Sunday, December 5, 2021

దొరకునా ఇటువంటి సేవ! స్వామియే శరణం అయ్యప్ప!!

 

దొరకునా ఇటువంటి సేవ! స్వామియే శరణం అయ్యప్ప!!

శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతిచోటా పడిపూజలు నిర్వహించి అహారపదార్ధాల ప్రసాదం అందించడం సాధారణం 

అలా కాక కొత్తగా అలొచించి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్త యాత్రీకులకు మార్గ మధ్యంలో భోజన సదుపాయం కల్పించాలన్న నా సంకల్పానికి మిత్రులు రిటైర్డ్‌ జడ్జ్‌ శ్రీ మాల్యాద్రి గారు స్పందించి వారి విశ్వవ్యాప్త సేవా సంఘం నెట్వర్క్‌ ద్వారా నెల్లూరు రైల్‌ స్టేషన్‌ లలో  04.12.2021 తేదీన  మధ్యాహ్నం 1 గంటకు 60 మంది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు నెల్లూరు శ్రీ గొనుగుంట సుధాకర్‌ రావు గారు శ్రీ సత్యనారాయణ గారి సహాయంతో మరియు 05.12.2021 తేదీన ఒంగొలు రైల్‌ స్టేషన్‌ లలో 6 మంది భక్తులకు శ్రీ నేరెళ్ళ శ్రీనివాస్‌ గారి ద్వారా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. చేసింది చెప్పకూడదు అంటారు కానీ కొత్తగా అలోచించి ఇలా, కాశీ, తిరుపతి మొదలైన వివిధ తీర్ధయాత్రలు చేసే భక్త యాత్రీకులకు మనం ఇలా కల్పిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్‌ పెట్టడం జరిగింది. కావున నా విన్నపం ఏమనగా? వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌ దగ్గరలో వున్న సేవా భావం కలిగిన ఔత్సాహిక మిత్రులు వారి ఫోన్‌ నంబర్ల వివరాలు నా మెసేజ్‌ బాక్స్‌లొ ఇవ్వ మని మనవి. భవిష్యత్‌ కార్యాచరణకు వారి సహాయ, సహకారాలు అవసరం అయినప్పుడు వినియోగించ వచ్చు. 



శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతిచోటా పడిపూజలు నిర్వహించి అహారపదార్ధాల ప్రసాదం అందించడం సాధారణం 

అలా కాక కొత్తగా అలొచించి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్త యాత్రీకులకు మార్గ మధ్యంలో భోజన సదుపాయం కల్పించాలన్న నా సంకల్పానికి మిత్రులు రిటైర్డ్‌ జడ్జ్‌ శ్రీ మాల్యాద్రి గారు స్పందించి వారి విశ్వవ్యాప్త సేవా సంఘం నెట్వర్క్‌ ద్వారా నెల్లూరు రైల్‌ స్టేషన్‌ లలో  04.12.2021 తేదీన  మధ్యాహ్నం 1 గంటకు 60 మంది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు నెల్లూరు శ్రీ గొనుగుంట సుధాకర్‌ రావు గారు శ్రీ సత్యనారాయణ గారి సహాయంతో మరియు 05.12.2021 తేదీన ఒంగొలు రైల్‌ స్టేషన్‌ లలో 6 మంది భక్తులకు శ్రీ నేరెళ్ళ శ్రీనివాస్‌ గారి ద్వారా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. చేసింది చెప్పకూడదు అంటారు కానీ కొత్తగా అలోచించి ఇలా, కాశీ, తిరుపతి మొదలైన వివిధ తీర్ధయాత్రలు చేసే భక్త యాత్రీకులకు మనం ఇలా కల్పిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్‌ పెట్టడం జరిగింది. కావున నా విన్నపం ఏమనగా? వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌ దగ్గరలో వున్న సేవా భావం కలిగిన ఔత్సాహిక మిత్రులు వారి ఫోన్‌ నంబర్ల వివరాలు నా మెసేజ్‌ బాక్స్‌లొ ఇవ్వ మని మనవి. భవిష్యత్‌ కార్యాచరణకు వారి సహాయ, సహకారాలు అవసరం అయినప్పుడు వినియోగించ వచ్చు. 

నేనేమీ చెయ్యలేదు చేసినదంతయు ఆ సర్వేశ్వరుడే అని 

మా పెద్ద తాతగారు కీ.శే. బ్రహ్మశ్రీ విస్సా వేంకట రావు గారు రాసిన ఈ పద్యం నాకు ఎప్పుడూ గుర్తు వస్తుంది. 

      చేసితి దానధర్మములు చేసితి నెన్నియొ తీర్థయాత్రలన్

      చేసితి పుణ్యకార్యముల జేసితి నెన్నియొ దైవపూజలన్ 

      చేసితి నన్ని చేతినొక చిల్లియు గవ్వయు లేకపోయినన్ 

      చేసితినంటి గాని యవి చేసినదంతయు నీవెగా ప్రభూ!

అంతా మనం చేసాం అనుకుంటాము కానీ చేసేదంతా ఆ జగన్నాటక సూత్రధారి. మనమంతా పాత్రధారులమే, అందుకే ఏ పుణ్యకార్యం అయినా చివరలో శ్రీ కృష్ణార్పణం అనిపిస్తారు. కర్తా కారయితా చైవ ప్రేరక శ్చానుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారస్సమ భాగినః వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. 

భవదీయుడు 

సత్యసాయి విస్సా ఫౌండేషన్‌!

No comments:

Post a Comment

Total Pageviews