Wednesday, September 11, 2019

భోజరాజు, బ్రహ్మచారి,కాళిదాసు భోజరాజా! శంభుడికి దూరం వుంటారో వారు తీర్థ యాత్రలకు వెళతారు

భోజరాజు ఒకనాడు కొలువు దీరి యుండగా,ఒక బ్రహ్మచారి వచ్చి రాజును చిరంజీవ అని
ఆశీర్వ దించాడు.
రాజు ఆ యువ బ్రహ్మచారిని బ్రహ్మచారీ!ఈ కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం
యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించావు?నిత్య వుపవాసాలతో యిలా ఎందుకు
కృశించి పోవడం?గృహస్తాశ్రమము స్వీకరించ రాదా? నేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ
కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.అన్నాడు.
అందుకు బ్రహ్మచారి రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది
ఏముంటుంది?అయినా
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహా: -శాంతి: ప్రియా గేహినీ,
వృత్తి: -- వన్యలతా ఫలై: నివసనం, వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నిర్వృతి:
తేషాం - ఇందు కళావతంస యామినాం మోక్షేపి నో నః స్పృహా
అర్థము:--లేళ్ళు మాకు మిత్రులు, కొండగుహలే ఇల్లు,మనశ్శాంతి, మనోనిగ్రహమే మా
ఇల్లాలు, అడవులలో
తీగేలతో,పండ్లతోనే సహవాసమే మా జీవన విధానం.చెట్టు పట్టలే మాకు వస్త్రాలు,మంచి
మాటలు అనే అమృత ప్రవాహం లో నిరంతర మునిగి తేలే వాళ్ళం, ఎవరికైతే ఈ
సుఖాలు వుంటాయో అలాంటి చంద్ర
మౌళీశ్వరుడి భక్తులము ,యోగులమూ అయిన మాకు మోక్షం మీద కూడా కోరిక
వుండదు.అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము ఏమైనా వుంటే
చెప్పండి.అన్నాడు
అప్పుడు అతడు రాజా!మేము కాశీయాత్రకు వెళుతున్నాము.దయచేసి మీ సభలోని
పండితులను భార్యా సమేతం గా మాతో పాటు యాత్రకు పంపించండి.త్రోవ పొడుగునా
శ్రమ తెలియకుండా పండిత గోష్టులు
జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.అన్నాడు ఆ బ్రహ్మచారి.రాజు అందుకు
సరే అన్నాడు రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళారు,ఒక్క
కాళిదాసు తప్ప.మీరు ఎందుకు వెళ్ళలేదు?అని రాజు కాళిదాసును అడిగాడు.కాళిదాసు
ఒక శ్లోకం లో బదులిచ్చాడు.
తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో: దూర వర్తినః
యస్య గౌరీశ్వరః చిత్తే / తీర్థం,భోజ! పరం హి సః
అర్థము:--భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు
వెళతారు,ఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజుకు కోపం వచ్చింది.కానీ ఏమీ చెయ్యలేక
వూరుకున్నాడు.
కొద్దిరోజుల తర్వాత భోజరాజు కాళిదాసు ను యీ రోజేమైనా విశేష మైన వార్త మీ చెవిన
పడిందా?అని అడిగాడు.కాళిదాసు నా చెవిన పడ్డది వార్త కాదు మహారాజా!అని ఒక శ్లోకం
చదివాడు.
మేరౌ, మందర కందరాసు, హిమవత్ సానౌ.మహేంద్రాచలే,
కైలాసస్య శిలా తలేషు, మలయ ప్రాక్ - భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!, శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గనై: (ణయై:) వుద్గీయ మానం యశః
అర్థము:--చారణులనే దివ్య గాయకుల బృందాల చేత,నీ కీర్తి గురించి
పాడబడుతున్నపాటలు వినబడ్డాయి
మేరు పర్వతం మీదా,మందర పర్వతపు గుహలలో,హిమాలయాల మీదా, మలయ
పర్వత శిఖ రాగ్రాల
మీదా,సహ్యాద్రి మీదా యిలా అనేకానేక ప్రదేశాలలో చారణులనే దివ్యగాయకుల
బృందాల చేత కొనియాడ బడుతున్న నీ కీర్తి వినపడ్డది
.
అప్పుడు భోజుడు సంతోషం తో కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని
నేను వినగలిగే వాడిని కాదు కదా!అనుకున్నాడు.కాళిదాసు మీద అతని కోపం
యెగిరిపోయింది.
------------------శుభరాత్రి -------------------------------

No comments:

Post a Comment

Total Pageviews