Saturday, August 2, 2014

పోతన భాగవత పద్యం.

పోతన భాగవత పద్యం.

వరద! పద్మనాభ! హరి! కృష్ణ! గోవింద! 
దాస దు:ఖనాశ  వాసుదేవ! 
యవ్యయాప్రమేయ! యనిశంబు గావింతు 
మిందిరేశ!  నీకు వందనములు.

భావం:-    విముక్తులైన రాజులూ శ్రీకృష్ణునిట్లు స్తుతించిరి. ఓ ఇందిరేశా! కృష్ణా!  వరద ( వరములిచ్చువాడా ) పద్మనాభ! శ్రీహరీ ! గోవిందా! దాసుల దు:ఖమును హరించువాడా! వాసుదేవా! అవ్యయా ! ( శాశ్వతుడా!)అప్రమేయా! ( ప్రమాణములచే నిరూపింపశక్యము  కానివాడా!) నీకు మే మెల్లప్పుడును వందనము నాచరించెదము. ప్రభూ! 

No comments:

Post a Comment

Total Pageviews