Monday, May 4, 2015

శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు ఎందుకు?

శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు  ఎందుకు?

                                   శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు అనేది సంప్రదాయసిద్ధమైన  ఆచారం. అజయోర్ధ్వియోర్మధ్యే నంది శంకర యోరపి అనే  ప్రమాణాన్ని బట్టి మేకపోతుల నడుమ, ద్విజుల నడుమ, నంది శంకరుల నడుమ నడువరాదని అంటారు. ఎందుకంటె శివుడు భాక్తానుగ్రహ తత్పరుడు. నంది శివభక్తులలోఅగ్రగణ్యుడు, శివునికి వాహనమైనవాడు, శివునే పాదపద్మాలను ఎడతెగకుండా నందీశ్వరుడు దర్శిస్తుంటాడు. శంకరుడు గూడా అవిచ్చిన్నంగా భక్తాగ్రగణ్యుడైన  నందీశ్వరుడిపై అనుగ్రహదృష్టిని ప్రసరింపచేస్తుంటాడు. వీరిరువురి మధ్య మానవులు నడిస్తే వారి పరస్పర దృష్టి ప్రసారానికి విచ్చేదం ఏర్పడుతుంది. అందువల్ల ఇరువురికీ అడ్డుతగిలిన వారిపై వారికీ కోపం రావచ్చు. అందుకే  శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు అని పెద్దలు చెపుతారు.

మందాకినీ సలిల చందన చర్చితాయ 
నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ 
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ 
తస్మై మ కారాయ నమః శివాయ!!!  


No comments:

Post a Comment

Total Pageviews