భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Tuesday, May 29, 2018
మార్టిన్ సన్ పద్యాల్నికొన్నైనా తెలుగు చెయ్యగలిగాను.Vadrevu chinaveerabhadrudu
హమ్మయ్య. మొత్తానికి మార్టిన్ సన్ పద్యాల్ని కొన్నైనా తెలుగు చెయ్యగలిగాను.
నా చిన్నప్పుడు మా ఊళ్ళో కంసాలి సోమలింగం బంగారపు పని చేస్తుంటే చూసేవాణ్ణి. ప్రతి చిన్న బంగారపు తునకనీ, గాలి వీయకుండానే ఎగిరిపోయేటంత పలచని బంగారు రేకుల్ని వేళ్ళతొ దారాలు అల్లినట్టుగా, శ్రద్ధగా, పసిపాపల్ని లాలించినంత జాగ్రత్తగా అతికేవాడు, పొదిగేవాడు. అట్లాంటి కవితా శిల్పం మార్టిన్ సన్ ది.
పూర్తిగా మొద్దుబారిపోయిన జీవితంలో, సౌకుమార్యం సన్నగిల్లిపోయిన కాలంలో ఆ కవితల్ని ముందు చదవడానికే ఎంతో మెలకువ కావాలి. దేవాలయంలో తీర్థం తీసుకునేటప్పుడు మన సమస్తాంగాలూ ఒక్క దోసిట్లోకి ఒదిగిపోయినట్టుగా, మన ప్రాణమంతా మన కళ్ళల్లోకి నింపుకుని మరీ ఆ కవితలు ఒక్కొక్కటీ చదవాలి. చదివినతరువాత, చెట్టునీడనకూచుని ఆవు నెమరువేసుకున్నట్టుగా ఆ పదచిత్రాల్ని స్వానుభవంలోకి ఒంపుకుని మరోమారు చర్వితచర్వణం చెయ్యాలి.
ఇక వాటిని అనువదించాలంటే ఆ కష్టమెట్లాంటిదో ఎట్లా చెప్పేది!
హారీ మార్టిన్ సన్ (1904-78) కవిత్వం Chickweed Wintergreen (2010), The Procession of Memories (2009) చదివిన తరువాత, ఆయన Wild Bouquet(1985) కోసం ఉవ్విళ్ళూరాను.కానీ అవుటాఫ్ ప్రింట్. అట్లాంటిది ఆ పుస్తకాన్ని సోమయ్యగారి అబ్బాయి రావెల మనోహర్ నా కోసం అమెరికా అంతా గాలించి ఒక యూజ్డ్ కాపీ సంపాదించి పంపించేరు.ఎవరో ఎవరికో 87 లో with love and best wishes కానుకచేసిన పుస్తకం. సముద్రాలు దాటి మరీ నన్ను చేరింది.
ఆ పుస్తకం అందినప్పటినుంచీ ఆ 61 చిన్న చిన్న కవితల్నీ ఎన్నిసార్లు చదివానో. ఆ కవితలు చదివినప్పుడల్లా నాలుకమీద పడగానే కరిగిపోయే నేరేడుపళ్ళలానే ఉంటాయిగాని, అనువదించాలంటే, ఊదారంగు చార తప్ప మరేదీ పట్టు చిక్కదు. ఎన్నోసార్లు విఫల ప్రయత్నం చేసి వదిలేసాను.
దుర్భరమైన అతడి బాల్యం, భయానకమైన సముద్రప్రయాణాలూ, జీవితమంతా వదలని ఒంటరితనం-వీటి గురించి నేనింతకుముందు రాసాను. అతడు స్వీడిష్ అకాడెమీలో సభ్యుడైనందుకే నోబెల్ ప్రైజు వచ్చిందన్న విమర్శ తట్టుకోలేకనే అతడు మరణించాడు,లేదా తనని తాను చంపుకున్నాడు. కాని ఒక విమర్శకుడు రాసినట్టుగా, నోబెల్ ప్రైజు వచ్చినందువల్ల మార్టిన్ సన్ కవిత్వానికి విలువ పెరగలేదు, విమర్శించినందువల్ల విలువ తగ్గలేదు. ఆ మాట నిజం. నా దృష్టిలో నోబెల్ ప్రైజుకి టాగోర్ ఎంత అర్హుడో మార్టిన్ సన్ కూడా అంతే అర్హుడు. కానీ అతడికి నోబెల్ ప్రైజు రాకపోయిఉంటే ఆ అద్భుతమైన కవిత్వం మనదాకా చేరిఉండేది కాదేమో.
చూడండి, సాలీడుదారపు పోగుల్లాంటి ఆ కవితావాక్యాల్ని నా బండ వేళ్ళతో ఎంతో కొంత తెలుగు చేసాను.
1.
సుళ్ళు తిరిగే మంచు
_____________
సుళ్ళు తిరిగే మంచు
_____________
మెరిసే హిమఫలకాల మీద
సుళ్ళు తిరుగుతూ మంచు నాట్యం.
దాని పాదాలు కనబడవు,
కప్పుకున్న వస్త్రం తప్ప.
మంచు అల్లిన లేసులాగా
చలించే ఉత్తరధ్రువకాంతులు,
చల్లగాలి సూదులతో దగ్గరగా
లాగి కుట్టిన కుచ్చిళ్ళు.
సుళ్ళు తిరుగుతూ మంచు నాట్యం.
దాని పాదాలు కనబడవు,
కప్పుకున్న వస్త్రం తప్ప.
మంచు అల్లిన లేసులాగా
చలించే ఉత్తరధ్రువకాంతులు,
చల్లగాలి సూదులతో దగ్గరగా
లాగి కుట్టిన కుచ్చిళ్ళు.
2.
బాల్యకాననం
_________
బాల్యకాననం
_________
ఆవుల్ని వెతుక్కుంటూ బోసిపాదాలతో
అడవినుంచి అడవికి పరుగెడుతున్నప్పుడు
కొండమీద కొలనులో చూసాను
అంతరిక్ష మేఘరథచక్రాన్ని.
అడవినుంచి అడవికి పరుగెడుతున్నప్పుడు
కొండమీద కొలనులో చూసాను
అంతరిక్ష మేఘరథచక్రాన్ని.
వేసవి కాననాల్లో ఆడుకున్న జీవితం
పిట్టలపాటలతో లోతెక్కిన సాయంసంధ్య
పక్షిగానంతో మరింత పైకి జరిగిన ద్యులోకం
నా కలలు, కాపట్యాలన్నిటినుంచీ నేను పొందిందేమీ లేదుగాని,
జ్ఞాపకం నా జీవితానికి ప్రాణం పోస్తున్నది.
జ్ఞాపకాలు సంపూర్ణ స్వప్నాలు.
పిట్టలపాటలతో లోతెక్కిన సాయంసంధ్య
పక్షిగానంతో మరింత పైకి జరిగిన ద్యులోకం
నా కలలు, కాపట్యాలన్నిటినుంచీ నేను పొందిందేమీ లేదుగాని,
జ్ఞాపకం నా జీవితానికి ప్రాణం పోస్తున్నది.
జ్ఞాపకాలు సంపూర్ణ స్వప్నాలు.
అప్పుడప్పుడు వేసవి దివ్యప్రాంగణంలో
చైత్రమాసపు కొంగలాగా
నా కల ఒకటి గాల్లోకి తేలుతుంది
పచ్చికబయళ్ళమీదుగా.
చైత్రమాసపు కొంగలాగా
నా కల ఒకటి గాల్లోకి తేలుతుంది
పచ్చికబయళ్ళమీదుగా.
3
వేసవి
____
వేసవి
____
అట్లా అని వేసవిలో పెద్ద బాధా ఉండదు.
అడవుల్లో తియ్యటి చిట్టీతపళ్ళు ఏరుకోవచ్చు.
ఎర్రటిపళ్ళు నాలుకమీద పెట్టుకోగానే రక్తం చిమ్ముతాయి,
కాని నెత్తుటివాసన ఉండదు.
అప్పుడే జీవితం పూర్తిగా జీవించినట్టుంటుంది.
అంటే ఎలా ఉందో అలా.
స్వర్గం వైపు ఒక అడుగువెయ్యడమన్నమాట
అడవుల్లో తియ్యటి చిట్టీతపళ్ళు ఏరుకోవచ్చు.
ఎర్రటిపళ్ళు నాలుకమీద పెట్టుకోగానే రక్తం చిమ్ముతాయి,
కాని నెత్తుటివాసన ఉండదు.
అప్పుడే జీవితం పూర్తిగా జీవించినట్టుంటుంది.
అంటే ఎలా ఉందో అలా.
స్వర్గం వైపు ఒక అడుగువెయ్యడమన్నమాట
4
పాము
____
పాము
____
వాక్కాయ పొదలమధ్య ఒక పాము
తన చర్మం వదిలించుకుంది.
ఇరుగ్గా ఉన్న చొక్కాలోంచి
అటూ ఇటూ మెలికెలు తిరుగుతూ
లోపలనుంచి బయటకొచ్చేసింది,
ఇక వెనుతిరిగి చూడలేదు.
అక్కడ అడవిలో తెల్లగా పొడుగ్గా మెరుస్తున్న
చొక్కా అంచు.
తన చర్మం వదిలించుకుంది.
ఇరుగ్గా ఉన్న చొక్కాలోంచి
అటూ ఇటూ మెలికెలు తిరుగుతూ
లోపలనుంచి బయటకొచ్చేసింది,
ఇక వెనుతిరిగి చూడలేదు.
అక్కడ అడవిలో తెల్లగా పొడుగ్గా మెరుస్తున్న
చొక్కా అంచు.
5
మైదానగీతం
_________
మైదానగీతం
_________
పూర్తిగా వికసించిన ఒక పచ్చికబయలుని
దాని సీతాకోకచిలుకలతో మాత్రమే వివరించగలం,
దాని తేనెటీగల్తో మాత్రమే గానం చెయ్యగలం.
వేలరెక్కల మిరుమిట్లు అందుకోవాలన్నా
తేనెటీగల పాట అర్థం కావాలన్నా
అప్సరసలకే సాధ్యమవుతుంది.
ఆ పాటలు వినడమెట్లానో
అవి మటుకే నేర్చుకుంటున్నాయి
అనంతకాలంగా .
దాని సీతాకోకచిలుకలతో మాత్రమే వివరించగలం,
దాని తేనెటీగల్తో మాత్రమే గానం చెయ్యగలం.
వేలరెక్కల మిరుమిట్లు అందుకోవాలన్నా
తేనెటీగల పాట అర్థం కావాలన్నా
అప్సరసలకే సాధ్యమవుతుంది.
ఆ పాటలు వినడమెట్లానో
అవి మటుకే నేర్చుకుంటున్నాయి
అనంతకాలంగా .
6
సీతాకోకచిలుకలు
____________
____________
సీతాకోక చిలుకలకి రెక్కలుండవు,
తూర్పుదేశాల శాలువాలు కప్పుకుని ఎగురుతాయవి.
ప్రకృతి కూడా ఈ విధంగా వాటికి సాయపడింది
వాటినెవరూ ఒక్క గుక్కలో మింగేయకుండా
వాటికంత పెద్ద శాలువాలు తగిలించింది.
తూర్పుదేశాల శాలువాలు కప్పుకుని ఎగురుతాయవి.
ప్రకృతి కూడా ఈ విధంగా వాటికి సాయపడింది
వాటినెవరూ ఒక్క గుక్కలో మింగేయకుండా
వాటికంత పెద్ద శాలువాలు తగిలించింది.
7
బాతు
____
బాతు
____
అల్లిబిల్లిగా అల్లుకుపోయిన నాచులోకి
కొడవలిలాంటి తన తెల్లటి మెడ
ఏటవాలుగా చాపింది బాతు.
ముఖమల్లాంటి బురదలో
ఈటెలాగా ముక్కు చాపి కెలుకుతోంది,
కలల ఒడ్డు మీద తలెత్తి చూస్తున్నది
చల్లగా పాములాగా.
కొడవలిలాంటి తన తెల్లటి మెడ
ఏటవాలుగా చాపింది బాతు.
ముఖమల్లాంటి బురదలో
ఈటెలాగా ముక్కు చాపి కెలుకుతోంది,
కలల ఒడ్డు మీద తలెత్తి చూస్తున్నది
చల్లగా పాములాగా.
8
నీటిలోపలి చిత్రం
___________
___________
నీటి చిత్తడి మధ్య రెల్లుపొదలు
పతాకల్లాగా రెపరెపలాడుతున్నాయి.
కానుగచెట్టు గుబుర్లలో పులకింత,
దాని ఆకుల గుసగుసలప్పటికే
అదృశ్యంగా లంకల్లోకి చేరుకున్నాయి.
ఒకామె స్నానం చేస్తున్నది.
ఈదుకుంటూ పోతున్నదొక బాతు,
అది వెనక్కి చూసినప్పుడు
గాలిమర పూర్తిగా తిరిగినట్టుంది
పతాకల్లాగా రెపరెపలాడుతున్నాయి.
కానుగచెట్టు గుబుర్లలో పులకింత,
దాని ఆకుల గుసగుసలప్పటికే
అదృశ్యంగా లంకల్లోకి చేరుకున్నాయి.
ఒకామె స్నానం చేస్తున్నది.
ఈదుకుంటూ పోతున్నదొక బాతు,
అది వెనక్కి చూసినప్పుడు
గాలిమర పూర్తిగా తిరిగినట్టుంది
9
చిమ్మెటలు
_______
చిమ్మెటలు
_______
కనుపాపలోని అందమైన తెలుపులాగా
వేసవి సాంధ్యగగనం.
కూనిరాగం తీస్తున్న చిమ్మెటలు
వాటి సుదీర్ఘగానం.
వేసవి సాంధ్యగగనం.
కూనిరాగం తీస్తున్న చిమ్మెటలు
వాటి సుదీర్ఘగానం.
అవి నేలమీద వాలినప్పుడు
పాతకాలపు విచిత్ర శోభ చూస్తావు,
వాటి ఆకుపచ్చ-బంగారపు రెక్కలమీద
కిలుంపట్టిన భారతీయ ఇత్తడి వన్నె.
పాతకాలపు విచిత్ర శోభ చూస్తావు,
వాటి ఆకుపచ్చ-బంగారపు రెక్కలమీద
కిలుంపట్టిన భారతీయ ఇత్తడి వన్నె.
10
దు:ఖమూ, సంతోషమూ
________________
________________
కోల్పోయిన ఏదో సంతోషం కోసమే
తీవ్రమైన ప్రతి దు:ఖమూ వెతుక్కుంటుంది
దాన్ని ఆ దారి తప్పిపోనివ్వకు
బాధ తన వెతుకులాట మాననివ్వకు.
దు:ఖమే సంతోషం పొందగల అతిగొప్ప సత్కారం.
తీవ్రమైన ప్రతి దు:ఖమూ వెతుక్కుంటుంది
దాన్ని ఆ దారి తప్పిపోనివ్వకు
బాధ తన వెతుకులాట మాననివ్వకు.
దు:ఖమే సంతోషం పొందగల అతిగొప్ప సత్కారం.
Monday, May 28, 2018
కులతత్వంపై శ్రీ వాసిరెడ్డి అమర్నాధ్ గారి పోస్ట్
స్లేట్ విజయవాడ లో తమ పిల్లల్ని చేర్పించాలనుకొన్న ఒక పేరెంట్ నుంచి ఇందాకే ఫోన్ " సర్ విజయవాడ లో చాలా విద్య సంస్థల్లో కులతత్వం హద్దులు దాటుతోంది . పిల్లలు కులాల వారీగా విడిపోయి ఘర్షణలకు దిగుతున్నారు . మీ పాఠశాలలో కూడా అలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏమిటి ?"
" ప్రపంచ జనాభా 760 కోట్లు . వీరందరూ నా వారే అనుకొన్న వాడు ప్రపంచానికి నాయకుడు అయ్యే అవకాశాన్ని పొందుతాడు . ప్రపంచం లో ఎక్కడైనా స్థిర పడగలుగుతాడు . తానూ ఎంపిక చేసుకొన్న రంగం లో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశాన్ని పొందుతాడు . సున్నా ను కనిపెట్టిన ఆర్యభట్టు , పెన్సిలిన్ ను కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ , అహింసా మార్గాన్ని ప్రపంచానికి చూపిన గాంధీ .. ఇలా ఎందరో మహనీయులు ప్రపంచ నాయకులుగా స్లాగించబడుతున్నారు .
డాక్టర్ అయినా , రోబోటిక్ ఇంజనీర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా , సొంత వ్యాపారం చేసుకొన్నా .. ఒక వ్యక్తి సమాజం లోని అన్ని కులాలు మతాలు ప్రాంతాలు వారితో వ్యవహరించాల్సి ఉంటుంది . అంతా మనవారే అనుకొన్న వ్యక్తిని సమాజం అలాగే ఓన్ చేసుకొంటుంది . ప్రపంచం మన ముందు నిలిచిఉన్న ఒక పెద్ద అద్దం. ప్రపంచం లో ని వీరు .. మా మతం వారు కారు .. మా ప్రాంతం వారు కారు .. మా కులం వారు కారు అంటూ అధిక శాతం జనాభా ని దూరం చేసుకొని సంకుచిత స్వభావం తో బావి లో కప్ప లా కూలతత్వాన్ని ఒంట పట్టించుకొన్న వ్యక్తి మహా అంటే ఆ కులానికి నాయకుడు కాగలుగుతాడు . అంతకన్నా ఎదగలేడు. రేపటి రోబోటిక్ యుగం లో ఇలాంటి వారికి మనుగడ కూడా కష్టం అవుతుంది . ... ఈ విషయాలను లైఫ్ స్కిల్స్ లో భాగంగా మా పిల్లలకు బోధిస్తాము . పిల్లలు మనం చెప్పే నీతి సూత్రాలు వినరు . మనల్ని చూసి అనుకరిస్తారు . మేము స్లేట్ పేరుతొ స్కూల్ నడుపుతున్నాము . అక్కడ టీచర్స్ స్టాఫ్ ఇంకా పిల్లలు వుంటారు . ఫలానా టీచర్ ది ఏ కులం .. ఏ మతం అనేది వారి ఇంటిలోని వ్యక్తి గత విషయం . ఇక స్కూల్ వస్తే వారు టీచర్స్ . టీచర్స్ ఎంపిక లో కానీ ప్రమోషన్ విషయం లో కానీ వారి ప్రొఫెషనల్ సామర్థ్యము ఏమిటి అనే విషయం తప్ప వారి సామజిక స్థితి ఏమిటి , కులం ఏమిటి మతం ఏమిటి అనేది పరిగణ లోకి తీసుకోము .
" అని చెప్పను .
" అని చెప్పను .
సర్ మా పిల్లల్ని మీ స్కూల్ లో చేర్చమంటారా ? అని ఆయన చివరిగా అడిగారు . మా స్కూల్ ఏమిటో నేను చెప్పను . చేర్చాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది మీరు . చేర్చండి అని నేను చెప్పను " అన్నాను .
Sunday, May 27, 2018
మృత్యువు ఎక్కడ ఉంది?:
మృత్యువు ఎక్కడ ఉంది?
Where is the death?
సర్వకాల సర్వావస్థలయందు ముక్కు చివరన ఉంటుంది. ఎలాగంటే శ్వాస తీసిన తరువాత విడవక పోతే మృత్యువు. విడిచిన శ్వాస తీయక పోయినా మృత్యువు.
1. శరీరము ఎక్కడనుండి వచ్చినది?
ఈ శరీరము పంచ భూతముల నుండి వచ్చినది. మరలా పంచ భూతములలో కలిసిపోతుంది. మనలోని పంచ భూతములు తిరిగి పంచ భూతములలో కలిసిపోతాయి.
“పురత్రయే క్రీడతి జీవయo తః” కైవల్యోపనిషత్తు.
త్రికూటములు.
1. స్థూల, 2. సూక్ష్మ 3. కారణ
1. స్థూల శరీరము:- జాగృత్- నిద్రలలో స్థూల శరీరముఉండును.
2. సూక్ష్మ శరీరము:- నిద్ర, నిద్రలోని స్వప్నము లో ఉంటుంది.
3. కారణ శరీరము :- సుఘప్తి, నిద్రలో ఉంటుంది.
ఈ ఉపాదిలోని జీవుడు జీవితకాలమంతా ఇందులో ఈ మూడింటిలో తిరుగుచుంటాడు.
సాక్షి చిత్రగుప్తుడు ఎవరు?
ఈ ఉపాదిలో గుప్తంగా కూర్చొని చిత్రంగా లెక్కలు వ్రాయువాడు పంచేంద్రియములు తమ పని తాము చేస్తున్నా,చేయలేక పోయినా అవి పనిచేస్తాయి, పని చేయలేవు అని చూచే ఆత్మ సాక్షి, లోపల నున్న జీవుడు.
1. అనుభవములు రెండు.
1.సుఖము 2. దుఃఖము మరొకటిలేదు.
మనకు ఇష్టపడినది, నచ్చినది సుఖము, మనకు నచ్చనిది బాధకలిగించేది దుఃఖము మరొకటిలేదు.
1. గుణములు మూడు.
1. సత్యము 2. రజస్సు 3. తమస్సు
2. చతుర్విద పురుషార్థములు.
1. ధర్మము 2. అర్థము 3. కామము 4.మోక్షము
3. తన్మాత్రులు ఏవి?
1. శబ్దము 2.స్పర్శ 3. రసము 4.రూపము 5. గంథము
4. ఉపాధి (శరీరము)
పంచేంద్రియములు + ఒక మనస్సు =మానవ ఉపాధి
(పంచేంద్రియములు + మనస్సు ఈ ఆరింటి సంఘతామే ఉపాధి)
సప్తధాతువులు
1)చర్మము 2)రక్తము 3)మాంసము 4)క్రొవ్వు 5)అస్థి 6)శుక్ల 7)మేధ
తొమ్మిదిరంధ్రములు
1)రెండు కళ్ళు ........................2
2) రెండు చెవులు ...................2
3)ముక్కుకు రెండు రంధ్రాలు......2
4)నోరు .................................1
5)మలద్వారము......................1
6)మూత్రద్వారము....................1
మొత్తము 9
పది వాయువులు
1)ప్రాణ 2)అపాన 3)వ్యాన 4)ఉదాన 5)సమాన 6)నాగ 7)కూర్మ 8)కృకర 9)ధనంజయ 10)దేవదత్త
ఇందులో ఈ వ్యాన వాయువు మాత్రం వెళ్ళదు. మరణించిన తర్వాత ఈ వ్యాన వాయువు శరీరమును పట్టుకొని ఉంటుంది. అపుడు తనూభవుడు (కుమారుడు) అంత్యేష్టి సంస్కారముతో మంత్ర బద్ధముగా ఈ వాయువును మరణించిన శరీరం నుండి విడగొట్టుతాడు.
భగవంతుని పూజ విషయంలో మనస్సుతో కలువని పంచేంద్రియము+కర్మేంద్రియములు చేయు పనులు నిష్ప్రయోజనం.
దేహాభిమానము, అహము తగ్గనిదే భగవంతుని చూడలేవు. మానవ జాతికి ధర్మ పథాన్ని నిర్దేశించడానికి యోగ్యమైన రీతిలో మహాభారతమును అనుగ్రహించిన వ్యాసుల వారి ధర్మ విషయములు.
ధర్మనిరతుడు:-
ఉదయ సమయంలో దాన ధర్మాలు చేయువాడు.
మధ్యాహ్న సమయంలో డబ్బు సంపాదించే మార్గములు అన్వేషించువాడు.
రాత్రి వేళలో సాంసారిక జీవితము సాగించేవాడు.
కేవలం ఇంద్రియ సుఖాల ఆలోచన వలననే విచారం ఆరంభమవుతుంది.
ఇంద్రియ వాంఛలు తీర్చుకొనడానికి శ్రమించే వారికి దుఃఖమే ప్రాప్తిస్తుంది. పాపాలకు అవకాశం కల్పిస్తుంది. నరకానికి పీటలు వేసి సర్వ నాశనానికి దారి తీస్తుంది.
ఈ భూమండలం అంతా మనకు స్వాధీనమైనా జనన మరణాలు నుండి తప్పించుకోగలమా?కోటీశ్వరులు, బిలీనియర్స్ ICU లో ఉంటే మనమంతా ఎంత వారుగాని చివరకు ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రసిడెంట్ ఆఫ్ చైనా, ప్రసిడెంట్ ఆఫ్ USA ఐనా ఎవరినైనా సరే ICU లో ఉంచితే మనము బయట(అద్దాలు బయట)నిలబడి I See You అంటూ చూస్తూ ఉండాలే కానీ ఏమి చేయలేము
Where is the death?
సర్వకాల సర్వావస్థలయందు ముక్కు చివరన ఉంటుంది. ఎలాగంటే శ్వాస తీసిన తరువాత విడవక పోతే మృత్యువు. విడిచిన శ్వాస తీయక పోయినా మృత్యువు.
1. శరీరము ఎక్కడనుండి వచ్చినది?
ఈ శరీరము పంచ భూతముల నుండి వచ్చినది. మరలా పంచ భూతములలో కలిసిపోతుంది. మనలోని పంచ భూతములు తిరిగి పంచ భూతములలో కలిసిపోతాయి.
“పురత్రయే క్రీడతి జీవయo తః” కైవల్యోపనిషత్తు.
త్రికూటములు.
1. స్థూల, 2. సూక్ష్మ 3. కారణ
1. స్థూల శరీరము:- జాగృత్- నిద్రలలో స్థూల శరీరముఉండును.
2. సూక్ష్మ శరీరము:- నిద్ర, నిద్రలోని స్వప్నము లో ఉంటుంది.
3. కారణ శరీరము :- సుఘప్తి, నిద్రలో ఉంటుంది.
ఈ ఉపాదిలోని జీవుడు జీవితకాలమంతా ఇందులో ఈ మూడింటిలో తిరుగుచుంటాడు.
సాక్షి చిత్రగుప్తుడు ఎవరు?
ఈ ఉపాదిలో గుప్తంగా కూర్చొని చిత్రంగా లెక్కలు వ్రాయువాడు పంచేంద్రియములు తమ పని తాము చేస్తున్నా,చేయలేక పోయినా అవి పనిచేస్తాయి, పని చేయలేవు అని చూచే ఆత్మ సాక్షి, లోపల నున్న జీవుడు.
1. అనుభవములు రెండు.
1.సుఖము 2. దుఃఖము మరొకటిలేదు.
మనకు ఇష్టపడినది, నచ్చినది సుఖము, మనకు నచ్చనిది బాధకలిగించేది దుఃఖము మరొకటిలేదు.
1. గుణములు మూడు.
1. సత్యము 2. రజస్సు 3. తమస్సు
2. చతుర్విద పురుషార్థములు.
1. ధర్మము 2. అర్థము 3. కామము 4.మోక్షము
3. తన్మాత్రులు ఏవి?
1. శబ్దము 2.స్పర్శ 3. రసము 4.రూపము 5. గంథము
4. ఉపాధి (శరీరము)
పంచేంద్రియములు + ఒక మనస్సు =మానవ ఉపాధి
(పంచేంద్రియములు + మనస్సు ఈ ఆరింటి సంఘతామే ఉపాధి)
సప్తధాతువులు
1)చర్మము 2)రక్తము 3)మాంసము 4)క్రొవ్వు 5)అస్థి 6)శుక్ల 7)మేధ
తొమ్మిదిరంధ్రములు
1)రెండు కళ్ళు ........................2
2) రెండు చెవులు ...................2
3)ముక్కుకు రెండు రంధ్రాలు......2
4)నోరు .................................1
5)మలద్వారము......................1
6)మూత్రద్వారము....................1
మొత్తము 9
పది వాయువులు
1)ప్రాణ 2)అపాన 3)వ్యాన 4)ఉదాన 5)సమాన 6)నాగ 7)కూర్మ 8)కృకర 9)ధనంజయ 10)దేవదత్త
ఇందులో ఈ వ్యాన వాయువు మాత్రం వెళ్ళదు. మరణించిన తర్వాత ఈ వ్యాన వాయువు శరీరమును పట్టుకొని ఉంటుంది. అపుడు తనూభవుడు (కుమారుడు) అంత్యేష్టి సంస్కారముతో మంత్ర బద్ధముగా ఈ వాయువును మరణించిన శరీరం నుండి విడగొట్టుతాడు.
భగవంతుని పూజ విషయంలో మనస్సుతో కలువని పంచేంద్రియము+కర్మేంద్రియములు చేయు పనులు నిష్ప్రయోజనం.
దేహాభిమానము, అహము తగ్గనిదే భగవంతుని చూడలేవు. మానవ జాతికి ధర్మ పథాన్ని నిర్దేశించడానికి యోగ్యమైన రీతిలో మహాభారతమును అనుగ్రహించిన వ్యాసుల వారి ధర్మ విషయములు.
ధర్మనిరతుడు:-
ఉదయ సమయంలో దాన ధర్మాలు చేయువాడు.
మధ్యాహ్న సమయంలో డబ్బు సంపాదించే మార్గములు అన్వేషించువాడు.
రాత్రి వేళలో సాంసారిక జీవితము సాగించేవాడు.
కేవలం ఇంద్రియ సుఖాల ఆలోచన వలననే విచారం ఆరంభమవుతుంది.
ఇంద్రియ వాంఛలు తీర్చుకొనడానికి శ్రమించే వారికి దుఃఖమే ప్రాప్తిస్తుంది. పాపాలకు అవకాశం కల్పిస్తుంది. నరకానికి పీటలు వేసి సర్వ నాశనానికి దారి తీస్తుంది.
ఈ భూమండలం అంతా మనకు స్వాధీనమైనా జనన మరణాలు నుండి తప్పించుకోగలమా?కోటీశ్వరులు, బిలీనియర్స్ ICU లో ఉంటే మనమంతా ఎంత వారుగాని చివరకు ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రసిడెంట్ ఆఫ్ చైనా, ప్రసిడెంట్ ఆఫ్ USA ఐనా ఎవరినైనా సరే ICU లో ఉంచితే మనము బయట(అద్దాలు బయట)నిలబడి I See You అంటూ చూస్తూ ఉండాలే కానీ ఏమి చేయలేము
చక్కని ఎద్దు...( కధ..)
చక్కని ఎద్దు... కధ..
‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘’’’’’‘’’’’’’’’’’’’’‘’’’’’’’’’
అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.
‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘’’’’’‘’’’’’’’’’’’’’‘’’’’’’’’’
అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.
గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.
ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు.
పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.
గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.
గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.
"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!
దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!'
గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.
తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!
గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.
చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ...
జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.
ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి.
ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.. సమాజంలో మార్పుకోసం కృషి చేయండి..
🙏
🙏
🙏
అమరవీరుని ఉత్తరం.
మనిద్దరమూ 18 వ ఏటే ఇంట్లోంచి బయటకు వచ్చాం...
నువ్వు నీ JEE క్లియర్ చేశావ్...
నేను ARMY కి సెలక్ట్ అయ్యాను...
నేను ARMY కి సెలక్ట్ అయ్యాను...
నువ్వు ఐఐటి లో చేరావ్...
నేను training centre లో చేరాను...
నేను training centre లో చేరాను...
నువు డిగ్రీకోసం రేయింబవళ్ళూ కష్టించావ్...
నేను ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్తితుల మద్య
ట్రైన్ అయ్యాను...
నేను ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్తితుల మద్య
ట్రైన్ అయ్యాను...
నువ్వు బి.టెక్ పూర్తి చేశావ్...
నేను the best soldier అయ్యాను...
నేను the best soldier అయ్యాను...
నీకు రోజూ ఉదయం 7 తో మొదలయ్యి
సాయంత్రం 6 తో ముగుస్తుంది ....
నాకు ఉదయం 4 తో మొదలయ్యి
రాత్రుళ్ళు కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది...
సాయంత్రం 6 తో ముగుస్తుంది ....
నాకు ఉదయం 4 తో మొదలయ్యి
రాత్రుళ్ళు కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది...
నీకు కాలేజీ లో స్నాతకోత్సవం ఉంటుంది ...
నాకు పాసింగ్ ఔట్ పెరేడ్ ఉంటుంది..
నాకు పాసింగ్ ఔట్ పెరేడ్ ఉంటుంది..
నువ్వు బెస్ట్ కంపెనీలో బెస్ట్ ప్యాకేజీతో చేరతావ్...
నేను నా ప్లటూన్ లో చేరతాను..
నేను నా ప్లటూన్ లో చేరతాను..
నీకు ఉద్యోగం వచ్చింది....
నాకు జీవన పరమార్ధం దొరికింది...
నాకు జీవన పరమార్ధం దొరికింది...
ప్రతి సందర్భంలోనూ నువ్వు నీ నీకుటుంబాన్ని కలుస్తావు... నేను నా తల్లితండ్రులను చూసే సమయం కోసం ఎదురుచూస్తాను ..
నువ్వు పండగలన్నీ
ఆనందోత్సాహలతో జరుపుకుంటావ్...
నేను నా సహచరులతో బంకర్లలో జరుపుకుంటాను..
ఆనందోత్సాహలతో జరుపుకుంటావ్...
నేను నా సహచరులతో బంకర్లలో జరుపుకుంటాను..
మనిద్దరికీ పెళ్లయింది.....
నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది....
నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది..
నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది....
నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది..
నువ్వు బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలు వెళ్తావ్...
నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళ్తాను..
నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళ్తాను..
మనిద్దరమూ తిరిగొస్తాము...
చాలా రోజుల తర్వాత చూసిన
నీ భార్య కన్నీళ్ళు నువ్వు తుడుస్తావు..
నేను తుడవలేను...
చాలా రోజుల తర్వాత చూసిన
నీ భార్య కన్నీళ్ళు నువ్వు తుడుస్తావు..
నేను తుడవలేను...
తనకు ఆత్మీయ కౌగిలి ఇస్తావ్..
నేను ఇవ్వలేను...
నేను ఇవ్వలేను...
ఎందుకంటే ....
నేను శవపేటికలో ఉన్నాను...
నా చాతీ మీద మెడల్స్ ఉన్నాయ్..
వాటి బరువుకు నేను లేవలేను..
నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక మీద
నా జీవన సాఫల్యమైన '' భారత త్రివర్ణ పతాకంతో ''
అందంగా చుట్టబడి ఉంది...
నేను శవపేటికలో ఉన్నాను...
నా చాతీ మీద మెడల్స్ ఉన్నాయ్..
వాటి బరువుకు నేను లేవలేను..
నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక మీద
నా జీవన సాఫల్యమైన '' భారత త్రివర్ణ పతాకంతో ''
అందంగా చుట్టబడి ఉంది...
ఆ గర్వించే క్షణాలు వదులుకొని
నేను శవపేటిక లోనుంచీ బయటకు రాలేను....
నేను శవపేటిక లోనుంచీ బయటకు రాలేను....
మాతృభూమి రక్షణలో నా జీవితం సార్ధకమైంది ...
మళ్ళీ సైనికుడిగా నే పుడతాను ...
మళ్ళీ సైనికుడిగా నే పుడతాను ...
నా జీవితం ఇంతటితో సమాప్తం
ఎందుకంటే నేను సైనికుణ్ణి ...... అమరుడ్ని ..
నీ జీవితం ముందుకే వెళ్ళాలని ఆశిస్తూ .....
''నీ మితృడైన ఒక సైనికుడు '' ....
''నీ మితృడైన ఒక సైనికుడు '' ....
భారత్ మాతాకి ... జై... జై హింద్...
Wednesday, May 23, 2018
వర్ణమాల వల్ల తెలియకుండానే వ్యాయామం .
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .
_____________________________________
ఈ పోస్ట్ నాది కాదు. రచయిత ఎవరో తెలియదు.వారికి నా ధన్యవాదాలు
తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .
_____________________________________
ఈ పోస్ట్ నాది కాదు. రచయిత ఎవరో తెలియదు.వారికి నా ధన్యవాదాలు
Subscribe to:
Comments (Atom)

