Tuesday, April 18, 2017

సత్యాలు:--

సత్యాలు:--
అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి,మేక, గొర్రెలను చంపి తింటుంటాం.
ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు జరుపుకుంటాం.
ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు.
అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.
మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు.
సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.
మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.
గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.
దేవాలయం,మసీదు, చర్చిలు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు - ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.
విచిత్రం ఏమిటంటే ?
గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.
వెయ్యి రూపాయలు ఇచ్చి కొన్న పట్టీలును కాళ్ళుకి కట్టుకుంటాం కానీ ఒక్క రూపాయి ఇచ్చి కొన్న బొట్టును మాత్రం నుదుటన పెట్టుకుంటాం.
(అక్కడ పైసా విలువ చూడరు దాని చేసే పనితనం చూస్తాం )
చివరికి నేను చెప్పేది అందరికి తెలిసిన సత్యం ఏమిటంటే ?
ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా! పులిరా! " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం! (అది క్రూరమృగమని గ్రహించరు)

No comments:

Post a Comment

Total Pageviews