Sunday, September 27, 2020

నీవు లేవు నీ పాటవుంది నీవు పరచిన వేలాది పాటల బాట వుంది.

 నీవు లేవు నీ పాటవుంది

నీవు పరచిన వేలాది పాటల బాట వుంది.

నీ పాట వింటూ పెరిగాం
నీ గొంతు లొంచే ఎన్నొ భావాలు ఎరిగాం
తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్లు
రాకూడదు అనుకున్న ఆ రోజు తొందరగా వచ్చింది
వినకూడదు అనుకున్న ఆ కబురు
వినబడి మనసు మూగ బోయింది
జాబిలంటి నీ పాట వినకుంటే మాకు వెన్నెలేది
ఇక వసంతాలు ఎన్నొచ్చినా నీ కమ్మని కోకిలమ్మ గొంతు కబురేది
గున్నమావి విరబూస్తున్నా మా పాటల తోటమాలి జాడేది
మా ఎదలన్నీ తుమ్మెదలై నీ పాటల చుట్టూ తిరుగుతున్నాయ్‌ వెర్రిగా
కళ్ళనిండా అశ్రువులే ఉబుతున్నాయి ఏక ధారగా
ఎలా మోయాలొయి వింత భారం
దేహమున్న లేవు ప్రాణాలే
నీవు నీ పాటే కాదా మాకు పంచ ప్రాణాలు
ఇక సందె మబ్బులెన్నొచ్చినా స్వాతి చినుకు తడుపేది
అల్లకల్లొల అలల్లొ నావలా రేవు చేరేదెలా రేపు గడిచేదెలా నీవు లేకుండా
నీవు లేవు నీ పాటవుంది నీడగా
నీవు పరచిన వేలాది పాటల బాట వుంది మా తోడుగా
కొట్లాది మంది అభిమానులకు స్వాంతనగా
మీ సత్యసాయి విస్సా
------

Saturday, September 19, 2020

🕉️జంబుద్వీపే భరతవర్షే భరతఖండే🕉️


సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.


అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?


జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:


1) కేతుముల వర్ష 

2) హరి వర్ష 

3) ఇలవ్రిత వర్ష 

4) కురు వర్ష 

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష 

7) కింపురుష వర్ష 

8 ) భద్రస్వ వర్ష


(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)


పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.


ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.


మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.


దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !


మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.


మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?


ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.


🌷🙏శ్రీ మాత్రే నమః🙏🌷

Friday, September 18, 2020

 ✍అన్ని రోగాలకూ విరుగుడు మనసే!✍


జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్యసమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని మన జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చిచెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసుబాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బైటపడడానికి బలహీనతలు పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు.


అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు.


ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు బ్రిస్క్‌వాక్ చేయాలనుకుంటే, ఇంకొందరు స్టురైకేస్ వాక్  చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగుచూస్తున్న అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.  


మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్: కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట.  మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట !


ఆవేశ కావేశాల వల్లే అధికరక్తపోటు: ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే  అధికరక్తపోటు ఎక్కువట !


అతిబద్ధకం వల్ల చెడుకోలెస్టరాల్: కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!


మధుమేహం సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం ఉన్నవారిలో నే ఎక్కువట !


అతివిచారం వల్ల ఆస్త్మా: ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్తా వస్తుందట. 


ప్రశాంతత లేక గుండెజబ్బులు: ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్లకాదని లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం 


50% ఆధ్యాత్మికత లోపంవల్ల

25% మానసిక కారణాల వల్ల

15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వల్ల

10% శారీరక కారణాల వల్ల


రోగాలు వస్తున్నాయి. అందువల్ల కడుపుమాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే 

స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం, వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి

కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం , సానుకుల దృక్పథం పెంచుకోవాలి.

Very nice information pleace forward

Thursday, September 17, 2020

ధ్వని అనుకరణ పదాలు గణ గణ

 *ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు.*


మనం చాలా పదప్రయోగాలు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోతూ మర్చిపోతున్నాం.


 1.కలకల 2.కిలకిల 3.గలగల. 4.విలవిల. 5.వలవల. 6.మలమల. 7.వెలవెల. 8.తళతళ. 

9.గణగణ. 10.గునగున 

11.ధనధన. 12.ఝణఝణ. 13.కణకణ. 14.గడగడ. 15.గుడగుడ. 16.దడదడ. 17.కిటకిట. 18.గటగట. 19.కటకట. 20.పటపట. 21. కితకిత

22.గిలి గిలి. 23.కిచకిచ. 24.జిబ జిబ. 25.చక చక. 26.పక పక. 

27.మెక మెక 28.బెక బెక. 29.నకనక. 30.చురచుర. 31.చిరచిర. 32.బిరబిర. 33.బుర బుర. 34.పరపర. 35.జరజర. 36.కర కర.  37.బరబర. 38.చర చర. 39.గజగజ. 40.తపతప. 41.టపటప. 42.పదపద. 43.గబగబ. 44.గుసగుస.. 45.కువకువ..

 46.ఠవఠవ 47.చిమచిమ. 48.గురగుర. 49.కొరకొర. 

50.భుగభుగ. 

51.భగభగ. 52.ఘుమఘుమ. 53.ఢమఢమ. 54.దబదబ. 55.కుహుకుహు. 


అందుకే.......

దేశ భాషలందు తెలుగులెస్స..

మంజీరమ్మ పాద మంజీర జీవభావం! సత్యసాయి విస్సా - మంజీరక దేశం

 





మంజీరమ్మ పాద మంజీర జీవభావం!

దివినుండి భువికి మా కొరకు ఉరికిన ఓ గోదారమ్మ చెల్లీ!
మా మంజీరమ్మ తల్లీ! వందనం
రావమ్మా నీ గజ్జెల రవళి
ఘల్లు ఘల్లు మంటూ
జన హృదయాలు జల్లుమనగా
గలగలా పారి సేదతీర్చగ వడి వడిగా సాగి
మా నేతల భగీరథ యత్నాలు రత్నాలు కాగా
సింగూరున ఆగి ఒక్కోక్క చుక్కగా మా గొంతులో జారి
వాగుగా పారి మా తెలంగాణా మాగాణమ్ముల చేరి
వరివై, జొన్నవై, చెరకువై, కూరవై మా ఆహారమై,
పత్తివై మా ఆహార్యమై
మెతుకు సీమ విశ్వానికే బతుకు నిచ్చు సీమగా మార్చి
మమ్ము దీవించు తల్లీ మంజీరమ్మా వందనం!
సతతము నీ పాద మంజీరాలంటిన జీవులం తల్లీ
మా ఊపిరి నీవు మా ఊహవు నీవు
మా ఉనికివి నీవు మా మనికివి నీవు
మా జీవము నీవు మా జవము నీవు మా రాజస రాజీవము నీవు
మా రసరాజం నీవు మా మానసం నీవు మా సాహసం నీవు
మా ఉల్లాసం నీవు మా ఉత్తేజం నీవు
సదా నీ పాద మంజీరాలు అంటి వుండే జీవులం
మమ్ము దీవించు తల్లీ మంజీరమ్మా వందనం!!
మంజీరమ్మ పాద మంజీర జీవభావం!
సత్యసాయి విస్సా - మంజీరక దేశం
(మెదక్‌ జిల్లాలో ఉన్న మంజీర నదిని ఒకప్పుడు ఈ నేలను మంజీరక దేశం పిలిచే వారని చరిత్ర)

Sunday, September 6, 2020

విస్సా ఫౌండేషన్‌ వివాహ సంబధాల ఉచిత సమాచార సేవ!

 శుభ కల్యాణమస్తు!!! 

విస్సా ఫౌండేషన్‌ వివాహ సంబధాల ఉచిత సమాచార సేవ 

1. ఫలనా ప్రాంతం పట్టింపులు ఉంటే స్పష్టంగా తెలియజేయగలరు 

2. శాఖ పట్టింపులు వుంటే వారి శాఖ / ఉప శాఖని ఖచ్చితంగా తెలియజేయగలరు 

3. అబ్బాయి/ అమ్మాయి పూర్తి పేరు:

4. తల్లిదండ్రుల పేర్లు : 

5. పుట్టిన తేదీ :

6. పుట్టిన సమయం :

7. పుట్టిన ప్రదేశం :

8. ప్రస్తుత వివాహ వయస్సు : 

9. నక్షత్రం(పాదంతో) :

10. రాశి :

11. గోత్రం :

12. చదువు :

13. ఉద్యోగ ప్రదేశం :

14. ఉద్యోగం :

15. కోరుకునే భాగస్వామి వివరణ :

16. వయసు వ్యత్యాసం :

17. ఎత్తు వ్యత్యాసం :

18. కోరుకునే ప్రదేశం :

19. శాఖ పట్టింపు :

20. ఫోన్ నెంబర్స్ (1).

                            (2).

21. ఈ-మెయిల్ ఐడి :

22. ఏదైన ఐడి ప్రూఫ్ :

Tuesday, September 1, 2020

"అనేక శత భాండా ని భిన్నాని మమ మస్తకే"

"అనేక శత భాండాని భిన్నాని మమ మస్తకే" దీనికొక కథవుంది.

పూర్వం ఒకగురువు దగ్గర శిషులు చదువుకునేవారు. ఆ గురువుగారి భార్య పరమ గయ్యాళి .గురువునెప్పుడూ తిడుతూ వుండేది. ఇలా గురువుగారిని ఆవిడ తిట్టడం ఒక శిష్యునికి నచ్చలేదు. వాడు గురువు దగ్గరికెళ్లి గురువుగారూ మీరు మహా జ్ఞాని కదా! మీ భార్యని అంత మాత్రం అదుపు చేయలేరా? అని అడిగాడు.ఆయన చిరునవ్వు నవ్వి యిలా అన్నాడు. నీకూ పెళ్ళయితే తెలుస్తుంది లేరా. అన్నాడు. నేనయితేనా దాన్ని నోరుకూడా తెరవనివ్వను.అంత అదుపులో పెట్టుకుంటాను. అని బీరాలు పలికాడు.గురువు సరేలేరా
అలాగే చేద్దువుగానీ నీకు పెళ్లయ్యాక నేను మీ యింటికి వచ్చి చూస్తాను లే. అన్నాడు.
శిష్యుని చదువు పూర్తయ్యాక వాడు గురువుగారివద్ద సెలవుతీసుకొని తన వూరికి వెళ్ళిపోయాడు.
తరువాత పెళ్లి చేసుకున్నాడు. వాడి భార్య గురువుగారి భార్యకన్నా మహా గయ్యాళి.
వాడేమైనా కోప్పడితే వీధిలోకి వెళ్లి గట్టిగా అరిచి గోల చేసేది. దానితో వీధిలోని వాళ్ళముందు శిష్యుడికి తలా కొట్టేసినట్లుండేది. తరువాత ఆమెని ఏమీ అనకుండా ఆమె ఏమన్నా భరించేవాడు.లేకుంటే పరువు తీసేస్తుందని భయం.
ఇదిలా వుండగా ఒకరోజు అతని గురువు గారు రేపు మీ యింటికి వస్తున్నానని కబురు చేశాడు. శిష్యుడి గుండె లో రాయి పడింది. ఎలాగయినా గురువుగారి ముందు పరువు కాపాడుకోవాలనుకొన్నాడు. భార్యాదగ్గరికెళ్ళి ప్రేమగా ఏమే! మా గురువుగారు రేపు భోజనానికి వస్తున్నారు. వంట నేనే చేస్తానులే. నీవు వడ్డించు చాలు దయచేసి నీవు మాత్రం నేనేమన్నా
ఆయన ఉన్నంత సేపూ కాస్త ఎదురు చెప్పకుండా వుండు. అని బ్రతిమాలాడాడు. దానికి ఆవిడ ఏ కళనుందో ఒప్పుకుంది కానీ నీవు నూరు తిట్లు తిట్టేవరకూ మాత్రమే వూరుకుంటాను.
దానిపైన ఒక తిట్టు తిట్టినా సహించేది లేదు అని షరతు పెట్టింది. శిష్యుడు తాను ఒప్పుకుందే చాలునని సంతోష పడిపోయాడు.
మరునాడు గురువుగారు వచ్చారు. శిష్యుడు ఏమే యిలారా!బుద్దుందా? గురువుగారొచ్చారు కాళ్లకు నీళ్లివ్వాలని తెలీదా? నీళ్ళుతీసుకొనిరా అని గద్దించాడు.ఆవిడ మారు మాట్లాడకుండా
నీళ్లు తెచ్చి యిచ్చింది. ఒక తిట్టు తిడుతూ త్వరగా పీట వేసి ఆకు వేసి వడ్డించు అని గద్దించాడు అప్పటినుండీ శిష్యుడు రెచ్చిపోయాడు.సందు దొరికింది కదా అని తిట్ల పురాణం విప్పాడు. ప్రతిదానికీ తప్పు పడుతూ తిడుతున్నాడు.అతని భార్య తెలివైంది నూరు చింతగింజలు పెట్టుకొని ఒక్కోతిట్టుకూ ఒకో గింజ బయటికి విసిరివేస్తూ వుంది.
గురువుగారు భోజనానికి కూర్చున్నారు ఆయనకు చాలా ఆశ్చర్యంగా వుంది.వీడు భార్యను బాగానే అదుపులో పెట్టుకున్నట్టున్నాడు. అనుకుంటూ.ఆవిడ వడ్ఢదించేంతవరకూ
ఏదో ఒకటి అంటూనే వున్నాడు. గురువుగారికి పులుసు మారు వెయ్యవే అంటూ మరో తిట్టు తిట్టాడు. అప్పటికి నూరు తిట్లూ పూర్తయ్యాయి. ఆవిడ కోపంగావేడి వేడి పులుసుకుండ తెచ్చిగురువుగారి నెత్తిన వేసింది. కుండ పగిలి వేడి పుసు గురువు మీద పడింది. ఆయన కేకలువేస్తూ పెరట్లోకి పరిగెత్తి అక్కడి తోటలోని నీళ్లు గుమ్మరించు కున్నాడు.ఆమ్మో మంట,మంట అని అరుస్తూ వున్నాడు.గబగబా లోపలి కి వచ్చి సంచీలోనుండి యింకో పంచె తీసి కట్టుకొని వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు.
అంతలో శిష్యుడి భార్య పరిగెత్తుకుంటూ వచ్చి ఓ అయ్యో అలా వెళ్ళిపోతే ఎలాగయ్యా?
పగిలిపోయిన కుండ డబ్బులిచ్చి మరీ కదులు అని గద్దించింది.అప్పుడు గురువు ఈశ్లోకం చెప్పాడు.
అనేక శతభా౦డాని భిన్నాని మమ మస్తకే
అహో గుణవతీ భార్యా భా౦డ మూల్యం న యాచతే
నా నెత్తిన ఇలాంటి కుండలు వందలు పగిలాయి. కానీ నాభార్య ఎంత గుణవతి ఒకసారికూడా పగిలిన కుండ డబ్బులిమ్మని అడగలేదు.
------------------------ శుభరాత్రి ----------------------

Total Pageviews