఈ భువిలో జన్మించెను ఒక దివ్య తేజము
అది షిరిడీ లో  వెలిసిన సాయి రూపము.




Tuesday, November 17, 2015

5వ, 6వ, 7వ అధ్యాయములు

5వ అధ్యాయము

వన భోజన మహిమ
ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజాన౦తరమున శివాలయమున న౦దు గాని విష్ణాలయము న౦దు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము  తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర(గన్నేరు) పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠము వెళ్ళుదురు. భగవద్గీత  కొంత వరకు పఠి౦చిన వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క పదమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో ని౦డి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరించవలయును.

వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను - యని వశిష్టుల వారు చెప్పిరి. అది విని జనక రాజు' ముని వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల కారణమేమి యని' ప్రశ్ని౦చగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.

కిరాత మూషికములు మోక్షము నొందుట
రాజా! కావేరి తీర మ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ . చిన్నతనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై  మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని  తండ్రి కుమారుని పిలిచి ' బిడ్డా! నీ దురాచారముల కంతు లేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన, నువ్వు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటుల చేయు'మని భోదించెను. అంతట కుమారుడు' తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతిరేకార్ధములతో పెడసరంగా సమాధాన మిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రీ ' ఓరి నీచుడా! కార్తిక మాస ఫలమునంత చులకనగా చుస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొర్ర యందు యెలుక రూపములో బ్రతికేదవు గాక' అని కుమారుని శపెంచెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి' తండ్రీ క్షమి౦పుము. ఆ జ్ఞానా౦ధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ  యెంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాపవిమోచన మోప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమెమో వివరింపు' మని ప్రా  ధేయ పడెను. అంతట తండ్రీ' బిడ్డా! నా శాపమును అనుభవి౦చుచు మూషికము వై పడియుండగా నీ వెప్పుడు కార్తిక మహత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొ౦దుదువు' అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.

ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభిరామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తిక మాసములో నొక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యా సమేతముగా  కావేరి నదిలో స్నానార్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించు చుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజ ద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందే మోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని' వీరు బాటసారులై వుందురు. విరి వద్దనున్న ధన మపహరించ వచ్చు' ననెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికి నమస్కరించి' మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో నా మనస్సులో చెప్పారని ఆనందము కలుగుచున్నది? గాన , వివరింపుడు' అని ప్రాధేయ పడ్డాడు. అంత విశ్వామిత్రుల వారు' ఓయి కిరాతక! మేము కావేరి నది స్నానార్ధమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరి౦చి కార్తీక పురాణమును పఠించుచున్నాము  . నీవును యిచట కూర్చుండి  సావధానుడవై  ఆలకి౦పుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తిక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మవృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణాన౦తరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది ' మునివర్య! ధన్యోస్మి! తమ దయవల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా! ఇహములో సిరి సంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తిక పురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి ఐదవ అధ్యాయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.

6 వ అధ్యాయము

దీపారాధన విధి- మహత్మ్యం
ఓ రాజ శేష్ట్రుడా! యే మానవుడు  కార్తిక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గాని, ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఆ ప్రకారముగా కార్తిక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.

శ్లో|| సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతి రస్తూ సదామమ||

అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్ధ మేమనగా,  'అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగు ఈ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక! ' అని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణుల కైననూ భోజన మిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి  కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్టుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట

పూర్వ కాలమున ద్రవిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది  ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చుధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసారా ధ్యాని౦చుట గాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని  పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడ బెట్టుచు౦డెడిది.

అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని  అమె కడకు వెళ్లి' అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి  అసహ్యముగా  తయారగును. అటువంటి యి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని  చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత:కాలమున నదీస్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వని వుపదేశ మిచ్చెను.

ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై  మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తిక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షమునందినది కావున  కార్తిక మాస వ్రతములో అంత మహత్మ్యమున్నది.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి
అరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.

7వ అధ్యాయము

శివకేశవార్చనా విధులు
వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా! కార్తిక మాసము గురించి, దాని మహత్మ్యము ను  గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈ మాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తిక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్షమింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు  చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి గల వారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసినచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్వాలయమున గాని జండా ప్రతిష్టించినచొ యమ కింకరులు దగ్గరకు రాలేరు సరి కదా, పెను గాలికి ధూళి రాసు లెగిరి పోయినట్లే కోటి పాపము లైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తిక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా జేసి, నైవేద్యమిడి కార్తిక పురాణము చదువు చుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తిక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తిక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవార మైనను చేసి శివకేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుము యని చెప్పెను.

' నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం
నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి
సప్తమధ్యాయము - సప్తమదిన పారాయణము సమాప్తం.  

Saturday, November 14, 2015

నవంబర్ 15, 2015; ఆదివారం; నాగుల చవితి.

నాగుల చవితి 


నాగుపామును హిందువులు ఎంతో ఆరాధ్యంగా, దైవంగా పూజించుకుంటారు. కార్తీక శుద్ధ చతుర్థిని నాగులచవితి అంటారు. ఇది దీపావళి అమావాస్య తరువాత వస్తుంది. నాగులచవితిని కొందరు శ్రావణశుద్ధచతుర్థినాడు కూడా జరుపుకుంటారు. ఈ పండుగరోజు నాగేంద్రుడిని అర్చిస్తే..శరీరంలో వున్న సర్వరోగాలు పోయి, సౌభాగ్యవంతులు అవుతారని భారతీయులు ప్రగాఢంగా నమ్ముతారు.
యోగాశాస్త్రం ప్రకారం.. మన శరీరంలో వున్న వెన్నెముక - కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘‘పాము’’ ఆకారంలో వుంటుందని తెలుపుతున్నారు. ఇది మానవునిలో సత్వగుణ సంపత్తిని తొలగిస్తూ వుంటుందంటారు. అప్పుడు నాగులచవితిరోజున విషసర్ప పుట్టలను ఆరాధించి, అందులో పాలుపోస్తే మానవునిలో వున్న విషసర్పం కూడా నశిస్తుందని నమ్ముతారు.
ఇలా ప్రతినాగులచవితినాడు స్త్రీలు ఆరాధిస్తే.. వారికి శుభప్రదమైన సంతానం కలుగుతుందని, ఆ పిల్లలు కూడా ఆచరిస్తే వారికి మంచి భర్తలు లభిస్తారని పలువురు విశ్వసిస్తారు.
ఈ నాగులచవితి ఈనాటినుంచి చేస్తున్న సంస్కృతికాదు.. పురాతనకాలాల నుంచి ఈ సంప్రదాయం నడుస్తూ వస్తోంది. దీంతో సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని, సంతానప్రాప్తి కలుగుతుందని పురాణాలలో కూడా ఎన్ని కథలున్నాయి.

నాగులచవితి నాడు
‘‘కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||’’
అనే శ్లోకాన్ని పఠిస్తే.. కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది.

వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఎందుకంటే.. సూర్యుడు ఈ నక్షత్రంలో సరిగ్గా కార్తీక శుద్ధ చవితినాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు.
ప్రస్తుతమున్న శాస్త్రీయపద్ధతి ద్వారా చెప్పాలంటే.. సర్పాలు మనకు పరోక్షంగా సహాయపడుతున్నాయి. ఎందుకంటే భూమి అంతర్భాగంలో వున్న క్రిముల్ని, పురుగుల్ని ఇవి తినేసి భూసారాన్ని కాపాడుతున్నాయి.

బ్రహ్మ పురాణంలో సంతానం కథ :
చంద్రవంశానికి రాజయిన శూర్యసేనుడు, అతని భార్య సంతానం కలగడం కోసం చాలారోజులు తపస్సు చేశారు. అయితే వారికి ఒక సర్పం (మగ) జన్మించింది. అయినా వీరు ఆ సర్పాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. కొన్నిరోజుల తరువాత ఆ సర్పం మనుషుల్లా మాట్లాడటం మొదలుపెట్టింది. దానిని చూసి రాజు, రాజుభార్య ఒక్కసారి ఖంగుతిన్నారు.

ఆ పాము తనకు ఉపనయనం చేయించమని కోరింది. ఆ రాజు అలాగే చేశాడు. కొన్నాళ్ల తరువాత ఆ సర్పం తనకు పెళ్లి చేయించమని కోరింది. దాంతో ఆ రాజు ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి తిరిగి రప్పించుకున్నారు.
అత్తింటికి వచ్చిన ఆ కోడలు తన భర్త పాము అని తెలుసుకుంటుంది. అయినా ఆమె ఏమాత్రం భయపడకుండా అతనితోనే కలిసిమెలిసి వుంటుంది. ఒకరోజు పాము ‘‘నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడటం లేదు’’ అని అడుగుతుంది. అప్పుడు ఆమె ‘‘భర్త ఎటువంటివాడైనా స్త్రీకి దైవంతో సమానం. దైవాన్ని చూసి ఎవరైనా భయపడతారా’’ అని సమాధానం ఇస్తుంది.

ఇది విన్న ఆ పాము ‘‘శివుని శాపం వల్ల నేను ఇలా పాములా అయ్యాను’’ అని చెబుతుంది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి చవితి వ్రతాన్ని ఆచరించి, గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపం నుండి విమోచనం పొందుతాడు.

కార్తిక పురాణం 4 వ అధ్యాయము





బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు మరియు కార్తిక పురాణం భక్తి సమాచారం తో మీకు మా విస్సా ఫౌండేషన్ బ్లాగ్ ద్వారా అందిస్తున్నాము, ఈ దిగువ లింక్ క్లిక్ చెయ్యండి! తెలుసుకుందాం! అలా ఆచరిద్దాం!! తరిద్దాం!!

4 వ అధ్యాయము...     దీపారాధన మహిమ

ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తిక మాసమున ముఖ్యముగ యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా! కార్తిక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొ౦దుదురు. కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.
శతృజిత్ కథ
పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చుటకు ఒక ముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నీ వెందుల కింత తపమాచరించు చున్నావు? నీ కోరిక యేమి?' యని ప్రశ్ని౦చగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని చెప్పెను. అంత ముని పుంగవుడు ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల నీ కోరిక నెర వేరగలదు' యని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలతో నియమాను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముహూర్తమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మాదులు జేసి, ఆ బాలునకు 'శతృజిత్' యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.
రాకుమారుడు శతృజిత్ దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనమునకు రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండి౦చుచు తన
కామవా౦ఛ తీర్చుకోనుచుండెను.
తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శతృజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వ ర్ణి౦చుట మన్మధున కైననూ శక్యము గాదు. అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై కామవికారముతో నామెను సమీపించి తన కామవా౦ఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములనుభవించెను.
ఇట్లుఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్దరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవా౦చ తీర్చు కొనుచు౦డిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.
ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలు దేరి గర్భగుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున' చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహాదానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామా౦ధకారముతో కన్ను మిన్నుతెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను. అంత యమకింకరులు' ఓ బాపడా ఎవరెంతటి నీచులైననూ, యీ పవిత్ర దినమున, అనగా, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ' అలా యెన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు యెలాగునున్నప్పటికి మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తి౦చ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆయనకు దానము చేసెను. శివదూతలు వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి.
వింటివా రాజా! శివాలయములో దీపారాధన చేయుట వలన వారి పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొ౦దుదురు.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి
నాలుగో అధ్యాయము - నాల్గవ రోజు పారాయణము సమాప్తం.

ఈనాటి తరానికి తెలియని మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నింటిని ఒకసారి గుర్తుచేసుకుని మన పిల్లలకి చూపిద్దామా?

బాలల కార్యక్రమాలు అంటే కార్టూన్ చానల్స్, వీడియో, సెల్ ఫోన్, కంప్యూటర్ గేమ్స్ కాదు, చదువంటే బండెడు బరువులు, బట్టీ చదువులతో అందమైన బాల్యం కరువవుతోంది. పెద్దలూ కొద్దిగా ఆలోచిద్దాం!  మన చిన్న నాటి అందమైన బాల్యాన్ని చిన్నారులకు అందించే ప్రయత్నం చేద్దాం! ఇది చదవండి "నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అన్న రసగంగాధర తిలకాన్ని అద్దిన ఈ అక్షరాలు అందమైన గతాన్ని సాక్షాత్కరిస్తాయి. బాలల దినోత్సవం చిన్నారులకు శుభాభినందనలతో! మీకోసం విస్సా ఫౌండేషన్.  

ఈనాటి తరానికి తెలియని మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నింటిని ఒకసారి గుర్తుచేసుకుని మన పిల్లలకి చూపిద్దామా?


మనదేశంలో పుర్వం చాలా ఆటలుండేవి..
కాలక్రమంలో చాలా ఆటలను అందరం మరచిపోయాము..
ఈ తరానికైతే కొన్నింటి పేర్లు కూడా తెలియదు..
అలాంటి ఆటలన్నింటినీ మరొక్కసారిఒ గుర్తు చేసుకుంటూ..
అష్టాచమ్మా,దాడీ,పచ్చీసు,పులు మేక,వామనగుంటలు,
కుంటాట,కోకో,కబాడీ,ఎద్దులపందాలు,టైరాట,కర్రబిళ్ళా, 
గోలీలు,కొబ్బరాకుల బొమ్మలు,టెంకాట,ఏడుపెంకులాట...
రాముడూ సీతా,కరెంట్ షోక్,చింతగింజలాట,దొంగ పోలీస్,
అంటాట,వొంగుదూకుళ్ళు,
ఇలా మరికొన్ని అందరి కోసం..

R Tulasi Chowdary's photo.
తెలుగాడ పిల్లల ఆటలు "..........డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .
గుజ్జన గూళ్ళు ,
గచ్చ కాయలు !
తొక్కుడు బిళ్ళా,
తోపుడు బండీ !
అష్టా చెమ్మా ,
చెమ్మా చెక్కా !
ఒప్పుల గుప్పా ,
వైకుంఠ పాళీ !
చింత పిక్కలూ ,
వామన గుంటలు !
స్తంబాలాట ,
కోతీ కొమ్మచ్చి !
చాకలి బాన ,
లక్క పిడతలు !
బువ్వాలాట ,
బొమ్మల పెళ్ళీ !
వీరీ వీరీ గుమ్మడి పండూ ,
వీటి పేరేమి ??
దెబ్బకు రెండు ద్రాక్షా పళ్ళు !
బహుమానం !!
(.................. మన " తెలుగు ఆడ పిల్లలకు " అంకితం .....smile emoticon డా . కృష్ణ సుబ్బారావు
తెలుగాడ పిల్లల ఆటలు "..........డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .
గుజ్జన గూళ్ళు ,
గచ్చ కాయలు !
తొక్కుడు బిళ్ళా,
తోపుడు బండీ !
అష్టా చెమ్మా ,
చెమ్మా చెక్కా !
ఒప్పుల గుప్పా ,
వైకుంఠ పాళీ !
చింత పిక్కలూ ,
వామన గుంటలు !
స్తంబాలాట ,
కోతీ కొమ్మచ్చి !
చాకలి బాన ,
లక్క పిడతలు !
బువ్వాలాట ,
బొమ్మల పెళ్ళీ !
వీరీ వీరీ గుమ్మడి పండూ ,
వీటి పేరేమి ??
దెబ్బకు రెండు ద్రాక్షా పళ్ళు !
బహుమానం !!
(.................. మన " తెలుగు ఆడ పిల్లలకు " అంకితం .....smile emoticon
 డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ 


07/11/2014పొన్నాడ 07/11/2014
R Tulasi Chowdary's photo.
R Tulasi Chowdary's photo.
R Tulasi Chowdary's photo.
R Tulasi Chowdary's photo.
+44
R Tulasi Chowdary added 48 new photos to the album: ఆటలు.

Friday, November 13, 2015

ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమో నమః

ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమో నమః 

శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు  ఎందుకు?

                                   శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు అనేది సంప్రదాయసిద్ధమైన  ఆచారం. "అజయోర్ధ్వియోర్మధ్యే నంది శంకర యోరపి" అనే  ప్రమాణాన్ని బట్టి మేకపోతుల నడుమ, ద్విజుల నడుమ, నంది శంకరుల నడుమ నడువరాదని అంటారు. ఎందుకంటే శివుడు భక్తానుగ్రహ తత్పరుడు. నంది శివభక్తులలోఅగ్రగణ్యుడు, శివునికి వాహనమైనవాడు, శివుని  పాదపద్మాలను ఎడతెగకుండా నందీశ్వరుడు దర్శిస్తుంటాడు. శంకరుడు గూడా అవిచ్చిన్నంగా భక్తాగ్రగణ్యుడైన  నందీశ్వరుడిపై అనుగ్రహదృష్టిని ప్రసరింపచేస్తుంటాడు. వీరిరువురి మధ్య మానవులు నడిస్తే వారి పరస్పర దృష్టి ప్రసారానికి విచ్చేదం ఏర్పడుతుంది. అందువల్ల ఇరువురికీ అడ్డుతగిలిన వారిపై వారికీ కోపం రావచ్చు. అందుకే  శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు అని పెద్దలు చెపుతారు.



కార్తిక మాస స్నాన మహిమ 3 వ అధ్యాయము







బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు మరియు కార్తిక పురాణం భక్తి సమాచారం తో మీకు మా విస్సా ఫౌండేషన్ బ్లాగ్ ద్వారా అందిస్తున్నాము, ఈ దిగువ లింక్ క్లిక్ చెయ్యండి! తెలుసుకుందాం! అలా ఆచరిద్దాం!! తరిద్దాం!! 
https://www.youtube.com/watch?v=BE_bvEwMlSw

కార్తిక మాస స్నాన మహిమ

జనక మహరాజా ! కార్తిక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్యములు విడువలేక, కార్తిక స్నానములు చేయక, అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి గ జన్మింతురు.

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు నయినా  స్నాన దాన జపత పాదులు చేయక పోవుట వలన  అ నేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురించి నాకు తెలిసిన యితిహాసమొకటి  వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకి౦పుము.


బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట

ఈ భరత ఖండ మందలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞాన శాలి, సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధ యాత్రాసక్తుడై  అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వటవృక్ష౦బు  పై భయంకర ముఖములతోను, దీర్ఘ  కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ, ఆ దారిన బ్రోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయక౦పితము చెయుచు౦డిరి. తీర్ధ యాత్రకై  బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున  పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి  యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటి౦చుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ! ఆ నాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని, ని౦డు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు  బారినుండి నన్ను రక్షించు తండ్రీ!  యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులుకు జ్ఞానోదయ౦ కలిగి ' మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు  జ్ఞానోదయ౦ అయినది మమ్ము రక్షింపుడు' యని ప్రాధేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని' ఓయీ! మీరెవరు? ఎందులకు మికీ  రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు' యని పలుకగా వారు' విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు' అని అభయమిచ్చి, అందొక  బ్రహ్మ రాక్షసుడు తన వృ త్తాంతము యీవిధముగా చెప్పసాగెను. 
'నాది ద్రావిడ దేశం. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడి నై యుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పసువునై ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యం గా ధనం లాగుకోనుచు, దుర్వ్యనాలతో  భార్య పుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమాన పరచుచు, లుబ్దుడనై లోక కంటకుడిగ నుంటిని. 

అట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తల౦పుతొ పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతనికి వద్ద నున్న ధనము, వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంటి వైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి ' ఓరి నీచుడా! అన్యక్రా౦తముగ డబ్బుకూడ బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాన, నివు రాక్షసుడవై నర భక్షకుడవుగా నిర్మానుష్య ప్రదేశాములలో నుందువు' గాక! యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తప్పింకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా! కాన నాయపరాధము క్షమి౦పుమని వానిని ప్రార్ధి౦ చితిని. అందులకాతడు దయదలచి' ఒయీ! గోదావరి క్షే త్రమ౦దొక వట వృక్షము గలదు. నివందు నివసించుచు బ్రాహ్మణువలన పునర్జన్మ నొ౦దుదువు గాక' యని వెడలిపోయాను. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపమున ఈ దుష్కార్యములు చేయుచుంటిని కాన, ఓ విప్రోత్తమా  నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు- ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించి వారికి  తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రాయను నటులచేసి, వారి యెదుటనే నా బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచు౦డెడివాడను.  నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగను, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవర్తి౦చితిని. కాన, నాకీ రాక్షససత్వము కలిగెను. నన్నీ పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము' అని బ్రాహ్మణుని పాదములపై  బడి పరిపరి విధముల వేడుకొనెను.

మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియజేసెను' మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు ఆలయములోఅర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డెడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము  లైనను నర్పించక, భక్తులు గొని తెచ్చిన సంభారములను  నా వుంపుడుగత్తెకు అందజేయుచు మద్య మాంసములు  సేవించుచు పాపకార్యములు  చేసినందున నా మరణాన౦తరము ఈ రూపము ధరించితిని, కావున నన్ను కూడా పాప విముక్తి ని కావి౦పు' మని ప్రార్ధించెను.

ఓ జనక మహారాజ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినాలాపము లాలకించి ' ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును' యని, వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతవిముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికి సకలైశ్వర్యములు ప్రసాది౦చుదురు. అందువలన, ఎంత ప్రయత్నమైనా సరే కార్తిక స్నానాల నాచరించాలి.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య ముందలి
మూడవ రోజు అధ్యాయము - మూడవ రోజు పారాయణము సమాప్తము.


శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం !!!

  ఆంజనేయస్వామి సిందూరాన్ని పెట్టుకుంటే లాభాలు!

1. ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.

2. ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది. 

3.ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది. 

4. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.

5. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతరు. 

6. విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు. 

7. లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది.
 
8. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.

9. ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ నెరవేరుతాయి.

10. ఆంజనేయస్వామికి సిందూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుంది.
ఆంజనేయ స్వామి సింధూరం ధరించడం  వలన పై లాభాలు కలుగుతాయని 
పెద్దలు చెపుతారు.

Thursday, November 12, 2015

భగినీ హస్త భోజనం విశిష్టత.! సోదర సోదరీమణులు అందరికీ భగినీ హస్త భోజనం శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు!!

                                           భగినీ హస్త భోజనం విశిష్టత.!
 సోదర సోదరీమణులు అందరికీ భగినీ హస్త భోజనం శుభాకాంక్షలు 
                           మరియు శుభాభినందనలు!!
సోదరుల,  సోదరీమణుల ప్రేమకి అద్దంపట్టే పండుగలలో రాఖీ పండుగ వంటి విశిష్ట పండుగ ఈ భగినీ హస్త భోజనం!  కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను జరుపుకుంటారు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అని అంటారు. అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం. సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు, చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజుకార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమె   తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెలిని  ఏదైనా వరం కోరుకోమనగా... యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు. అందువలనే ఈ తిథికి *యమ ద్వితీయ* అని పేరు వచ్చింది.  తరవాత యమునమ్మనుపరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు, ఘనంగా సారె పెట్టి చెల్లెలిని పంపించాడు.
  ఒకప్పుడు  సమష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ, కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను, అనుబంధాలను శక్తిమంతం చేసుకునేవారు. అటువంటి హార్దిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక, కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. అందువల్లనే కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన, మంచి- మర్యాద, అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది ఈ * భగినీ హస్త భోజన * విశిష్టత.

ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి.

             మరొక్కసారి సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు
                              మరియు శుభాభినందనలు!!

శుభోదయం !!



                                             శుభోదయం !!

                మాతృ, పితృ, ఆచార్య, దైవ, ఋషి రుణాలంటే:-

       పశుపక్షాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బయటకి తెరిమెయ్యరు. తల్లి, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగుచేసి ఇచ్చి, పెళ్లికుడా చేసి ధర్మ,అర్ధాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు.ప్రేమతో పెంచుతారు. తల్లి, తండ్రి ఋణం ఎంతసేవచేసినా తీరదు. ముసలితనంలో వాళ్ళని బిడ్డల్లా చూసుకోవడమే.
                        
                      మలమూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను నిస్వార్ధముతో పెంచి పెద్ద చేసిన తండ్రి రుణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నేర్పించినందుకు గురు రుణాన్ని, మనకి బుద్ధిని, కర్మని ఇస్తున్న దైవ రుణాన్ని భక్తి ద్వారా, ధర్మ మార్గం ద్వారా,సకల శాస్త్రాలను, ధర్మాలను గ్రందాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి   రుణాన్నితీర్చుకోవాలి. వివాహం ద్వారా అన్ని రుణాలని తీర్చి తిరిగి తాను రుణ పడటమే మానవ జన్మ.

పరమశివునికి ఉన్న అనేక పేర్లలో " ఆశుతోషుడు" ఒకటి !


మానవులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి భగవంతుని నవవిదాలుగా, స్మరణ ద్వారా.. అభిషేకం ద్వారా కొలుస్తారు.
హర హర మహా దేవ శంభో శంకర!  పరమశివునికి ఉన్న అనేక పేర్లలో " ఆశుతోషుడు" ఒకటి. ఆశుతోషుడు అంటే స్వల్ప మాత్రానికే సంతోషించేవాడని అర్ధం. శివుడికి చేసే అభిషేకాలు వాటి ఫలితాలు.

  తులసి తీర్ధం - మనశ్శాంతి 
పాలు    -    దీర్ఘాయువు 
పెరుగు   -    వంశాభివృద్ధి
చక్కర    -    శత్రుజయం 
        తేనె       -    విద్య,సంగీత వృద్ధి 
నెయ్యి    -    స్వర్ణార్హత
పన్నీరు   -    సకల ఐశ్వర్యప్రాప్తి 
చందనం  -   ధనాభివృద్ధి
విభూది   -   సర్వరోగ నివారిణి 
నిమ్మరసం -  మరణ భయం హరం
పంచామృతాలు  -    దేహధారుడ్యం
పువ్వులు   -   సుఖం 
అరటిపళ్ళు  -   వ్యవసాయం 
అన్నం       -  పెండ్లి, సౌభాగ్యం 
పంచలోహ జలం  -   మంత్రసిద్ధి 
కస్తూరి    -   కార్యసాఫల్యం
దానిమ్మరసం  -   శత్రువశీకరణ 
సుగంధ ద్రవ్యములు  -  ఆయుర్దాయం 



స్కాంద పురాణా౦ తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము




బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు మరియు కార్తిక పురాణం భక్తి సమాచారం తో మీకు  మా విస్సా ఫౌండేషన్ బ్లాగ్ ద్వారా అందిస్తున్నాము, తెలుసుకుందాం! అలా ఆచరిద్దాం!! తరిద్దాం!! 
click this link for Bhramasri Chaganti vari Pravachanam.


సోమవార వ్రత మహిమ

జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన  విధి కార్యక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కానీ, సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావదానుడవై ఆలకించుము. కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నది స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పటన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తేసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంట ప్రాప్తియు నొందును. దీనిని ఉదాహరణముగ నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరిచెదను శ్రద్దగా వినుము.

కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట
పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటు౦బమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల దినములుకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి ' తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశియుడగు మిత్ర శర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అబ్యాసించిన వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్య వాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడను యగుటచే లోకులేల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొను చు౦ డేడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్టురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దుషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చు చున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మత్రమా మెయ౦దభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, "చీ పోమ్మనక , విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారి నిష్టురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెను ' కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు.

ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ , ఒకనాటి రాత్రి తన భర్త గాడా నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, తాళి కట్టిన భర్త యన్న విచక్షణ గాని, దయాదాక్షి న్యాలుగాని లేక, ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్య౦గా దొడ్డి దారిని గొ౦పొయీ ఊరి చివరనున్న పాడు నూతిలో బడవైచి పైన చెత్త చెదరములతో నింపి, యేమియు యెరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు యే ఆట౦కములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు, తన సౌందర్య౦ చూపి యెందరినో క్రీ గ౦టనే వశపరచుకొని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతో డ నూరమిన్చుచు వర్ణ సంకరు రా లయ్యెను. అంతేయే గాక పడుచు కన్యలను, భర్తతో కాపురము చేయుచున్న పడుచులను, తమ మాటలతో చేరదీసి, వారి క్కూడా దుర్భుదులు నేర్పి పాడు చేసి, వితులకు తార్చి ధనార్జన కూడ చేయసాగాను.

జనక రాజ! యవ్వన బి౦కము యెంతో కాలము౦డదు గదా! కాలమోక్కరితిగా నడవదు. క్రమక్రముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రానములు బయలుదేరినవి. ఆ వ్రానములనుండి చీము, రక్తము రాసికరుత ప్రార౦భంయ్యేను. దానికి తోడూ శరీరమంతా కుష్ట్టు వ్యాది బయలుదేరి ద్రుర్ఘందము వెలువడుచున్నది. దినదినమూ శరీర పటుత్వము కృశించి కురూపియై భయ౦కర రోగాములతో భాదపడుచున్నది. ఆమె యవ్వనములో వుండగా ఎన్నో విడల తృపి కలిగేంచిన విటులయే ఒక్కరు ఇప్పుడమను తొ౦గి చూడ రైరి . ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమునే టులైననూ పలుకరించునని, ఆ విది మోఘమైనను చుదకున్తిరి. కర్కశ ఇటుల నరక బాధలను భావించుచు, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొ౦పోయి ప్రేత రాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్ర గుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చుపించి, భటులారా! ఈమే పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే యీమెను తెసుకువెల్లి ఎర్రగా కాల్చిన ఎనుప స్తా౦భామునకు కట్ట బెట్టుదు' అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖి౦చిన౦ దులకు గాను-యమభ టులామేను ఎర్రగా కాల్చిన ఇనుప స్తా౦భామునూ కౌగాలిచుకోమని చెప్పిరి. భర్త నూ బండ రాతిలో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యబిచారి ణి లుగా చేసినదుకు సలసల కరగిన నూనెలో పదవేసిరి. తల్లితండ్రులకు అత్తమామలకు యపకీర్తి తేచినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను, పోసి, ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కు౦బిపాకమును నరకములో వేయగా, అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు,జెర్రులు, కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఈటు ఏడు తరాలవాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక భాదల ననుభవించి, కడకు, కాళింగ దేశమున కుక్క జన్మమెత్తి, ఆకలిభాడ పడలేక ఈల్లిలు తిరుగుచుండగా, కర్రతో కొట్టువారు, కొట్టుచు తిట్టువారు, తిట్టుచు, తరుమువారు తరుముచు౦డిరి. ఈట్లుండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమ వార వ్రతమాచరించి ఉపవసము౦డి, సాయ౦త్రము నక్షత్ర దర్శనము చేసి, బలియన్నాము నరుగుపై పెట్టి, కళ్ళు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నాము తినెను. వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ ధానముచే జరిపెంచిన బలియన్నమగు టచే తను ఆ రోజు కార్తిక మాస సోమ వరమగు ట వలననూ, కుక్క ఆ రోజంతాయు ఉపవాసముతో వుండుతవలనాను, శివ పూజ పవిత్ర స్థానామిన ఆ ఎంత దొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మ౦ తా రజ్ఞా న ముద్భ వించెను. వెంటనే ఆశునకము 'విప్రకులోతమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టుకోనేను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులేవారు లేన౦దుకు లోనికేగాను. మరల ' రక్షిపుము రక్షిపుము'యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నివు ! నీ వృతంతమేమి!' యని ప్రశ్నించగా, యంత న కుక్క 'మహానుభావ! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులా౦గానను నేను. వ్యభిచారి ణి నై అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్య ములో కుష్టు రాలనై తనువు చాలించిన తరువాత, యమ దూతలవల్ల మహానరక మనుభవిన్చినా పూర్వికుల పుణ్య ఫలము వల్ల ఈజన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తిక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా , మీరు చేసిన కార్తిక సోమ వార వ్రత ఫల మొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను'యని వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాల మహాత్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకుధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను. వింటివా జనక మహారాజ! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందు-మని వశిష్టునకు హితబోద చేసి, ఇంకను ఇట్లు చెప్పదొడ౦గిరి.


ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము సమాప్తం.

Total Pageviews