Friday, September 9, 2016

భ్రాహ్మణ సమాచార

ఈ కింది సమాచారాన్ని మీకు తెల్సిన భ్రాహ్మణ బృందాల్లో, సమూహాల్లో పోస్టు చేయండి.

బ్రాహ్మణ మిత్రులందరితో ఈ సమాచారం పంచుకుందాం - అవసరం ఉన్న వారికి చెబుదాం. ఇవి ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న తల్లిదండ్రులకు (సంరక్షకులకు) మాత్రమే వర్తిస్తాయి.
ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ వెల్పేర్ కార్పొరేషన్ (ప్రభుత్వ రంగ సంస్థ) అందిస్తున్న సంక్షేమ పథకాలు:
అన్ని పథకాలు గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే కింది లంకె మీద క్లిక్ చేయండి https://www.andhrabrahmin.ap.gov.in/down/schemest.pdf
ఇంగ్లీషు లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/down/schemes.pdf
గాయత్రీ విద్యా ప్రశస్తి పథకం - ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియెట్ (తత్సమానం), గ్రాడ్యుయేషన్, వృత్తివిద్యా కోర్సు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులలో విద్యావిషయకంగా విశిష్ఠ ప్రతిభ కనబర్చినందుకు గుర్తింపు పొందిన, పేరుగాంచిన పాఠశాల, కళాశాల, సంస్థల్లో సర్వప్రథమునికి గుర్తింపు నివ్వడం - ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/gayathri/gayathrit.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/gayathri/gayathri.pdf
భారతీ విద్యా పథకం: అనాథ పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్న పిల్లల కోసం సహాయం. 1-5 తరగతి వరకు 5000/-, 6-10 తరగతి వరకు 10000/-, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరానికి లేదా తత్సమానికి 12000/-, ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం లేదా తత్సమానికి 20000/-, గ్రాడ్యుయేషన్ మొదటి లేదా రెండో సంవత్సరం లేదా తత్సమానికి 15000/-, గ్రాడ్యుయేషన్ మూడో సంవత్సరానికి లేదా తత్సమానికి 25000/-, వృత్తి విద్యా కోర్సులు (చివరి సంవత్సరం మినహా), పోస్టు గ్రాడ్యుయేషన్ (చివరి సంవత్సరం మినహా) 20000/-, వృత్తి విద్యాకోర్సులు (చివరి సంవత్సరం), పోస్టు గ్రాడ్యుయేషన్(చివరి సంవత్సరం) 35000/-.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/bharati/bharatit.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/bharati/bharati.pdf
భారతీ దేశాంతర మాస్టర్స్ డిగ్రీ పథకం - విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు బ్రాహ్మణులను ప్రోత్సహించడం - 10,00,000/- వరకు సాయం.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి .
https://www.andhrabrahmin.ap.gov.in/bharati/bs-msoet.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/bharati/bs-msoe.pdf
వశిష్ఠ - పోటీ పరీక్షలకు శిక్షణ పథకం - బ్యాంకింగ్, రైల్వేలు, రాష్ట్ర - కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లు, స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ వగైరాలకు ఉచిత శిక్షణ. మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/vasishta/vasishtat.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/vasishta/vasishta.pdf
ద్రోణాచార్య నైపుణ్యాభివృద్ధి పథకం - బేకరీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫాబ్రికేషన్, హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్, టైలరింగ్, సౌరఫలకాల ఏర్పాటు, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్, ఐ.టి. రంగం వంటి ఎన్నో రంగాల్లో ఎంపిక చేసిన క్షేత్రాల్లో ఉచిత శిక్షణ.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి. https://www.andhrabrahmin.ap.gov.in/dronac…/dronacharyat.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/dronach…/dronacharya.pdf
చాణక్య ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పథకం - స్వయం ఉపాథి -
*చాణక్య - అంత్యోదయ * - 1.5 లక్షల వరకు ప్రాజెక్టులకు సాయం - 80 శాతం రాయితీ + బ్యాంకు ఋణం
చాణక్య - అభ్యుదయ - 1.6 నుంచి మూడు లక్షల ప్రాజెక్టులకు సాయం - 60 శాతం రాయితీ + బ్యాంకు ఋణం
చాణక్య - అభివృద్ధి - 3.1 నుంచి 10 లక్షల ప్రాజెక్టులకు సాయం - రెండు లక్షల వరకు 40 శాతం రాయితీ + బ్యాంకు ఋణం
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి.
https://www.andhrabrahmin.ap.gov.in/chanakya/sust.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/chanakya/sus.pdf
చాణక్య ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పథకం - లఘ, మధ్యతరహా పరిశ్రమలు -
చాణక్య - లఘు పరిశ్రమలు - 11 లక్షల నుంచి కోటి రూపాయల ప్రాజెక్టుల కోసం సాయం - 10 లక్షల వరకు 20 శాతం రాయితీ
చాణక్య - మధ్యతరహా పరిశ్రమలు - ఒక కోటి నుంచి 5 కోట్ల రూపాయాల ప్రాజెక్టుల కోసం సాయం - 25 లక్షల వరకు 10 శాతం రాయితీ
మరిన్ని వివరాలకు కింద లంకె మీద క్లిక్ చేయండి.
https://www.andhrabrahmin.ap.gov.in/chanakya/smet.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/chanakya/sme.pdf
చరక ఆరోగ్య బీమా పథకం - ఎన్టీఆర్ వైద్య సేవాపథకంలో చేరని వృద్ధుల కోసం ఆరోగ్య బీమా పాలసీ.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద షేర్ చేయండి. https://www.andhrabrahmin.ap.gov.in/charaka/charakat.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/charaka/charaka.pdf
కశ్యప ఆహార మరియు ఆశ్రయ కల్పనా పథకం - అనాథ పిల్లలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులైన బ్రాహ్మణులకు ఆహారం, ఆశ్రయం ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం - వృద్ధులకు నెలకు 3000/- చొప్పున, ఇతరులకు 1000/- చొప్పున. మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి.
https://www.andhrabrahmin.ap.gov.in/kashyapa/kashyapat.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/kashyapa/kashyapa.pdf
గరుడ అంత్య క్రియల సహాయ పథకం - పేదబ్రాహ్మణుల్లో ఇతరత్రా మార్గం లేని వారి అంత్రక్రియల కోసం 10000/- వరకు.
మరిన్ని వివరాల కోసం కింది లంకె మీద క్లిక్ చేయండి.
https://www.andhrabrahmin.ap.gov.in/garuda/garudat.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/garuda/garuda.pdf
భార్గవ భాగస్వామ్య పథకం - వృద్ధాశ్రమం, పరుశురామ భవన్, విశ్వనాథ ఆరామ క్షేత్రం వంటి నిర్మాణాలకు ప్రోత్సాహం - ఏదైనా సంస్థ ప్రోది చేసుకున్న మొత్తానికి సమానమైన మొత్తం వరకు సాయం.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/bhargava/bhargava.pdf
అనాథ విద్యార్థుల కోసం, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకోసం ప్రత్యేక పథకం - ఆర్ఫన్ -
వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/vol/donee.pdf
అన్ని పథకాలకూ టోల్ ఫ్రీ సంఖ్య - 1800 102 3579
సమాచారం పంచుకోండి - సాయపడండి.
లోకా సమస్తా సుఖినో భవన్తు.

నిన్ను నీవు ఎక్కువగా ఊహించుకోకు. చిన్నకధ:-

నిన్ను నీవు ఎక్కువగా ఊహించుకోకు.
చిన్నకధ:-
ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు.
అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు.
అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు.
ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు.
బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది.
ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు.
దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి,
నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు.
అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది.
అందరూ తనని చూసి, తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది.
అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది.
'ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా, గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా!
అని ఆశ్చర్యపోయింది.
'ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు'
అనుకుంది.
కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి.
అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది.
గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు.
గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు.
'ఊరి వాళ్ళంతా నాకు
గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా!
మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి, '
అనుకుని అక్కడి నుండి కదలలేదు.
శిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు.
" ఆ! పోతే పోయాడు"
అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద.
కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు.
అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు.
ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై కర్రతో కొట్టాడు.
దానితో గాడిదకి జ్ఞానోదయం అయింది.
"అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను.
ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది,
అనుకుని యజమాని దగ్గరకు పరుగెత్తింది

బార్లీతో అనేక అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బిపి, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి.
బార్లీ గింజ‌ల‌ను ఎక్కువ‌గా బీర్ త‌యారీలో ఉప‌యోగిస్తారు. అంత‌మాత్రం చేత వాటితో త‌యారు చేసిన నీటిని తాగితే మ‌త్తు వ‌స్తుంద‌నుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వ‌ల్ల ఎన్నో అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో బార్లీ గింజ‌లు మెత్త‌గా మారుతాయి. వాటిలోని పోష‌కాల‌న్నీ ఆ నీటిలోకి వెళ్తాయి. అనంత‌రం ఆ నీటిని చ‌ల్లార్చి దాంట్లో కొద్దిగా నిమ్మ‌ర‌సం లేదా ఒక టీస్పూన్ తేనెను క‌లుపుకుని నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో అనేక అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.
1. పైన చెప్పిన బార్లీ నీటిని నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ‌, విష ప‌దార్థాల‌న్నీ మూత్రం రూపంలో బ‌య‌టికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రం అవుతుంది. ఇది కోల‌న్ క్యాన్స‌ర్ రాకుండా చేస్తుంది.
2. బాగా వేడి చేసిన వారు బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల దాన్నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.
3. క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.
4. బార్లీ నీటిలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్లు, మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి.
5. మ‌ధుమేహం ఉన్న వారు బార్లీ నీటిని తాగ‌డం ఎంతో మంచిది. ఎందుకంటే బార్లీలో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్ర‌హించ‌డాన్ని ఆల‌స్యం చేస్తుంది. దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌వు.
6. బార్లీలో పీచు ప‌దార్థం పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది.
7. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. బీపీ అదుపులో ఉంటుంది.
8. గ‌ర్భంతో ఉన్న స్త్రీలు బార్లీ వాట‌ర్ తాగితే మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఇత‌రుల‌కు కూడా మూత్రాశ‌య స‌మ‌స్య‌లు ఉంటే బార్లీ నీటిని నిత్యం తాగ‌వ‌చ్చు.
9. కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించే శ‌క్తి బార్లీ నీటికి ఉంది. రోజూ బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు క‌రిగిపోతాయి.
10. బాలింత‌లు బార్లీ వాట‌ర్ తాగితే పాలు బాగా ప‌డ‌తాయి. జీర్ణ‌శ‌క్తి బాగా పెరుగుతుంది.
1 1.బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి బార్లీ వాట‌ర్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో ఉండే పోష‌కాలు శ‌రీర మెట‌బాలిజంను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గుతారు. అయితే బ‌రువు త‌గ్గాల‌నుకుంటే బార్లీ వాట‌ర్‌ను ఉద‌యంతోపాటు సాయంత్రం కూడా తాగాల్సి ఉంటుంది
హైదరాబాద్ బస్టాండ్ లో ఒక ముసలావిడ వైజాగ్ వెళ్లే బస్సు ఎక్కింది, ఎక్కగానే డ్రైవర్ తో... బాబు నేను నిద్రపోతానేమో, విజయవాడ రాగానే నన్ను లేపుతావా అన్నది...?
డ్రైవర్: ఓకే పడుకోండి
ఆ ముసలావిడకు నమ్మకం లేక పక్కనే ఉన్న తోటి ప్రయాణికులకు కూడా చెప్పింది, అందరూ సరే అన్నారు
చాలా దూరం ప్రయాణం  తరువాత ముసలావిడ నిద్ర లేచింది, విజయవాడ ఇంకా రాలేదా బాబు?
అయ్యో సారీ బామ్మగారు మర్చిపోయాను, విజయవాడ దాటేసి 100కి.మీలు వచ్చేశాము.. ఆమె ఏడవడం మొదలుపెట్టింది, మర్యాదగా వెనక్కి తిప్పి విజయవాడ తీసుకెళ్లమని గోల చేసింది, ఆమెకు తోటి ప్రయాణికులు కూడా ఆమెకు  సపోర్ట్ చేశారు, డ్రైవర్ వెనక్కి తిప్పి విజయవాడ తీసుకొచచి ఆమెను దింపడానికి ట్రై చేశాడు.
డ్రైవర్.. బామ్మగారు విజయవాడ వచ్చేసింది దిగండి...
ఆమె తన బ్యాగు నుండి రెండు ట్యాబ్లెట్స్ తీసి ఇలా అన్నది
నాకు బీపీ ఉంది బిడ్డ.. విజయవాడ రాగానే ట్యాబ్లెట్స్ వేసుకోమని బస్సు ఎక్కేటప్పుడు మా అబ్బాయి చెప్పాడు...
నేను కూడా వైజాగ్ వెళ్లాలి, ఇప్పుడు పోనీయ్యి బాబు వైజాగ్....
బామ్మ ROCKSSSSS
డ్రైవర్ బాబు SHOCKZZZZZ

Thursday, September 8, 2016


ఒక మంచిమాట తో మిత్రులందరికీ శుభ సాయంత్రం!!

చిటారు కొమ్మపై పక్షి వాలిందంటే 
ఆ కొమ్మపై నమ్మకంకాదు... 
తన రెక్కలపై!!!




పీవీ.. దీర్ఘదర్శికి...మా ఘన నివాళి....

బజాజ్ స్కూటర్ మీద నాన్నఇంటికి తిరిగొస్తాడు… టేబుల్ మీదో అల్మారాలోనో హెచ్ఎంటీ వాచ్ ఉంటుంది…ట్రంకాల్ వస్తుందంటూ పోస్టాఫీసులోనో… మరోచోటో ఫోన్ కోసం ఎదురుచూసే రోజులు… అప్పుడప్పుడూ కనిపించే అంబాసిడర్ కార్లు… ఫియట్ కార్లో తిరిగితే సౌండ్ పార్టీ అనుకుంటా అని చూసే చూపులు… విమానం అనగానే ఇండియన్ ఏర్ లైన్స్ అంటూ చూపించే సినిమాలు…! ఇవన్నీ పాతికేళ్ల జ్ఞాపకాలు ! అప్పటి ఇండియా ఇదంతా ! ఇలాంటి పరిస్థితి నుంచి చేతిలో సెల్ ఫోన్… అందులోంచే మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునేంత టెక్నాలజీ… ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఏమైనా కొనుక్కునే కెపాసిటీ అన్నీ వచ్చాయ్.ఇదంతా ఓ రూపశిల్పి రూపుదిద్దిన అద్భుతం. ప్రధానిగా పీవీ వేసిన ఆ ఒక్క అడుగూ దేశాన్నే కాదు మన జీవితాల్ని, జ్ఞాపకాల్ని కూడా మార్చేసింది. గ్లోబలైజేషన్ ఊపందుకుంటున్న దశలో పడిన ఆ అడుగులు ఇపుడు దేశ రూపురేఖల్నే మార్చేశాయ్.
మేకిన్ ఇండియాకి ఐకానిక్ సింబల్… లోహ సింహం ఉంటుంది చూశారు సమరనాదం చేస్తున్నట్టు… నిజానికి అది పాతికేళ్ల కిందట దీర్ఘదర్శి పీవీ రూపుకట్టిన ఆలోచన. దానికి ఓ అప్పియెరెన్స్ ఇస్తే ఇప్పుడది సింహం అయ్యింది. తాకట్టు పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని… అవకాశాల కోసం ప్రపంచమే తలుపు తట్టేలా తీర్దిదిద్దిన వ్యూహం పట్టాలెక్కి సరిగ్గా పాతికేళ్లు. ఏ ఆర్థిక వేత్తలో… ప్రపంచబ్యాంకో… లేదంటే విశ్వవిఖ్యాత నిపుణులో తీర్చిదిద్దలేదు ఈ ఆలోచనల్ని ! ప్రపంచాన్ని పరిశీలించి… భారత బలాబలాల్ని మథించి రూపొందించిన వ్యూహం. తిరుగులేని స్ట్రాటజీ దేశాన్ని పదేళ్లలో అపూర్వంగా మార్చేస్తే… అందుకు కారకుడు, సాధకుడు అయిన పీవీ మాత్రం అప్పటికే తెరమరుగైపోయారు. ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణ బాటలకి ఇరవైదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇదే అయనకి మా ఘన నివాళి.....

Wednesday, September 7, 2016

సమాజానికి బ్రాహ్మణుల సేవ

*******సమాజానికి బ్రాహ్మణుల సేవ*****
బ్రాహ్మణులేం చేశారో గమనిద్దాం.
పాణిని సంస్కృత వ్యాకరణం వ్రాశాడు.
ఆయన వ్రాసిన పద్ధతిలో కొన్ని భాషలకు వ్యాకరణాలు వ్రాశారని తెలుస్తోంది.
కణాద మహర్షి వైశేషిక తర్కశాస్త్రం రచించాడు.
దానిలో ప్రపంచం పరమాణువులతో నిర్మింపబడిందని తెలిపాడు.
గౌతముడు వ్యవసాయం చేసి కరవుతో బాధపడే వారికి అన్నం పెట్టాడు.
ఆయన కార్యకారణ భావాన్ని, పదార్థ లక్షణాలను తెలిపే న్యాయశాస్త్రం రచించాడు
. పతంజలి యోగసూత్రాలు వ్రాసి ఆరోగ్యం పొందడానికి దారిచూపాడు.
చరకుడు ఆయుర్వేదం ద్వారా జనం ఆరోగ్య రక్షణకు బాట ఏర్పరచాడు.
సుశ్రూతుడు శస్తచ్రికిత్స ద్వారా ఆరోగ్య రక్షణకు ప్రయత్నించాడు.
ధన్వంతరి ఆయుర్వేద మూల పురుషుడు,
అగ్నివేశుడు వైద్య గ్రంథకర్త,
అష్టాంగ హృదయకర్త వాగ్భటుడు.
అత్రి, భరద్వాజుడు, ఆత్రేయుడు, గౌతముడు మొదలైనవారు ఆయుర్వేద ప్రవర్తకులు.
ఆంగ్లేయ వైద్యము భారతదేశంలో ప్రవేశించడానికి పూర్వం ఈ ఆయుర్వేదమే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడింది గదా!
అత్రిముని ‘అందరు సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ శుభం పొందాలి. ఒక్క రు కూడా దుఃఖం పొందకూడదు అని బోధించాడు.
దానికనుగుణంగా ఆయన భార్య అనసూయ కరవుకాలంలో పంట పండించి అందరికీ అన్నదానం చేసింది.
యాస్కు డు పదాల వ్యుత్పత్తిని తెలిపే నిరుక్తం రచించాడు.
ఆర్యభటుడు ఖగోళానికి చెందిన అనేక విషయా లు తెలిపాడు. భూమి తిరుగుతుందని చెప్పిన శాస్తవ్రేత్త ఆయన. భాస్కరుడు
లీలావతీ గణిత శాస్త్రాన్ని రచించారు.
చాణక్యుడు అర్థశాస్త్రం రచించాడు. ఆ జ్ఞానంతో వౌర్య చంద్రగుప్తుని ప్రభువుగా చేశాడు.
మహామంత్రి తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యానికి చేసిన సేవలు ప్రసిద్ధాలు
ఇక లోకానికి ఆనందాన్ని కల్గించే కావ్యాలు, నాటకాలు, కృతులు రచించిన మహానుభావులు సంస్కృతంలోను, దేశ భాషలలోను వందల సంఖ్యలో ఉన్నారు.
ధ్వని మా ర్గాన్ని కనుగొన్న ఆనందవర్ధనుడు......
ఔచిత్య విచార చర్చ చేసిన క్షేమేంద్రుడు.....
అభిజ్ఞాన శాకుంతలం రచించిన కాళిదాసు....
నాట్యశాస్త్రాన్ని రచించిన భరతుడు,
నీతి శాస్త్రం రచించిన శుక్రుడు,
కామశాస్త్రాన్ని రచించిన వాత్స్యాయనుడు,
పంచతంత్రం ద్వారా నీతి బోధ చేసిన విష్ణుశర్మ వీరందరూ బ్రాహ్మణులే కదా!
కృషి పద్ధతిని రచించినవాడు పరాశరుడు....
సుధన్వోపాధ్యాయుడు ధనుర్వేద గురువులలో ఒకడు....
కృష్ణమాచార్యుడు ధనుర్విద్యా విలాసమునకు రచయిత.
సంగీత రత్నాకరాన్ని రచించినవాడు శార్జ్ధర దేవుడు.
రుద్రభట్టు స్వర నిర్ణయం రచించాడు.
శిల్ప శాస్త్రం గర్గపరాశరులవలన విశ్వకర్మకు లభించింది.
నీలకంఠ భట్టు, విశ్వనాథ దేవుడు, నరహరి భట్టు, విశ్వనాథ ద్వివేది శిల్పశాస్త్ర గ్రంథాలను వ్రాశారు.
మానసార ముని రచించినది మానసారం. ఇది గృహ నిర్మాణ విషయాలనేకం తెల్పింది.
ఇక తెలుగులో ......
నన్నయభట్టు మొదలయిన కవుల గురించి తెలిపితే అదో పెద్ద గ్రంథమవుతుంది. ఇవన్నీ సమాజానికి మేలు కలిగించేవి కావా?
రూపాయి చేతితో తాకకుండా సాధన చేసి ఏ మతం ద్వారానైనా పరతత్త్వాన్ని పొందుతారని నిరూపించి, విశ్వమత ప్రవక్త వివేకానందుని తయారుచేసిన రామకృష్ణ పరమహంస,
అమెరికాలో యోగమార్గం ప్రచారం చేసిన పరమహంస యోగానంద, భారతదేశంలో యోగ గంగను ప్రవహింపజేసిన రామ్‌లాల్ ప్ర భూజీ బ్రాహ్మణులే.
గడచిన శతాబ్దాలలో.....
సంఘ సంస్కర్త, మహారచయిత, కవి కందుకూరి వీరేశలింగం పంతులు...
తన సర్వస్వం దేశంకోసం సమర్పించిన టంగుటూరి ప్రకాశం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య,
శాస్తవ్రిజ్ఞాన ప్రచారకులు కొమర్రాజు లక్ష్మణరావు పంతులు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశే్వశ్వరయ్య, గొప్ప ఆయుర్వేద వైద్యులు, బహుగ్రంథకర్త, పండిత గోపాలాచార్యులు ఇలా ఎందరి పేర్లయినా చెప్పవచ్చు. ప్రతి రంగంలో వారి కృషి తరువాతి వారికి మార్గదర్శకంగా ఉండేలా చేసిన వారెందరో!
ఆధునికులలో గేయ కవులలో గురజాడ, శ్రీశ్రీ, ఆరు ద్ర, సాంప్రదాయక కవులలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్య ఇలా ఎందరినో పేర్కొనవచ్చు.
భారతదేశంలో ఏ పార్టీకి మెజార్టీరాని పరిస్థితిలో ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి అయిదు సంవత్సరాలు మధ్యలో ఎన్నికలు రాకుండా నెట్టుకుని వచ్చిన పి.వి.నరసింహారావు, ఇలా ప్రతి రంగంలోనూ సమాజానికి మేలుచేసిన బ్రాహ్మణులనెందరినైనా చెప్పవచ్చు.
పత్రికా రంగంలో ముట్నూరి కృష్ణారావు, నీలంరాజు వెంకట శేషయ్య, భావరాజు నరసింహారావు మొదలైనవారు అంకితభావంతో పనిచేసినవారే. మచిలీపట్నంలో ముట్నూరి కృష్ణారావు, డాక్టర్ పట్ట్భా సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు ఆంధ్ర జాతీయ విద్యాపరిషత్తు నెలకొల్పి, ఒకప్రక్క స్వాతంత్య్రోద్యమ కృషి కొనసాగిస్తూ జాతీయ విద్యావ్యాప్తికి కృషిచేశారు. ఆ ఊరిలో రాంజీ పంతులు హరిజనులలో విద్యావ్యాప్తికి అంకితమయ్యారు. ఆయన స్థాపించిన పాఠశాల ఇప్పటికీ నడుస్తున్నది.
ఇంతెందుకు? లోకమాన్య బాలగంగాధర తిలక్, మో తీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ ఆశయాలకు అంకితమయిన భూదానోద్యమం నిర్వహించిన తపస్వి వినోభాభావే, ఆ కాలంలోనే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నెలకొల్పిన మదనమోహన మాలవ్యా బ్రాహ్మణులే గదా! వీరందరు సమాజానికి చేసిన మేలు చాలదంటారా? ఇంతకంటే ఈ విమర్శకుల వర్గం సమాజానికి చేసిన అధికమైన మేలు ఏమిటి?
పూర్వం చేశారు కాని ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించవచ్చు. ఇపుడు బ్రాహ్మణులు జీవన పోరాటంలో ఉన్నారు. కాబట్టి ఎల్లాగో శ్రమపడి ఏదో దేశానికి వెళ్ళి తన చాకచక్యం, కృషి పట్టుదలతో జీవిస్తున్నాడు. అలా వెళ్ళలేనివారు బ్రతుకుబండి భారంగా ఈడుస్తున్నారు. మేధావి, సంపన్నుడు ఎలాగో జీవిస్తాడు. సామాన్యుని మాటేమిటి? పూర్వం ధర్మం, నీతి, దయ, అహింస వంటి సుగుణాలను అలవరచిన కాలంలో స్వాతంత్య్ర సంపాదనమో, సామ్యవాదమో పరమధర్మమని భావించి ఎందరో యువకులు తమ సర్వస్వం వెచ్చించి దానికి అంకితమయ్యారు. సంపన్నులు కొందరయినా తమ డబ్బు గుడికో, బడికో ఇచ్చి చెరువోనుయ్యో తవ్వించి జన్మధన్యమయిందనుకునేవారు. తమ డబ్బుతో పేదలకు సాయం చెయ్యడంవల్ల పేదలకు వారిపై గౌరవం ఉండేది. దాతలకు పుణ్యం, భగవదనుగ్రహం లభిస్తాయనే తృప్తిఉండేది. ఇపుడు పాప పుణ్య విశ్వాసాలు తొలగిపోతున్నాయి. గుడులకు వెళ్ళినా కోరికలు తీరడానికి తప్ప, భగవదనుగ్రహంకోసం అనే పద్ధతి తగ్గింది.
ఇప్పుడు అకారణంగా బ్రాహ్మణులు సోమరులని, వీరి కులం ఉత్పత్తికి సంబంధించినది కాదని, వారు పేద వారైనా సహకరించవద్దని ప్రచారం చేస్తే బాధ, ద్వేషం కలగడం తప్ప దానివల్ల సమసమాజం రాదు. పూర్వం గురుస్థానాల్లో ఉన్న వర్గం ధర్మం చెబితే సమాజం పాటిం చేది. ఇప్పుడు తల్లిదండ్రులనే అనాధాశ్రమాల్లో చేర్పిస్తు న్నారు. రామా యణ, భారతాలు చదివితే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, శౌచం, ఓరిమి, జ్ఞానం, సత్యం పల కం, పరిశుద్ధత, అహింస, దయ, దొంగతనం చేయక పోవడం ఇలాంటి సుగుణాలు అవలర్చుకోవాలని తెలుస్తాయ. అందువల్ల జనహితం కోరేవారు విశాల హృదయంతో సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలి. అంతేకాని ఒక కులాన్నో, వర్గాన్నో నిందిస్తే జరిగే పనా ఇది.

Total Pageviews