Monday, March 2, 2015

ధర్మశాస్త్రం చెప్పేది:

ధర్మశాస్త్రం చెప్పేది:
  1. సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు
  2. రెండు చేతులతో తల గీరుకోరాదు.
  3. అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును.
  4. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు.
  5. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను.
  6. గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు.
  7. గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు.
  8. గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు.
  9. సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం లక్ష్మి కటాక్షము. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం లక్ష్మి లోగిలోకి రావడానికి దోహదం.
  10. చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు.
  11. ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు.

No comments:

Post a Comment

Total Pageviews