Monday, October 31, 2016

కార్తిక పురాణం 2వ అధ్యాయము - సోమవార వ్రత మహిమ.

కార్తిక పురాణం
2వ అధ్యాయము - సోమవార వ్రత మహిమ
శ్లో|| ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతీ త్రయశ్శిఖాః |
తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః ||
జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన, సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.
కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీగాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నదీ స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తీసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగ నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను శ్రద్దగా వినుము.
కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట
పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటు౦బమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల దినములుకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి', తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అభ్యసించిన వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును యగుటచే లోకులేల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొనుచు౦డేడివారు. ఇటువంటి ఉత్తమపురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దుషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మత్రమా మెయ౦దభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, ఛీ పోమ్మనక, విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెకు 'కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు.
ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ, ఒకనాటి రాత్రి తన భర్త గాడా నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, తాళి కట్టిన భర్త యన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలుగాని లేక, ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్య౦గా దొడ్డి దారిని గొ౦పొయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవైచి పైన చెత్త చెదారములతో నింపి, యేమియు యెరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు యే ఆట౦కములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు, తన సౌందర్య౦ చూపి యెందరినో క్రీ గ౦టనే వశపరచుకొని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచు వర్ణసంకరు రాలయ్యెను. అంతేయే గాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తమ మాటలతో చేరదీసి, వారి క్కూడా దుర్భుదులు నేర్పి పాడు చేసి, విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను.
జనక రాజా! యవ్వన బి౦కము యెంతో కాలము౦డదు గదా! కాలమోక్కరితిగా నడవదు. క్రమక్రముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రాణములు బయలుదేరినవి. ఆ వ్రాణములనుండి చీము, రక్తము రాసికారుట ప్రార౦భమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ట్టు వ్యాది బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినమూ శరీర పటుత్వము కృశించి కురూపియై భయ౦కర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో వుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులుయే ఒక్కరు ఇప్పుడామెను తొ౦గి చూడ రైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమునెటులైననూ పలుకరించునని, ఆ వీధిమొఘమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలనుభవించుచు, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొ౦పోయి ప్రేత రాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, "భటులారా! ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే యీమెను తెసుకువెల్లి ఎర్రగా కాల్చిన యినుప స్త౦భమునకు కట్టబెట్టుడు" అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖి౦చిన౦దులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్త౦భమునూ కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండ రాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యబిచారిణిలుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లితండ్రులకు, అత్తమామలకు యపకీర్తి తేచినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను పోసి, ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కు౦భీపాకమను నరకములో వేయగా, అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెఱ్ఱులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు యిటు ఏడు తరాలవాళ్లు అటు ఏడు తరాలవాళ్లు నరకబాధలు పడుచుండిరి.
ఈ ప్రకారముగా నరక భాదల ననుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మమెత్తి, ఆకలిబాధ పడలేక యిల్లిలు తిరుగుచుండగా, కఱ్ఱలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు౦డిరి. ఇట్లుండగా ఒకానొకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమవార వ్రతమాచరించి ఉపవసము౦డి, సాయ౦త్రము నక్షత్ర దర్శనము చేసి, బలియన్నాము నరుగుపై పెట్టి, కాళ్లు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తికమాస సోమవారమగుట వలను, కుక్క ఆ రోజంతాయు ఉపవాసముతో వుండుటవలననూ, శివ పూజ పవిత్ర స్థానమైన ఆ యింట దొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మ౦తరజ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము 'విప్రకులోతమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టుకోనేను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరు లేన౦దున లోనికేగాను. మరల 'రక్షింపుము రంక్షిపుము'యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నివు! నీ వృతంతమేమి!' యని ప్రశ్నించగా, యంత నా కుక్క "మహానుభావ! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులా౦గనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్యములో కుష్టురాలనై తనువు చాలించిన తరువాత, యమ దూతలవల్ల మహానరక మనుభవించి నా పూర్వికుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తిక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా, మీరు చేసిన కార్తిక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను"యని వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను.
వింటివా జనక మహారాజా! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధచేసి, ఇంకను ఇట్లు చెప్పదొడ౦గిరి.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము సమాప్తం.

కార్తీకమాసం.

   కార్తీకమాసం పండుగలు  -  - భక్తజనం ఆనందం
ఒక పండుగ ముగిసిన వెంటనే మరొక పండుగ వస్తోంది.. అది ఒక రోజు పండుగ కాదు.. నెల రోజుల పండుగ.. అదే కార్తీక పండుగ. కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగలో ఈ సారి చాలా ప్రత్యేకతలున్నాయి. కార్తీక మాసం ప్రారంభం కావడమే సోమవారం ప్రారంభమవుతుంది. అందునా కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ప్రత్యేకత.. మరొక ప్రత్యేక ఏమిటంటే ఈ ఏడాది కార్తీకమాసంలో 5 సోమవారాలు వచ్చాయి.ఈ పండుగ ఈ నెల 31 నుంచి వచ్చే నెల 30 తేదీ వరకు ఉంటుంది.. అటువంటి ఆధ్యాత్మిక పండగ నెలలో వచ్చే వాటి గురించి తెలుసుకుందాం... ఆచరిద్దాం.. పండుగను ఆనందంగా చేసుకుంటాం..

  కార్తీకమాసం పండుగలు :-

1న భగినీహస్తభోజనం సోదరి ఇంట భోజనం చేయాలి.. 

కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విదియ.. దీనినే భగినీ హస్త భోజనం.. అన్నా చెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు.ఈ పండుగ నవంబరు 1వ తేదీన వస్తోంది. యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒక రోజు అలక చెందగా ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు. యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక భాదలు ఉండవని చెబుతారు.అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

3న నాగుల చవితి... 

మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ నాగుల చవితి. ఈ రోజున పుట్టలో పాలు పోసుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు. సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రార్థిస్తారు. పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వల్ల యాగంలో పడి పాములు చనిపోతాయి. సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడుని ప్రార్థిస్తాడు.ఆయన ఆ యాగాన్ని ఆపించడం వల్ల సర్పజాతికి విముక్తి కలుగుంది. అందుకే ఆ రోజున భక్తులు ఆనందంగా పుట్టలో పాలు పోసి వారికి సమర్పిస్తారు.

10న ఏకాదశి ఉపవాసాలు 

కార్తీక మాసంలో  ఈనెల 10వ తేదీన ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఉపవాసాలు ఉంటారు.మహావిష్ణువు క్షీర సముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగిలేస్తారు. అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రాహ్మ ణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు.

11న క్షీరాబ్ది ద్వాదశి 

11వ తేదీ సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి (ఉసిరి మొక్క)ను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. 12,16,21 దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేసుకుంటారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు.ఆ రోజున ప్రతీ ఇంటా ఈ దీపాల వెలుగులతో నిండిపోతుంది.

14న కార్తీక పౌర్ణమి

కృత్తిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలి తం ఉంటుందని పండితులు చెబుతున్నారు.వచ్చే నెల 14వ తేదీన ఉదయం నుంచి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరున్ని పూజించి 365 ఒత్తులు వెలిగించి చం ద్రుని దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. అంతే కాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడిపండు, కంద, పసుపు మొక్కతో పాటు స్వయం పాకం ఇప్పిస్తారు.

30న పోలి స్వర్గం 

కార్తీక మాసం ఆఖరి రోజు 30న అమావాస్య వెళ్లిన మరుసటిరోజున పోలిస్వర్గం పూజలు చేస్తారు.దీనికి సంబంధించిన కథను పురోహితుల ద్వా రా విని వారికి స్వయంపాకాలు ఇచ్చి అరటి డిప్పలో దీపాలు పెట్టి కాల్వలో గానీ, చెరువులోగానీ వదులు తా రు.దాంతోకార్తీక మాసం దీక్షలు పరిసమాప్తి అవుతాయి.

భగినీ హస్త భోజనం విశిష్టత.!

సోదర సోదరీమణులు అందరికీ భగినీ హస్త భోజనం శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు!!
భగినీ హస్త భోజనం విశిష్టత.!
సోదరుల, సోదరీమణుల ప్రేమకి అద్దంపట్టే పండుగలలో రాఖీ పండుగ వంటి విశిష్ట పండుగ ఈ భగినీ హస్త భోజనం! కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను జరుపుకుంటారు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అని అంటారు. అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం. సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు, చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజుకార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమె తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమనగా... యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు. అందువలనే ఈ తిథికి *యమ ద్వితీయ* అని పేరు వచ్చింది. తరవాత యమునమ్మనుపరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు, ఘనంగా సారె పెట్టి చెల్లెలిని పంపించాడు.
ఒకప్పుడు సమష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ, కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను, అనుబంధాలను శక్తిమంతం చేసుకునేవారు. అటువంటి హార్దిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక, కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. అందువల్లనే కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన, మంచి- మర్యాద, అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది ఈ * భగినీ హస్త భోజన * విశిష్టత.
ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి.
మరొక్కసారి సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు!!

నవంబర్ 1 వ తేదీ,

నవంబర్ 1 వ తేదీ, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రమే కాదు. తెలుగు వారికంటూ, తెలుగు భాషకంటూ గుర్తింపు తెచ్చిన రోజు. తెలుగు వారందరికీ చరిత్రాత్మకమైన రోజు. ఉత్తరాది వారు మనల్ని మద్రాసీలు, సాంబారు గాళ్ళు అని గేలి చేసే వారు (ఇప్పటికీ చేస్తూనే ఉంటారు) తెలుగు భాషమాట్లాడే వారందరి కోసం రాష్ట్రం కావాలని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పడడానికి అసువులు బాసిన అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి దేశ రాష్ట్రాల పట్టికలో ఆంధ్ర అనే పదం ఉంటే అరుణాచల్ ప్రదేశ్ కంటే ముందు ఉండి, అగ్రస్థానంలో ఉంటుందని తద్వారా ఎక్కువ గుర్తింపు ప్రయోజనం ఉంటుందని ఎంతో ముందు చూపుతో తమ పదవులను సైతం తృణప్రాయంగా ఆశించిన బూర్గుల రామ కృష్ణా రావు గారి లాంటి ఎందఱో మహనీయులు ఎన్నెన్నో త్యాగాలు చేసారు. రాష్ట్రాలు ఏర్పడవచ్చు విడిపోవచ్చు కానీ వాటి ఏర్పాటుకు కారణ భూతులయిన,మూలపురుషులయిన మహనీయులను స్మరించుకోవడం, వారందరికీ శ్రద్ధాంజలి ఘటించడం ప్రతి ఒక్క తెలుగు వాడి కృతజ్ఞతా పూర్వక కర్తవ్యం! ఈ సందర్భంగా
శ్రీ సామవేదం జానకిరామ శర్మ గారి కవితను నివాళిగా అర్పిద్దాం!
అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
దాన మిచ్చె ధధీచి మౌని యతడు!
యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
శిబి చక్రవర్తి ప్రసిద్దుడతడు!
అది యొక లెక్కయా? యడుగులు మూడుగా
ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల.
ఆంధ్ర రాష్ట్రం అంటే అర్ధం:-
ఆం - అందరినీ
ధ్ర - ధృడమైన విశ్వాసముతో ...
రాష్ట్రం - అందరినీ ప్రేమించే రాష్ట్రం.
                                                    __/i\__

కార్తిక పురాణం1రోజు


విస్సా ఫౌండేషన్ బ్లాగ్ సందర్సక బంధుమిత్రులకు శుభోదయం! 
ఈ రోజు నుంచి శ్రీ కార్తిక మాస పుణ్యకాలం శివ కేశవారధనతో పునీతులమవుదాం! అయితే ఎన్నో చెయ్యాలని ఉంటుంది, ఎన్నో సందేహాలు ఏమిచెయ్యాలి? భక్తి సమాచారం సౌజన్యంతో ఎలాచేయ్యాలి? ఈ కార్తీక పురాణం ప్రతి రోజు చదివి పునీతులమవుదాం!..తెలుసుకోండి ఆచరించండి. తరించండి. సత్యసాయి విస్సా ఫౌండేషన్.  
కార్తిక పురాణం
కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మధఖిలా౦డ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్త మందు నైమిశారణ్య ములో శౌనికాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.

ఒకనాడు శౌనికాది మునులు గురుతుల్యుడగు సుతునిగాంచి" " ఆర్యా! తమ వలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహాస్యములు సంగ్రహముగ గ్రహించినాము. కార్తీకమాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరావ్రతమును వివరించవలసినది" అని కోరిరి. అంత నా సూతమహర్షి " ఓ మునిపుంగవు లారా! ఒకప్పుడు యీదే కోరికను నారదుడు సృష్టి కర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి- విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సా౦బశివుడు పార్వతీదేవికి తెలియ చేసిన విదముగా నా గాథను వివరించెను.అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు కలుగుటయే గాక, యీహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రదగానాలకింపు " డని యిట్లు చెప్పెను.

పూర్వ మొకానొక దిన౦బున పార్వతి పరమేశ్వరులు గగన౦బున విహరించుచుండగా పార్వతి దేవి " ప్రాణేశ్వర సక లైశ్వర్యములు కలుగ చేయునట్టిది , సకల మానవులు వర్ణ  భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్య చంద్రులున్నంత వరకు నాచరింపబడేడిది యగు వ్రతమును వివరింపు"డని కోరెను.అంతట మహేశుడు మందహాసమొనరించి " దేవి ! నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమును చెప్పబడియున్నది దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోవుచున్నాడు. చూడు, మా మిథిలా  నగరమువైపు"అని మిథిలానగరపు దిశగా చూపించెను.

అట, మిథిలానగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్య పాధ్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సు పైజల్లుకొని' మహాయోగి!మునివర్య! తమ రాకవల్ల నేనూ, నాశరిరము, నాదేశము, నాప్రజలు, పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నాదేశము పవిత్రమైనది. తమరిచటికేల వచ్చితిరో సెలవొసంగు' డని వేడుకొనెను. అందులకు వశిష్టుడు - జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని, దానికి కావాల్సిన అర్ధబలము, అంగబలము, నిన్నడిగి  క్రతువు ప్రారంభి౦చమని నిశ్చయి౦చి యిటు వచ్చితిని-అని పలుకగా జనకుడు" మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరి౦పుడు. కానీ, చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞలనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయదృష్టముకొలది యీ అవకాశము దొరికినది. గురురత్న! సంవ త్సరములో  గల మాసములలో కార్తీకమాసమే యేలన౦త పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలాకాలమునుండి యున్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి  వివరించవలసివున్నది" యని ప్రార్ధి౦చెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి" రాజ! తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయివున్నది . ఈ కార్తిక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున౦దాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడా నాన౦ద దాయకమైనది. అ౦తియే గాక వినినంత మాత్రముననే యెట్టి నరక బాధలును లేక యీహమందును, పరమ౦దును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్దగా ఆలకింపు'మని యిట్లు చెప్పసాగెను .

వశిష్టుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట

ఓ మిథిలేశ్వర! జనక మహారాజ! ఏమానవుడైనాను యే వయసువాడైనను " ఉచ్చ- నీచ' అనే భేదములేక కార్తిక మాసములో, సూర్యభగవానుడు తులారాశి య౦దుడగా, వేకువ, జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానమాచరించి ,  దానధర్మములను, దేవతపూజలను చేసినచో - దాని వలన ఆగణిత పుణ్యఫలము లబించును. కార్తికమాస ప్రారంభమును౦డియు యిట్లు చేయుచు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచు౦డ వలెను. ముందుగా కార్తిక మాసమునునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి " ఓ దామోదర నేను చేయు కార్తిక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము" అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించ వలెను.

కార్తిక స్థాన విదానము
ఓ రాజ! యీ వ్రత మాచరి౦చు దినములలో సుర్యోదయమునకు పుర్వమేలేచి కాలకృత్యములు తీర్చుకొని, నదికిబోయీ స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ , పరమేశ్వరునకు, బైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యపాదన మొసంగి, పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్ళు పోయవలెను. ఈకార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగబద్ర, యమునా మున్నగు నదులలో యే ఒక్క నదిలో నైననూ స్నానమాచరించిన యెడల గొప్పఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తనే స్వయముగా కోసితెచ్చి నిత్యధూప, దీప , నైవేదములతో భగవంతుని పూజ చేసుకొని, గంధము తీసి భగవంతునికి సమర్పించి తను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిది అభాగ్యతులను పూజించి వారికి ప్రసాద మిడి, తన యింటి వద్దగానీ,దేవాలయములో , లేక రావిచెట్టు మొదట గాని కూర్చుండి కార్తిక పురాణము చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందు గాని విష్ణాలయమందుగాని తులసికోట వద్ద గాని , దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయను. ఈ విధ ముగా వత్త్రమాచరించి స్త్రీ పురుషులకు పూర్వమందును , ప్రస్తుత  జన్మమందును చేసిన పాపమూ పోయి మోక్షమునకు ఆర్హులగుదురు . ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారులు వ్రతము చేసిన వారిని జూచి , వారికి నమస్కరించినచొ వారికి కూడా తత్సమాన ఫలముదక్కును .

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్యమ౦దలి
మొదటి అధ్యాయము - మొదటి రోజు పారాయణము సమాప్తం
శ్లో ఓమిత్యే కక్షార౦  బ్రహ్మవ్యాహరితి త్రయశిఖ:
తాసై తరాత్మ నే మేతదశినముర్తాయే నమ:

Sunday, October 30, 2016

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళినాడు లక్ష్మీదేవినే ఎందుకు పూజిస్తుంటాం ?

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళినాడు లక్ష్మీదేవినే ఎందుకు పూజిస్తుంటాం ? తమసోమా జ్యోతిర్గమయ - తమస్సు అంటే చీకటి అనీ, అజ్ఞానం అనీ అర్ధం. చీకట్లు పోగొట్టే దీపం లాంటిదే అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞాన జ్యోతి కూడా.మన పూర్వికులు దీపాన్ని దైవంతో పోలుస్తూ " దీపం జ్యోతి పరబ్రహ్మ" అని చెప్పటం జరిగింది. 'భా' అనగా కాంతి. 'రత ' అంటే ఇష్టం గలవారు.కాబట్టి భారతీయులు అంటే కాంతికి, జ్ఞానానికి విలువనిచ్చేవారని అర్ధం. ఏకార్యక్రమమైనా దీపోజ్వలనం తో మొదలుపెట్టటం మన ఆనవాయితీ. వెలుగుతూవుం డే దీపంలో తాను కొలువుంటానని మహాలక్ష్మీదేవి శెలవిచ్చింది. దీపం ఆతల్లి ప్రతిరూపం అని అంటారు. దీపావళి రోజున అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపాలను వెలిగిస్తాం. దీపావళి రోజున దీపకాంతులతో ఏగృహము అయితే కాంతిభరితంగా వుంటుందో ఆగ్రుహం లక్ష్మీనిలయముగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెపుతూవుంటారు. దీపానికి నమస్ఖరిస్తే అది లక్ష్మీదేవికి నమస్ఖరించినట్లే.దీపావళినాడు లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.మన దేశంలోని అన్ని ప్రాంతాలవారు దీపావళి సాయంత్రం కొత్తవస్త్రాలు ధరించి దీపాలను వెలిగించి ధనలక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీదేవికి పెట్టిన ప్రసాదాన్ని తాము, తమ కుటుంబం వారు స్వీకరించడమే గాక యిరుగుపొరుగు వారికీ, బంధు మిత్రులకి పంచటం ఆచారంగా వస్తున్నది. శుభప్రదమైన దీపాల శోభతో మెరిసే ముంగిల్లతో నున్న మీ నట్టింట్లో ఈ దీపావళి అనంతమైన ఆనందాలను నింపాలని కోరుకొంటున్నాము.  నాగమణి విస్సా.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

అందరికీ దీపావళి శుభాకాంక్షలు



దీపావళి శుభాకాంక్షలు!...సత్యసాయి విస్సా ఫౌండేషన్.

మీకు, మీ కుటుంబసభ్యులకు, తెలుగుమిత్రులందరికీ, ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు!శుభాభివందనాలు!! దీపావళి శుభాకాంక్షలతో...దీపావళి నాడు ఏమిచెయ్యాలి? ఎలా జరుపుకోవాలి?  ఈ శుభవేళ మీకోసం ...'విచిత్రబంధం' చలన చిత్రం లోని "చీకటి వెలుగుల రంగేళి"  ఈ అద్భుత గీతాన్నిఈ దిగువన లంకె పై నొక్కి చూడండి ఆస్వాదించండి.. సత్యసాయి విస్సా ఫౌండేషన్. 
https://www.youtube.com/watch?v=buhFHTTOkXg








Saturday, October 29, 2016

ఇహం పరం జ్యోతిర్మయం! దీపావళి దీపాల పండుగ. ..

ఇహం పరం జ్యోతిర్మయం!  ఈనాడు ఎడిటోరియల్   30-10-2016
దీపావళి దీపాల పండుగ. దీపం పరబ్రహ్మ స్వరూపం. అది వెలుగుకు మూలం. వికాసానికి సంకేతం. ‘దీపం తమస్సును సమూలంగా నిర్మూలిస్తుంది’ అన్నది వైదిక భావన, శుభ దీవెన. తమస్సు అంటే చీకటి, అజ్ఞానం. ‘చీకటి నుండి వెల్గులకు జీవనయానము సాగగా వలెన్‌’ అని రుషులు ఆకాంక్షించారు. అజ్ఞానం నుంచి జ్ఞానానికి, దుఃఖం నుంచి ఆనందానికి, నిరాశ లోంచి గట్టి ఆశాభావంలోకి చేరాలన్న మనిషి నిరంతర తపనకు దీప ప్రకాశనం మంగళకరమైన ప్రతీకగా పెద్దలు భావించారు. ‘గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు’ అంటూ కవులు ధైర్యం చెప్పారంటే- దాన్ని గట్టిగా నమ్మబట్టే! ‘దీపావళి దీపావళి దీపావళి యంచు పల్క- ధీమంతులకున్‌... దీపసముదాయం లోంచి జ్ఞాన వికాసం పొడగడుతుంది’ అనడానికి కారణం అదే! నిజానికి దీపం లక్ష్యమే అది. భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఆవరణలను జ్యోతిర్మయం గావించేదే దీపావళి పండుగ! ‘దీపము జ్ఞానదీపమై చీకటి దూరమౌట సుఖజీవన సారమటంచు ఎరుంగరే’ అన్న కవుల హితబోధను మనం ఆ కోణంలోంచే అర్థం చేసుకోవాలి. కృష్ణదేవరాయల కాలంలో దీపావళిని ‘లక్ష్మీ ఉత్సవం’గా జరుపుకొనేవారని సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాహిత్య చరిత్ర’లో పేర్కొన్నారు. దీన్నిబట్టి దీపకాంతులకు వారు ఎంతటి పవిత్రతను ఆపాదించారో మనకు తెలుస్తుంది. కాంతిమంతమైన నవీన విద్యుద్దీపావిష్కారం జరిగినా, ఇప్పటికీ సభాసంప్రదాయంలో జ్యోతిప్రకాశనం శుభారంభ సూచనగా నిలిచిపోవడంలో రహస్యం అదే! పుట్టినరోజున దీపాలార్పడాన్ని మనవాళ్ళు గట్టిగానే నిరసించారు. ‘దీపమార్పుచున్‌ షోకులవేల? జన్మదిన శోభనవేళల అమంగళంబుగన్‌’ అని ప్రశ్నించారు. నోటితో దీపాన్ని వూదేయడం అశుభమని మనవారి నమ్మకం.
దీపావళి ముందురోజు నరకచతుర్దశి. నరకాసురుడు మరణించినరోజుగా దాన్ని భావిస్తారు. భాగవతం దశమస్కంధంలోని ఈ కథ పోతన పుణ్యమా అని బాగా ప్రసిద్ధికెక్కింది. నరకుడు లోక కంటకుడయ్యేసరికి కృష్ణుడు- నరకాసుర సంహారానికై బయలుదేరాడు. ‘నీ మానిత బాహుదుర్గముల మాటున ఉండగ ఏమిశంక? నీతో అరుదెంతు’ అంది సత్య. యుద్ధంలో కృష్ణుడు గాయపడ్డాడు. వెంటనే ‘వేణింజొల్లెము వెట్టి(జుట్టు ముడిపెట్టి) సంఘటిత నీవీబంధయై(కోకచుట్టి)’ సత్య నరకుడితో తలపడింది. ‘వీరశృంగార భయరౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యెనో’ అన్నట్లుగా విజృంభించింది. ‘జ్యావల్లీ(వింటితాడు) ధ్వని గర్జనంబుగ సురల్‌ సారంగ యూధంబుగా... అలినీలాలక చూడ నొప్పెసగె ప్రత్యాలీఢ పాదంబుతో’ అంటూ పోతన లోకోత్తరంగా వర్ణించాడు. చివరకు నరకుడు కృష్ణుడి చేతిలో హతమయ్యాడు. ‘అమర్త్యులు మునులున్‌ మింటన్‌ పువ్వులు కురియుచు’ పండుగ చేసుకున్నారు. దరిమిలా నరకుడు మరణించిన ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరకచతుర్దశిగాను, విజయోత్సవాలు జరిగిన తరవాతి రోజు దీపావళి పండుగగాను మారిపోయాయి. వాస్తవానికి చతుర్దశిని ‘దీపరాత్రి’గా ఆరాధించడం కృష్ణుడికన్నా ఎంతో ముందే ఉంది. పితృదేవతలు తరించాలన్న కోరికతో స్వర్గం దిశగా దీపాలు చూపిస్తూ దీపదానాలు చేయాలని వామన పురాణం ఏనాడో చెప్పింది. సంతానానికో దారి చూపించిన పెద్దలు ఏ చీకటి లోకాల్లోనో మార్గం తోచక తపిస్తున్నారేమోనని ప్రేమతో స్వర్గానికి తోవ చూపించడాన్ని మానవీయ కోణంలోంచి ఆలోచిస్తే, వామన పురాణ వాక్కులోని ఉదాత్తత బోధపడుతుంది. వైజయంతీ విలాసంలో ‘దీపము భవహరము శుభంకరము’ అన్న పలుకుల ప్రాశస్త్యం తెలుస్తుంది. ‘నరక భయాన్ని పోగొట్టే చతుర్దశి’గా నరకచతుర్దశిని ధర్మశాస్త్రాలు వ్యాఖ్యానించడంలోని ప్రామాణికత అర్థమవుతుంది. ‘సంతానము దీపధారులయి తాపము తీర్చిరి నాక(స్వర్గ)మందగా’ అని పితృదేవతలు సంతృప్తి చెందడంవల్ల నరకచతుర్దశి పండుగ అవుతుంది. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్న ప్రార్థన స్వర్గస్థులైన పెద్దలకు సైతం వర్తింపజేయడం దానికి కారణం.
పితృదేవతలకు వెలుతురు చూపించేందుకు దీపాలు, కాగడాలు వెలిగించే సంప్రదాయమే క్రమంగా మతాబులు కాల్చడంగా మారిందంటారు. అక్కడితో ఆగితే బాగుండేది. దాసు శ్రీరాములు చెప్పినట్లు ‘ఉద్భటముగ ఢమ్ము ఢామ్మను తుపాకులవెన్ని మతాబులెన్ని పిక్కటిలెడు ఝల్లులెన్ని మరి కాకరపూవతులెన్ని గాల్తురో’ లెక్కే లేకుండా పోయింది. భారీ శబ్దాల బాణసంచా పేలుళ్ళతో తీవ్ర ధ్వని, వాయు కాలుష్యాలకు దీపావళి నెలవైంది. ‘దిబ్బు దిబ్బు దీపావళి...’ కాస్తా డబ్బు డబ్బు దీపావళిగా మారి పర్యావరణానికి చేటయింది. మామూలు మనిషికి చేదయింది. ఆర్భాటాలు పెరిగిపోయాయి. ‘ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ మతః శాంతిం ప్రయచ్ఛమే’ అనే ప్రార్థనతో దీపాలు వెలిగించి ఇహపరాలను జ్యోతిర్మయం చేయాలన్న పెద్దల మౌలిక ఆలోచనలను ఈ జాతి విస్మరించింది. ‘తైలంలేని వత్తిని ఏ అగ్గిపుల్లా వరించదు’ అన్నట్లుగా తైలం(ధనం) లేని వ్యక్తిని దీపావళి వరించడమే లేదు. ‘కుప్పనూర్చుట పొల్లు కొరకా, కూడు వండుట గంజి కొరకా?’ అన్న ‘నార్లమాట’ను గుర్తుకు తెస్తోంది. ‘ఈ గడ్డునాళ్ళలో పండుగ పండుగంచు గుదిబండగ దండిగ కైతలల్లి వేదండమునెక్కి(ఏనుగునెక్కి) చాటినను దండగ’ అని కవులు తీర్మానిస్తున్నారు. పండుగరోజుల్లో పెద్దలు నిర్దేశించిన విధివిధానాల వెనక మన సంస్కృతీ బీజాలున్నాయి. వారి ఆలోచనల వెనక చరిత్ర ముందుచూపు అంతరార్థాలు పరమార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మరిచిపోతే పండుగ పరమ లక్ష్యమే మసకబారి బాణసంచా నుసి మిగులుతుంది. ‘పరబ్రహ్మ స్వరూపమైన ఓ దీపమా! ధీయోయోనః ప్రచోదయాత్‌’ అంటూ వేడుకోవడం మినహా చేసేదేం లేదేమో... ‘దీపేన సాధ్యతేసర్వం’ అన్నారుగా... చూద్దాం!

శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే?

శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే?
సంపదలకు అధినేత్రి శ్రీ మ‌హాల‌క్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి. సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. సాగరమథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు.ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటాం. శుచి, శుభ్రత, నిజాయతీ కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది. శ్రీమహావిష్ణువును పూజించే వారిని అనుగ్రహిస్తుంది. అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోధిక సేవలందించిన విభీషణుడు, హనుమంతుడికి చిరంజీవులుగా వుండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు. హనుమంతుడికి భవిష్యత్‌ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం. గృహంలో ప్రశాంతత, మహిళలను గౌరవించడం, తెల్లవారుఝామునే లేవడం, పూజాధికాలను క్రమం తప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇంటికి సిరి ఇల్లాలు ఆమె మనస్సును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కంట తడి పెడితే ల‌క్ష్మి వెళ్లిపోతుంది. అమ్మ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, ఆదిశంకరాచార్యులు ఐదేళ్ల వయస్సులో పఠించిన కనకధార స్తోత్రాం, లక్ష్మీదేవిఅష్టోత్తరాలను ప్రార్థన చేయాలి. మనకున్న దానిలో దానం చేయాలి ఇలా చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది.

Total Pageviews