Thursday, March 29, 2018

మన మహనీయులు: శ్రీ కృష్ణ దేవరాయలు

మన మహనీయులు: శ్రీ కృష్ణ దేవరాయలు:  సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజ...

Monday, March 26, 2018

శ్రీ మద్రామాయణము నందలి వ్యక్తిత్వాల శోభ.

శ్రీ మద్రామాయణము నందలి కొన్ని సందర్భాలు/ సంభాషణలు.
ఆయా మహోన్నత వ్యక్తిత్వాల శోభ ఎలాంటిదో చూడండి.

వాల్మీకితో నారదుడు.

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ౹
ఆర్యః సర్వసమశ్చైవ సదైవప్రియదర్శనః ౹

స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః ౹
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ౹

విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శినః ౹
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ౹
ధనదేన సమ స్తాగే సత్యే ధర్మ ఇవాపరః ౹

16-18, 1 వ సర్గ, బాలకాండము,శ్రీమద్రామాయణము.

నదులు సముద్రమును కలిసినట్లు సత్పురుషులు నిరంతరం శ్రీరాముని చేరుచుందురు.
అతను అందరికీ పూజ్యుడు. ఎవరియెడలా వైషమ్యాలు గాని,తారతమ్యాలుగానీ లేక మెలగువాడు.,
ఎల్లవేళలా అందరికీ ఆయన దర్శనము ప్రీతినిగొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణవిలసితుడు, అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీమహావిష్ణువు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు,సుతిమెత్తని హృదయం కలవాడే ఐనను తన ఆశ్రితులకు అపకారం చేసినవారి యెడల ప్రళయాగ్నివంటివాడు.
సహనమున భూదేవి వంటివాడు. కుబేరుడివలె త్యాగస్వభావం కలవాడు,సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు.

సీతాదేవి రాములవారితో.....
పశ్చాదపి హి దుఃఖేన మమ నైవాస్తి జీవితమ్ ౹
ఉజ్ఝితాయాస్తవయా నాథ!తదైవ మరణం వరమ్ ౹

ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే ౹
కిం పునర్దశవర్షాణి త్రీణిచైకం చ దుఃఖితా ౹

20 - 21, 30 వ సర్గ, అయోధ్యాకాండ, శ్రీ మద్రాయణము.


ప్రభూ! నీవు నన్ను ఇచటనే  విడిచి, వనములకు వెళ్ళినచో, ఆ పిమ్మటనైన దుర్భరమైన నీయెడబాడు కారణముగా నేను జీవించియుండుట అసంభవం.
కనుక, ఇప్పుడే నీయెదుటనే ప్రాణములు వీడుట మేలు.
స్వామీ! నీకు దూరమై ఈ విరహ బాధను ఒక్క క్షణం కూడా భరించలేను. ఇక దుర్భరదుఃఖముతో పదునాలుగేళ్ళు ఎలా గడపగలను?

అరణ్యవాసం విషయంలో శ్రీ రామునితో లక్ష్మణుడు.

న దేవలోకాక్రమణం నామరత్వమహం వృణే ౹
ఐశ్వర్యం వాపి లోకానం కామయే న త్వయా వినా ౹

5, 31 వ సర్గ, అయోధ్యాకాండ.

స్వామీ! నీ వెంట ఉండి నిన్ను సేవించు భాగ్యమునకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభిఃచిననూ నాకు అక్కర లేదు, జనన మరణ రాహిత్యమును కూడా నేను కోరుకొనను., అంతే  కాదు పరమపద ప్రాప్తిని సైతము నేను వాంఛింపను.

శ్రీ రామునితో భరతుడు.

 అధిరోహా౽ర్య! పాదాభ్యాం పాదుకే హేమభూషితే ౹
ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః ౹

తవ పాదుకయోర్న్యస్య రాజ్యతంత్రం పరంతప! ౹
చతుర్దశే హి సంపూర్ణే వర్ష౽హని రఘూత్తమ!౹
న ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్షామి హుతాశనమ్౹

21& 25,
112 వ సర్గ, అయోధ్యాకాండ.


పూజ్యుడైన ఓ అన్నా! నీ పాదుకలు బంగారం తో తాపబడినవి.
వాటిని ఒకసారి నీ పాదములకు తొడిగి నాకు అనుగ్రహింపు.
అవే సమస్తలోకాలకు యోగక్షేమాలు సమకూర్చును.

ఓ పరంతపా! ఈ పదునాలుగేళ్ళు రాజ్యతంత్రమును నీ పాదుకల మీదనే ఉంచెదను.
పదునాలుగేళ్ళు ముగిసిన మరునాడు నీ దర్శనం కానిచో అగ్ని ప్రవేశం చేసెదను.


రామాయణం మనకిచ్చే ఆదర్శ సందేశం.

శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామ తత్వం.....

అవకాశం ఉన్నా భర్త వెంట నడవటం సీత తత్వం....

కష్టాల్లో తోడు నిలవటం లక్ష్మణ తత్వం...

నమ్మిన వారి కోసం తెగించటం ఆంజనేయ తత్వం.....

ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్ధం....

ఇదే రామాయణం మనకిచ్చే ఆదర్శ సందేశం.....

ఈ జగమంతా రామ మయం.....
రామాయణం మన రక్తంలో ఉంది.

రామో విగ్రహవాన్ ధర్మః ...

రాముడు మనలాంటి మాములు మనిషే. రామాయణంలో రాముడు ఎక్కడా మహిమలు చూపలేదు.

ఒక మాములు వ్యక్తిగా పుట్టిన వ్యక్తి దాదాపు 10,00,000 నుంచి 18,00,000 సవత్సరాలు గడిచిపోయినా, ఇంకా అదే వైభవంతో వెలగడానికి కారణం రాముడి సత్యనిష్ట, ధర్మ నిబద్ధత.

రాముడు తన బాణాలతో 18,000 మంది కర దూషణాదులను చంపాడు కానీ తనకు అమోఘమైన శక్తి ఉన్నదని గర్వించలేదు.

 వాలి ప్రపంచంలో ఉన్న వానర సైన్యాన్ని ఏక తాటి పైకి తీసుకు వచ్చి, సమన్వయ పరిచాడు.

 వాలి ఎంత శక్తివంతుడంటే, వాలికి రావణాసురుడు కూడా భయపడ్డాడు.

 అటువంటి వాలితో స్నేహం చేస్తే, సీతమ్మను క్షణంలో లంక నుంచి తీసుకురావచ్చని తెలిసినా, వాలి తన ధర్మం తప్పాడని అతని సాయం కోరలేదు.

 వాలిని చూసి భయపడుతున్న సుగ్రీవునికి అండగా నిలబడ్డడు.

 వాలిని చంపి, రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పజెప్పాడు కానీ తాను రాజ్యంలో కొద్ది భాగం కూడా తీసుకోలేదు.

శత్రువు తమ్ముడైనా, తనను శరణు వేడుకున్నాడని విభీషణుడికి గౌరవం ఇచ్చాడు, స్నేహం కుదిరిని వెంటనే విభీషణునికి లంకాధిపతిగా సముద్రజలాలతో పట్టాభిషేకం చేశాడు శ్రీ రాముడు.

అప్పుడు అక్కడున్న వారికి ఒక ప్రశ్న తలెత్తింది.

 విభీషణుడు శరణుజొచ్చాడని అతనికి పట్టాభిషేకం చేశావు, మరి రేపు రావణుడు శరణు వేడితే ఏం చేస్తావు రామా?!

 అని అడిగారు
అక్కడున్న వారు.

నేను ఆడిన మాట తప్పను, అదే జరిగితే, విభీషణుడిని అయోధ్యకు రాజును చేస్తాను అన్నాడు.

 ఇంత ధైర్యంగా ఈ మాటను ఎవరు చెప్పగలరు ఒక్క మన రాముడు తప్ప!

రామ రావణ యుద్ధం అప్పట్లో ఒక ప్రపంచ యుద్ధంగా చెప్పచ్చు.

రావణుడు సమస్త ప్రపంచాన్ని హడలు గొట్టిన వీరుడు.

 అటువంటి రావణుడితో యువకుడైన రాముడు  పోరాటం చేయడానికి పూనుకోవడం, అది కూడా వైరంతో కాదు, తన భార్య కోసం ............... ఒక చారిత్రాత్మిక సంఘటన.

 రాముడు అందగాడు, రాకుమారుడు, ఆజానుబాహుడు, తను కోరుకుంటే ప్రపంచంలో ఉన్నా సుందరీమణులందరూ రాముడిని వివాహం చేసుకోవాడానికి సిద్ధపడతారు.

 అయినా, కట్టుకున్న భార్యను కాపాడటం భర్త విధి.

 ధర్మార్ధ కామాలలో నేను నీ చేయి విడిచి పెట్టను అని వివాహ సమయంలో చేసిన ప్రమాణాన్ని గట్టిగా పాటించి, లోకానీకి మార్గం చూపినవాడు శ్రీ రాముడు.

తన భార్య కోసం రావణుడితో భీకరయుద్ధానికి సిద్ధమయ్యాడు.
అదిమాములు యుద్ధం కాదు, అందులో అణ్వస్త్రాలు (న్యూక్లియర్ వెపన్లు), మిస్సైల్స్, రాడర్లకు అంతుచిక్కని విధంగా తయారు చేయబడిన యుద్ధ విమానాలు మొదలైనవి రావణుడి చెంత ఉన్నా, వాటికి బెదరలేదు శ్రీరాముడు.

 ఎదురించి, యుద్ధం చేసి గెలిచాడు, రావణుడి చెంత బంధీలుగా ఉన్నా ఎందరో స్త్రీలను విడిపించాడు, సీతమ్మను గ్రహించాడు.

ఇంత చేసినా, లంక నుంచి రూపాయి తీసుకోలేదు, రాజ్యంలో వాటా అడగలేదు.

లంకలో ధర్మస్థాపన చేసి, విభీషణుడిని లంకాధిపతిని చేశాడు.

అప్పటికి రాముడికి రాజ్యం మీద ఆసక్తిలేదు.

 భరతుడి మనసు మారిందేమో, భరతుడు రాజ్యపరిపాలన చేయాలనుకుంటున్నాడేమో, ఒక వేల అదే నిజమైతే, తాను తన జీవితాన్ని అడవిలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు.

అక్కడ పరిస్థితి చూసి రమ్మని హనుమను పంపారు, భరతుడు రాముడి రాక ఆలస్యమైందని ఆత్మాహుతికి సిద్ధం అవుతున్నాడని తెలుసుకుని, తన తమ్ముడి ప్రాణం కోసమే రాముడు అయోధ్య చేరాడు.




"ముద్దబంతి పూవులో" వరుసలో పేరడీ పాట.....

ఒక పేరడీ పాట.....

మూగమనసులు చిత్రంలో "ముద్దబంతి పూవులో" వరుసలో పాడుకోవాలి...

ముద్దపప్పు కూరలో - ములగకాడ పులుసులో
తెలుగువారి రుచులు - ఎందరికి తెలుసులే  || ముద్దపప్పు||

మిరపకాయలో కారం దాగుందని తెలుసును
గోంగూరను జోడిస్తే ఏమౌనో తెలుసునా.....ఆ...ఆ..ఆ...
చూసినా....రుచి చూసినా....కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీరెనకాల ఏ కారమో తెలుసునా...... || ముద్దపప్పు||

రసం 'అరవ'దే గాని ఘాటుంటది దానికీ
జ్వరమొచ్చిన మనిషికే తెలిసోస్తుందారుచీ.....
వడియాలను జతచేసి పదిలంగా తినుకో
తినుకొని హాయిగా కమ్మగా నిదురపో.... || ముద్దపప్పు||

ఆవకాయ మాగాయలే ఆంధ్రులకు రక్ష
సున్నుండలు జంతికలే శ్రీరామ రక్ష.....
తిన్నోళ్ళు, తిననోళ్ళ తీపి తీపి గురుతులు
సిరులొలికే పంటలూ- మన తెలుగు వారి వంటలు  || ముద్దపప్పు||
( శ్రీ రాయచోటి కృష్ణమూర్తి గారిచే విరచితము)

అంతర్జాల తెలుగు భాష

అంతర్జాల తెలుగు భాష
అంతర్జాలం = internet
ముఖ గ్రంథం = Facebook
 ఏమిటది = what'sup
దరఖాస్తు = application
అన్వేషిక = Google
క్రీడా సంగ్రహణము= Play store
మీ ఆజ్ఞ నాళం = YouTube
వితరిణి = share it
జాబితా = file
తపాల కట్ట = G-mail
గణన యంత్రం = computer
4వ తరం = 4G
కీలక ఫలకం = keyboard
చలన భాషిణి = Mobile phone
 నిస్తంత్రి భాషాంత్రర్జాల యంత్రం = WiFi
ధర్శన చెలికాడు = vidmate
విస్తరణ క్షేత్రం = website
సమాచార ధూత = messenger
సల్లాపములు = chatting
ప్రతిబింబం = image
శ్రవణ సంభంది = audio
దృశ్య సంభంది =  video
సమాచార నిమ్న బదిలి  = download
సమాచార ఊర్ద్వ బదిలి = upload
మృది సామగ్రి = software
ఘన సామగ్రి = hardware
బంధన = link
ముద్ర లేఖనం = typing
అద్దకం = Printing
 స్పర్శ తెర=Touch screen
 చాతుర్య చలన భాషిణి= smart phone
దృశ్య పిలుపు= Video call
శబ్ధ పిలుపు = audio call
సమాచారా బంధక క్రిమి = VIRUS
జ్ఞప్తిక ఘన పత్రం = Memory card
 ధ్వని ముద్రీకరణ = audio Recording
అంకాత్మక కటకము = digital camera
అర్ధ ముఖ చిత్రపటం= Profile picture

                

Tuesday, March 20, 2018

మీ ఇంట్లో తొమ్మిది , పది లేదా ఇంటర్ ఒకటవ, రెండవ సంవత్సరం చదువుతున్న పిల్లలు వున్నారా ? ఇంకా కింది { 7 , 8 వ తరగతులు } లేదా పై తరగతులు { ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా బి ఎస్ సి లాంటి డిగ్రీ లేదా పీజీ అయినా } అయినా సరే !

మీ ఇంట్లో తొమ్మిది , పది లేదా ఇంటర్ ఒకటవ, రెండవ సంవత్సరం చదువుతున్న పిల్లలు వున్నారా ? ఇంకా కింది { 7 , 8 వ తరగతులు } లేదా పై తరగతులు { ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా బి ఎస్ సి లాంటి డిగ్రీ లేదా పీజీ అయినా } అయినా సరే !
ఒక్కసారి దయ చేసివినండి . చూస్తున్నారుగా చుట్టూరా ఏమి జరుగుతుందో ? "మీ అంచనాలను అందుకోలేక పోతున్నాము" అంటూ పిల్లలు సెల్ఫీ వీడియో లు తీసి మరీ ఆత్మ హత్య చేసుకొంటున్నారు . అంటే వారు చిన్న బుచ్చుకొంటున్నది మీ అంచనాలను అందుకోలేమో అనే ఆందోళన వల్ల. ఇపుడు తల్లితండ్రులుగా మీరు అర్జెంటు గా చెయ్యాల్సింది ఒకటి వుంది . అబ్బో .. మా అబ్బాయి / అమ్మాయి అంత బలహీన మనస్తత్వం వున్నవారు కాదండీ.. వారు చదువులో అద్భుతంగా రాణిస్తారు అని అనుకోకండి . ప్రతి తల్లితండ్రి అలాగే అనుకొంటారు . జరగరానిది జరిగితే ఇక జీవితాంతం జీవచ్ఛవాల్లా ఉండాల్సి వస్తుంది . సరే మీ పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారు . అలాంటి ఆలోచన రాదు . మంచిదే . కానీ ఇలా చేస్తే మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు . దీని కోసం మీరు ఏమి ఖర్చుపెట్టనక్కర లేదు . కావాల్సిందల్లా మీ అరగంట సమయమే .
ఇంట్లో టీవీ గట్రా ఆఫ్ చెయ్యండి . ప్రశాంతగా దంపతులిద్దరూ కూర్చోండి . పిల్లల్ని ఎదురుగా కూర్చుపెట్టుకోండి . లేదా ఇంట్లో వద్దుఅనుకొంటే దగ్గరగా వున్నా పార్క్ లో కూర్చోపెట్టి ఇలా మాట్లాడండి .
నువ్వు నీ శక్తి కొద్దీ కష్ట పడి చదువు . మనసు లగ్నం చేసి చదువు . ఇప్పుడే ముగిసిన ఇంటర్ లాంటి పరీక్ష లు అయినా సరే రేపు జరగ బోయే ఎంట్రన్స్ పరీక్ష లు అయినా సరే . నీ శక్తి కొద్దీ చదువు. అదే చాలు . రిజల్ట్ ఎలా వున్నా ఫరవా లేదు . మేము ఏమీ అనుకోము . చిన్న బుచ్చుకోము . బాధ పడం. టెన్త్ లోనో ఇంటర్ లోనో ఫెయిల్ అయినా ఏమీ కాదు . ఇంజనీరింగ్ లోనో మెడిసిన్ లోనో సీట్ రాకపోయినా ఏమీ కాదు .
అయినా మనం చెయ్యాల్సింది కష్ట పడడం వరకే . ఫలితాలు మన చేతిలో వుండవు . మీరు ఆస్తికులైతే ఇలా చెప్పండి .. అయినా అన్నీ ఆ భగవంతుడు ముందుగానే నిర్ణయించి ఉంటాడు . శివుని ఆజ్ఞ లేనిదే { లేదా జీసస్ లేదా అల్లా - మీ మతాన్ని బట్టి ; మీరు నాస్తికులు అయితే దీన్నే హేతుబద్దంగా వివరించండి } చీమ అయినా కుట్టదు అంటారు . గీత లో కృష్ణుడు చెప్పినట్టు పని చెయ్యడం వరకే మన భాద్యత . దాని ఫలితం పై కాదు . అసలు ఫలితం గురించి ఆలోచిస్తే టెన్షన్ పెరిగి లక్షాన్ని అందుకోలేము . మొన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ చూసారు కదా . చివరి ఓవర్ ల లో ఇండియన్ బాట్స్మన్ ఎలా పరుగులు కొట్టి బంగ్లా దేశ్ ను ఓడించారో . వారు బాటింగ్ పై ద్రుష్టి పెట్టారు . అయ్యో పరుగులు వస్తాయో మ్యాచ్ గెలుస్తామో లేదో అని ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ పెరిగి ఫలితం తయారు మారు అయ్యివుండేది .
జీవితం లో నీకు మేము వున్నాము . ఫలితం ఎలా వున్నా పరవా లేదు . ఇది కాక పొతే మరొకటి . అసలు నీకు ఒకటి తెలుసా . కృత్రిమ మేధస్సు, రోబో ల వినియోగం వల్ల నువ్వు చదువు ముగించి జాబ్ మార్కెట్ లో కి అడుగు పెట్టేటప్పటికీ ఇప్పుడున్న ఉద్యోగాల్లో చాల మటుకు వుండవు . కొన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి . ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి . జ్ఞాపక శక్తి పై ఆధార పడి జరిగే నేటి పరీక్షల్లో వచ్చే మార్కులు రాంక్ లు వాటి ఆధారంగా జరిగే కోర్స్ లు రేపు ఎందుకు కొరగావు .
జీవితం లో ఓటమి అంటూ ఏమీ ఉండదు . ప్రతి అపజయం ఒక చక్కటి అవకాశం . అది ఎన్నో పాఠాల్ని మనకు నేర్పుతుంది . నీలో శక్తికి పదును పెట్టు . చుట్టూరా జరిగే పరిణామాల్ని కనిపెట్టు . పాఠాల్ని గ్రహించు . ఇంజనీరింగ్ పరీక్షలో మంచి రాంక్ సాధించిన వాడు రేపు ఇంజినీర్ అవుతాడు . నువ్వు కాలేదనే బాధ వద్దు . వాడికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి నువ్వు ఎదుగు . ఇందుకు డబ్బు మూటలు అక్కర లేదు . గాడ్ ఫాదర్ అక్కర లేదు . కావలసింది సంకల్పం . ఇంటర్ నెట్ చేతిలో వుంది . అంటే అర చేతిలో ప్రపంచం . సమాజాన్ని చదువు . నీ శక్తి సామర్త్యాలను పెంపొందించుకో . ఎదగాలి అనే బలమైన సంకల్పము ఉంటే చాలు . మిఠాయల్ని అమ్ముకొనే వాడు ఏదో ఆ రోజుకి సంపాదిస్తాడు అనుకొంటారు . కానీ పుల్లా రెడ్డి గారు మరోలా ఆలోచించారు . వందల మందికి ఉపాధి కల్పించారు . అయన స్థాపించిన సంస్థల్లో ఇప్పుడు ఎంతో మంది చదువుతున్నారు . థింక్ బిగ్ . అపజయమే నీకు ఆయుధం కావాలి . నీలో కసిని పెంచాలి . ఇందుకు తల్లితండ్రిగా మేము నీకు అండగా ఉంటాము . మేము వద్దన్నా మరో ముప్పై ఏళ్ళు బతుకుతాము . అంతకాలం నీకు మా అండ ఉంటుంది .
పక్కింటి అంకుల్ లేదా పై ఇంటి ఆంటీ లేదా మీ ఫ్రెండ్ లేదా పక్క ఇంటి అమ్మాయి నువ్వు ఫెయిల్ అయ్యావని నవ్వని . ఏమి కద్దు . వారి నవ్వులే నీకు ఆశీర్వాదాలు . వారి వెక్కిరింపులే నీ ప్రగతి కి సోపానాలు . నాన్నా నీ పై ప్రాణం పెట్టుకొని బతుకుతున్నాము . నువ్వు మా కళ్ళముందు ఉంటే చాలు . ఎన్ని పరీక్షలు ఫెయిల్ అయినా ఏమి కాదు . ఎలాంటి అఘాయిత్యానికి పాలుపడను అని మా పైన ప్రమాణమా చెయ్యి . నీ result ఎలా వున్నా నీకు అండగా ఉంటామని మేము ఇదిగో దేవుడిపై { లేదా మీ అంతరాత్మ పై } ప్రమాణం చేస్తున్నాము .
ఇలా ఒక అరగంట గడపండి . తెలుగిళ్ళలో { ఆ మాట కొస్తే ఏ బాషా వారైనా} చావు మేళాలు మోగకూడదు. పిల్లల్ని కోల్పోవడానికి మించిన నరకం మరొకటి ఉండదు . అనారోగ్యం వల్ల అమ్మాయి ని కోల్పయిన నాకు తెలుసు గుండె కోత ఎలా ఉంటుందో . ఇలా చెప్పే నైతిక హక్కు నాకు వుంది . మరోకోణం లో కూడా నాకు అపజయాలు మన ప్రగతికి సోపానాలు అనే చెప్పే హక్కు నాకు వుంది . అండర్ ఏజ్ వల్ల నాకు ఆ రోజుల్లో ఎంబీబీస్ చేసే అవకాశం రాలేదు . అయ్యో ఎంతబాగా చదివినా ఎంబీబీస్ లేదా చివరికి వేటిర్నరీ లేదా అగ్రికల్చర్ bsc చేసే అవకాశం దక్క లేదు అని బాధ పడ్డా. అటుపై ఐఏఎస్ ను లక్ష్యం గా చేసుకొని మూడు సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్లినా ఏదో సర్వీస్ అయితే వచ్చింది కానీ అనుకొన్న ఐఏఎస్ రాలేదు . ఇప్పుడు వెనుతిరిగి చూస్తే నా తో పాటు చదివి డాక్టర్స్ అటు పైన ఐఏఎస్ లు అయినా వారికంటే ఎక్కువ సంతోషంగా బతుకుతున్నా. వందల మందిని డాక్టర్ లు గా ఐఏఎస్ లు గా తీర్చి దిద్దా . ఐఏఎస్ ల కంటే డాక్టర్ ల కంటే ఎక్కువ పేరు సంపాదించా . నా జీవితం లో చెప్పుకోదగ్గ విజయం లేదు . అన్నే పరాజయాలే. కానీ జీవితంగా మొత్తంగా చూస్తే నా జీవితమే ఒక సక్సెస్ స్టోరీ . పరాజయం తెచ్చివ విజయం ఇది . నేను జీవితం అనే పరుగు పందెం లో గెలిచిన తాబేలు .
ఇంతకూ వంద రేట్లు వెయ్యి రేట్లు మీ పిల్లలు విజయాన్ని సాధిస్తారు . నేడు ప్రపంచమే ఒక అవకాశాల గని . కావాల్సిందల్లా ఆలోచన . కృషి పట్టుదల . చికెన్ ముక్కలు అమ్మి డబ్బు సంపాదించాలి అంటే మీరు ఏమంటారు . అరేయ్ రోజుకు వంద రూపాయిలు కూడా సంపాదించ లేవు అంటారు . కానీ KFC వాడు మరోలా ఆలోచించాడు . అందుకే ప్రపంచ సామ్రాజ్యాన్ని నిర్మించాడు . అన్ని తలా కిందులు కానున్న రేపటి రోబో యుగం లు మార్కుల చదువులు చట్టుబండలు కానున్నాయి . ఆలోచనే పెట్టుబడి . అదే భవిష్యత్తు . మీ పిల్లలని ఎగరనివ్వండి. ఆ రెక్కల కు శక్తి నివ్వండి .
ఈ సందేశం మరొకరికి ఉపయోగ పడుతుంది అను కొంటె వారితో పంచుకోండి

Thursday, March 15, 2018

పెద్దలమాట చద్దిమూట

బద్దకంలో దారిద్రo ఉంది 
కృషిలో ఐశ్వర్యం ఉంది 
అందుకేనేమో........ 
కృషితో నాస్తి దుర్భిక్ష్యం అంటారు.!!!

అవసరమైతే ఎవరికైనా సలహా ఇవ్వు 
కానీ ... సూటిపోటి మాటలతో భాద  పెట్టకు.

ఆంగ్లభాష అన్నం పెడుతుంది 
కానీ... మన అమ్మభాష పక్కోడికి 
అన్నం పెట్టమంటుంది.

మనిషన్న వాడు కష్టాలకు
దూరంగా ఉండాలనుకుంటాడు.
మనసున్నవాడు ఆ కష్టాలలో ఉన్న
తనవారికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటాడు.

ఉత్తముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు
వేవేకవంతుడు ఎన్నడూ చిక్కుల్లో పడడు
సాహసవంతుడు ఎన్నడూ భయపడడు.

Total Pageviews