Tuesday, April 19, 2016

3) విఘ్నేశ్వరునికి మీదు కట్టడం


విఘ్నేశ్వరునికి మీదు కట్టడం 
అమ్మాయి/ అబ్బాయికిపెళ్ళి కుదిరి తాంబూలాలు పుచ్చుకోగానే, ముహూర్తం పెట్టించుకోగానే మొదట చేసేపని విఘ్నేశ్వరునికి మీదు కట్టడం.
మీదుకట్టడం ఎలా, ఇది ఆడవారు, సాధారణంగా తల్లి కడుతుంది. ఇంట్లో పెద్దలుంటే కట్టిస్తారు,మంగళవారం, శుక్రవారం కాకుండా మంచిరోజు చూసుకుని, కనీసం ముగ్గురు పేరంటాండ్రని పిలిచి, పసుపు వినాయకుని చేసి, పూజించి, ఒక ఎర్రటి జాకట్ ముక్కలో ఐదు సోలల బియ్యం పోసి అందులో ఒక బెల్లం ముక్క వేసి ఉంచి, తిరగలి వేసి, దానికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి,శనగలు తీసుకుని దానిలో విసరాలి,వచ్చిన ముత్తయిదువుల చేత విసిరించి, వాటిని వేరుగా పొట్లం కట్టి, ఈ ఎర్ర గుడ్డలో పెట్టి, పసుపు వినాయకుడిని కూడా ఆ మూటలో పెట్టి గుడ్డని మూట లా కట్టి, లోపల బీరువాలో భద్రం చేస్తారు. దీనిని మీదు కట్టడం అంటారు. వినాయకుని, స్వామీ! ఈ కార్యక్రమం సాఫీగా అయ్యేలా అనుగ్రహించు, అని చెప్పి చేసేది. మరొక రకంగా చెప్పాలంటే, పాత రోజులలో ఇరుగుపొరుగువారికి పెళ్ళి పనులు మొదలుపెట్టినట్లు చెప్పడమే. మీదు కట్టే దాకా పెళ్ళికి సంబంధించిన పనులు చేయరు, బంగారు వస్తువులు చేయించడం సహా.మొత్తం కార్యక్రమం పూర్తయిన తరవాత ఈ మీదుకట్టిన మూట తీసి, బియ్యం విసిరి,శనగపప్పును అందులో వేసి ఉండ్రాళ్ళు చేసి వినాయకునికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా స్వీకరిస్తాం. పెళ్ళికి ఈ కార్యక్రమం పదహారురోజుల పండుగనాడు చేస్తాం. ( పెళ్ళయిన పదహారవ రోజు పండగ చేసుకుంటాం ) సాధారణంగా ఊరిలో పిలుపులు కార్యక్రమం ఈ రోజు పెట్టుకుంటారు, కష్టేఫలి శర్మగారి సౌజన్యంతో-పెళ్ళిభోజనం మృష్టాన్న భోజనం: సాధారణంగా పెళ్ళీడుకొచ్చిన ఆడ, మగ పిల్లల్ని పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తారు అని పెద్దవారు సరదాగా అడుగుతారు పెళ్ళిభోజనం అంటే పప్పన్నం మాత్రమె కాదండోయ్! రుచికరమైన తియ్యని పదార్థములతో కూడిన మంచి భోజనము. తృప్తికరమైన భోజనము. అని నిఘంటువులు చెప్తున్నాయి. మరికి పెళ్ళికి వచ్చే మీ వంటి ఆత్మీయ అతిధులకు మరి అటువంటి భోజనం ఎలా వండాలి, వడ్డించాలి వంట బ్రాహ్మల, క్యాటరింగ్ వారితో సంప్రదింపులు. మా ఇంట ఆ సందడి చిత్రాలు. మీరూ ఆస్వాదించండి. సందర్భం వచ్చింది కాబట్టి మనలో మనమాట ఈ రోజుల్లో పెళ్ళిభోజనం పేరు చెప్పి వందలాది ఆహార పదార్ధాలు, ఇండియన్, కాంటినెంటల్ అంటూ ఎన్నెన్నో స్టాల్ల్స్ పెట్టి ప్లేట్ ఒక్కింటికీ 100 రూపాయల నించి 1000 రూపాయల ఖర్చు పెట్టడం అవసరమా? ఆయన 100 రకాల ఆహార పదార్ధాలు పెట్టాడు కాబట్టి మనం 150 పదార్ధాలు పెడదాం అంటూ పోటా పోటీగా ఒక వేలం వెర్రి వ్యవహారం లా తయారయ్యింది ఇదంతా క్యాటరింగ్ వారు బాగు కోసం తప్ప నిజంగా ఆనాడు తినే సామర్ధ్యం ఈనాటి మనకు ఉందా చెప్పండి ఎందుకంత దుబారా? ఆహారపదార్ధాలు సగం తిని పారవేయడం, మిగిలిపోవడం ఎంత బాధగా ఉంటుంది. అవసరమైన మేరకు సంప్రదాయక నవకాయ పిండివంటలతో అరటి ఆకులలో భోజనం ఎంత తృప్తిగా ఉంటుంది. ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు, ఎంత పర్యావరణానికి హాని కలిగిస్తున్నాము. ఆలోచించండి. ఆ అనవసర ఖర్చు తగ్గించుకుని వధూవరుల పేరిట ఏ అనాధ శరణాలయం లోనో వృద్ధాశ్రమాల లోనో లేదా పేదలకి, అన్నార్తులకు పెడితే పుణ్యం పురుషార్ధం! ఒకవేళ మిగిలిపోయిన పదార్ధాలని సేవా భావంతో అన్నార్తులకు అందించే సంస్థలు ఇటీవల ఎన్నో వస్తున్నాయి వారి ఫోన్ నంబర్లు మనం సేకరించి, మనం వెళ్ళే కళ్యాణ మంటపాల్లో వాటి గురించి ప్రచారం చేస్తే మనకు కూడా ఎంతో తృప్తి ఉంటుంది అందుకే కదా మన పెద్దలు అన్నారు పెట్టక పోయినా పెట్టె ఇల్లు చూపించమని! విజ్ఞతతో ఆలోచిద్దాం! మానవత్వంతో ప్రతిస్పందిద్దాం! ధన్యవాదాలతో,
సత్యసాయి - విస్సా ఫౌండేషన్!






No comments:

Post a Comment

Total Pageviews