Thursday, May 9, 2019

ప్రాచీన కవుల అపోహలూ --- అనుమానాలూ!

 ప్రాచీన కవుల అపోహలూ --- అనుమానాలూ!

కం: ఆఱింటను ' త' బెట్టిన ,
వారింటను బీనుగెళ్ళు ! వసుమతిలోనన్;

ఎవరి మీద పద్యం చెప్పినా జాగ్రత్తగా ఆలోచించి పద్యం చెప్పాలి. లేకపోతే వారికి చాలా యిబ్బందులే!
ఆఱవ అక్షరంగా 'త 'కారం ఉంచి యెవరిపైనా పద్యం చెప్పరాదు. అలాచెపితే వారింట్లో శవం లేవటం ఖాయం! యిలా యేవో కొన్ని
అపోహలూ అనుమానాలూ నాటికవులలో ఉండేవట! ఇంతకీ ఇవి అనుమానాలేనా? యిలాజరిగిన దాఖలాలున్నాయా? అనేప్రశ్నకు
ఉన్నవని సమాధానంకూడా చెపుతున్నారు. యేవిటా సమాధానం?

పూర్వం వేముల వాడ భీమకవి యనే ఉద్దండ కవియుండేవాడు. ఆయన సంచార శీలి. నిత్యం సంచారంచేస్తూ, ఆయాప్రభువులను పొగడి ద్రవ్య సమార్జన చేసేవాడు. ఆవిధానంగా ఒకరోజు "గుడిమెట్టలంక" గ్రామానికి వచ్చాడు. "పోతరాజు"-
దానిపాలకుడు. ఆతనికి కవులపై సదభిప్రాయం శూన్యం. వారిని బిచ్చగాండ్రుగా చూచేవాడు. పోతరాజు
భీమకవిని ఆదరింపక పోగా అందంగా ఉన్నదని యతనిగుర్రమును బలిమి తో నపహరించి యవమానించాడు. శాపానుగ్రహ దక్షుఁడైన భీమకవి యూరకుండునా? వెంటనే ఆరవ యక్షరముగా త కారమునుంచి-

చ: " హయమది సీత , పోత వసుధాధిపుఁ డారయ రావణుండు , ని
శ్చయముగ నేను రాఘవుఁడ ! సహ్యజ వారిధి , మారుఁడంజనా
ప్రియ తనయుండు , లచ్చన విభీషణుఁ, డా గుడిమెట్టలంక , నా
జయమును ,పోత రక్కసుని జావును , నేఁడవ నాఁడు జూడుడీ ! -- అనేపద్యం చెప్పాడట!

ఆ తరువాత కోపంతో వెళ్ళి ఆగ్రామ సత్రంలో బసచేశాడు. నాటికి ఏడవ నాడు పోతరాజు అకారణంగానే
విరుచుకు పడిపోయాడట. వైద్యుడు పరిశీలించి ఆశలేదని చెప్పాడట! ఆసమయంలో అంతఃపురకాతల రోదనలను వినలేక బుధ్ధిమంతుడైన యతనిమంత్రి దానికి కారణం భీమకవిశాపమేనని భావించి, గ్రామ సత్రమున కేగి యతనిని బ్రతిమాలి మాయేలికను
తిరిగి బ్రతికింపుమని కోరినాడట. దయాస్వభావుడైన భీమకవి కోటకు వచ్చి మరియొక పద్యమును జెప్పి పోతరాజును బ్రతికించినాడట! పోతరాజు తనయపరాధమును క్షమింపగోరి ,కవిని ఘనముగా సన్మానించి పంపినాడట! ఆరెండవ పద్యము యెంతప్రయత్నించినను గుర్తురాకున్నది. మీలో నెవరికైన వచ్చినచో వ్యాఖ్యలలో వ్రాయగలరు.
ఇంతకీ పోతరాజుపై చెప్పిన పద్యంలో ఆఱవ అక్షరం త కారం !చివరి పాదమూ అంతే!
అప్పటినుండి కృతిభర్తపై చెప్పు పద్యములలో ఆఱవ అక్షరంగా త" కారం నిషేధం!
అది మొదటిది. ఇలాంచిదే మరోటి. వింటారా!? సరే !

కం: మగణంబుఁ గదియ రగణము
వగవకఁ గృతిమొదల నిలుపు వానికి 'మరణం
బగు' నిక్కమండ్రు ,మడియడె!
యగునని యిడి దొల్లి టేంకణాదిత్యు డనిన్!

పద్యంలో మగణం తదుపరి 'రగణాన్ని' వాడరాదు. అలా వాడినందువలననే టేంకణాదిత్యుడు యుధ్ధంలో
మరణించాడు. అనిదీని భావం. సారాంశం:- మగణం తరువాత రగణం వాడరాదని. వాడితే వాడికి మూడినట్లే నని సారాంశం.
అలావాడి నష్టపోయిన వారున్నారా? అన్నదిప్రశ్న? లేకేమి? నన్నెచోడ కవి అలావాడి కృతిని నిర్మించాడు. దానిఫలితమే చోళరాజుల యుధ్ధంలో అతడు కనుమూయటం. అన్నది సమాధానం..
---------------------------
నన్నెచోడ కవికి టేంకణాదిత్యుడు అనిబిరుదం. ఆయన పొత్తపి రాజధానిగా కడప మండలమును పాలించాడు.
వీరశైవుడు. కుమారసంభవము ఇతనికృతి. ఇది స్రగ్ధరా వృత్తముతో ప్రారంభమౌతోంది.

శ్రీ వాణీంద్రామరార్పిత మకుటమణి శ్రేణిధామాంఘ్రిపద్మా
జీవోద్యత్కేసరుండాశ్రిత జన లషితాశేష వస్తు ప్రదుం డా
దేవాధీశుండునిత్యోదితుఁడజుడు మహాదేవుఁ డాద్యుండు విశ్వై
కావాసుండెప్పుడున్ మాకభిమతములు ప్రీతాత్ముఁడై యిచ్చుఁ గాతన్!

కుమార సంభవము--మొదటి పద్యము!
ఈపద్యంలో మగణంతరువాత రగణం వస్తోంది. తప్పదు. దానిలక్షణమది!
నన్నెచోడ మరణానికది కారణమని విజ్ఙులమాట! యిందులో కొంత సత్యమున్నదనిపిస్తోంది. తిక్కన గారు మనుమసిధ్ధి
కృతిపతిగా "నిర్వచనోత్తర రామాణాన్ని రచించారు. అందులో మొదటిశ్లోకం స్రగ్ధర. మగణంతరువాత రగణంవేయక తప్పదు. మనుమ సిద్దికూడా ఆతరువాత అక్కన బయ్యనలనే దాయాదుల యుధ్ధంలో మరణించటం జరిగింది.
కాబట్టి యీప్రవాదాలలో కొంత నిజమున్నమాట నిజం!
అందుకే గాబోలు అనంతామాత్యుడు ఛందోదర్పణం లో శుభా శుభ గణాలను సూచించాడు.

ఉ: నవ్య శుభప్రదాయి భగణంబు , జకారము రుక్ప్రదంబగున్ ,
ద్రవ్యము చేయునా ,లయకరంబు సకారము , ఆశుభంబు ఆ
దివ్య సువర్ణకారి , వెత దెచ్చును రేఫ , శుభంబులిచ్చు దా
కావ్యములందు నాదినిడ కర్తకు భర్తకు నంబుజోదరా!

అంటాడు. అందుచేత నవకవులు యువకవులు ఛందో లక్షణాలను చక్కగా ఆకళింపు చేసికొనిపద్యాలువ్రాయటానికి ఉఫక్రమించటం మంచిదేమో?
స్వస్తి!
(శ్రీ సత్యనారాయణచొప్పకట్ల గారి సౌజన్యముతో మరియు ధన్యవాదములతో)
[10:22 PM, 5/6/2019] +91 98852 71166: యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి - 

రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.

1) రథి - ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు -
వీరంతా రథులు.

2) అతి రథి (రథికి 12రెట్లు) -

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు అతిరథులు.

3) మహారథి (అతిరథికి 12రెట్లు) -

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధులు మహారథులు.

4) అతి మహారథి (మహారథికి 12రెట్లు) -

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు - వీరు అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, అటు ఇంద్రజిత్తు - ఇటు ఆంజనేయుడు. రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) -

ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దుర్గా దేవి, గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి, వీరు మహామహారథులు.

మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మంచి విషయం.

No comments:

Post a Comment

Total Pageviews