Friday, November 16, 2018

భగవంతుని ప్రేమ కరుణ

భగవంతుని ప్రేమ కరుణ ఎలా ఉంటుందో ఒక చిన్న సంఘటన ఇస్కాన్ వారి ప్రసంగం ప్రేరణతో చెపుతాను.

       శ్రీ కృష్ణుడు బృందావనంలో ప్రతిరోజు 7 లక్షల ఆవులను రోజూ ఉదయం మేతకు తీసుకువెళ్లి...వాటితోనే సాయంత్రం వరకు ఉండి ఇంటికి తీసుకుని వచ్చేవారట...

      ఒకనాడు యశోద ..కృష్ణయ్యతో... క్రిష్ణయ్యా..నీవు రోజు ఆవులను మేతకు తీసుకొని వెళుతున్నావు...దారిలో రాళ్లు రప్పలు ఉంటాయి.
ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి నీ పాదాలు కందుతాయి...అందుకోసం అని నీకు పాదరక్షలు తెచ్చాను...ధరించి వెళ్ళమని చెప్పింది యశోదమ్మ..

     అప్పుడు కృష్ణుడు యశోదమ్మతో... అమ్మా నాతో ఈ ఆవులు కూడా తిరుగుతాయి... వాటికి కూడా రాళ్లు, ముళ్ళు, గుచ్చుకొంటాయి... వాటికి ఎండ వలన వాటి గిత్తలు కూడా కందుతాయి...కాబట్టి వాటికి పాదరక్షలు చేయించమ్మా.... అవి పాదరక్షలు ధరించినప్పుడే...నేను కూడా ధరిస్తాను అన్నాడట..
7 లక్షల ఆవులకి పాదరక్షలు చేయడం ఎలా అవుతుంది అని యశోద మిన్నకుండిపోయిందట..

   ఆవులు...కృష్ణయ్య తమ మీద చూపించే వాత్సల్యం చూసి..స్వామికి దారిలో రాళ్లు రప్పలు గుచ్చుకోకూడదని..ఆ ఆవులు అన్ని బృందావనం అంతా.. ఎక్కడా రాళ్లు రప్పలు లేకుండా తమ గిత్తలతో... నేలను సన్నని ఇసుక మాదిరిగా చదును చేసేసాయట... ఇప్పటికి బృందావనంలో నేల అలాగే ఉండటం విశేషం...

నీతి : భగవంతుడు అందరి మీద ఒకలాగే వాత్సల్యాన్ని, కరుణని చూపిస్తాడు...భక్తులు అది తెలుసుకొని స్వామి పట్ల అంకితభావంతో ఉండాలి..

No comments:

Post a Comment

Total Pageviews