Wednesday, September 29, 2021

 బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. తమ గురించి తాము చెప్పుకోలేని పరిస్థితి బ్రాహ్మణులకు కలిగింది. ఈ నేపధ్యంలో పాత్రికేయులు డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావు రాసిన "సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర" బ్రాహ్మణేతర విమర్శకులకు అసలు-సిసలైన సమాధానం అనాలి. ఇది చదివిన వారు-ముఖ్యంగా బ్రాహ్మణ విమర్శకులు, "ఓహో...బ్రాహ్మణులంటే ఇంత గొప్ప వారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన చేయవచ్చా?" అన్న ఆలోచన చేయక మానరు.

 

          సామూహిక జన జీవన వ్యవస్థే సమాజం అంటూ ప్రారంభించి, అనేకానేక విషయాలను, సంక్షిప్తంగా అంటూనే, వివరంగా తెలియచేసే ప్రయత్నంలో పాలకోడేటి సఫలమయ్యారనడంలో సందేహం లేదు. వివరాలలోకి పోతే.... ప్రపంచంలో ఎన్ని మతాలున్నా హైందవ మతానికి, లేదా, వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే కాలంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. మరో వాదన ప్రకారం, ఆర్యులు ఆంధ్ర దేశం రాక ముందు, చాతుర్వర్ణ పద్ధతి లేదు. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే ఐనా, కొంత వ్యత్యాసం వుంది. లోతుగా పోతే, బ్రాహ్మణులని పిలిపించుకోవాలంటే, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం తప్పని సరి. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, చాతుర్వర్ణాలుండవచ్చు కదా! ఇలాంటి వ్యవస్థ ప్రాచీన కాలం నాటి ఈజిప్ట్, బాబిలోనియాలతో సహా, చైనా దేశంలోనూ వుండేదట. అక్కడి వాడుక ప్రకారం వారిని పూజారులుగా, పాలకులుగా, వృత్తి దారులుగా, బానిసలుగా విభజించారు. అలానే ప్రాచీన ఇరాన్‌లో "పిస్త్రీ" అనే నాలుగు వర్ణాలుండేవి.

 

          ఇక "కులం" అంటే ఏమిటో చూద్దాం. ఒక అర్థం ప్రకారం కులమంటే "నివాసం". వర్ణాలు వేరు, జాతులు వేరు. వర్ణం అనే మాట "వర్గం" ను సూచిస్తే, జాతి అనేది "కులం" ను సూచిస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే "క్లాస్", "కాస్ట్" అన్న మాట. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, ఒక విషయం మాత్రం వాస్తవం. అది ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ పడాల్సిన అవసరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు. బ్రాహ్మణుల విషయానికొస్తే, వారు సమాజంలో దైవ చింతనను పెంచాలని, సమాజ హితం కోరే "పురోహితులు” గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను చాలా కాలంపాటు, బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. కాలానుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బ్రాహ్మణులు కూడా మార్పులకు లోనుకాక తప్పలేదు. ఒకటి మాత్రం వాస్తవం. బ్రాహ్మణులు కులవ్యవస్థకు కారకులు కాదు. వారు కుల వ్యవస్థను పెంచి పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ.

 

          "బ్రాహ్మణులు" అనే మాట "బ్రహ్మన్" అనే పదం నుంచి వచ్చింది. బ్రహ్మన్ అంటే "యజ్ఞం’ అనే అర్థం కూడా వుంది. అంటే యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే "బ్రహ్మ" అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు. అంటే వేదాధ్యయనం చేసిన వాడు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. ఒకానొక రోజుల్లో బ్రాహ్మణులకు బ్రహ్మ-క్షత్రియ గుణాలుండేవి. కాని, ఆ తరువాత, వారు తమ క్షత్రియ గుణాలను పూర్తిగా వదిలి, పాలన, మంత్రాంగం, పురహితాల వైపు దృష్టి మరల్చారు. బ్రాహ్మణులకు అనాది నుంచీ, సమాజంలోని ఇతరుల నుంచి ఎంతో గౌరవ ప్రపత్తులు లభించేవి. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు పనిచేసే "పంచ ప్రధానుల" లో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణులుండేవారు. అదే నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఐంది. సుమతి శతకం ప్రకారం, ఒక ప్రదేశం గ్రామం అనిపించుకోవాలంటే, దానికి వుండాల్సిన ప్రాధమిక లక్ష్యాలలో వూళ్లో బ్రాహ్మణుడు వుండడం కూడా ఒకటి. సమాజాన్ని మార్క్సిస్టు కోణంలో నిశితంగా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రంధంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా గొప్ప యోగ్యతా పత్రం ఇచ్చారు. ఆర్య, ఆదిమ వాసుల పునఃకలయికవల్ల ఏర్పడిన కులంగా బ్రాహ్మణులను అభివర్ణించి, ప్రాచీన పవిత్ర గ్రంథాలలో లభ్యమైన వాటిని భద్ర పరిచింది వారేనని, దాని విలువ అపారమని పేర్కొన్నారు.  

 

          బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని "మాత్రులు" అని; వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని "బ్రాహ్మణులు" అని; బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని "శ్రోత్రియులు" అని; నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులను "అనూచానులు" అని; ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్న వారిని "భ్రూణులు" అని; ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని "ఋషికల్పులు" అని; రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని "ఋషులు" అని; సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని "మునులు" అని అంటారు.

 

          అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచ గౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే బ్రాహ్మణులు, భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో "బహున్" లుగా, మయన్మార్‍లో "పొన్న" లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త  బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది వరకూ వున్నాయి. వారిని, తెలగాణ్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణ కమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ పది తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగం వారిని నియోగులంటారు.

 

          వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమైన కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని "వైదికులు" అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ వుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన ఈ బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మారిపోయాయి.

 

          వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు "నియోగులు". వారిలో, ఆరు వేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి నియోగులని రకరకాల ఉప శాఖల వారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే వినియోగించబడిన వారని. నియోగులు సంప్రదాయ బ్రాహ్మణులు కారనే వాదన కూడా వుంది. కొందరి దృష్టిలో సంప్రదాయ బ్రాహ్మణులంటే వైదిక కార్యాలు చేసే వైదికులు మాత్రమేనని. పౌరోహిత్యం వృత్తిగా కాకుండా, లౌకిక ఉద్యోగాల మీద ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరు వేల నియోగులది పెద్ద ఉప శాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో అనే విషయం ఇదమిద్ధంగా తేలలేదు. శతాబ్దాల క్రితం ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజులు పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాధమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల పరిపాలనా కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించి నందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న పేరొచ్చిందంటారు. అంతవరకూ యుద్ధాలలో కూడా పాల్గొన్న బ్రాహ్మణులు పాలనా రంగంలోకి వచ్చారు. మరో కథనం ప్రకారం, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి వుండవచ్చు.     వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంత వరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో వున్నాయి. వేటిలో ఏది నిజమో, ఏవి కావో మరింత పరిశోధనలు చేయాల్సి వుంటుంది.

 

వైదికులైనా, నియోగులైనా, తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?

 

ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్నాయి. క్రిస్టియన్ మిషనరీల రాకతో, అంతకు ముందు ముస్లింల పాలనలో, ప్రారంభమైన బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో బలపడి, స్వతంత్ర భారత దేశంలో పతాక దశకు చేరుకుంది. దశాబ్దం క్రితం మండల కమీషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూనుకుని పోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృఛ్చికంగా జరిగిందేమీకాదు. భారత దేశ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలచడంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు కలగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటీష్ ప్రభుత్వం, భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు బ్రాహ్మణులను దెబ్బ తీయాలని భావించింది. అలనాడు ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే స్వతంత్ర భారత దేశంలో మండల్ కమీషన్ అనుసరించింది. చదువుకున్న బ్రాహ్మణుల మూలాన, భారతదేశంలో తమ గుత్తాధిపత్యానికి ప్రమాదం వుందని భావించింది బ్రిటీష్ ప్రభుత్వం. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించడం వారి అనుమానాన్ని మరింత ధృఢ పరిచింది.

 

అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం. బ్రాహ్మణులంటే బ్రహ్మ జ్ఞానం కలవారని. అదొక సామాజిక వర్గం. హైందవ మతంలో, ఆచారంలో, ఒక భాగం. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు వైదిక కాలం నుంచి కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తోంది. భారతీయ మనుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, వ్యాపారులు, బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అనే నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి. నాలుగు వర్ణాలుగా అనాది నుంచీ విభజన జరిగిన వాటిలో మొదటిది బ్రాహ్మణులు కాగా, మిగిలిన మూడింటిని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులనీ పిలవడం మొదలెట్టారు. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు దక్కిన ప్రత్యేక హోదా నాటి నుంచీ నేటి దాకా ఒక విధంగా కొనసాగుతూనే వుంది. వాళ్ల గొప్పతనానికి, ఆధిపత్యానికి, ఇప్పటికీ గౌరవం లభిస్తున్నప్పటికీ, అనాదిగా వారికి దక్కిన హక్కుల విషయంలో మాత్రం అడుగడుగునా కోతలు ఎప్పటి నుంచో మొదలైంది. ఇతర కులాల వారు, వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే జ్ఞాన సముపార్జన వాళ్లకే చాలా కాలం వరకూ పరిమితమై పోయింది. కాలానుగుణంగా వస్తున్న మార్పులలో ఇతర వర్ణాల వారు, కులాల వారు, జ్ఞాన సముపార్జన విషయంలో వీరితో పోటీ పడి నెగ్గుకొస్తున్నప్పటికీ, సాంప్రదాయిక వైదిక విద్యా సముపార్జన మాత్రం ఇంకా వీరి అధీనంలోనే చాలా వరకు వుందనాలి. వాళ్లకు సంఘంలో వున్న గౌరవం వల్లనైతేనేమి, సాంప్రదాయకంగా వారికి లభిస్తున్న విద్య వల్ల నైతేనేమి, బ్రాహ్మణులు మత పరమైన వ్యవహారాలనే కాకుండా లౌకిక వ్యవహారాలను కూడా చక్కదిద్దే స్థాయికి ఎదిగారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటు పడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదాలలో ప్రావీణ్యం కల వారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభిస్తోంది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద-పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై చక్కటి అవగాహన కలిగి ఉంటారు.

--------------------శుభరాత్రి ------------------------

Saturday, September 25, 2021

ప్రపంచ నదుల దినోత్సవ సందర్భంగా గోదావరీ నదీమతల్ల వడిలో కొన్ని మధుర క్షణాలు

 #ప్రపంచ నదుల దినోత్సవం🌊🎉 #ప్రపంచ నదుల దినోత్సవం #ప్రపంచ నదుల దినోత్సవం

వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికా లోని ఎడారులలోను, సౌదీ అరేబియా లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్‌ స్టోన్‌) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్‌) ఉంటే నీరు అంతగా ఇంకదు.





"గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు`"అన్న మంత్రాన్ని పఠిస్తూ గంగ, యమున, సరస్వతి వంటి పుణ్యనదులన్నీ కూడా తాను స్పృశించిన నీటిలో ఉండుగాక అని దీని అర్థం.  జ్యోతిష శాస్త్ర రీత్యా నీటి మీదా, మానవుల మనసు మీదా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడట. అందుకే ఈ మాసానికి `కౌముది మాసం` అని కూడా పేరు. అలాంటి చంద్ర కిరణాలతో, ఔషధులతో రాత్రంతా తడిసిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనాదిగా మన పెద్దలు నదులకు గొప్ప స్థానాన్ని అందించారు. వాటిని దేవతలుగా భావించి కొలిచారు. అలాంటిది సాక్షాత్తూ ఆయా నదీజలాలలోనే స్నానంమాచరించే సందర్భం వస్తే వదులుకోరు కదా! ఆ సందర్భమే కార్తీక మాసం!!! ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్దకు చేరుకుని సంకల్పం చెప్పుకుని, పితృదేవతలను తల్చుకుని, దానధర్మాలు చేసి, దీపాన్ని వెలిగించి, భగవంతుడిని కొలుచుకోవాలని కార్తీక పురాణం చెబుతోంది. ఇక ఆయా పుణ్యనదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయవచ్చని ప్రోత్సహిస్తుంటారు పెద్దలు. 


గోదావరితల్లి పై నా స్వీయ కవిత ఈ లింక్‌ లో చూడండి 

 https://www.youtube.com/watch?v=NoLrZn1ctcE



















ప్రపంచంలోని పెద్ద నదుల: పొడవైన నదుల జాబితా నైలు నది (6,695 కి.మీ.) అమెజాన్ నది (6,683 కి.మీ.) యాంగ్‌ట్జీ నది (చాంగ్ జియాంగ్) (6,380 కి.మీ.) మిసిసిపి నది (5,970 కి.మీ.) ఓబ్ నది (5,410 కి.మీ.) హువాంగ్ హో (4,830 కి.మీ.) కాంగో నది (4,630 కి.మీ.) లెనా నది (4,400 కి.మీ.) అమూర్ నది (4,350 కి.మీ.) యెనిసెయి నది (4,106 కి.మీ.) భారత దేశాన్ని🇮🇳 నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. నదులను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పాటమాలజీ అందురు. మరిన్ని వివరాలకు www.sriwritings.blogspot.com/2000/07/blog-post_1.html గంగ, సింధు, యమున, బ్రహ్మపుత్ర, సరస్వతి, పంజాబు లోని ఐదు నదులు : **సింధూ నది, **రావి నది, **బియాస్ నది, **సట్లెజ్ నది, **చీనాబ్ నది, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, నర్మద, తపతి, మహానది, భరతపూయ, దహీసార్, దామోదర్, ఘాగర్ గోమతి, కోయెనా, మండోవి, మిధి, ఓషివార, సబర్మతి, శరావతి, ఉల్హాస్, వశిష్ఠి, జువారి, పంబా, నాగావళి, నేడు ప్రపంచ నదుల దినోత్సవం🌊 #WorldRiversDay 🌊🌊🌊🌊 సముద్రుడే విశ్వమంటు సర్వస్వము ధారబోసి అస్థిత్వము కోల్పోయిన నదినెవ్వరు ఓదార్చిరి ఔషధముల ఆస్తినంత ఒడిదుడుకుల దూకుడులో వారాశికి సమర్పించు నదినెవ్వరు ఒడార్చిరి పిల్ల నదుల తీసుకొచ్చి సంగమమున ప్రేమమీరి సంద్రుడికే బలి ఇచ్చెడి నదినెవ్వరు ఓదార్చిరి తనలో తీపిని సైతము విశ్వాసపు ముసుగులోన ఉప్పుకు దాసోహమిచ్చు నదినెవ్వరు ఓదార్చిరి తానై జమకట్టు రాళ్ళు కడలిలోని రత్నములని భ్రమసి ఎగసె నదినెవ్వరు ఓదార్చిరి సంప్రోక్షణ పరమైనను కాలుష్యపు కోరలలో సర్వరోగిగా మారిన నదినెవ్వరు ఓదార్చిరి తన గమనమును మార్చివేసి మనిషి కట్టు ఆనకట్ట ఆకాశపు హర్మ్య మన్న నదినెవ్వరు ఓదార్చిరి నది యెన్నడు సజీవమే కష్టాలలో కడలియె నది ఒంటరిగా పయనించును ఒంటరియై అమరమౌను. కవి: అష్టకాల విద్యాచరణ శర్మ

Thursday, September 23, 2021

 *బంధాలు భారమై'పోయా'యా:* 🌹🤝


           *మన చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు.  వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి.  ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు.  ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు.  ఇల్లంతా వెతికినా కనిపించవు.  అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది.  అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు.   కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు.  ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి.  బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు*.  


         *రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది.  ఇక గత రెండు మూడు దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి.  ఒకే పట్నంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది.  ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఆర్ధికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభం అయింది.  డబ్బున్న బంధువులకు ఒకరకమైన మర్యాదలు, డబ్బులేని బంధువులకు మరొకరకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది.  ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ,  అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంతవాళ్ళం అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలు పెట్టారు.   డబ్బులేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు*. 


          *ఇక సొంత అన్నదమ్ములైనా, అక్కాచెల్లెళ్ళే అయినా, ఏవైనా ఫంక్షన్స్ ఉంటె తప్ప కలుసుకోవడం లేదు.  మామూలుగా వెళ్లి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది.  ఆ ఫంక్షన్స్ కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్లడం, భోజనాలు అయ్యాక వెంటనే "పనులు ఉన్నాయి" అని వంక చెప్పి వెళ్లిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాము.  మనుషుల మధ్య  ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది*.  


     *సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకుని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలయితే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి.  అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకుని, కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్లిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు.   వందలమంది అతిధులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునొ, తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చెయ్యడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు*.  


            *అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా, కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్లిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి.  చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెబుతుంటారు. ఏడాదికి వందరోజులు సెలవులు ఉన్నాయి మనకు. లేనిదల్లా ఆత్మీయతలు...బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు!  అన్నం అనేది మనమధ్య మానసిక బంధాలను సుదృఢంగా నిలిపి అజరామరం గావించే  అమృతం లాంటిది*.


                *కొందరికి తల్లితండ్రులను పలకరించే తీరికలేని సంపాదనలో ఉన్నారు. అది చాలా దుర్భరమైన స్థితి*.


 *ఆలోచించండి బంధాలను బలపరుచుకోండి*🙏🌹

Wednesday, September 22, 2021

 ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మనసు కవి జీవితంలోని ఒక సరదా సంఘటన..🌹*_


👉మనసుకవి ఆత్రేయ పాట రాసే విధానం చాలా వింతగా ఉంటుంది. పగలంతా పిచ్చాపాటీతో కాలం గడుపుతారు. డాన్ పీంచ్ సిగరేట్ పేకెట్లూ.. పళ్లెంలో ఆరారగా ప్రూట్సు.. ఇవివుండి తీరాలి. అసిస్టెంట్ డైరెక్టరు పాట రాయించుకోవడం కోసం వస్తాడు, పేపర్లూ పాడ్‌తో. పెన్నుతెరిచి మరీ రెడీగా వుంటాడు. ఆ పెన్ను అలాగే వుంటుంది. ప్రూట్సు ఒకటీ అరా అవుతాయి. సిగరెట్లు మొత్తం ఖాళీ అవుతాయి. ఆయన నిద్రలోకి జారుకుంటాడు.

అంతే!

మళ్లీ సాయంత్రం.

ఫ్రెష్ష్‌గా స్నానం చెయ్యడం

ధవళ వస్త్రాలు ధరించడం.. సిగరెట్ వెలిగించడం.

‘‘ఎందాకా వచ్చాం?’’

‘‘ఏదీ... మొదలు పెట్టందే!’’

‘‘మొదలుపెడితే పాట పూర్తయినట్లే కదరా! ఆ మొదలు దొరకడం లేదు.’’

‘‘ఓ మాట అనండి!’’

‘‘వేడి కాఫీ చెప్పు!’’

‘‘మాట అనమంటే ఇదా!’’

ఇలా వుంటుంది ఆయన ధోరణి.

పాట పూర్తికాదు.

గంటలు.. రోజులు.. వారాలు గడుస్తుంటాయి.

‘‘పాట’’ పుట్టదు.

హోటలుకి అద్దె పెరిగిపోతుంది. ప్రొడ్యూసరు లబోదిబోమంటాడు. సరిగ్గా ఇలా జరిగింది, పద్మశ్రీ పి పుల్లయ్యగారి మురళీకృష్ణ చిత్రానికి.

ఇద్దరిమధ్య మంచి చనువుంది. తిట్లూ- పొగడ్తలూ సర్వసాధారణం. ఆరోజు అమీతుమీ తేల్చుకోడానికి పుల్లయ్యగారొచ్చారు.

‘‘పాట వొచ్చిందా?’’ పుల్లయ్యగారు.

‘‘వొచ్చి చచ్చింది!’’ ఆత్రేయ సమాధానం.

‘‘నన్ను చంపకు. ఇక రూమ్ వెకేట్‌చేసి బయలుదేరు!’’

‘‘ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నాను’’

‘‘సిగ్గులేదూ నీకు!’’

‘‘వుంటే సినిమాలకెందుకు పనిచేస్తాను!’’

వీరి మాటల్లో బూతులు సర్వసాధారణం. అవి వ్రాయదగ్గవి కాదు.

కారు ఆత్రేయగారింటికేసి దూసుకుపోతోంది వేగంగా.

అంతకుమించిన వేగంతో వారిమధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

పుల్లయ్యగారి ముఖంలో కోపం. ఆత్రేయ ముఖంలో చెక్కుచెదరని చిరునవ్వు.

‘‘దిగూ! నువ్వు ఎక్కడవున్నా- ఏవైనా.. నువ్వు సుఖంగా వుండాలనే నేను కోరుకుంటాను!’’ అన్నాడు పుల్లయ్యగారు.


అంతే! ఏదో ఫ్లాష్ వెలిగింది.

కారు తిప్పు. మన ఆఫీసుకి పోనివ్వు.. అన్నాడు ఆత్రేయ.

‘‘ఏం ఉద్ధరిద్దామని!’’

‘‘ఎలా- పోనియ్యవయ్యా!...

ఆఫీసు చేరుకుంది కారు.

‘‘ఎక్కడవున్నా- ఏమైనా’’

మనమెవరికి వారై వేరైనా...

నీ సుఖమే నే కోరుతున్నా

నిను వీడి అందుకే వెళుతున్నా- సాకీ...పల్లవి. వచ్చేసింది.


అనుకున్నామని జరగవు అన్ని

అనుకోలేదని ఆగవు కొన్ని

జరిగినవన్నీ మంచికనీ,

అనుకోవడమే మనిషి పనీ... చరణం వొచ్చేసింది-

ఇక రెండవ చరణం-


‘వలచుట తెలిసిన నా మనసునకు

మరచుట మాత్రం తెలియనిదా

మనసిచ్చినదే నిజమైతే

మన్నించుటయె రుజువుకదా- రెండవ చరణం వచ్చేసింది.

ముక్తాయింపు వుండాలి కదా-

‘‘నీ కలలే కమ్మగా పండనీ.

కలకాలం నీలో దాగనీ..

చిరంజీవిగా వుండాలనీ..

దీవిస్తున్నా.. నా దేవినీ.. దీవిస్తున్నా నా దేవిని..


పాట అయిపోయింది. పుల్లయ్యగారికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఆత్రేయ చేతుల్ని ముద్దుపెట్టుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఈ పాట మాస్టర్ వేణు చేతుల్లో పడింది. ఆయన ట్యూను చేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. రిహార్సల్స్‌లో ఘంటసాల మాస్టారు విన్నారు. ఆయన ఆ పాటకి ప్రాణం పోశారు. ఘంటసాల మాస్టారి జీవితంలో అత్యంత ఇష్టమైన పాట.

వేణు మాస్టారికి ప్రాణం ఈ పాట.

పుల్లయ్యిగారికి ఈ పాట ఆరో ప్రాణం...

అక్కినేని నట జీవితంలో పూర్ణాయుష్షు నింపుకున్న పాట ఇది!

అయితే ఆత్రేయకిది కేవలం ‘పాట విడుపు’ మాత్రమే!..


💟💟💟💟💟💟💟💟💟💟

                              ---------------   శుభసాయంత్రం ----------------------


Thursday, September 16, 2021

 స్కూళ్ల నిర్వాకం...                                     

ఒక ప్రైవేట్ స్కూల్ కి DEO lnspection ki వెళ్లి, 

ఒక పిల్లాడిని లేపి అడిగారు


DEO: శివ ధనుస్సు విరిచినది ఎవరు ప్రశ్నించారు?


స్టూడెంట్: సార్...నేను కాదు అని ఏడుస్తూ బదులిచ్చాడు.


అది విని DEO క్లాస్ టీచర్ ని కోపంగా ఏంటి ఇది అని అడిగారు.


క్లాస్ టీచర్ : "చ..చ వీడు అలాంటి వాడు కాదు సర్.... నాకు వీడి గురించి బాగా తెలుసు" అని బదులిచ్చాడు.


కోపంతో DEO, HM ని పిలిపించి.. శివ ధనుస్సు విరిచింది ఎవరు అని అడిగితే పిల్లలకి తెలియకపోతే కనీసం క్లాస్ టీచర్ కి అయినా తెలియాలి కదా..అని అన్నారు.


వెంటనే HM: సార్ ఈ క్లాసు పిల్లలు అలాంటి వారు కాదు..6 వ క్లాస్ పిల్లలు చేసి ఉండవచ్చు.... అని అన్నారు.


కోపంతో DEO: స్కూల్ బంద్ చేయండి అని ఆర్డర్ వేసారు.


HM: వెంటనే స్కూల్ కరస్పాండెంట్ ని పిలిపించాడు.


కరస్పాండెంట్: సార్...స్కూల్ మూసేయకండి..కావాలంటే విల్లు ఖరీదు ఎంతైనా నేను ఇస్తాను....అని అన్నాడు.


కోపంతో DEO....విద్యా శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొర పెట్టుకున్నాడు....


విద్యా శాఖ మంత్రి: ఏయ్.. ఏయ్ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, ఏమైనా విరగకొడతారు. అయినా తెలిసి కూడా అక్కడ విల్లుని ఎందుకు వదిలేశారు అని అన్నారు....


DEO...తల పట్టుకుని CM దగ్గరికి వెళ్ళాడు..


CM: దీని గురించి నాకు తెలియదు.ఊరికే నేను ఏమీ చెప్పను..ఇదంతా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చేస్తున్న కుట్ర.... 


విల్లును ఎవరూ విరగ్గొట్టలేదు.... 

ఒకవేళ విరగ్గొడితే దీని పైన CBI enquiry  వేయిస్తాం. 

దీని వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా సరే వదలం.

చట్టం ముందు దోషిగా నిలబెడతాం అని చెప్పారు.


DEO గారిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేశారు......😃   ఇది మన   చదువుల పరిస్థితి దుస్థితి  

🤣🤣🤣🤣🤣🤣


 ఒక్కరే నవ్వు కోకండి పక్క వారికి కూడా పంపండి.

Saturday, September 11, 2021

ఎక్కడ న్యూస్ ఛానళ్ళ పేరిట హింస లేదో ....Where the mind is without fear and head is held high

 ఎక్కడ న్యూస్ ఛానళ్ళ పేరిట హింస లేదో ....

ఎక్కడ 24 గంటల వార్తల పేరిట
చూపిందే చూపి జనాల్ని చంపరో...
ఎక్కడ బిగ్ బాస్ పేరిట సెమీ పోర్న్ రియాలిటీ షోలు నడిపించరో..
ఎక్కడ జబర్ధస్త్ పేరిట బూతు కామెడీ లు నిర్వహించరో...
ఎక్కడ సీరియళ్ళ పేరిట కుట్రలు కుతంత్రాలు చూపించరో...
ఎక్కడ న్యూస్ ఛానళ్ళు రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగవో...
ఎక్కడ రిమోట్ కంట్రోల్ లు చెత్తబుట్టలో పారేసి... ఇంటిల్లిపాదీ కలిసి కబుర్లు చెప్పుకుంటారో...
ఆ స్వేచ్ఛా స్వర్గానికి....తండ్రీ నా దేశాన్ని నడిపించు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు - శతం జీవ శరదో వర్ధమాన

 పుట్టిన రోజు శుభాకాంక్షలు

💐💐💐శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతిశత మితి శతం దీర్ఘమాయుః|
మరుత ఏనావర్ధయంతి|
శతమేన మేవ శతాత్మానాం భవతి శతమనంతం భవతి|
శత మైశ్వర్యం భవతి|
శతమితి శతం దీర్ఘమాయుః|
అగ్నే యశస్వి యశ సేమ మర్ప యేంద్రావతీ మపచితీ మి హావహ|
అయం మూర్ధా పరమేష్ఠీ సువర్చా స్సమానానా ము త్తమశ్లోకో అస్తు||
శతమానం భవతి శతాయుః
పురుషః శతేంధ్రియ
ఆయుఃశ్శ్యేవేంధ్రియే ప్రతితిష్ఠతి.
సుదినం సుదినం జన్మదినం తవ,
సుదినం సుదినం భవతు మంగళం,
సుదినం సుదినం చిరంజీవ భవ,
సుదినం సుదినం యశోవర్ధనం,
విజయీ భవ సర్వత్ర సర్వదా.
శత మానం భవతి శతయుహ్
పురుష శతేంద్రియ
ఆయుష్యే వేంద్రియే ప్రతితిశ్ఠతి!
ఆశీర్వాద శ్లోకం
శ్లో.గృహంకనక శోభితం
వదనమస్తు! విద్యోజ్జ్వలం
వపుర్బాల విరాజితం హృదయమస్తు! సత్వాచీం తమ్
భవంతు తవ శత్రవో భువితు కాందిశీకాః!
పరం సుహృజ్జన సమాగమం భవతు తే సదా హర్నిశం!!
తా.మీ ఇల్లు బంగారం చేతను , మీ ముఖము విద్య చేతను శోభిల్లుగాక , మీశరీరం బలిష్టమై యుప్పెనుగాక ,
మీ హృదయము సత్వ గుణముతో నిండియుండునుగాక, మీ శత్రువులు నాలుగుదిక్కులకు పా రిపోవుదురు గాక , రాత్రింబవళ్ళు మీకు సత్పురుష సాంగత్యము లభించునుగాక.
మీ ఇంట ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి
భక్తీ, జ్ఞాన, వైరాగ్య , సిద్దులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, తులతూగి
పుత్ర,పౌత్రులతో బంధు, మిత్రులతో కళకళలాడు గాక!!దీర్ఘాయుష్మాన్భవ భూ , జల , నిధి , నికేప, ధన, ధాన్య, వస్త్ర , వస్తు, నూతనస్థలి, నూతనగృహ, వాస్తుదోషానివారణ, అష్టమ, అర్థాష్టమ, ఏలిననాటి శనిదోషానివారణ, ఇష్టదైవత, కులదైవత అనుగ్రహ! శతృష్ణేహ అనుకూలిత !ఉన్నతాధికార అనుకూలిత ! సమాజ అనుకూలిత !పదవి అనుకూలిత ! కుటుంభఅనుకూలిత ! దాంపత్య జీవిత అనుకూలిత !తత్సంతానప్రాప్తి! పుత్ర పుత్త్రాభి వృద్ధి ! ఆనందజీవితప్రాప్తి ! మనఃశాంతి ప్రాప్తి ! రోగనిరోధకశక్తి ప్రాప్తి రాచరికముఖతేజస్సు! దానగుణ! దానశీలి!! దైవానుకూల !తల్లిదండ్రుల ఆశీర్వాద ! గగనసంచార గురువుల ఆశీర్వాద ! స్నేహపూర్వక ఆశీర్వాద ! ఇష్టదైవత , కులదైవత ,తధాస్తు దైవత ఆశీర్వాదమస్తు! .
శ్రీశైలం శ్రీ గంగా పార్వతీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ రామ శర్మ ఓం నమో వేంకటేశాయ
మీ శ్రీ రామ శర్మ 9490944543
1

Total Pageviews