Wednesday, August 12, 2020

పెరింటింగ్ సూత్రం నెంబర్ 1 Ramadevi Telugu one

 పెరింటింగ్ సూత్రం నెంబర్ 1

" పిల్లల ల కి ఎలాంటి షరతులు లేకుండా తోడుగా నిలబడాలి. వాళ్ళు ఏమి నేర్చుకోవాలో చెప్పటం కాదు అనుభవం లోకి వచ్చేలా చేయండి."
నాన్న,అమ్మ ఈ విషయాన్ని ఎలా పాటించారో చెప్పే రెండు సంఘటనలు ఈ రోజు పంచుకుంటున్నా.
పేరెంటింగ్ గురించి,పిల్లలకి మంచి చెడు నేర్పించటం గురించి ఎవరన్నా చెబుతుంటే వెంటనే అమ్మా,నాన్న గుర్తువస్తారు. వాళ్ళ తో పాటు పెదనాన్నలు, మేనత్తలు,పిన్నులు ,ఎందుకంటే ఇలా మన రక్తసంబంధీకులు ఎందరో మనల్ని,మన ఆలోచనల్ని ఎంతో ప్రభావితం చేస్తారు.ఈ రోజు మనం ఏంటి అని ఒకసారి చూసుకుంటే అందులో ఎందరో కనిపిస్తారు. వాళ్ళని చూసి మనం ఆకళింపు చేసుకున్న ఎన్నో విషయాలు ని పోలికలుగా చెబుతారు అనిపిస్తుంది నాకు. మా పిల్లలు కి నా చిన్న తనం గురించి, మా వాళ్ళ గురించి కథలుగా వినటం ఇష్టం.అలా వాళ్ళకి చెబుతూ ఆ చిన్నతనం లోకి ఎన్నో సార్లు వెళ్లి వచ్చాను. అలా చిన్నతనాన్ని చూసుకున్నప్పుడల్లా ఒక నలభయ్యేళ్ళ క్రితం ఒక జీవితాన్ని రూపుదిద్దటాని కి ఎంత మంది శిల్పులు ప్రయత్నించారో కదా అనిపిస్తుంది. అప్పుడు నా బాధ్యత ఏంటో కూడా తెలుస్తోంది.
ఒక్కసారిగా అమ్మమ్మ,బామ్మ ,పెద్దనాన్న,పెద్దత్త,చిన్నత్త ఇలా అందరూ నా కళ్ళముందుకు వచ్చేస్తున్నారు రాయటం మొదలు పెట్టగానే.అందరికంటే ముందు నాన్న గురించి చెప్పాలి.ఎందుకంటే ఈ రోజు నేను ఏంటి అన్నదానికి నాన్న విత్తనం నాటి నీళ్లు పోసి జాగర్తగా పెంచి పెద్దచేశారు.అమ్మ అందుకే అంటుంది ఎంతయినా నువ్వు నాన్న కూతురువి అని.అమ్మ ఎంత నమ్మినా,సపోర్ట్ చేసినా,అసలు అమ్మ ఏం చేసినా అమ్మేకదా చేయాలి, ఇంక అమ్మ గురించి చెప్పేది ఏముంటుంది చెప్పండి.
నాకు బాగా గుర్తువుండి,నన్ను ఎంతో ప్రభావితం చేసిన కొన్ని సంఘటనలు చెబుతాను.
వాటన్నిటి కంటే ముందు ఈ రోజు నాకు అత్యంత ఇష్టమయిన జ్ఞాపకం,ఎప్పుడు తలచుకున్నా కళ్ళలో నీళ్లు వచ్చి,గర్వం గా అనిపించే ఒక సంఘటన చెబుతాను.పని ని ఎంత ప్రేమించాలో నాన్న చెప్పకుండా చెప్పారు ఆ ఒక్క సంఘటన తో.
మాది సింహాచలం. అమ్మాయి పదవతరగతి కూడా పూర్తి చేయకుండానే పెళ్లి చేసే అలవాటు వున్న కుటుంబం లో LAW చదవటం అనేది ఎలా జరిగిందో ఇంకోసారి చెబుతాను. అలాంటిది అమ్మాయి ఉద్యోగం అన్న విషయం లో ఎన్ని కట్టుబాట్లు ఉండాలి ?
నేను ALL INDIA RADIO లో యువవాణి కార్యక్రమాన్ని నిర్వహించేదాన్ని. అనౌన్సర్ గా. ఆ కార్యక్రమం సాయంత్రం 5.30 నుంచి ఒక గంట ఉండేది. నెల మొదట్లో నే మాకు కాంట్రాక్ట్ ఫార్మ్స్ పంపుతారు ఆ నెలలో మా డ్యూటీ ఎప్పుడెప్పుడు అన్న తేదీ వివరాల తో . మేము సంతకం పెట్టి ఇచ్చాకా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు టైం కి వెళ్లి షో చేయాలి. అలా ఒకసారి నా డ్యూటీ దీపావళి రోజు పడింది. నేను సంతకం పెట్టేటప్పుడు దీపావళి రోజు డ్యూటీ అని చూసుకోకుండా పెట్టేసాను. దీపావళి రోజు సింహాచలం నుంచి విశాఖపట్నం లో వున్న రేడియో స్టేషన్ కి వెళ్ళాలి, అదీ సాయంత్రం అందరూ దీపాలు పెట్టి, టపాసులు కాల్చే టైం లో. బస్సు దిగి రేడియో స్టేషన్ కి ఒక పావుగంట నడవాలి. ఇంటి నుంచి బస్టేషన్ కి కూడా పావుగంట నడక.
నాన్న కి మధ్యాహ్నం డ్యూటీ. కంపెనీ కి వెళ్లిపోతున్నారు.నేను ఎలా వెళ్లాలా అని తర్జన భర్జన పడుతున్నా, నాన్న వెళుతూ పెద్దనాన్న గారి కి చెప్పాను, నీకు తోడు వస్తారు, ఆటో కి చెప్పాను వస్తుంది, నీ షో అయ్యేదాకా ఉండి తీసుకువస్తాడు అన్నారు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే , ఒక్కమాట అనలేదు నాన్న చూసుకోవద్దా సంతకం పెట్టే ముందు,?ఎలా వెళతావు అని?కామ్ గా అన్ని అరెంజ్ చేసేసారు. ఆటో లో పంపించటం ఏంటి అంత గొప్పవిషయం అంటారా? నేను డ్యూటీ చేస్తే వ చ్చేది 150/- లు, ఆటో కి అటూ,ఇటూ అంత సేపు వెయిట్ చేయటానికి అంత కంటే ఎక్కువే తీసుకున్నాడు.
అదీ ఒక 27 ఏళ్ళ క్రితం ఆటో ఎక్కటం అనేది చాలా , చాలా అపురూపం అయిన రోజుల్లో. ఇవన్నీ కాదు కానీ పెద్ద పెద్దనాన్న గారు డెబ్బయి ఏళ్ల వయసులో నాకోసం ఆటో లో నాకు తోడుగా వచ్చి, నేను లోపల కార్యక్రమం చేస్తున్నంత సేపు బయట వెయిటింగ్ హాల్ లో కూర్చోవటం. నా పని కి నాన్న, పెద్దనాన్న ఎంత విలువ ఇచ్చారో తెలిసాక ఇంక నేను చేసే పనిని ప్రేమించకుండా ఎలా ఉండగలను.
తిరిగి వస్తుంటే ఇళ్ల ముందు వెలుగుతున్న దీపాలు, ఆకాశం లో విరుస్తున్న వెలుగులు ని మించి నా లోపల వెలుగు కు విరిశాయి. పెద్ద నాన్న తో ఇబ్బంది అయ్యిందా అంటే "మా ఇంటి సరస్వతి దేవి వి ,..నువ్వు ఏమి చేసినా గర్వమ్ గా ఉంటుంది. రేడియో లో నీ గొంతు ఎంత మంది విని వుంటారో కదా! అన్నారు.
నాన్న ఆ తర్వాత ఒక్కసారన్నా ఆ విషయం గురించి మాట్లాడలేదు. ''పని లో డబ్బు ఎంత వస్తుంది అని కాదు, నువ్వు దానిని ఎంత భక్తి తో చేస్తావు, ఎంత ఆనందాన్ని పొందుతావు అన్నది ముఖ్యం ' ' నాన్న ఎప్పుడూ చెప్పే మాట ఇదే. పని నుంచి ఆనందాన్ని పొందాలంటే దాన్ని ఇష్టం గా చేయాలి. అది ఎంత కష్టం గా వున్నా. నాన్న ఈ సూత్రాన్ని నాకు అలా నేర్పించారు.
పెద్దనాన్న ఇప్పటికీ ఎక్కడినుంచో నన్ను చూస్తూనే వుంటారు, నా విజయాల కి ఆనందపడుతూనే వుంటారు.రేడియో అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికి ,అందుకు ఈ సంఘటన కూడా ఒక కారణం. నాన్న, అమ్మా నా రేడియో కార్యక్రమాలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో చెప్పటానికి ఇంకో ఉదాహరణ వుంది .
ఒకసారి అనుకోకుండా పెళ్లి చూపులకి అని ఎవరో వస్తే ఒక అరగంట తర్వాత అమ్మ వాళ్ళ తో నేరుగా చెప్పేసింది. మీరు వస్తారని ముందుగా తెలియదు కదా, అమ్మాయి రేడియో లో చేస్తోంది. ఇప్పుడు వెళ్ళాలి ఏమి అనుకోకండి అని. పెద్దత్త కూడా వత్తాసు పలికింది. అంతే పెళ్ళివాళ్ళు కాఫీ లు తాగుతుండగా నేను పట్టుచీరతో బస్సు స్టాండ్ కి బయలు దేరా. వాళ్ళ మొహాల్లో కనిపించిన ఆశ్చర్యం, మా వాళ్ళందరి మొహాల్లో కనిపించిన ఆనందం అస్సలు మర్చి పోలేను ఎప్పటికి. ఇలా రోజు కి ఒక జ్ఞాపకం. కథలు మన జీవితాల్లోనే ఎన్ని వుంటాయో చూసుకోవాలి గాని .

108 ప్రశ్నలు –జవాబులతో.💐💐 రామాయణం

 108 ప్రశ్నలు –జవాబులతో.💐💐


రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి...

🙏✍💐🏹


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?

= వాల్మీకి.


2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?

= నారదుడు.


3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?

= తమసా నది.


4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?

=24,000.


5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?

=కుశలవులు.


6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

=సరయూ నది.


7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?

=కోసల రాజ్యం.


8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?

=సుమంత్రుడు.


9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?

=కౌసల్య, సుమిత్ర, కైకేయి.


10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?

=పుత్రకామేష్ఠి.


11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?

= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.


12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?

=జాంబవంతుడు.


13. వాలి ఎవరి అంశతో జన్మించెను?

= దేవేంద్రుడు.


14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?

=హనుమంతుడు.


15. కౌసల్య కుమారుని పేరేమిటి?

=శ్రీరాముడు.


16. భరతుని తల్లి పేరేమిటి?

=కైకేయి.


17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?

=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.


18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?

=వసిష్ఠుడు.


19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?

=12 సంవత్సరములు.


20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?

=మారీచ, సుబాహులు.


21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?

=బల-అతిబల.


22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?

=సిద్ధాశ్రమం.


23. తాటక భర్త పేరేమిటి?

=సుందుడు.


24. తాటకను శపించిన మహర్షి ఎవరు?

=అగస్త్యుడు.


25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?

=భగీరథుడు.


26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?

=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.


27. అహల్య భర్త ఎవరు?

=గౌతమ మహర్షి.


28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?

=శతానందుడు.


29. సీత ఎవరికి జన్మించెను?

=నాగటి చాలున జనకునికి దొరికెను.


30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?

=దేవరాతుడు.


31. శివధనుస్సును తయారు చేసినదెవరు?

=విశ్వకర్మ.


32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?

=మాండవి, శృతకీర్తి.


33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?

=జనకుడు.


34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?

=కుశధ్వజుడు.


35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?

=వైష్ణవ ధనుస్సు.


36. భరతుని మేనమామ పేరు ఏమిటి?

=యధాజిత్తు.


37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?

=మంధర.


38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?

=గిరివ్రజపురం, మేనమామ యింట.


39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?

=శృంగిబేరపురం.


40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?

=గారచెట్టు.


41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?

=భారద్వాజ ముని.


42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?

=మాల్యవతీ.


43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?

=తైలద్రోణములో.


44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?

=జాబాలి.


45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?

=నందిగ్రామము.


46. అత్రిమహాముని భార్య ఎవరు?

=అనసూయ.


47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?

=విరాధుడు.


48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?

=అగస్త్యుడు.


49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?

=గోదావరి.


50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?

=శూర్ఫణఖ.


51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?

=జనస్థానము.


52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?

=మారీచుడు.


53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?

=బంగారులేడి.


54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?

=జటాయువు.


55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?

=దక్షిణపు దిక్కు.


56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?

=కబంధుని.


57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?

=మతంగ వనం, పంపానదీ.


58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?

=ఋష్యమూక పర్వతం.


59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?

=హనుమంతుడు.


60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?

=అగ్ని సాక్షిగా.


61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?

=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.


62. సుగ్రీవుని భార్య పేరు?

=రుమ.


63. వాలి భార్యపేరు?

=తార.


64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?

=కిష్కింధ.


65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?

=మాయావి.


66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?

=దుందుభి.


67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?

=మతంగముని.


68. వాలి కుమారుని పేరేమిటి?

=అంగదుడు.


69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?

=ఏడు.


70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?

=ప్రసవణగిరి.


71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=వినతుడు.


72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=అంగదుడు.


73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?

=మామగారు, తార తండ్రి.


74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=శతబలుడు.


75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?

=మాసం (ఒక నెల).


76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?

=దక్షిణ దిక్కు.


77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?

=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.


78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?

=స్వయంప్రభ.


79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?

=సంపాతి.


80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?

=పుంజికస్థల.


81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?

=మహేంద్రపర్వతము.


82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?

=మైనాకుడు.


83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?

=సురస.


84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?

=సింహిక.


85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?

=నూరు యోజనములు.


86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?

=లంబ పర్వతం.


87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?

=అశోక వనం.


88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?

=రెండు.


89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?

=త్రిజట.


90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?

=రామ కథ.


91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?

=చూడామణి.


92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?

=ఎనభై వేలమంది.


93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?

=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.


94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?

=విభీషణుడు.


95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?

=మధువనం.


96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?

=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.


97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?

=ఆలింగన సౌభాగ్యం.


98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?

=నీలుడు.


99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?

=నికుంభిల.


100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?

=అగస్త్యుడు.


101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?

=ఇంద్రుడు.


102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?

=మాతలి.


103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?

=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!


104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?

=హనుమంతుడు.


105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?

=శత్రుంజయం.


106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?

=స్వయంగా తన భవనమునే యిచ్చెను.


107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?

=బ్రహ్మ.


108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?

=తన మెడలోని ముత్యాలహారం.


శ్రీ రామ జయం!

🙏👍✍🏹 🙏🙏 మీ శ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌹🙏🌹

Tuesday, August 11, 2020

ఎన్నాళ్ళయిందో..కరోనా ఎంత పని చేసావే..

 ఎన్నాళ్ళయిందో..


ఇంటికి పెళ్లి కార్డు వచ్చి..

సినిమాకెళ్ళి..

బంతి భోజనం తిని..

అమ్మలతో కలిసి భుజాన బస్తా బాగులతో బడికెళ్తున్న 

పిల్లల్ని చూసి..

కిటకిటలాడే బస్సుల్లో 

ఫుట్ బోర్డు పట్టుకు వేలాడే కుర్రకారును తిట్టి..

వీధి చివర బడి

గంట విని..

రైల్వేస్టేషన్లలో అనౌన్స్మెంట్ ఆలకించి..

కవి సమ్మేళనంలో 

మంచి కవిత వినిపించి..

పేరంటానికెళ్తున్న అమ్మలక్కల

అలంకారాలు గని..

టివిలో క్రికెట్ మాచ్ తిలకించి..

మంచి కబురు విని పులకించి..

మిత్రుడు కనిపిస్తే 

మనసారా కౌగలించుకుని..

రాత్రి పొద్దుపోయే దాకా 

జంక్షన్లో అసుక్కొట్టి..

హోటల్ కెళ్ళి విందారగించి.

పార్కుకు పోయి..

బహిరంగ సభ కవర్ చేసి..

షేక్ హాండిచ్చి..

రైల్లో కంపుకొట్టే టాయిలెట్ కు 

ముక్కు మూసుకుని 

వెళ్లి వచ్చి..

ఆకశాన రివ్వున ఎగిరెళ్లే విమానాన్ని చూసి అబ్బురపడి..

ఊరేగింపు కనబడి..

నినాదాలు వినపడి..

రోడ్ల మీద వేషాలు తిరిగి..

గ్రూప్ ఫోటో దిగి..

బడ్డికొట్లో టీ తాగి..

అంతెందుకు తనివితీరా తుమ్మి

బాధ తీరేలా దగ్గి..

ఎన్నాళ్ళయిందో..


అప్పుడెప్పుడో నాన్న పోయారు

రక్తం పంచుకుని పుట్టినోళ్ళం

ఒకరినొకరం గట్టిగా పట్టుకుని

మనస్ఫూర్తిగా ఏడ్చాం..

కష్టమే అయినా పంచుకున్నాం

గుండె బరువు దింపుకున్నాం..

మొన్న అమ్మెళ్ళిపోయింది

కొందరు రాలేకపోయారు

ఉన్నోళ్ళం భయం భయంగా

దూరం దూరంగా

భారం భారంగా..

ఖచ్చితంగా చెప్పాలంటే

ఘోరం ఘోరంగా..

ఓదార్చే స్పర్శ..

కన్నీరు తుడిచే చేయి లేవు..

పంటి బిగువున బాధ..

గుండె పట్టేసింది..

భోరున ఏడ్చే 

పరిస్థితి లేని దుస్థితి..

కష్టం చూసి కాష్టానికి

వచ్చినోళ్లే లేరు..

ఆ నలుగురూ 

దొరకడమే దుర్లభం..

ఏమి ప్రారబ్ధం..

భరించలేని నిశ్శబ్దం..


కరోనా ఎంత పని చేసావే..

సంఘజీవిని ఒంటరిని చేసి

లొంగదీసావ్..

ఆపై కృంగదీశావ్..

గత అయిదు నెలలుగా 

ఎక్కడ విన్నా 

నీ మాటే..

నీ కాటే..

పాజిటివ్..నెగిటివ్..

టెస్టులు..రెస్టులు..

క్వారెంటైన్లు..ఐసొలేషన్లు..

ఆంబులెన్సు మోతలు..

పోలీసు లాఠీల వాతలు..

లెక్కల కోతలు..

సమ సమాజం..శ్రమ సమాజం

భ్రమ సమాజమై..

చావు అసహజమై..

భయం నిజమై..

బ్రతుకు బరువై..

మనశ్శాంతి కరువై..

గుండె చెరువై..

మృత్యువు చేరువై..

సామాజిక దూరం..

వెంటరానితనం..

అలవాటై..

జీవితమే గ్రహపాటై..

సాటి మనిషిని 

కలవడమే పొరపాటై..

ఇల్లే ఖైదై..

బ్రతుకు చేదై..


సరేలే..

ఎన్నాళ్లులే నీ విలయం..

ఈ జగమే దేవాలయం..

గంట మోగదా..

పంట పండదా..

మంట రేగదా..

నీ ఆయువు మూడదా..

జగతిన మళ్లీ 

తొలి పొద్దు పొడవదా..

మానవజాతి మరో విజయగీతిక ఆలపించదా..!

Saturday, August 8, 2020

హరి జయ ప్రియ ప్రాణేష తల్లీ నా అభిమాన నీరాజనం!

అమ్మా చక్కని నీ అభినయానికి నా అభిమాన నీరాజనం  

హరి జయ ప్రియ ప్రాణేష తల్లీ  https://www.youtube.com/channel/UCF74NeHr_Y5HrKQqSk5oFYA

ఆ రసమయ కాంతిధారలొ కరిగి 

మంజుల మధుకర సుధారస ధారలో పొంగి 

ఆ నయన చంద్రోదయ కలువల సోయగాల వలలో 

మధుమాస దరహాస సుమశరాలలొ చిక్కి 

ఇలా నాట్య కళాకారిణుల కాలి మువ్వగా మారి 

ఆ చరణ మంజీరాల రవంలో చేరితే నా జన్మ ధన్యం! 

Tuesday, August 4, 2020

వంగపండు

చాలా ఏళ్ళ కిందటి సంగతి. నేను రాజమండ్రిలో పనిచేస్తున్నప్పటి రోజులు. అప్పట్లో బెంగాల్ నుంచి ఒక విప్లవరచయితల బృందమొకటి ఏ కారణం చాతనో రాజమండ్రిలో కొన్నాళ్ళున్నారు. బహుశా తలదాచుకున్నారేమో, తెలీదు, కాని అట్లాంటి బృందమొకటి అక్కడికి వచ్చినట్టు మా మిత్రులకి ఎట్లా తెలిసిందో ఏమోగానీ, వాళ్ళని పోయి కలిసారు. ఆ తర్వాత చాలా రోజులు రాత్రిపూట సాహిత్య చర్చలు జరుగుతుండేవి. ఒకసారి అట్లాంటి గోష్టికి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వాళ్ళని చూడగానే వాళ్ళతో ఎట్లా మాటలు కలపాలా అని ఆలోచించి, వాళ్ళు విప్లకవులు కాబట్టి, టాగోర్ గురించి ప్రస్తావించి లాభం లేదనుకుని, నజ్రుల్ ఇస్లాం గురించి నాకు తెలిసిందేదో చెప్పబోయాను. ఊరు కాని ఊళ్ళో, తమ భాష కాని భాషమాట్లాడేవాళ్ళ మధ్య తమ కవి గురించిన ప్రస్తావన వచ్చినందుకు వాళ్ళల్లో ఆశ్చర్యంగాని, సంతోషంగానీ ఏమీ కనిపించలేదు. నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలూ చెప్పేదాకా ఆగి, ఆ బృందనాయకుడు అన్నాడు కదా ' నజ్రుల్ ఏనాటి మాట! ఈ మధ్య మేమొక గీతం విన్నాం. ఆ కవి ఎవ్వరో తెలీదు, ఏ భాషకి చెందిన కవినో తెలీదు, కాని ఎట్లాంటి కవిత! కవిత రాస్తే అలా ఉండాలి! అట్లాంటి కవిత బెంగాలీలో పుట్టాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ' అంటో ఒక కవిత బెంగాలీలో వినిపించాడు. ఆ కవిత వింటోనే నాలో ముందేదో జ్ఞప్తిలో కదలాడి, ఆ పైన తెలియని ఒక ఉద్విగ్నత ఒళ్ళంతా విద్యుచ్ఛక్తిలాగా కదలాడింది. 

'కష్ట జీవులం, మేం కమ్యూనిష్టులం
ఎవరన్నా ఏమన్నా అదే ఇష్టులం.'

అనిసెట్టి సుబ్బారావు గేయం. 

తెలుగులో ఆ గీతాన్ని చాలామంది చదివి ఉండవచ్చుగానీ, నజ్రుల్ ఇస్లాం ని కూడా మరిపించేతంటటి సముజ్జ్వల గీతంగా దాన్ని కీర్తించే వారుంటారని ఊహించి ఉండరు.

బహుశా నేడు అనేక భారతీయ భాషా సాహిత్యాల్లో, పీడిత ప్రజలు పోరు బాట పట్టక తప్పని ప్రతి చోటా, వంగపండు ప్రసాద రావు అటువంటి కవిగా గుర్తింపబడుతూ ఉండవచ్చు. మనిషి ఒక పాటగా మారే అత్యంత అపురూపమైన సామాజిక సందర్భం మన కళ్ళముందే సంభవిస్తున్నా కూడా వంగపండుని ఒక ప్రజాగాయకుడని పేర్కోడాన్ని మించి మనం  అతడికీ, అతడి పాటకీ ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండానే ఇన్నాళ్ళూ గడిపేసాం.

మామూలుగా ఒక కవి మన మధ్యనుంచి నిష్క్రమించిన తర్వాతనే మనం మన రాగద్వేషాల్నీ, ఉదాసీనతనీ విడిచిపెట్టి, అతడి కవిత్వ మూల్యాంకనం మొదలుపెడతాం కాబట్టి, బహుశా ఇవాల్టినుంచీ వంగపండు కవిత్వం గురించిన నిజమైన అంచనా మొదలవుతుందని ఆశిద్దాం. ఉదాహరణకి, అతడి పేరు తలవగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే, 'ఏం పిల్లో ఎల్దమొస్తవా, ఏం పిల్లడో ఎళ్దుమొస్తవా 'అన్న పాటనే తీసుకోండి. దేశంలోనూ, ప్రపంచంలోనూ సంభవిస్తున్న అన్నిరకాల  పోరాటాల్నీ ఒక్కచోట, ఒక్కసారిగా తలుచుకోవడం కోసం తానా గీతం కూర్చానని చెప్పుకున్నాడాయన. అంటే ఒక విధంగా 1950 ల తర్వాతి దేశ చరిత్ర అంతా ఆ పాటలో ఉంది. కాని ఆ పాట మీద ఒక సవివరమైన విశ్లేషణ, వ్యాఖ్యానం ఏదీ కూడా ఇప్పటిదాకా ఎక్కడా ఎవరూ రాసినట్టు నేను చూడలేదు. 

ఉత్తరాంధ్రలో వినవచ్చే ఒక జానపద బాణీని ఆధునీకరిస్తూ తానా గీతం కట్టానని ఆయన చెప్పాడు. ఆ జానపద గీతాన్ని ఆయన ఏ విధంగా ఆధునీకరించాడు, దాని జానపద, ప్రజారంజక లక్షణాల్ని ఏ మేరకు నిలిపాడు, ఏ మేరకు ఆ రంజకత్వంలోని వైయక్తిక, గ్రామీణ అంశాల స్థానంలో సామూహిక, చారిత్రిక అంశాల్ని చొప్పించాడు, అందుకు ఆయన ఎటువంటి నిర్మాణ వ్యూహాలు అనుసరించాడు, గాయకుడిగా సరే, జననాట్యమండలి కళాకారుడిగా సరే, అసలు ఒక కవిగా, శిల్పిగా ఆయన ఆ గీతరచనలో కనపరిచిన మౌలికమైన ప్రజ్ఞ ఏమిటి అన్నదాని మీద ఎంత చర్చ జరిగి ఉండాలి ఇప్పటిదాకా!

బహుశా ప్రపంచంలోని మరేదో భూభాగం నుంచి, ఒక సైప్రస్ నుంచో, ఒక క్రొయేషియో నుంచో, ఒక కాంగో నుంచో, ఒక శ్రీలంకనుంచో ఎవరో ఒక సాహిత్య విద్యార్థి ఈ అంశం మీద సమగ్రంగా పరిశోధన చేసి మనకి చెప్పేదాకా మనం ఈ పాటని కూడా చాలా సినిమా పాటల్లో ఒకటిగా వింటో విన్నంతసేపూ పులకిస్తో, విన్నాక పక్కన పెట్టేస్తో ఉంటాం.

వంగపండు రాసిన ప్రతి పాట మీదా, ఆ మాటకొస్తే గద్దర్ రాసిన ప్రతి పాట మీదా కూడా ఇట్లాంటి విశ్లేషణా, విమర్శా రావాలని కోరుకుంటాను. వారు రాసిన కొన్ని పాటల పల్లవులు విన్నప్పుడు, మహనీయులైన పూర్వ వాగ్గేయకారుల పల్లవులు విన్నప్పటిలానే నిశ్చేష్టుణ్ణవుతూ ఉంటాను. పాటకి పల్లవి ప్రాణం అని ఊరికే అనలేదు. పల్లవి అంటే ఒక కవి గుండె తెరుచుకునే చప్పుడు. కొన్నిసార్లు అతడి గుండె బద్దలయ్యే చప్పుడు కూడా.

'నిధి చాలా సుఖమా, రాముని స
న్నిధి సుఖమా '

అనే పల్లవి త్యాగరాజాత్ములైనవారి ని ఎట్లా సంభ్రమపరుస్తుందో

'నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా'

'కొండలు పగలేసినం, బండలను పిండినం
మా నెత్తురె కంకరగా ప్రాజెక్టులు కట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో

అనే పల్లవులు ఎంత విద్యుత్తును సృష్టిస్తాయో

'యంత్రమెట్లా నడుస్తు ఉందంటే ఓరన్నో లమ్మీ రైలూ లారీ కారూ బస్సూ  మిల్లూ మిషనూ, మోటారు సైకిలు
యంత్రమెట్లా నడుస్తు ఉందంటే ..'

అనే పాట మొదలుకాగానే నా వళ్ళంతా విద్యున్మయం కాకుండా ఉండలేదు. అయితే, ఆ పల్లవి ఆయనకెట్లా స్ఫురించిందో ఆ ఆల్కెమీనీ మనం వివరించలేకపోవచ్చుగానీ, ఆ పల్లవిని ఆయన నిర్మించిన తీరు నిస్సందేహంగా మనం మరింత మరింత అధయనం చెయ్యవలసిన అంశం కాదా.

పల్లెటూర్లలో పంటలు ఇంటికొచ్చినప్పుడు జంగాలు ఇంటింటికీ తిరిగీ పాడుకునే ఒక జంగం పాట బాణీలో షిప్ యార్డు కార్మికుల కోసం రాసిన ఆ పాటలో ఒక ఫిట్టరుగా వంగపండు కార్మికానుభవం మాత్రమే కాదు, శిల్పిగా ఆయన కనపరిచిన అసామాన్యమైన నిర్మాణ కౌశల్యం గురించి కూడా మనం గురించవలసి ఉంటుంది. ఇంతకీ శిల్పి అంటే ఏమిటి?  Fitter of words మాత్రమే కదా. గాయకుడంటే ఎవరు?  Fitter of sounds  నే కదా.

కవిత్వం వసంతం లాంటిది, అది అన్ని వేళలా అందరిమీదా వాలదు. శ్రీ శ్రీకి ఈ రహస్యం తెలుసు. ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టినప్పుడు అది చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిమీదా, కృష్ణశాస్త్రిమీదా, విశ్వనాథమీదా వికసిస్తుండటం చూసాడు. తన జీవిత చరమదినాల్లో అది చెరబండురాజులోనూ, వంగపండులోనూ వికసిస్తున్నదని గుర్తుపట్టాడు. 'జంగమదేవర్ల గంటల చప్పుళ్ళల్లో నేను నా కవిత్వాన్ని వెతుక్కున్నాను 'అని ఆయనొక చోట రాసుకున్నాడుగాని, అది ఆయనకి ఒక కల మాత్రమే. నిజంగా జంగం దేవర్ల పాటల్లోంచి కవిత్వం తెచ్చుకోవడమెలా ఉంటుందో వంగపండుని చూసాకే ఆయనకి అర్థమయింది.

బహుశా ప్రపంచంలోని ఏ భాషలోనూ లేనంతమంది శక్తిమంతులైన ప్రజాగాయకులు నేడు తెలుగు భాషలో మాత్రమే కనవస్తున్నారు. నా మాటమీద అనుమానం ఉన్నవాళ్ళు, protest song గురించిన సమాచారం నెట్ లో శోధించి చూడవచ్చు. తక్కిన నేల కన్నా తెలుగు నేల మరిన్ని పోరాటాల పురిటిగడ్డ అని నేను చెప్పలేనుగానీ, పోరాటాన్ని పాటగా మార్చగలిగే ఒక సౌలభ్యం, ఒక వేగం, ఒక సంప్రదాయం తెలుగు సాహిత్యంలో పుష్కలంగా ఉంది. తెలుగులో ఒక కవి ప్రయత్నం మీద పద్యకవికాగలడు, చాలా కష్టపడితే మంచి వచనకవి కాగలడు, కాని అప్రయత్నంగా ఒక గీతకారుడు కాగలడు. కావలసిందల్లా కొంత తడి గుండె. అటువంటి గుండె కనుక ఉంటే , నండూరి సుబ్బారావులాంటి వకీలుకి కూడా ఒక సాయంకాలం ట్రాము బండిలో ఇంటికొస్తున్నప్పుడు 'గుండె గొంతుకలోన కొట్లాడటం 'అప్రయత్నంగా అనుభవంలోకి వస్తుంది. ఇక అతడు వంగపండు ప్రసాద రావే అయితే, అతడి పార్వతీపురం నేపథ్యం, శ్రీకాకుళం పురిటినొప్పులు అతణ్ణొక అసమాన కవిగాయకుడిగా మార్చేస్తాయనడంలో ఆశ్చర్యమేముంది!

పార్వతీపురం  గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అదృష్టానికి నోచుకున్నవాడిగా, వంగపండు గీతాలు అక్కడి నేల మీద నేనెన్నోసార్లు విన్నాను. పాఠశాలల్లో పిల్లలు మొదలుకుని, గ్రామాల్లో కళాకారులదాకా భూమిబాగోతం ప్రదర్శించగా చూసాను. బహుశా భూషణంగారో మరెవరో పరిచయం చేయగా వంగపండుని ఒకసారి కలుసుకోగలిగాను. కాని, ఆయన కవిత్వాన్ని అధ్యయనం చేయవలసినంతగా అధ్యయనం చేయలేదని మాత్రం ఇప్పుడు గ్రహిస్తున్నాను.

పాట చాలా చిత్రమైనది. ఒకరికి అది జయమాల, మరొకరికి ఉరితాడు. ఒకరినది అందలమెక్కిస్తుంది. పద్మశ్రీ, పద్మవిభూషణుల్ని చేస్తుంది. మరొకరిని ప్రవాసానికీ, కారాగారానికీ పంపిస్తుంది. కాని, శ్రోతల్ని మాత్రం ఒక్కలానే పరవశింపచేస్తుంది. గీతకారుడికి పాటనుంచి ఏమి దక్కుతుందనేది అతడి సామాజిక-రాజకీయ సందర్భాన్ని బట్టి ఆధారపడుతుంది. కానీ, జాతికి మాత్రం ఆ పాట మిగులుతుంది. గీతకారుడి సుఖసంతోషాలూ, కష్టనష్టాలూ పాటగా మారి ఆ పాట విన్న ప్రతి ఒక్క గుండెలోనూ గూడుకట్టుకోవడం మొదలుపెడతాయి.

తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు శ్రోత ఉన్నంతకాలం వంగపండు చిరంజీవి.

Monday, August 3, 2020

బ్రాహ్మణులు ఇకనైనా తమ పంథాను మార్చుకోవాలి..

బ్రాహ్మణులు ఇకనైనా తమ పంథాను మార్చుకోవాలి..
కాలానుగుణంగా మనమూ మారి "తీరవలసిందే.."

"శాస్త్రాన్ని - ఆధునికతను" ఈ రెండిటిని
సరైన స్థాయిలో సమన్వయ మొనర్చినప్పుడే
మనకు నిజమైన పురోగతి, "ఆశయాభివృద్ధీ కూడా.."

కారణం: కుడిచెంప మీద కొడితే ఎడమచెంప
చూపటానికి ఇదేమి గాంధీగారి కాలమూ కాదు..
ధర్మం నాల్గుపాదాల నడిచిన రామరాజ్యమూ కాదు..

నీచ నికృష్టాదుల చేతుల్లో..
పరమ పవిత్రమైన వేదధర్మం, సనాతన సాంప్రదాయం..
అడుగడుగునా అవమానింప బడుతున్న కలికాలం..
దుర్భరమైన "మధాందుల కాలమిది.."

మహోన్నతమైనట్టి వేదదర్మం అణగారిపోతున్నా..
అర్చకుల ఆత్మాభిమానాలు మంటగలసి పోతున్నా..

ఇంకా నేను శాంతి మంత్రాలనే పఠిస్తాను..
ఓ మూల కూర్చొని వేదపనసలనే "వల్లెవేస్తానంటే.."

ప్రియమైన వేదపండితుడా..
తస్మాత్ జాగర్త..!!

యావత్ "జాతీ.." నిర్వీర్యమైపోవలిసిందే..
మీలోని నిర్లక్ష్యతకు, హేయమైన మీ నిర్లిప్తతకు..

"ఇదం బ్రాహ్మ్యం - ఇదం క్షాత్రం.."

ధర్మం తప్పిననాడు తుదకది స్త్రీయైనాసరే..
నిట్టనిలువునా సంహరించవలసిందే నిర్దాక్షిణ్యంగా..

ఇదే విషయాన్ని గూర్చి మరింత లోతుగా
"నిర్మొహమాటంగా.." ప్రస్తావించవలసివస్తే..

ఇకనైనా మనం మారకుంటే, సంఘటితం కాకుంటే..
కాలానుగుణంగా వ్యవహరించకుంటే..

2040 నాటికి "బ్రాహ్మణత్వం.." పరిపూర్తిగా
తన ఉనికిని కోల్పోవలసి వస్తుంది "నిస్సందేహంగా.."

Let me explain point by point..

చాపకింద నీరులా చుట్టుముడుతున్న అన్యమతస్తులు..
రాజకీయ నాయకులను సినీపరిశ్రమను వశపర్చుకోని..

తమతమ మాధ్యమాల ద్వారా..
అధికార దుర్వినియోగత ద్వారా..
సద్బ్రాహ్మణులను వేదపండితులను.. సంఘద్రోహులుగా "వెధవలుగా.." చిత్రీకరించి..

మనవారిని మనవారిపైనే ఉసిగొలిపి..
బ్రాహ్మణుడికి సాటి బ్రాహ్మణుడినే శత్రువుగా మలచి..

మనలోని అనైక్యతనే మనపై
ఓ "బ్రహ్మాస్త్రంగా.." ప్రయోగిస్తూ..

బ్రాహ్మణేతర అర్చకులు..
బ్రాహ్మణేతర పీఠాధిపతులు..
బ్రాహ్మణేతర ఆలయ విధులు..
బ్రాహ్మణేతర యజ్ఞ యాగాదులు..

ఇలా ఒక్కొక్కటిగా పావులు కదుపుతూ..
వ్యూహలను రచిస్తూ సామాన్య ప్రజాబాహుళ్యంలో..
ఓ తిరుగుబాటుకై, ఏర్పాటు వాదానికై నినాదాలిస్తూ..

వేదాల్లో బూతులున్నాయి..
ఉపనిషత్తుల్లో హింసాకాండలున్నాయి..

మనుస్మృతిలో యిలా చెప్పబడింది..
అధర్వణ వేదంలో యిలా ఉదహరించబడిందంటూ..

క్రిందిస్థాయిల వారిని, అమాయక ప్రజలను..
అడుగడుగునా మనపైకి రెచ్చగొడుతూ, ఉసిగొల్పుతూ

ఫైనల్గా బ్రాహ్మణత్వాన్ని బ్రాహ్మణుడినే "ఓ బఫూన్గా.."
మార్చబోతుంది ఈ "మతాంతర దుష్టచతుష్టయం.."

"ఆచార్య గౌతముడు.." ఓ ద్రష్టయై
తెలియజేస్తున్న పరమ "యదార్ధమిది.."

ఎవడు విశ్వసించినా విశ్వసించకున్నా..
ఇదే! సత్యం, సత్యం, సత్యం, "పునఃసత్యం.."

కనుకనే! ఓ సద్బ్రాహ్మణుడి ఆలోచనా శైలిలో
వ్యవహార శైలిలో, యికనైనా ఓ స్పష్టమైన మార్పు రావాలి.. ఆ మార్పు! "మీనుండే మొదలవ్వాలి.."

అందుకై..! మీరేమీ "కత్తులూ.." పట్టనవసరంలేదు..
ఊరూరా "కుస్తీపోటీలూ.." నిర్వహించనవసరంలేదు..

కేవలం ఈ సమాజంపట్ల మీలో నెలకొన్న భయాల్నీ..
అనవసరమైన "చాదస్తాలని.." విడనాడితే చాలు..

1. ఎవడైనా మనల్ని విమర్శించినప్పుడు..
క్రిందిస్థాయి వారిలా "లం..కొడకా" అనవసరంలేదు..

కనీసం అందులో సగం!
"నోరుముయ్యరా జారపుత్రుడా.."
అని అవతలివాడి "నోరును.." నిట్టనిలువునా..
మూయించగల్గితేచాలు, నిర్భయంగా, సభాముఖంగా..

2. "సినీపరిశ్రమను.." ద్వేషించనవసరంలేదు..

కనీసం, నుదుటిపై త్రిపుండ్రాలను! మేనిపై యజ్ఞోపవీతాన్నీ దాల్చామన్న ఇంగిత జ్ఞానం
కూడా లేకుండా, నాలుగు చిల్లర డబ్బుల కోసం, శ్రావణమాసం సినిమాలో పూజ్యులు తనికెళ్ళభరణి గారిలా, "హరికృష్ణ కాళ్ళదగ్గర పాకే.." పనికిమాలిన "క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను.." వారి దిగజారిన భావజాలాన్నీ ఖండించి, వీలైనంత "దూరంగా ఉంచితే చాలు.."

3. "ఓటు హక్కును.." విస్మరించనవసరం లేదు..

కానీ, సోమిరెడ్డి లాంటి అంట్లవెధవలను..
బజారు మనుషులను, మరోసారి తిరిగి ఎన్నుకోకుండా, ఎన్నుకొని అవమానింపబడకుండా "సంఘటితంగా - సమూలంగా" ఉద్వాసన "చెప్పగల్గితే చాలు.."

4. ఉత్సాహంతో "డాన్సులెయ్యనవసరంలేదు.."

కానీ, అనవసరమైన జోక్యాలతో, అహంకారంతో,
సాటి బ్రాహ్మణులను, అర్చక వ్యవస్థని, వేదధర్మాన్నీ, అవమానిస్తుంటే, చీమూనెత్తురూ లేనివారిలా, బృహన్నల వారసుల్లా, హా! మనల్ని కాదులే..!! మనదాకా రాబోదులేయన్న, స్వార్ధబుద్ధితో, నిర్లక్ష్యతతో, నిమ్మకు నీరెత్తినట్లు, వ్యవహరించక, చూసీచూడనట్లు నటించక, గాలిలో దీపంపెట్టి శాంతిమంత్రాలను పఠింపక, శక్తివంచనలేకుండా సర్వులూ ఏకమై, మీవంతు "పోరాడగల్గితే చాలు.."

5. మడినీ ఆచారాలను "వదులుకోనవసరం లేదు.."

కానీ, మనంకూడా మనుషులమేనని మర్చిపోకుండా!
ఎప్పుడైనా బ్రాహ్మణుడనేవాడు, అర్చకుడనేవాడు, తినాలనిపించో, లేక తప్పకో.. బయటికివెళ్లి,
ఏ బజ్జీలో, న్యూడిల్సో, పానీపూరీనో భుజిస్తే,
లేకో జీన్స్ ప్యాంట్ ను ధరిస్తే, అదేదో పెద్దనేరంలా, మానభంగంలా, వందమందిని చంపిన హత్యాకాండలా చిత్రీకరించి..!! నీ వారినే నువ్వు తప్పుపడుతూ, నడిరోడ్డుపైకి ఈడుస్తూ, అక్కడికి నువ్వేదో పెద్దఉత్తముడిలా, గురిగింజలా, సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడిలా! స్టేజీపైకెక్కి
"వెధవ ఉపన్యాసాలు.." ఇవ్వకుండా ఉంటే చాలు.. 

6. విరగబడి లోకాన్నేం "ఉద్ధరించనవసరంలేదు.."

కనీసం, 30 యేండ్లు దాటినా, నలభై యేండ్లు వచ్చినా..
అర్చకవ్యవస్థలో ఉన్నవారు పెళ్లీపెటాకులు కాక..
దేబ్యపు ముఖాలేసుకొని మగ్గిపోకుండా, మీ కూతుర్లకు, మేనకోడళ్లకు, IT సంబంధాల కోసమై, విదేశీ సంబంధాల కోసమై ప్రాకులాడకుండా, కోట్లు పోసినా దొరకని, ఓ భగ్వద్ సేవకునికి, "అర్చకునికీ యిచ్చి.." గౌరవప్రదంగా వివాహం "చెయ్యగల్గితే చాలు.."

7. సమాజంపై "విరుచుకుపడనవసరం లేదు.."

ఎదుటివారి జాలి కూతలకు, గాలి కూతలకు లొంగకుండా, ప్రతీ ఒక్కరిలోనూ తగు అంతర్గత భయాన్నీ వణుకునూ కలిగించేలా, కమ్యూనిటీ
గురించి "ఏ ఒక్కడూ, ఏ రాజకీయ నాయకుడు
తప్పుగా మాట్లాడకుండా.." వేలెత్తి చూపకుండా,
ఎవడిని ఎలా వంచాలో, ఎవరి నోరును ఎలా
మూయించాలో, తగు సరైన స్థాయిలో గుర్తెరిగి,
సామ, దాన, భేద, దండోపాయాలను
ప్రయోగించానా సరే, మనలో మనం
కీచులాడుకోకుండా, దుర్భాషలాడుకోకుండా,
"మనవారిని మనం.." సర్వేసర్వత్రా పొదివిపట్టి
"సంరక్షించుకోగల్గితే చాలు.."

Last but not the least..

8. చంద్రమండలానికి "దూసుకెళ్లనవసరంలేదు.."

కానీ, ఎప్పుడూ, శాంతి, సహనం, అర్చకత్వం,
మడీ దడీ.. అని బిగుసుకుపోకుండా, కాలానుగుణంగా నడుచుకుంటూ, చిన్నవారిని సైతం తగు సహృదయంతో ప్రోత్సహిస్తూ, మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లు, తగు Updated గా వ్యవహరిస్తూ, కేవలం అర్చకవ్యవస్థలోనే కాక, రాజకీయం, విద్యా, వైద్యం, వ్యాపారరంగం, జర్నలిజం ఇలా ప్రతీ విభాగంలోనూ, మనదైన శైలిలో చొచ్చుకుపోతూ, "శాఖలు - తోకలూ అంటూ వెఱ్ఱి కూతలు కుయ్యకుండా.." శృతిమించిన పైత్యాన్ని ప్రదర్శించకుండా, ప్రతీ ఒక్కరితోనూ,
తగు స్నేహభావంతో సచ్ఛీలతతో నడుచుకుంటూ, తగు దృఢ సంకల్పంతో, "ధీరత్వంతో విలసిల్లగలిగితే చాలు.."

జగత్పూజ్యమగు వేదధర్మం సనాతన సాంప్రదాయం..
సర్వేసర్వత్రా దిగ్విజయంగా సుశోభితంగా వర్ధిల్లాలని..

మహోత్కృష్టమైనట్టి సద్బ్రాహ్మణ "విజయపరంపరకై"
ప్రతీ వేదపండితుడూ, ఓ "సైనికుడై పోరాడాలని.."

మనసా, వాచా, కర్మణా..
త్రికరణ శుద్ధిగా ఆశిస్తూ..

సర్వేజనా సుఖినోభవంతు..
గో బ్రాహ్మణేభ్యః శుభంభవతు..

స్వస్తి... 

అరటికాయ బజ్జీలు. బంగాళాదుంప, కాకర, వాము ఆకు

అంతరించిపోతున్న బజ్జీసాంప్రదాయం

బాధపడుతున్నవారు: కాలనాధభట్తవీరభద్రశాస్త్రి

**  **  **

ఎంతసేపూ మిరిపకాయబజ్జీలే తప్ప ఇంకేవీ గుర్తుకురావా?

అసలు బజ్జీలకు పితామహ ప్రపితామహులు అరటికాయ బజ్జీలు. బంగాళాదుంప, కాకర, వాము ఆకు, వంకాయ దర్మిలా ఉల్లిపాయకూడా

అవతలహోరున వాన. మండువాలోగిల్లో మధ్యవున్న చతురస్య కుండిలో ధారాపాతంగా పైన పెంకులకప్పునుంచి

వాన నయాగరా జలపాతంలా జాలువారుతూవుంటే చాపమీదకూర్చుని మగరాయుళ్ళు చతుర్ముఖ పారాయణ చేస్తూ మధ్యమధ్య నారీమణుల హస్తపాకచాతుర్య సంభవమైన వేడివేడి బజ్జీలు తింటూవుంటే, మరికొందరు డిటెక్టివ్ నవలో వార పక్షమాసపత్రికలో చదువుతూ పేజీలు తిప్పుతూ ఆసమయంలొ వేడివేడి బజ్జీలు తింటూఆస్వాదిస్తూవుంటే. కన్నెపిల్లలు చింతగింజలతో వామనగుంట ఆడుతూ మధ్య మధ్య వేడివేడి బజ్జీలుతింటూవుంటే, నవదంపతులు గదిలో మంచంమీదకూర్చుని భార్య బజ్జీని భర్తనోట పెట్టి తానొకటి భర్త తననొటపెట్టగా తింటూవుంటే 

చెప్పలేను ఆహాయి ఎంతోగొప్పగవుంటుందోయి

మారోజుల్లో మిరపకాయబజ్జీలు ఎరగం అంటే సత్యదూరంకాదు

పచ్చిమిర్పకాయ నూరిన మెత్తని ఉప్పులో అద్దుకొని పప్పు అన్నం తినడం అలవాటు. 

అంతేగాని పచ్చిమిరపకాయలోని (అహం) కారమ్ నూనేలోవేగితే అబ్బే హుళక్కేకదా!

మరోవిషయం

పులిహారలో చింతపండు రసం ఆరసంతోబాటు వుడికిన ఎండుమిరపకాయలు 

ఎప్పుడన్నా విడిగా ఆఎండుమిరపకాయలు నమిలారా? పుల్లపుల్లగా కారంకారంగా..అబ్బో పులిహారకి అనుపానంకదండీ

అసలు మారోజుల్లొవివాహాలలొ మధ్యాహ్నం స్నాక్సు తీపి బూందీ, వేడివెడి అరటి, బంగాళాదుంపబజ్జీలే. నో ఉల్లిపాయ

ఉదయం ఫలహారం ఉప్మాయే. 

బడా వివాహాలలో ఉదయం పెసరట్టు ఉప్మా

2009 నవంబరు ఒకటవతేదీన అమెరికా హ్యూస్తన్ నగరంలో మాద్వితీయపుత్రుని ప్రధమపుత్రిక వివాహానికి ఉప్మాయే ఉదయం ఫలహారం

దర్మిలా కాలంతోమార్పులువచ్చి ఏవేవో చేస్తున్నారు

వెళ్ళండి   ఏభైసంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆరోజుల్లోని  వంటలు ఆస్వాదించండి

**  **  **

కొసమెరుపు: నాకు మిరపకాయ అంటే మహా చెడ్డభయం. నాశ్రీమతికి మహాయిష్టం. 

కనుక తనని తల్చుకుంటూ ఈ రచన తనకే అంకితం

Total Pageviews