Saturday, April 16, 2016

1) పెళ్ళంటే పందిళ్ళు



పెళ్ళంటే పందిళ్ళు

























పెళ్ళంటే పందిళ్ళు 
పెళ్ళంటే… పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు… మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. ఎంత ఆర్భాటంగా చేసాము అన్నదానికంటే ఎంత సంప్రదాయ బద్దంగా చేశాము అన్నది ఏంతో సంతృప్తి గా ఉంటుంది. కళ్ళలో పెళ్లి పందిరి కనబడ సాగే అన్న పాట ఎంత చల్లగా హాయిగా ఉంటుంది. పందిరి అంటే తాటాకు పందిరే చలవ పందిరి అంటారు. ఈ కాలంలో ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న విషయం, తాటి ఆకు లభించాలి, చెట్టు నుండి కోసి వాటిని ఒక వరుసక్రమంలో ఒక దానిపై ఒకటి వరుసగా పేర్చి చదును చేసే ప్రక్రియను మడదొక్కడం అంటారు. ఈ మధ్యకాలంలో పాకలు పందిళ్ళు నేసే వారు కరువవుతున్నారు. ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. పందిరిని బట్టి ఆధారపడుతుంది. అందుకనే గ్రామాలలో కూడా పెళ్లిళ్ళలో పందిరిలు నామమాత్రం గానే కనిపిస్తున్నాయి. టెంటు వేసేస్తే సరి అని సరిపెట్టేసు కుంటున్నారు. కనీసం 6 మంది 4 రోజులు కష్టపడితే పందిరి తయారవుతుంది. ఇక ఆ పందిరి కింద కాసింత సేదతీరితే ఆ పచ్చి తాటిఆకు వాసన ఆ పందిరి స్తంభాలకు కట్టిన పచ్చి కొబ్బరాకులవాసనా, తోరణాలుగా కట్టిన మామిడాకుల వాసనలు పీలుస్తూ ఆ పందిరి కింద సేదతీరితే అటు ఎండనుండి రక్షణతో పాటు సంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నామన్న భావనతో ఎంతో తృప్తి గా అలౌకిక ఆనందం అంతేకాదు ప్రకృతి సహజసిద్ధమైన అలసట పోగొట్టి మనసుని ఉల్లాసంగా ఉంచే గుణం తాటి ఆకుల్లోను , తాటి పందిళ్ళలోను, పాకల్లోను ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే పూర్వం శుభకార్యాలకి కొబ్బరి ఆకుల కన్నా తాటి వనరులనే ఎక్కువ ఉపయోగించేవారు. ఈ విషయంలో కొబ్బరికన్నా, మరింత శాతం తాటి మంచిది అంటున్నారు పరిశోధకులు. అందులో అనేక విశే షాలు, ఔషధగుణాలు, కలగలుపుగా ఎన్నో ఉన్నాయి. దీని సాధారణ ఉపయోగాలు చూస్తే, దీని ఆకులు లతో పూరిపాకలే కాక శోభస్కరమైన పెళ్లి పందిరికీ, వాడేవారు కాగితం లేని పూర్వకాలంలో ప్రజలందరూ తాటి ఆకుల్నే వాడేవారు. వాటినే తాళపత్రాలు అని పిలిచేవారు. నేటికీ ఎన్నో గ్రంధాలు మనకి తాళపత్రాలలోనే ఉన్నాయి. ఇక దీని కాండం ఇంటి వాసాలుగా ఉపయోగిస్తారు. అనేక పల్లెల్లో, వ్యవసాయ భూముల్లో ఈ తాటివాసాలతో, తాటి ఆకులతో కట్టిన ఇళ్ళు మనకి నేటికీ కనిపిస్తూనేవుంటాయి. ఈ ఇళ్ళు మనకి వేసవిలో చల్లగానూ, శీతాకాల, వర్షాకాలాల్లో వెచ్చగానూ వుంటాయి. అందుకే తాటితో తయారైన ఇంటిని ‘నేచురల్‌ ఎయిర్‌కండిషన్డ్‌ హౌస్‌’ అంటారు. తాటికల్లుని నీరాగా అందరూ సేవించడం మనకి తెలిసినదే. తాటి సంపద ఆయుర్వేదపరంగా కూడా మనిషికి మేలుచేస్తుందనే చెప్తోంది. భొజానాల్లో అరటి ఆకులు కూడా మాయమై పోతున్నాయి. నేటి ఆధునిక ఒత్తిడుల మయ మాయా జీవనంలో ఇలా ఒక చల్లని పందిరికింద సేద తీరితే ఎంత హాయి! ఇలా పందిరి వేసాక దానికి తెల్ల వస్త్రాన్ని కప్పి రంగు రంగుల పువ్వులతో అలంకరిస్తే ఇంటి ముంగిట ఎంత చల్లదనం ఎంత శోభాయమానం... నగరాల్లో పట్టణాల్లో పెళ్లి మంటపాలకు లక్షాలాది రూపాయలు ఖర్చు చేసేవారు ఏదో ఒక గ్రామంలో ఇలా పందిరి ఏర్పాటు చేసి తక్కువ ఖర్చులో ఎంతో వైభవంగా చెయ్యవచ్చు సంప్రదాయాన్ని పరిరక్షించావచ్చు ఆలోచించండి! ఇంతకీ ఈ హడావుడి అంతా ఏమంటే? రాజు తలుచుకుంటే దేనికైనా కొదువా అంటారు కదా మా తమ్ముడు రాజు తలుచు కుంటే అంతేమరి! ఇదిగో మా తమ్ముడు చి. వెంకటేశ్వర్లు వివాహ నిశ్చితార్దానికి మా ఇంటి ముంగిట పందిరి శోభ! అచ్చతెలుగు సంప్రదాయం ఆస్వాదించండి! రేపటి పోస్ట్ లో నిశ్చితార్ధం దృశ్యాలు వీక్షించండి మనసారా ఆశీర్వదించండి! సత్యసాయి విస్సా ఫౌండేషన్!

No comments:

Post a Comment

Total Pageviews