Sunday, November 1, 2015

అమర జీవులకు శ్రద్ధాంజలి!!

నవంబర్ 1 వ తేదీ, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రమే కాదు. తెలుగు వారికంటూ, తెలుగు భాషకంటూ గుర్తింపు తెచ్చిన రోజు. తెలుగు వారందరికీ చరిత్రాత్మకమైన రోజు. ఉత్తరాది వారు మనల్ని మద్రాసీలు, సాంబారు గాళ్ళు అని గేలి చేసే వారు (ఇప్పటికీ చేస్తూనే ఉంటారు) తెలుగు భాషమాట్లాడే వారందరి కోసం రాష్ట్రం కావాలని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పడడానికి అసువులు బాసిన అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి దేశ రాష్ట్రాల పట్టికలో ఆంధ్ర అనే పదం ఉంటే అరుణాచల్ ప్రదేశ్ కంటే ముందు ఉండి, అగ్రస్థానంలో ఉంటుందని తద్వారా ఎక్కువ గుర్తింపు ప్రయోజనం ఉంటుందని ఎంతో ముందు చూపుతో తమ పదవులను సైతం తృణప్రాయంగా ఆశించిన బూర్గుల రామ కృష్ణా రావు గారి లాంటి ఎందఱో మహనీయులు ఎన్నెన్నో త్యాగాలు చేసారు. రాష్ట్రాలు ఏర్పడవచ్చు విడిపోవచ్చు కానీ వాటి ఏర్పాటుకు కారణ భూతులయిన,మూలపురుషులయిన మహనీయులను స్మరించుకోవడం, వారందరికీ శ్రద్ధాంజలి ఘటించడం ప్రతి ఒక్క తెలుగు వాడి కృతజ్ఞతాపూర్వక కర్తవ్యం! ఈ సందర్భంగా శ్రీ సామవేదం జానకిరామ శర్మ గారి కవితను నివాళిగా అర్పిద్దాం! 


అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
దాన మిచ్చె ధధీచి మౌని యతడు!
యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
శిబి చక్రవర్తి ప్రసిద్దుడతడు!
అది యొక లెక్కయా? యడుగులు మూడుగా
ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల.
__/i\__

No comments:

Post a Comment

Total Pageviews