Thursday, May 5, 2016

అనగనగా ఓ చెరువు కధ!

అనగనగా ఓ చెరువు కధ! అనాదిగా ఊరూరా జీవులకు నోరారా
నీటి కరువు తీర్చిన ఎన్నెన్నో చెరువుల కన్నీటి వ్యధ!!
అదిగో మా ఊరు పినపళ్ళ చెరువుగట్టు
ఆ గట్టున కొలువైన చెట్లు ఎదురుగా ఠీవిగా నాడు
కీ.శే. బచ్చు వీర్రాజు వీర్రాజు గారు నాటిన రావిచెట్టు!...

మరోవైపు రేవు నానుకుని శ్రీ సిద్ది వినాయక ఆలయం!!
దూరంగా మా విస్సా నిలయం!!!
ఎండిన మా వూరి చెరువును ఇలా చూస్తె
నా గుండె చెరువయ్యింది!
మా కుటుంబ సాహితీ మిత్రులు, మా విస్సా ఫౌండేషన్ 'యాత్రా ప్రియమిత్ర' బిరుదాంకితులు శ్రీ కొత్తపల్లి సూర్యనారాయణ గారితో ఒక ఉదయపు నడక ఆమె గర్భంలోకి పయనం. చినుకు కోసం తన గొంతుని వేల నేరలుగా పోరలుగా చీల్చుకుని నీరీక్షిస్తున్న ఆమె లోకి... ఆ చల్లని చెరువు గర్భంలో అనాదిగా నిలిచి మౌన సజీవ సాక్షిగా నిలిచి సగం విరిగిన జలస్తంభం దగ్గరికి చెరువు గర్భంలోకి పయనమయ్యాము. మా నాన్నగారు అనేవారుట ఈ చెరువు మన ఊరు వాస్తుకు అనుకూలంగా లేదు ఇది పూడ్చి మరో చోట తవ్వాలని చోటు కూడా సూచించారట. ఆ వివరాలు ఇతర విషయాలు ముచ్చటించు కుంటూ
దాశరధి గారి "ఆ చల్లని సముద్రగర్భం" పాట గుర్తుచేసుకుంటూ... పాడుకుంటూ ఆమె గర్భంలోకి పయనమయ్యాము. మీకోసం ఆ పాటను మీరూ ఆస్వాదించండి!
పల్లవి : ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడ బానలమెంతో ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరు లెందరో
1. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో
2. మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసిప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
ఉన్మాదుల అకృత్యాలకు ధగ్ధమైన బ్రతుకులు ఎన్నో
3. అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసి పాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవిగుండెలలో వ్రాయబడిన కావ్యాలెన్నో".... అంటూ రాసిన ఆ మహాద్భుత గేయాన్ని తలుచుకుంటూ తవ్వించిన మహనీయులను తలచుకుంటూ మేలుచేసిన మహానుభావులను, భావకవులను నాటి చలం, నేటి వాడ్రేవు చినవీరభద్రుడు వరకూ తలచుకుంటూ నీటి చెంత ప్రభవించిన నాగరికత నీటి ఆనవాళ్ళను చెరిపేస్తూ ...పల్లెల నుండి నగరాలదాక చెరువులు చెరిపేసి వాటిపై భవనాలు కట్టి చినుకు చినుకు ఇంకే చోటు, చెరువులు కానరాక వానలై, వరదలై ఊరును ముంచిన వైనాలు నిన్న మొన్నటి చెన్నై వరకు ఎన్నెన్నో అయినా నీటిని అవసరానికి వాడుకోవడమే తప్ప జలవనరులను రక్షించాలన్న ఇంగిత జ్ఞానం కరవైన మన జన గణం...స్వచ్చందంగా ఇంటింటా ఇంకుడు గుంటలు ఏర్పాటుతో నీటి ని బొట్టు బొట్టుగా చినుకు చినుకును ఒడిసిపట్టి, రాజకీయాలు పక్కన పెట్టి భుజం భుజం కలిపి, నాలాంటి వారు ఇలా చెరువు గర్భం లోకి ఉదయపు నడకకు వెళ్ళకుండా...కబ్జాలకి గురికాకుండా ప్రతివారు ఊరూరా ఉద్యమంగా చెరువుల సంరక్షిస్తే... ఊరూరా చెరువులు తర తరాలకి తరగని జలసిరులతో అలరారుతాయి. అలా జీవనదుల్లా అలలతో అందరినీ అలరించాలని మనసారా కోరుకుంటూ....సత్యసాయి విస్సా ఫౌండేషన్
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Wednesday, May 4, 2016

4) మా తమ్ముడు కల్యాణానికి కళ్యాణి వాహనంలో బయలుదేరడం.

విశ్వవ్యాప్తంగా బంధు మిత్రులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మా తమ్ముడు పెళ్లి పోస్టులు పెట్టడం పెళ్లిపనుల వత్తిడిలో ఆలస్యం అయ్యినందుకు మన్నించాలి.
4) పెళ్లి పనులు పూర్తి చేసుకుని బంధుమిత్రులకు ఇచ్చే వస్త్రాలు, ఇతర కానుకలు, సర్దుకుని, కులదైవం, పెద్దల, పూర్వికుల ఆశీర్వాదాలు తీసుకుని కల్యాణానికి కళ్యాణి వాహనంలో బయలుదేరడం.



















Monday, May 2, 2016

'పీవి' యనగనతడు ప్రియ 'భరత' సుతుడు !...డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ


ఆటవెలది : డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ
'పీవి' యనగనతడు ప్రియ 'భరత' సుతుడు !
'దేశ'దిశను మార్చె దివ్యముగను !
అపర 'తిమ్మరసుగ' 'ఐస్వర్య' బాటేసె
స్వార్ధ మసలులేని సాధు జీవి !
...
కాంగి రేసు వారి కంగారు పనులకు ,
తొంద రొద్ద నుచును తోడు వుండి !
పథక రచన చేసి పాలన సరిజేసి ,
వెనుక యుండి కాసె వెన్ను లాగు !

జాతిరత్న మయిన చాణుక్యుడతనేను !
కుటిల రాజకీయ కూటమందు ,
జటిల చిక్కులెన్నొ సరిజేసి మురిపించి
మట్టి యంట నట్టి మాన్య జీవి !


ఆటవెలది : ఆధునిక భారత గతిని అమోఘమైన రీతిలో తీర్చి దిద్ది , రాబోయే తరాలకు బంగారు బాట వేసి ' చాణక్యుని అర్ధ శాస్త్రాన్ని ఆచరించి చూపిన అపర తిమ్మరుసు మన 'పీవీ నరసింహారావు గారు .. వారి ఋణం ఈ జాతి ఎన్నటికీ తీర్చుకోలేదు .
దారిద్ర్యాంధకారం లో మ్రగ్గుతోన్న దేశానికి దిశను మార్చి' బంగారు ' భవిష్యత్తును ప్రసాదించిన , మాన్యులు శ్రీ పీవీ నరసింహా రావు గారి కి , వారు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలకు ' 25' సంవత్సరాలు పూర్తైన సందర్భంలో పాదాభివందన ములతో ....డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ

Tuesday, April 19, 2016

3) విఘ్నేశ్వరునికి మీదు కట్టడం


విఘ్నేశ్వరునికి మీదు కట్టడం 
అమ్మాయి/ అబ్బాయికిపెళ్ళి కుదిరి తాంబూలాలు పుచ్చుకోగానే, ముహూర్తం పెట్టించుకోగానే మొదట చేసేపని విఘ్నేశ్వరునికి మీదు కట్టడం.
మీదుకట్టడం ఎలా, ఇది ఆడవారు, సాధారణంగా తల్లి కడుతుంది. ఇంట్లో పెద్దలుంటే కట్టిస్తారు,మంగళవారం, శుక్రవారం కాకుండా మంచిరోజు చూసుకుని, కనీసం ముగ్గురు పేరంటాండ్రని పిలిచి, పసుపు వినాయకుని చేసి, పూజించి, ఒక ఎర్రటి జాకట్ ముక్కలో ఐదు సోలల బియ్యం పోసి అందులో ఒక బెల్లం ముక్క వేసి ఉంచి, తిరగలి వేసి, దానికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి,శనగలు తీసుకుని దానిలో విసరాలి,వచ్చిన ముత్తయిదువుల చేత విసిరించి, వాటిని వేరుగా పొట్లం కట్టి, ఈ ఎర్ర గుడ్డలో పెట్టి, పసుపు వినాయకుడిని కూడా ఆ మూటలో పెట్టి గుడ్డని మూట లా కట్టి, లోపల బీరువాలో భద్రం చేస్తారు. దీనిని మీదు కట్టడం అంటారు. వినాయకుని, స్వామీ! ఈ కార్యక్రమం సాఫీగా అయ్యేలా అనుగ్రహించు, అని చెప్పి చేసేది. మరొక రకంగా చెప్పాలంటే, పాత రోజులలో ఇరుగుపొరుగువారికి పెళ్ళి పనులు మొదలుపెట్టినట్లు చెప్పడమే. మీదు కట్టే దాకా పెళ్ళికి సంబంధించిన పనులు చేయరు, బంగారు వస్తువులు చేయించడం సహా.మొత్తం కార్యక్రమం పూర్తయిన తరవాత ఈ మీదుకట్టిన మూట తీసి, బియ్యం విసిరి,శనగపప్పును అందులో వేసి ఉండ్రాళ్ళు చేసి వినాయకునికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా స్వీకరిస్తాం. పెళ్ళికి ఈ కార్యక్రమం పదహారురోజుల పండుగనాడు చేస్తాం. ( పెళ్ళయిన పదహారవ రోజు పండగ చేసుకుంటాం ) సాధారణంగా ఊరిలో పిలుపులు కార్యక్రమం ఈ రోజు పెట్టుకుంటారు, కష్టేఫలి శర్మగారి సౌజన్యంతో-పెళ్ళిభోజనం మృష్టాన్న భోజనం: సాధారణంగా పెళ్ళీడుకొచ్చిన ఆడ, మగ పిల్లల్ని పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తారు అని పెద్దవారు సరదాగా అడుగుతారు పెళ్ళిభోజనం అంటే పప్పన్నం మాత్రమె కాదండోయ్! రుచికరమైన తియ్యని పదార్థములతో కూడిన మంచి భోజనము. తృప్తికరమైన భోజనము. అని నిఘంటువులు చెప్తున్నాయి. మరికి పెళ్ళికి వచ్చే మీ వంటి ఆత్మీయ అతిధులకు మరి అటువంటి భోజనం ఎలా వండాలి, వడ్డించాలి వంట బ్రాహ్మల, క్యాటరింగ్ వారితో సంప్రదింపులు. మా ఇంట ఆ సందడి చిత్రాలు. మీరూ ఆస్వాదించండి. సందర్భం వచ్చింది కాబట్టి మనలో మనమాట ఈ రోజుల్లో పెళ్ళిభోజనం పేరు చెప్పి వందలాది ఆహార పదార్ధాలు, ఇండియన్, కాంటినెంటల్ అంటూ ఎన్నెన్నో స్టాల్ల్స్ పెట్టి ప్లేట్ ఒక్కింటికీ 100 రూపాయల నించి 1000 రూపాయల ఖర్చు పెట్టడం అవసరమా? ఆయన 100 రకాల ఆహార పదార్ధాలు పెట్టాడు కాబట్టి మనం 150 పదార్ధాలు పెడదాం అంటూ పోటా పోటీగా ఒక వేలం వెర్రి వ్యవహారం లా తయారయ్యింది ఇదంతా క్యాటరింగ్ వారు బాగు కోసం తప్ప నిజంగా ఆనాడు తినే సామర్ధ్యం ఈనాటి మనకు ఉందా చెప్పండి ఎందుకంత దుబారా? ఆహారపదార్ధాలు సగం తిని పారవేయడం, మిగిలిపోవడం ఎంత బాధగా ఉంటుంది. అవసరమైన మేరకు సంప్రదాయక నవకాయ పిండివంటలతో అరటి ఆకులలో భోజనం ఎంత తృప్తిగా ఉంటుంది. ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు, ఎంత పర్యావరణానికి హాని కలిగిస్తున్నాము. ఆలోచించండి. ఆ అనవసర ఖర్చు తగ్గించుకుని వధూవరుల పేరిట ఏ అనాధ శరణాలయం లోనో వృద్ధాశ్రమాల లోనో లేదా పేదలకి, అన్నార్తులకు పెడితే పుణ్యం పురుషార్ధం! ఒకవేళ మిగిలిపోయిన పదార్ధాలని సేవా భావంతో అన్నార్తులకు అందించే సంస్థలు ఇటీవల ఎన్నో వస్తున్నాయి వారి ఫోన్ నంబర్లు మనం సేకరించి, మనం వెళ్ళే కళ్యాణ మంటపాల్లో వాటి గురించి ప్రచారం చేస్తే మనకు కూడా ఎంతో తృప్తి ఉంటుంది అందుకే కదా మన పెద్దలు అన్నారు పెట్టక పోయినా పెట్టె ఇల్లు చూపించమని! విజ్ఞతతో ఆలోచిద్దాం! మానవత్వంతో ప్రతిస్పందిద్దాం! ధన్యవాదాలతో,
సత్యసాయి - విస్సా ఫౌండేషన్!






Total Pageviews