Friday, August 1, 2014

పోతన భాగవత పద్యం.

చదువనివా  డజ్ఞుండగు
జదివిన సదసద్వివేక చతురత గలుగున్
జదువగ వలయును  జనులకు
జడివిమ్చెద నార్యులొద్ద  జడువుము తండ్రీ !!

భావం:-       ఒకనాడు హిరణ్యకశిపుడు పుత్రుడైన ప్రహ్లాద కుమారునితో నిట్లనియె. కుమారా! చదువు కొననివాడు  జ్ఞాన హీనుడగును. చదువుకొన్నచో  సత్ అసత్ ల వివేకము, చతురత ( మంచి,చెడుల విచక్షణ - ఆత్మా అనాత్మల వివేక బుద్ధి జ్ఞానము ) కల్గును. అందుచేత జనులు విద్యనభ్యసింపవలెను.నాయనా! నిన్ను శ్రేష్ఠుల యొద్ద చదివిం చెదను.నీవు చదువుకో.    

No comments:

Post a Comment

Total Pageviews