Sunday, October 30, 2016

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళినాడు లక్ష్మీదేవినే ఎందుకు పూజిస్తుంటాం ?

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళినాడు లక్ష్మీదేవినే ఎందుకు పూజిస్తుంటాం ? తమసోమా జ్యోతిర్గమయ - తమస్సు అంటే చీకటి అనీ, అజ్ఞానం అనీ అర్ధం. చీకట్లు పోగొట్టే దీపం లాంటిదే అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞాన జ్యోతి కూడా.మన పూర్వికులు దీపాన్ని దైవంతో పోలుస్తూ " దీపం జ్యోతి పరబ్రహ్మ" అని చెప్పటం జరిగింది. 'భా' అనగా కాంతి. 'రత ' అంటే ఇష్టం గలవారు.కాబట్టి భారతీయులు అంటే కాంతికి, జ్ఞానానికి విలువనిచ్చేవారని అర్ధం. ఏకార్యక్రమమైనా దీపోజ్వలనం తో మొదలుపెట్టటం మన ఆనవాయితీ. వెలుగుతూవుం డే దీపంలో తాను కొలువుంటానని మహాలక్ష్మీదేవి శెలవిచ్చింది. దీపం ఆతల్లి ప్రతిరూపం అని అంటారు. దీపావళి రోజున అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపాలను వెలిగిస్తాం. దీపావళి రోజున దీపకాంతులతో ఏగృహము అయితే కాంతిభరితంగా వుంటుందో ఆగ్రుహం లక్ష్మీనిలయముగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెపుతూవుంటారు. దీపానికి నమస్ఖరిస్తే అది లక్ష్మీదేవికి నమస్ఖరించినట్లే.దీపావళినాడు లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.మన దేశంలోని అన్ని ప్రాంతాలవారు దీపావళి సాయంత్రం కొత్తవస్త్రాలు ధరించి దీపాలను వెలిగించి ధనలక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీదేవికి పెట్టిన ప్రసాదాన్ని తాము, తమ కుటుంబం వారు స్వీకరించడమే గాక యిరుగుపొరుగు వారికీ, బంధు మిత్రులకి పంచటం ఆచారంగా వస్తున్నది. శుభప్రదమైన దీపాల శోభతో మెరిసే ముంగిల్లతో నున్న మీ నట్టింట్లో ఈ దీపావళి అనంతమైన ఆనందాలను నింపాలని కోరుకొంటున్నాము.  నాగమణి విస్సా.

No comments:

Post a Comment

Total Pageviews