Thursday, January 7, 2021

పూర్వం విజయనగర ప్రాంతంలో వైదిక బ్రాహ్మణ స్త్రీలు మాటాడే భాష!

 పూర్వం విజయనగర ప్రాంతంలో వైదిక బ్రాహ్మణ స్త్రీలు మాటాడే భాష 

అట్లాంటి చాటు పద్యం ఇది. శార్దూల పద్యం.

“ అస్సే! చూస్తివషే! వొసే చెముడషే! అష్లాగషే యేమిషే? 

విస్సా వజ్ఝుల వారి బుఱ్ఱినష ఆ విస్సాయి కిస్సారషే ! 

విస్సండెంతటివాడె ? యేండ్లు పదిషే! విన్నావషే ! యెంత వ 

ర్చస్సే!’ యందురు శ్రోత్రియోత్తమపద స్త్రీ లాంధ్ర దేశమ్మునన్!”

.

చెరువుకి నీళ్ళ కోసం వెళ్లి ( అప్పట్లో కొళాయిలు లేవు) బిందెలు తోముకొంటూ జరిపిన సభాషణ,పై చాటు పద్యం. భావం వివరిస్తాను.

.

“ అవునే చూసావా! (అంటే ప్రక్కావిడ పలకలేదు.) ఏమే నీకుచేముడా!(రెండో ఆమె) అయ్యో అలాగా ఏమిటి? (అని అడిగింది) విస్సా వఝలవారి అమ్మాయిని (బుఱ్ఱి అంటే అమ్మాయి) మన విస్సాయికి (కుర్రవాడికి) ఇచ్చి పెళ్లి చేస్తారట! వాడికి పదేళ్ళ వయసు. వింటున్నావా ? వాడు ఎంత కళగా ఉంటాడో” అని శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు 

No comments:

Post a Comment

Total Pageviews