Thursday, November 12, 2020

సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని మనవి. మీ - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌!

 ఈ మధ్య అందరికీ పర్యావరణ స్పృహ పట్ల అవగాహన బాగా పెరిగింది. 

అది కేవలం హిందూ పండగలకే మాత్రం పరిమితం అవ్వకూడదు 

నిజమే దీపావళికి బాణాసంచా కాలిస్తే వాయు కాలుష్యం ఉంటుంది. 

కానీ అది ఒక్క రోజు మాత్రమే అదీ ఒక దేశానికే పరిమితం 

గతంతో పొలిస్తే పెరిగిన ధరలు తగ్గిన సరదాలతో అది చాలా చాలా స్వల్పం 

కానీ మనం ప్రతి నిత్యం చేసే ఘనకార్యాలను ఓ సారి గమనిస్తే  

జనవరి 1 వ తేదీ ప్రపంచ వ్యాప్త బాణాసంచా వినియోగం కాలుష్యం కాదా 

కానీ మనం నిజమైన పర్యావరణ ప్రేమికులం అయితే ప్రతీ రోజూ ఊరుబయట 

చెత్తను ముఖ్యంగా ప్లాస్టిక్‌, టైర్లు, ఇతర హానికారక వ్యర్ధాలను తగలబెట్టడం 

యంత్రాలతో పంట కోసిన తర్వాత మిగిలిన దుబ్బులు తగులబెట్టడం 

వంటి వాటితో పోలిస్తే ఎంత? 

అయినా పసి పిల్లలను, అనారోగ్యంతో వున్నవారిని, పెద్దవారిని దృష్టిలో ఉంచుకుని 

ఎక్కువ ధ్వని కాలుష్యంతో వున్నవి కాకుండా తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకుని 

సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని మనవి. 

మీ - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌! 

  

No comments:

Post a Comment

Total Pageviews