Friday, March 13, 2015

శుభోదయం!!! తిరుమల తిరుపతి లో పూలబావి ప్రత్యేకత



శుభోదయం!!!

తిరుమల తిరుపతి లో పూలబావి ప్రత్యేకత 

                   అద్దాల మంటపానికి ఉత్తరం దిక్కున ఉంది ఈ పూలబావి. స్వామివారికీ సమర్పించిన తులసి, పూలదండలు, పువ్వులు ఎవ్వరికీ ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు. ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగమార్గం ద్వారానే ఆ వేంకటేశ్వరస్వామిని శరణువేడాడు. స్వామివారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొందమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మి సిగ్గుతో శ్రీమహావిష్ణువు వక్షస్థలం లో చేరింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్లి రహస్యంగా దాక్కుందని పురాణాల గాధ!!!

No comments:

Post a Comment

Total Pageviews