Friday, November 13, 2015

కార్తిక మాస స్నాన మహిమ 3 వ అధ్యాయము







బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు మరియు కార్తిక పురాణం భక్తి సమాచారం తో మీకు మా విస్సా ఫౌండేషన్ బ్లాగ్ ద్వారా అందిస్తున్నాము, ఈ దిగువ లింక్ క్లిక్ చెయ్యండి! తెలుసుకుందాం! అలా ఆచరిద్దాం!! తరిద్దాం!! 
https://www.youtube.com/watch?v=BE_bvEwMlSw

కార్తిక మాస స్నాన మహిమ

జనక మహరాజా ! కార్తిక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్యములు విడువలేక, కార్తిక స్నానములు చేయక, అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి గ జన్మింతురు.

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు నయినా  స్నాన దాన జపత పాదులు చేయక పోవుట వలన  అ నేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురించి నాకు తెలిసిన యితిహాసమొకటి  వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకి౦పుము.


బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట

ఈ భరత ఖండ మందలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞాన శాలి, సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధ యాత్రాసక్తుడై  అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వటవృక్ష౦బు  పై భయంకర ముఖములతోను, దీర్ఘ  కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ, ఆ దారిన బ్రోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయక౦పితము చెయుచు౦డిరి. తీర్ధ యాత్రకై  బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున  పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి  యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటి౦చుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ! ఆ నాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని, ని౦డు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు  బారినుండి నన్ను రక్షించు తండ్రీ!  యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులుకు జ్ఞానోదయ౦ కలిగి ' మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు  జ్ఞానోదయ౦ అయినది మమ్ము రక్షింపుడు' యని ప్రాధేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని' ఓయీ! మీరెవరు? ఎందులకు మికీ  రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు' యని పలుకగా వారు' విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు' అని అభయమిచ్చి, అందొక  బ్రహ్మ రాక్షసుడు తన వృ త్తాంతము యీవిధముగా చెప్పసాగెను. 
'నాది ద్రావిడ దేశం. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడి నై యుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పసువునై ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యం గా ధనం లాగుకోనుచు, దుర్వ్యనాలతో  భార్య పుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమాన పరచుచు, లుబ్దుడనై లోక కంటకుడిగ నుంటిని. 

అట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తల౦పుతొ పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతనికి వద్ద నున్న ధనము, వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంటి వైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి ' ఓరి నీచుడా! అన్యక్రా౦తముగ డబ్బుకూడ బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాన, నివు రాక్షసుడవై నర భక్షకుడవుగా నిర్మానుష్య ప్రదేశాములలో నుందువు' గాక! యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తప్పింకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా! కాన నాయపరాధము క్షమి౦పుమని వానిని ప్రార్ధి౦ చితిని. అందులకాతడు దయదలచి' ఒయీ! గోదావరి క్షే త్రమ౦దొక వట వృక్షము గలదు. నివందు నివసించుచు బ్రాహ్మణువలన పునర్జన్మ నొ౦దుదువు గాక' యని వెడలిపోయాను. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపమున ఈ దుష్కార్యములు చేయుచుంటిని కాన, ఓ విప్రోత్తమా  నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు- ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించి వారికి  తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రాయను నటులచేసి, వారి యెదుటనే నా బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచు౦డెడివాడను.  నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగను, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవర్తి౦చితిని. కాన, నాకీ రాక్షససత్వము కలిగెను. నన్నీ పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము' అని బ్రాహ్మణుని పాదములపై  బడి పరిపరి విధముల వేడుకొనెను.

మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియజేసెను' మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు ఆలయములోఅర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డెడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము  లైనను నర్పించక, భక్తులు గొని తెచ్చిన సంభారములను  నా వుంపుడుగత్తెకు అందజేయుచు మద్య మాంసములు  సేవించుచు పాపకార్యములు  చేసినందున నా మరణాన౦తరము ఈ రూపము ధరించితిని, కావున నన్ను కూడా పాప విముక్తి ని కావి౦పు' మని ప్రార్ధించెను.

ఓ జనక మహారాజ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినాలాపము లాలకించి ' ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును' యని, వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతవిముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికి సకలైశ్వర్యములు ప్రసాది౦చుదురు. అందువలన, ఎంత ప్రయత్నమైనా సరే కార్తిక స్నానాల నాచరించాలి.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య ముందలి
మూడవ రోజు అధ్యాయము - మూడవ రోజు పారాయణము సమాప్తము.


No comments:

Post a Comment

Total Pageviews