Thursday, December 24, 2020

ఎల్‌ బి శ్రీ రాం షార్ట్‌ ఫిల్మ్స్‌ వీడియోలు చూద్దాం! చూపిద్దాం!! ఆదరిద్దాం!!!

 https://www.youtube.com/watch?v=ntPJDvq4HQ4&t=316s

ఏడుపుగొట్టు సీరియల్స్‌ వంటి చెత్త కార్యక్రమాల కన్నా ఇటువంటి వీడియోలు చూద్దాం! చూపిద్దాం!! ఆదరిద్దాం!!! 

ఎల్‌ బి శ్రీ రాం షార్ట్‌ ఫిల్మ్స్‌ 

గుండె కోనల్లో చిన్న కుదుపుల మాటవిరుపు
మనసున మల్లెల మాలలూగు మైమరపు
కన్నుల వెన్నెల డోలలూగి
ఎంతో హాయి గుండె నిండు
కొమ్మల గువ్వలు గుసగుస
రెమ్మల గాలులు ఊసులా
అలలు కొలనులో గలగలలా
దవ్వుల వేణువు సవ్వడిలా
కొండంత తెలుగు సంస్కృతికి
లంకంత భద్రాద్రి శ్రీరాముడి లఘు చిత్రాలు
గోరంత ఉడతాభక్తి
ఎంత హృదయంగమం
వందనం అభినందనం
యు ట్యూబ్ లో తిలకించి పులకించండి
ఎల్ బి శ్రీ రామ్ షా(హా)ర్ట్
Show less

Sunday, December 20, 2020

మితృలతో షష్ఠి కబుర్లు...శంకరనారాయణ బ్రహ్మ ధవళగిరి సుబ్రహ్మణ్య షష్ఠి

 మితృలతో షష్ఠి కబుర్లు...

"సుబ్రహ్మణ్య షష్ఠి" అనడానికి చిన్నప్పుడు నోరు తిరిగేది కాదు.
బబ్రమణ్యం అనేవాడ్ని.
మా బామ్మ
"ఒరే తప్పురా అలా అనకూడదని సుబ్బారాయిడి షష్ఠి" అని సులభంగా నేర్పింది.
ఇక షష్ఠి పండగంటే నాకావయసులో తెలిసింది
"బడికిసెలవు..
గుడిదగ్గర తీర్థం."
ఊహ తెలిసాకా తణుకు లో మా బామ్మవేలు పట్టుకు చూసిన షష్ఠి తీర్ధం
శ్రీ కేశవస్వామి వారి గుడినించి
గోస్తనీ నది వంతెన మీదుగా
శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి దాకా వుండేది.
రొడ్ కి ఎడా పెడా వివిధ దుకాణాలు దాదాపు అర కిలోమీటర్ దర్శనంకై భక్తుల వరస.
ఇప్పటికీ నాకు పూర్ణ అవగాహన లేని "పూలూ పడగలూ" గుళ్ళో ఇవ్వడం.
ఇక తీర్ధం లో
ఓ అట్టబండికి
మట్టి ఢంకా రంగుకాయితాలతో కట్టి రెండు వెదురు పుల్లలు కింద రెండు మట్టి చక్రాల బండి కి పురుకోస కట్టి లాగుతూంటే అది "డమడమ శబ్దంతో వింతగా వుండేది దానికి నేను "డమడక్కలబండి" అనేవాడ్ని దాని వెల పది పైసలు.
ఇంక ఎరుపు పసుపు నీలం రంగు కాయితాల కళ్ళజోళ్ళు.. రైయ్ రైయ్ మని చప్పుడు చేసే తిప్పుడు పుల్లలు..దెయ్యం బొమ్మల మాస్కులు..
రంగుకాయితం పువ్వుని ఓ పుల్లకి గుచ్చి పైకి పట్టుకుని పీ...పిపీప్..అంటూ పరిగెడుతూంటే ఆ పువ్వు గిర్రున తిరుగుతూండేది.
బుడగలు బూరాలూ పిల్లనగ్రోవులూ సరేసరి.
ఇంకో తమాషా
ఓ ఇనుపచువ్వకి ఆంజనేయుడిలా కోతి బొమ్మ గుచ్చి దాన్ని పైకీ కిందకీ తిప్పుతూంటే కోతికొమ్మచ్చి నా చేతిలో భలే ముచ్చట.
తీర్థం లో కొనుక్కున్నవి మర్నాడు బళ్ళో సావాసగాళ్ళకి చూపెట్టడం మరో అచ్చట.
తినుబండారాలపై అంత ఆసక్తి వుండేది కాదు.
ఓమాటు నేను ఉండ్రాజవరంలో మారాంబాబయ్య దగ్గర ఏడో తరగతి చదూకునేటపుడు
షష్ఠి తీర్ధం కి మా తాతయ్యగారు బామ్మగారు వచ్చారు.
అసలది ఉండ్రాజవరం కాదట. నిన్నే శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ద్వారా నాకు తెలిసింది అది "ఉరగరాజపురం"ట. ఉరగమంటే పాము.
ఆ గ్రామంలో చిన్న ఏరు పక్కన గల సుబ్బారాయుడి గుడి దగ్గర్నించి మా పట్టాభి మాస్టారింటి వీధి చివరి దాకా ఓ ఫర్లాంగంతా తీర్ధమే..
ఆరోజు మా తాతయ్యగారు నాకో "రూపాయి"ఫెళఫెళ లాడే కొత్త కాయితం ఇచ్చారు.
ఆరోజే నాకు తొలి సారి తెలిసింది షష్ఠి నాడు ఆయన పుట్టిన రోజని.
ఆ రోజే నేను తొలిసారి "రూపాయిని చూడడం ముట్టుకోవడం".
అంతదాకా పదిపైసలు పావలా అర్దరూపాయిలే నా సంపాదన కాని పైసలు చూడడం.ముట్టుకోవడం.
తొలి సారి రూపాయి చేతిలో పడగానే మతి పోయింది.
ఆరోజు రాత్రి
వాళ్ళు వెళ్ళి పోగానే మా రాంబాబయ్య
"ఏరా రూపాయేదీ" అన్నాడు.
నాకు అది ఆయనకిచ్చేయాలేమొ అనుకుని
" కొనేసుకున్నా"
అన్నా
చెంపపై కొట్టీ "రూపాయిఅంతా ఖర్చు పెట్టెసావా ఏంకొన్నావ్ చూపించు" అన్నాడు.
ఉక్రోషంగా నేను
ఆ రూపాయిని బాబయ్య మొఖానికేసి కొట్టి
"నేనేం కొనుక్కోలేదు."
.అని ఏడ్చేసా..
ఆ వయసు నించే నా అపార్ధపు ఉక్రోషాలతో చేయని తప్పుకు శిక్ష అనుభవించడం మొదలైంది.
కధ పక్కదారి పడుతోందికదా..
సరే ఇక ముగింపుగా మా జట్టుగాళ్ళందరం
"డబ్బారేకుల సుబ్బారాయుడి పండగోయ్..దబ్బు దబ్బున అందరూ రారండోయ్ "
అని తీర్థం లో అరుస్తు తిరిగేవాళ్ళం.
ఇవీ నా "సుబ్బారాయిడి షష్ఠి"
గురుతుల కబుర్లు.
చదివిన మీకు ధన్యవాదాలు
మీ
శంకరనారాయణ బ్రహ్మ ధవళగిరి
సుబ్రహ్మణ్య షష్ఠి
20.12.20
ఆదివారం
ఉ.10.50 ని

ఓం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధా సుబ్రహ్మణ్యం భగవాన్‌ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి గళంలో భజన

 శ్రీ సుబ్రహ్మణ్య షష్టి శుభసంధర్భం లో

ఓం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధా సుబ్రహ్మణ్యం
భగవాన్‌ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి గళంలో భజన

Saturday, December 19, 2020

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి ... అన్నమయ్య ఆర్ధ్ర స్వరార్చన బ్రహ్మశ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌ గారి గళార్చన

 దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి ... అన్నమయ్య ఆర్ధ్ర స్వరార్చన 

బ్రహ్మశ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌ గారి గళార్చన 

https://www.youtube.com/watch?v=GnPnojF_cWU

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

పూచి నీ కీరీతి రూప పుష్పములు ఇవి అయ్యా

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

పూచి నీ కీరీతి రూప పుష్పములు ఇవి అయ్యా

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మము రక్షింపగ

తక్కినవి భండారాన దాచి వుండనీ

వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మము రక్షింపగ

తక్కినవి భండారాన దాచి వుండనీ

వెక్కసమగు నీ నామము 

వెక్కసమగు నీ నామము వెల సులభము ఫల మధికము

వెక్కసమగు నీ నామము వెల సులభము ఫల మధికము

దిక్కై నన్నేలితివి ఇక నవి తీరని నా ధనమయ్యా  

దిక్కై నన్నేలితివి ఇక నవి తీరని నా ధనమయ్యా 

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

పూచి నీ కీరీతి రూప పుష్పములు ఇవి అయ్యా

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

నా నాలికపై నుండి నానా సంకీర్తనలు

పూని నాచే నిన్ను పొగడించితివి

నా నాలికపై నుండి నానా సంకీర్తనలు

పూని నాచే నిన్ను పొగడించితివి

వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ

వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ

కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితి వింతే అయ్యా

కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితి వింతే అయ్యా

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

పూచి నీ కీరీతి రూప పుష్పములు ఇవి అయ్యా

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

యీ మాట గర్వము కాదు నీ మహిమే కొనియాడితి గాని

యీ మాట గర్వము కాదు నీ మహిమే కొనియాడితి గాని

చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడ కాను

చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడ కాను

నేమాన పాడేవాడను నేరము లెంచకుమీ

నేమాన పాడేవాడను నేరము లెంచకుమీ

శ్రీమాధవా నే నీదాసుడ

శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా

శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా

దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

పూచి నీ కీరీతి రూప పుష్పములు ఇవి అయ్యా

దాచుకో దాచుకో దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

హరీ

Friday, December 18, 2020

గంగిరెద్దుల వారు మా ఇంటివద్ద గంగిరెద్దు ఆటల విన్యాసాలు మరిన్ని విశేషాలు ఈ లింక్‌ లో

 గంగిరెద్దుల వారు 

మా ఇంటివద్ద గంగిరెద్దు ఆటల విన్యాసాలు మరిన్ని విశేషాలు ఈ లింక్‌ లో

1)  https://www.youtube.com/watch?v=3TRbv1jTMK4

2) https://www.youtube.com/watch?v=uwYjjiUYARY

3) https://www.youtube.com/watch?v=hrXR7C2I3dU

ఇటువంటి జానపద కళారూపాలను ఆదరించండి. వారి ప్రతిభ విశ్వవ్యాప్తమయ్యేలా ఈ వీడియోలు లైక్‌, షేర్‌ చెయ్యండి. 

మా ఈ ఛానల్‌ సబ్‌ స్క్ర్యైబ్‌ చెయ్యండి.  

                    గంగిరెద్దులాటలు అనునది ఒక జానపద కళారూపం.ఇది ప్రాచీనమైనది. తెలుగు సంప్రదాయాలకు గుర్తు సన్నాయి అప్పన్న, విశాఖ పట్నంలో జరిగే విశాఖ ఉత్సవ చిహ్నం కూడా సన్నాయి అప్పన్నే. కానీ సన్నాయి అప్పన్నల జీవితాలలో విషాదమైన సంగీతము మారుమ్రోగుతోంది. ఇతరులకు సన్నాయి పాటలను వినిపించి డోలు కొట్టి, శిక్షణ నిచ్చిన గంగిరెద్దును పట్టుకొని తిరిగే గందిరెద్దులోళ్ళు జీవితాలు చీకటి మయమయ్యాయి. స్థిర నివాసాలు లేనివారు, భూములు లేని వీరికి విద్యా, ఉద్యోగం, మొదలగు వాటిలో వున్న రిజర్వేషన్లు వీరికి తెలియవు.

                       పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట. అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకో మంటాడట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడు. అంతర్ధానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవి దుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు గంగి రెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నంది కేశ్వరుణ్ణి గంగి రెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలైన డోలు, సన్నాయి, బూర, సుత్తి లను ధరింప చేసి, తాను మేళానికి నాయకత్వం వహించి ...గజాసురుని చెవుల బడి తన సమక్షంలో ఆ ఆటను ప్రదర్శించ మని కోరుతాడట. అందు కోసమే ఎదురు చూచిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహిస్తాడట. గజాసురుడు ఆనంద భరితుడై ఏం కావాలో కోరుకో మంటాడట. తన పాచిక పారిందనుకున్న హరి... ఇది శివుని వాహనమై న నంది తన స్వామికి దూరమై విలపిస్తూ ఉంది. ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట. ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారి యైన చక్రధారి అనీ, ఇక తనకు మృత్యువు తప్పదనీ తెలుసుకున్న గజాసురుడు శివుని ప్రార్థించి, నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట. అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట పడతాడట. ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజ లందుకుంటుందనీ, అతని చర్మాన్ని తాను మేన ధరిస్తాననీ చెప్పి శివుడు గజాసురునికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. ఆ గంగిరెద్దులను లోకంలో తిప్పుకొమ్మని గంగిరెద్దుల వారికి గంగిరెద్దులతో పాటు వాయిద్యాలు కూడా యివ్వడం జరుగుతుంది. (గంగ యొక్క ఎద్దు గంగిరెద్దు) అప్పటి నుండి గంగిరెద్దులను తిప్పుకొని బ్రతుకు తున్నట్లు పెద్దలు చెప్తారు.

                    వీరు ప్రాంతీయ బాణీలలో జానపద పాటలు పాడుతారు. సన్యాసమ్మ పాట, రాములవారి పాట, ఈశ్వరమ్మ పాట, గంగరాజు పాట, వీరగున్నమ్మ పాట (మందస ప్రాంతంలో), మాలవారి మంగమ్మ మొదలగు పాటలు బాణీకట్టి పాడతారు. సినిమా పాటలు కూడా పాడతారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా గంగిరెద్దుల వారున్నారు. అయినా వీరంతా తెలుగువారే. మహారాష్ట్రలో వీరిని నందివాలా అంటారు.

గంగిరెద్దు ఆటల విన్యాసాలు

గంగిరెద్దుతో సన్నాయి అప్పన్న చేయించే విన్యాసాలు

సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దుల వారు పల్లెల్లో తిరుగుతుంటారు. గంగిరెద్దు

డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నావురుకుతు రారన్నా రారన్న బసవన్నా

అమ్మవారికీ దండం బెట్టు అయ్యగారికీ దండం బెట్టు

మునసబు గారికి దండం బెట్టూ

కరణం గారికి దండం బెట్టూ

రారా బసవన్నా, రారా బసవన్నా.... అంటూ


Thursday, December 17, 2020

 బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ  అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. 


కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.


అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.


బాగా చదువుకున్న  వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.


ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. 


కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo.  అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. 


కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...


ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.


ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.


నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.


మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.

ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు.  2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.


మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం  వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.


అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది.  ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!


ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.


రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.


అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు


చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.


అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.


ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.


CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.

అదే టాటా నానో పరిశ్రమ మోడీ  సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి.  అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.


https://www.google.com/amp/s/wap.business-standard.com/article-amp/companies/sanand-the-new-global-auto-hub-115032200818_1.html


మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని.


ఈ క్రింద ఫోటోలు చూడండి.  కుడి వైపు ఫోటో చైనా MNCలది. రెండోది US, యూరోప్ MNC లది.  స్వాతంత్రం వచ్చి 70 సం. లకు పైగా అయింది. ఎన్ని భారత్ కంపెనీలు పేర్లు దీనిలో ఉన్నాయో వెతకండి.


.....చాడా శాస్త్రి...


ధనుర్మాస విశేషాల్లో ముఖ్యమైనది హరిదాసుల హరి కీర్తనలు!

                             నుర్మాస విశేషాల్లో ముఖ్యమైనది హరిదాసుల హరి కీర్తనలు! ఈ లింక్‌ లో చూడండి.

1) https://www.youtube.com/watch?v=BW8iNbKYan8

                ఓ సంక్రాంతి శుభవేళ హైదరాబాద్‌ శిల్పారామంలో మా చిన్నబ్బాయి చి. ప్రభవ్‌ హరిదాసు వేషం ఈ లింక్‌ లో చూడండి.

2) https://www.youtube.com/watch?v=yhea6kGRa4Y

                ఇటువంటి వీడియోలను లైక్‌ చేసి, షేర్‌ చెయ్యండి, మా యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌ స్క్రైబ్‌ చెయ్యండి. 

                        ధనుర్మాస విశేషాల్లో ముఖ్యమైనది హరిదాసుల హరి కీర్తనలు! 

            మొట్ట మొదటి హరిదాసు నారద మహాముని.  "శ్రీ మద్రారమారమణ గోవిందో హారి" అంటూ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దిన హరిదాసు వేషధారణతో, ముంగిళ్ళ రంగవల్లులే వేదికగా నర్తనలతో "హరిలొ రంగ హరి" హరి కీర్తనలతో తెలుగు నేలలో తెల్లవారు ఝామునే అధ్యాత్మిక పరిమళాలతో అలరిస్తారు.  హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగాలని దీవిస్తారు హరిదాసులు. వీరు నెలరోజులు పాటు వీధి వీధినా హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు.   సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు. 

                     

                ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం  హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం , కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. హరిదాసును విష్ణు మూర్తికి సంకేతంగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. అలాగే ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటిచెప్పే హరిదాసు కీర్తనల్లో, రూపంలో ఉంటుంది. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటని కొంతమంది నమ్మకం అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో  బియ్యం, లేదా ఇతర కానుకలతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. కాలంతో పాటుగా హరిదాసులు వాహనాల మీదే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రికార్డు చేయించిన హరినామ కీర్తనలను మైక్‌ ద్వారా ప్రజలకు వినిపిస్తున్నారు. మన తరతరాల ఈ ఆధ్యాత్మిక కళా వారసత్వాన్ని మనం ఆదరించి, వారి గురించి మన భావితరాలకు అవగాహన కల్పించేందుకు, తరలించేందుకు మనమందరం కృషి చేద్దాం అందులో భాగంగా 

            ఇటువంటి వీడియోలను లైక్‌ చేసి, షేర్‌ చెయ్యండి, మా యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌ స్క్రైబ్‌ చెయ్యండి. 

Total Pageviews