Tuesday, November 22, 2022

 పెళ్ళిపిలుపు

**  **  ** 

మా చిన్నతనంలో పల్లెటూరులో అగ్రహారంలో ఎవరి ఇంట్లో ఐనా పెళ్ళి జరగబోయే ముందు 

వీలైనంతవరకు కన్యాదాత భార్యసమేతంగా బయల్దేరి స్వయంగా పిలిచేవారు. 

ఆపిలుపుల్లోకూడా రకరకాల వైవిధ్యం గమనించండి

1. బాగా దగ్గర బంధువులు సన్నిహితులు అయితే ఒక మంచిరోజున వారి ఇంటికివెళ్ళి

(దృశ్యం)

కన్యాదాత: యాజులు బావగారూ

యాజులు గారు (ప్రవేసిస్తూ) ఓహో శాస్త్రిబావగారా రండీ. (ఈలోగా యాజులు గారి భార్య ప్రవేశిస్తుంది)

శాస్త్రి: బావగారూ మీకు తెలుసుగా. పెద్దమ్మాయి వివాహం ఎల్లుండి రాత్రి 7.30 కి. మీరు అక్కయ్యగారు పిల్లలు తప్పకరావాలి. ఈ ఐదురోజులూ మీరు దగ్గరవుండి వివాహం జరిపించాలి

యాజులు: అలాగే బావగారు.

శాస్త్రి భార్య: (యాజులు గారి భార్యకు బొట్టుపెట్టి) వదినా  రేపు  మీమేనకోడలుని పెళ్ళికూతురుని చేస్తాం. వచ్చి పిల్లను ఆశీర్వదించాలి. తర్వాత పెల్లికి వచ్చి ఐదురోజులూ వుండి ..

యాజులు భార్య: అలాగే వదినా. 

యాజులు: అన్నట్టు శాస్త్రీ దొడ్లో పనస చెట్టు కూరకాయలు నాలుగు పంపుతాను. పాదుని గుమ్మడి కాయలు  ఆనపకాయలు కూడా పంపుతాను

యాజులు భార్య: అన్నట్టు వదినా వంటకు..

శాస్త్రిభార్య: తణుకు నుంచి సుబ్బన్నగారు వస్తున్నారు.

యాజులు భార్య: ఆహితాగ్నుల మాటేమిటి?

శాస్త్రిభార్య: మాపిన్ని వుంది వదినా

యాజులు భార్య: అదేమిటీ అత్తయ్యగారు వక్కరివల్లా అవుతుందా? నేనూ మడికట్టుకుని .........

2 వ దృశ్యం

వూరిలో తెలిసిన  దూరపు చుట్టాలని స్నేహితులను పిలవడం 

శాస్త్రి: శర్మగారూ

శర్మ ప్రవేశిస్తూ ఓహో శాస్త్రి గారా. రండి రండి

శాస్త్రి: శర్మగారూ ఎల్లుండి రాత్రి 7.30 కి మాపెద్దమ్మాయి వివాహం. తాము బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి వధూవరులను ఆశీవర్దించాలి. మర్నాడు మధ్యాహ్నం దేవతార్చనకు  దయచేయాలి. అక్కయ్యగారు లోపలవున్నారా

శర్మతలవూపుతారు. శాస్త్రిగారి భార్య లోపలిలికి వెళ్ళి 

వదినగారూ రేపు మాపెద్దమ్మాయిని పెళికూతుర్ని చేస్తాం. మీరు వచ్చి పిల్లని ఆశీర్వదించాలి. ఎల్లుండి రాత్రి 7.30 కి పెళ్ళికి మర్నాడు మధ్యాహ్నం సంతర్పణకి తప్పక రావాలి

సాధారణంగా ఆరోజుల్లో వివాహమహోత్సవ ఆహ్వాన పత్రికలు అంటూ వుండేవి కావు

ఇతరగ్రామాలలో వున్న బంధువర్గానికి పోస్టు కార్డు వ్రాయడమే

మరో విషయం. భోజనాని కి అని గాని విందు అనిగాని పిలిచేవారుకాదు. దేవతార్చనకి అనే మాటే వాడేవారు

ఈ పద్ధతి 1936 వరకే అని గుర్తు.

రాను రాను కాలంతో మార్పులు వచ్చాయి. 

అవి తమకే తెలుసు కదా

కొసమెరుపు: 1. మార్చి 1945 నాపెళ్ళికి కార్డు ప్రింటైన శుభలేఖే 

మరోకొసమెరుపు: ఈమధ్య అంతర్జాలంలో పిలిచేస్తున్నారు

భవదీయుడు

25-12-2022 న 96 లోకి దేవుని దయవల్ల అడుగిడబోయే

కాలనాధభట్టవీరభద్రశాఅస్త్రి

హ్యూస్టన్ అమెరికా’


Saturday, September 3, 2022

 జీవితానికి అవసరమైన భగవద్గీత చావు ఇంట్లో వింటున్నాము భక్తి పారవశ్యం తో తేలియాడాల్సిన వినాయక మండపాలును బూతు రికార్డింగ్ డాన్స్ లతో ముంచుతున్నాము మన హిందూ జాతి స్వీయ ప్రక్షాళన దిశగా వెళ్లి మరలా పూర్వ వైభవం తీసుకుని రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కళాకారులను నేను తప్పు పట్టను ఎందుకంటే అదే వారికి జీవనధారం.. వాళ్ళు మనం ఏం కోరుకుంటున్నామో అదే ప్రదర్శిస్తున్నారు. వాళ్లనే భక్తి పాటలకి డాన్స్ చెయ్యమంటే వాళ్ళు అదే చేస్తారు.. ఎన్నో నాటకాలు భాగవతాలు హారికథలు కనుమరుగై కళాకారులు రోడ్డున పడుతున్నారు. కొంతమంది బిక్షగాళ్లు గా మారుతున్నారు. అటువంటి వారిని ఆదరించి అక్కున చేర్చుకోవాల్సిన సందర్భాలు మన వినాయక ఉత్సవాలు దేవీ నవరాత్రులు అమ్మవారి పండగలు.. కొన్ని ఏళ్లగా కొనసాగుతున్న ఈ జాడ్యాన్ని ఇప్పటికైనా మార్చాల్సిన అవసరం ఉంది లేదంటే మన హిందూ పండగలు ఇంకా విమర్శలు పాలు కావాల్సి వస్తుంది... ఎంతో లోక హితం కోరే మన పండగలు ఆరోగ్యం ఆహ్లాదం సాటి మనుషులకు జీవన భృతి ని ఉపాధిని కల్పించే మన పండగలు ఇలాంటి కార్యక్రమాలు వలన వన్నె కోల్పోయి ఎదుటి వారికి విమర్శ అస్త్రాలు గా మారుతున్నాయి ... నాకు తెలిసి ఈ జాడ్యం మన తెలుగు రాష్ట్రాలు లోనే ఎక్కువ కనిపిస్తుంది... ఒక జాడ్యం ఒకేసారి మారదు కొంచెం కొంచెం అయినా మారినా చాలు. అయితే అందరూ వీటిని మాత్రమే ప్రోత్సహస్తున్నారు అంటే కాదు మంచి కార్యక్రమాలు ప్రోత్సహించి ఔన్నత్యం చాటుతున్నవారు ఉన్నారు అటువంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను దయచేసి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీలు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.. ఇది చదువుతున్నవారు .నలుగురికి తెలిసేటట్టు ఫార్వర్డ్ చెయ్యగలరు ఒక్క కమిటీ మారినా చాలు వాళ్ళ ద్వారా ఇంకొంత మంది మారటానికి అవకాశం ఉంది .... త్రినాధ్



Thursday, September 1, 2022

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

 బదరీ జ్యోతిష్పీఠ మరియు ద్వారకా శారాదాపీఠ సింహాసనాధీశ్వరులు, ద్విపీఠాధీశ్వరులు అస్మద్గురువులు అనన్తశ్రీవిభూషిత ధర్మసామ్రాట్ జగద్గురు శఙ్కరాచార్య స్వరూపానన్ద సరస్వతీ మహాస్వామి వారి 99 ప్రకటోత్సవం(జన్మదిన సందర్భంగా ) కోటి కోటి ప్రాణమాలు..


శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

పదవాక్య ప్రమాణ పారావార పారీణ 

యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాననిష్ఠా

తపశ్చర్యాచరణ చక్రవర్తిన

అనాది గురుపరంపరాప్రాప్త 

వైదికధర్మ ప్రచారణ పారాయణ

సకల దర్శన సమన్విత 

వేద వేదాంత సిద్ధాంత ప్రతిపాదకాచార్య

నిగమాగమ సార హృదయ 

సర్వతంత్ర స్వతంత్రత

వర్ణాశ్రమ సదాచార శిక్షకా

విశ్వకళ్యాణ మానసా

అఖండ భూమండలాచార్యా

అనంత శ్రీ విభూషిత శ్రీ మదాద్య శంకరాచార్య భగవత్పాద స్థాపిత మర్యాదా పోషణ పరాయణా

పరాపర విద్యాధ్భోదితాంతఃకరణా

అలకనందా తీరవాసిన

శ్రీ బదరీనారాయణ సమాధాన మానసా

జ్యోతిరీశ్వరసహిత పూర్ణాంబోపాసక

ఉత్తరామ్నాయ జ్యోతిర్మఠాధీశ్వర 

గోమతీ తీరవాసిన

పశ్చిమామ్నాయ ద్వారకా శారదా పీఠాధీశ్వర 

అనంత శ్రీ విభూషిత శ్రీ జగద్గురుశంకరాచార్య శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివర్యా తవ పాదారవిందయోః సాష్టాంగ ప్రణా

మాన్ సమర్పయామః

🙏🕉️🚩

Thursday, August 18, 2022

 పుష్ప విలాపం.. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 


Pushpa vilapam....the cry of the flower...Jandhyala. Papaiya Shastri.


The delicate flower,cries in pain and anguish, as the  woman plucks the flowers from the creeper and makes garlands by poking  them with needles..


పల్లవి:


నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ

ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతోంది

పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి

అప్పుడు..


నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి

గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి

మా ప్రాణము తీతువా..ఆ..యనుచు బావురుమన్నవి కృంగిపోతు

నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై.. ఆ.. ఆ.. ఆ..


చరణం 1:


అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అన్నది ప్రభు


ఆయువుగల్గు నాల్గు ఘడియల్

కనిపించిన తీగతల్లి జాతీయత దిద్ది తీర్తుము

తదీయ కరమ్ములలోన స్వేచ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము

ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము

ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై

ఆ....ఆ...


ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డు వస్తావ్?

మేము నీకేం అపకారము చేసాం?


గాలిని గౌరవింతుము సుగంధము పూసి

క్షమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు

మిమ్ముబొంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాళుము

త్రుంప బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతురే... ఏ....ఏ....


చరణం 2:


ఇంతలో ఒక గులాబి బాల కోపంతో

ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభూ..


ఊలు దారాలతో గొంతుకురి బిగించి

గుండెలోనుండి సూదులు గ్రుచ్చి, కూర్చి

ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మూ..

అకటా..ఆ.. దయలేనివారు మీ ఆడవారు


పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే


మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల

మీకై త్యజించి కృశించి నశించిపోయే..

మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల

మీకై త్యజించి కృశించి నశించిపోయే..

మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి

మమ్మావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా..ఆ..


చరణం 3:


ఓయీ మానవుడా


బుద్ధదేవుని భూమిలో పుట్టినావు

సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి

అందమును హత్య చేసెడి హంతకుండా

మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ఆ... ఆ... ఆ...


అని దూషించు పూలకన్నియల కోయలేక

వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని

నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..

ప్రభూ ఊ ఊ ఊ...


Friday, June 24, 2022

భయం -ఖలీల్ జిబ్రాన్

 భయం


అంటారు సముద్రంలో కలిసిపోయే ముందు నది 

భయంతో వణకిపోతుందని


దాటివచ్చిన దారిని వెనక్కు తిరిగి చూచుకుంటుంది

పర్వతాగ్రాలనుండి అరణ్యాలు జనపదాలు, వంపుల సుదీర్ఘపయనం.


ఎదురుగా చూచింది ఎంతటి అనంతసముద్రం 

అందులో దిగడమంటే శాశ్వతంగా అదృశ్యమవడమే.


మరో దారి లేదు 

నది వెనక్కు తిరగలేదు. 


సాహసం చేయవలె

సముద్రంలో దిగవలె

అప్పుడే భయం వదిలిపోగలదు

అప్పుడు కాని తెలియదు 

అబ్ధిలో లబ్ధి

అదృశ్యమవడం అంటే

సముద్రమవడం అని. 


                        -ఖలీల్ జిబ్రాన్


నోట్: 

[Nobody can go back

To go back is impossible in existence 


ఆంగ్లానువాదంలోని యీ చరణాలు నా తెలుగు అనువాదంలో వదిలేశాను. అవి లేకున్నా కవిత పూర్ణమే అనిపించింది. ]


Sunday, May 29, 2022

మిత్రులు శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారు, వకీలు, సుప్రీంకోర్టు, మాజీ జిల్లా న్యాయమూర్తి గారితో ముఖాముఖి - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌

 


మిత్రులు శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారు, 

వకీలు, సుప్రీంకోర్టు, మాజీ జిల్లా న్యాయమూర్తి గారితో ముఖాముఖి - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌

ఈ దిగువ లింక్‌ ల్లో చూడండి

1) https://www.youtube.com/watch?v=o9XIU4DJyGs




2) https://www.youtube.com/watch?v=-Lnbvi7rqVQ








Monday, February 28, 2022

"స్కైలాబ్" తగిన ప్రచారానికి నోచుకోని ఒక చక్కని సినిమా

 ఒక చక్కని సినిమా ఇది ప్రచారం లేదు  

4 డిసెంబర్ 2021 తేదీన విడుదలైన స్కైలాబ్ సినిమా ఎంతమంది చూసారు. 1979లో స్కైలాబ్ నేలమీద పడబోతోందన్న వార్త ఇతివృత్తంగా ఆ నేపథ్యంలో ఒక తెలంగాణా పల్లెటూరి నేపధ్యంగా అల్లిన ఈ చిత్రం లో  సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, నారాయణరావు, తులసి, సుబ్బరాయ శర్మ, తదితరులు నటించిన ఈ సినిమా 

1979లో స్కైలాబ్ ఊరి మీద పడుతుందని అప్పట్లో ప్రతి ఊళ్లోనూ కలకలం ఏర్పడిన సంగతి అప్పటి వారికి తెలుసు. 

ఎలాగూ పొతాము అనే తెగింపుతో చాలామంది ఆస్తులమ్మేసుకోవడం, దానాలు చేసేయడం, రకరకాల తీరని కోర్కెలు తీర్చేసుకోవడం, ఎవర్నైనా తిట్టాలనుకుంటే భయాన్ని పక్కనబెట్టి తిట్టేయడం, పెరట్లో ఉన్న కోళ్లని మేకల్ని కోసుకు తినేయడం, రైతులు పొలం పనులకు వెళ్లకపోవడం, చాలమంది తాగి పొడుకోవడం లాంటివి చేసారు. 

చివరికి స్కైలాబ్ సముద్రంలో పడడంతో కధ సుఖాంతం అయింది. సరదాగా నడుస్తుంది. నటీనటుల హవభావాలు, నెపధ్య సంగీతం కెమెరా పనితీరు, ఆర్ట్ వర్క్ లాంటి సాంకేతిక విలువలు బాగున్నాయి  1979 నాటి కాలాన్నిపునఃసృష్టించడం కళా దర్శకుని ప్రతిభ కు నిదర్శనం. ఈ చిత్రం ఒక ఆర్ట్ సినిమాలా అలరిస్తుంది. 

మీ కోసం ఈ లింక్‌ ఇస్తున్నాను. https://www.youtube.com/watch?v=CFj76ZnB-5Q   చూడండి! ప్రచారం మనం కల్పిద్దాం! మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్‌ 



Sunday, February 13, 2022

ఇకనుంచైనా నీటి వనరులను, ప్రేమాభిమానాలను పదికాలాలు కాపాడుకుందాం!

 ఇకనుంచైనా నీటి వనరులను, ప్రేమాభిమానాలను పదికాలాలు కాపాడుకుందాం!

జల్లూరు బావి పన్నీటి జల్లు స్నానం!
చినుకులా రాలిన నీటి చుక్క నదులుగా వాగులై వరదలై కడలి లో కలిసే
ఆ మహా ప్రస్థానంలో అలా అలా, కాలువలై సాగి సాగి, కాస్త ఆగి ఆగి, ఊరిలో చెరువులై కూసింత సేద తీరి మానవ నాగరికతకు జీవం పోసిన "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి" అంటూ సంకల్పం చెప్పుకునే నీటిపై మానవాళి కృతజ్నత క్రమంగా కనుమరుగై స్వచ్చమైన నీరు కాస్తా మురుగుగా మారిపోతొంది. తాగునీటి, సాగునీటి కాలువలు అడుగంటి
మురుగునీటి కాలువలు నిత్యం పెరుగుతున్నాయి. ఆనాటి ఇంటింటా నీటి వనరుగా విలసిల్లిన బావి, నుయ్యి అని పిలవబడే
ఈ వనరు ఓ అందమైన జ్నాపకంగా మారింది. ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది.అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు. ఆ సాంప్రదాయ కొనసాగుతున్న అరుదైన ఇళ్లల్లో మా పెద్దమ్మ గారి ఊరు జల్లూరు పుణ్యక్షేత్రాలు అటు పిఠాపురం ఇటు సామర్లకోట కు మధ్యలో వుంది. పూర్వం జైనలూరుగా ప్రసిధ్ది చెందిన ఈ ఊరులో కూచిమంచి వారు బహుమంచి వారు కరణీకం ప్రధాన వృత్తిగా, ధర్మం ప్రధాన ప్రవృత్తిగా విలసిల్లిన ఆ అపురూప సాంప్రదాయాన్నిఈ తరం వరకూ అదే ఆప్యాయత, ఆదరణ, అభిమానం, ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఈనాటికీ అడుగంటని ఈ తియ్యటి కొబ్బరి నీటి బావి లాగే సజీవంగా వున్నాయి. తరచు ఆ జల్లూరు పన్నీటి జల్లుల్లో ఇలా నా శారీరిక, మానసిక మాలిన్యాన్ని శుభ్ర పరచుకోవడం కోసం ఉవ్వీళ్ళూరుతాను.
పూర్వం కాలువలు, చెరువులు నుంచి కావిళ్ళతో, ఇంట్లో నూతినుంచి ఇలా చేదతో ఓపికతో తోడుకున్న వాడికి తోడుకున్నంత మహదేవా అన్నట్లుగా అవసరానికి మాత్రమే వాడేవారు. ఇప్పుడు చెరువులు పూడ్చి, ఇళ్ళు కట్టి, గొట్టపు బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును మోటారు పంపు ద్వారా వ్యవసాయంలో అటు సాగునీటికి ఇళ్లల్లో కూడా తాగునీటికి విరివిగా వినియోగించడం వల్ల మోటర్లతో తోడి, టాంకుల్లో సంపుల్లో నింపి నిత్యం ఎంతో వృధాగా సింకుల్లో ఇంకిస్తున్నాం. బావులు రకాలు
దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో బావిగిలక నిర్మించబడి ఉంటుంది.
ఇకనుంచైనా నీటి వనరులను, ప్రేమాభిమానాలను పదికాలాలు కాపాడుకుందాం!

Saturday, January 29, 2022

కొండేపూడి వారి "మన ఊరు మన ఇల్లు" వీడియో చూడండి.

 కొండేపూడి వారి "మన ఊరు మన ఇల్లు" వీడియో చూడండి.

సీరియల్సు, బిగ్‌ బాస్‌ లాంటి కార్యక్రమాలు కాస్త ఆపి
ఇలాంటి వీడియోలు కుటుంబ అంతా కలిసి చూస్తే
నేటి తరానికి మన బంధాలు, అనుబంధాలు,
పండుగలు, ఉత్సవాలు అర్ధమవుతాయి.
కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లల సమూహం.
ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో
రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం.
పూర్వ కాలం నుండి భారత దేశ కుటుంబ వ్యవస్థ
ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.
సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు,
నాయనమ్మ తాతయ్యలు, తల్లితండ్రులు, భార్యా భర్తలు,
పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, అన్నయ్యలు, తమ్ముళ్ళు
ఇంకా ఆ కుటుంబ సభ్యుల వివాహాల ద్వారా మరిన్ని వంశాల
బంధుత్వం ఇలా అటువంటి ఉమ్మడి కుటుంబాల లో
మా విస్సా వారి కుటుంబం కూడా ఒకటి అలాగే
మా కొండేపూడి వారి కుటుంబ గురించి నేటి తరం వారికి
తెలియ చెప్పెందుకు ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=E6yT-uWaVyE వీడియో చూడండి.
మన బంధాలు అనుబంధాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేద్దాం! మరో తరానికి పరిచయం చేద్దాం! విస్సా ఫౌండేషన్‌!

Thursday, January 27, 2022

ఇది మేఘ సందేశమూ అనురాగ సంకేతమూ

 ఇది మేఘ సందేశమూ అనురాగ సంకేతమూ 

లేత మనసుల తొలి ప్రేమలో 

అనురాగ సందేశాన్ని ఇంత అందంగా 

ఆ మేఘ సందేశాన్ని అమోఘంగా మోసుకొచ్చి

మనసులకు హత్తుకునేలా 

అక్షరసుమాల భావ గీతం, 

అందుకు అనువైన సంగీతం 

అహ హా హా హాయి అనిపించే ఆ ఆలాపన, ఆ యుగళ గానం 

అద్భుతాలు అన్నీ కలగలిసిన సమ్మేళనా సంకేతం 

అహహహ ఆ ఆ ఆ హా

చిరుజల్లు కురిసేది విను వీధిలో కాదు అది విన్న మదిలో 

ఆ ఆ ఆ హా వెల్లువలా పొంగే ఆ పాల వయసుల 

మూగ మనసుల ప్రణయ గీతానికి 

ఈ పాట బాటలో మరిన్ని పాటలు 

అక్షారాల వంతెన వేసి 

పల్లవి చరణాలుగా 

ఆచరణ లోకి వచ్చేది ఎప్పుడో 

ఆ వాగ్ధానం చేసేవారు ఎవరో 

ఆప్పుడే కదా 

కలిసిన హృదయాలకది దీవెన


Wednesday, January 19, 2022

2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ ఓవర్‌ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం - సత్యసాయి విస్సా నిలయం

 2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ ఓవర్‌ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం - సత్యసాయి విస్సా నిలయం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన 2019 క్రికెట్ ప్రపంచ కప్ లో టై మరియు సూపర్‌ ఓవర్‌ లలో /ఛాంపియన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులు గెలుచుకున్నది మాత్రం న్యూజీలాండ్‌ అందులో ముఖ్యంగా జట్టు కెప్టెన్‌ స్థిత ప్రజ్ఞత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవ్వు ఆఖరి ఓవర్ ప్రపంచ కప్ ఈ ఉత్కంఠను శిఖరాగ్రానికి చేరుస్తూ ఫైనల్‌ ఓవర్లో ఇంగ్లండ్‌ లక్ష్యం 4 బంతుల్లో 15 పరుగులు. ఫైనల్‌ అనే త్రాసు కివీస్‌ వైపు మొగ్గింది. మూడో బంతిని స్టోక్స్‌ లాగిపెట్టి సిక్స్‌ కొట్టాడు. అప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రాయల్ స్మైల్ నవ్వు ఇంగ్లండ్‌ లక్ష్యం 3 బంతుల్లో 9 పరుగులుగా మారింది. అప్పటికీ కివీ్‌సదే ఆధిపత్యం. నాలుగో బంతికి స్టోక్స్‌ 2 పరుగులు తీయడం.. ఫీల్డర్‌ గప్టిల్‌ వేసిన త్రో స్టోక్స్‌కు తగిలి బౌండరీ లైన్‌ దాటడంతో మొత్తంగా 6 పరుగులొచ్చాయి. ఫైనల్‌ మ్యాచ్‌కు ఇదే టర్నింగ్‌ పాయింట్‌. చివరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లండ్‌ విజయానికి చేరువైంది. పక్కాగా ఇంగ్లండే గెలుస్తుందని అందరూ ఫిక్సయ్యారు కూడా! ఐదో బంతికి రెండో పరుగు తీసే యత్నంలో నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న రషీద్‌ రనౌట్‌ అయ్యాడు. చివరి బంతికి 2 పరుగులు కావాలి. బౌల్ట్‌ వేసిన ఫుల్‌ టాస్‌ను లాంగ్‌ ఆన్‌ దిశగా ఆడాడు స్టోక్స్‌. వెంటనే ఈ వైపు నుంచి స్టోక్స్‌.. నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌ నుంచి వూడ్‌ పరుగులు పెట్టారు. ఒక పరుగే పూర్తయింది. రెండో పరుగు పూర్తయ్యేంతలో వూడ్‌ రనౌట్‌ అయ్యాడు!! 241 పరుగులతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్‌ టై!!

Wednesday, January 12, 2022

ఆముక్తమాల్యద కావ్యం గురించి సులభంగా వివరించగల శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఈ వీడియో ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=ioTwaML5syU

 

ధనుర్మాస శుభవేళ! ముక్కోటి ఏకాదశి పర్వదినాన పెద్దలు, పిల్లలతో కలిసి వీలున్నసమయంలో https://www.youtube.com/watch?v=ioTwaML5syU

ఈ వీడియో చూస్తే మనకున్న అనేక సందేహాలు తీరిపోతాయి

1. ధనుర్మాసం అంటే ఏమిటి?

2. శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కథ ఏమిటి?

3. ఆముక్తమాల్యద అంటే ఏమిటి?

4. ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేసి సాయంత్రం కవుల సాహిత్యంతో పోటీపడి యుద్దంలోనూ, కవిత్వంలోనూ గెలిచి సాహితీ, సమరాంగణ సార్వభౌముడు అని పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఈ ఆముక్తమాల్యద కావ్యం గురించి   సులభంగా వివరించగల శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఈ వీడియో ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=ioTwaML5syU  చూడండి. మన ఘన చరిత్ర తెలుసుకుందాం తెలియజేద్దాం -  విస్సా పౌండేషన్!


Friday, December 24, 2021

స్వచ్ఛ భారత్ అభియాన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా విస్సా ఫౌండేషన్‌ కు చేంజ్‌ మేకర్‌ బేడ్జ్‌ స్థాయి ఓ గర్వ కారణం!

స్వచ్ఛ భారత్ అభియాన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా విస్సా ఫౌండేషన్‌ కు చేంజ్‌ మేకర్‌ బేడ్జ్‌ స్థాయి ఓ గర్వ కారణం 1 వ స్థాయి 480 పాయింట్సు నుంచి 16 స్థాయిలు దాటి 1 లక్ష పాయింట్సుకి చేరువై ఇప్పుడు 3 లక్షల 1970 పాయింట్సు చేరిన ప్రస్థానం . ఇది నిజంగా మా చిన్నారుల విజయం. మా విస్సా ఫౌండేషన్‌! బాలమిత్ర, చందమామలకు వారి తల్లితండ్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఈ విజయం మా చిన్నారులందరిదీ మరీ ముఖ్యంగా వారిని ఉత్సాహంగా పంపుతున్న వారి తల్లితండ్రులదీ అని సవినయంగా మనవి చేస్తున్నాను. స్వచ్చ భారత్‌ కార్యక్రమాలు 2014 సంవత్సరం నుంచి మా విస్సా ఫౌండేషన్‌ అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఆదివారం పిల్లలకు వివిధ తరగతులు, కార్యశాలలు నిర్వహించి వివిధ అంశాల పట్ల అవగాహన కలిగేలా ఉదా: మొక్కలు నాటడం, నీళ్ళు పోయడం, కలుపు తీయడం వంటి సంరక్షణ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్ధాల పునర్వినియోగం వంటి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలను ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్‌ వెబ్‌ సైట్‌ లో ఉంచడం జరిగింది. ఆ విజయ ప్రస్థానం అనంతంగా కొనసాగుగాక!





Thursday, December 23, 2021

వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన #రత్నం రతన_టాటా. ''

 

వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన #రత్నం
డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు. కారణం ఆ నాల్గవ వ్యక్తి #రతన_టాటా. '' సార్ , మీరు ? '' '' అవును , మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? '' అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ]
TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది !
బాల్యంలో ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది.
యవ్వనంలో ఆయన girl friend మోసం చేసింది.
ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి.
కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. #TATA సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది :
టాటా సంస్థ అయిన #TCS యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.
భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది.
ప్రతి ఏటా అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50000 + కోట్లు ]
నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క #TajHotel మీద [ కింద ఫోటోలో కనిపిస్తుంది ] ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం , పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ] నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు : Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.
నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద. ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశాన్ని సేవిస్తున్నాడు.
(సేకరణ)

Saturday, December 11, 2021

 64లక్షల #జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక #పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా #దేహం పెరుగుతుంది. దేహం మీద #మోహం పెరుగుతుంది.

ఈ దేహం నేనె అంటాం. కానీ ఎలా?

నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?

ఏ భాగము వినదు.

వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.

చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6అడుగులు అవుతుంది.

అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.

ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?

ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?

ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?

ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు. 

ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.

ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి యొక్క అర్థం అని తెలుసుకొ..

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.

రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.

చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.

ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

రూపానికి ముందు నువ్వున్నావు.

రూపంలో నువ్వున్నావ్.

రూపం వదిలేశాకా నువ్వుంటావు.

ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు. 

ఈ దేహం అమ్మ నాన్న లు ఇచ్చిన ఒ అద్భుత వరం. 

కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్....👏👏

Sunday, December 5, 2021

దొరకునా ఇటువంటి సేవ! స్వామియే శరణం అయ్యప్ప!!

 

దొరకునా ఇటువంటి సేవ! స్వామియే శరణం అయ్యప్ప!!

శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతిచోటా పడిపూజలు నిర్వహించి అహారపదార్ధాల ప్రసాదం అందించడం సాధారణం 

అలా కాక కొత్తగా అలొచించి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్త యాత్రీకులకు మార్గ మధ్యంలో భోజన సదుపాయం కల్పించాలన్న నా సంకల్పానికి మిత్రులు రిటైర్డ్‌ జడ్జ్‌ శ్రీ మాల్యాద్రి గారు స్పందించి వారి విశ్వవ్యాప్త సేవా సంఘం నెట్వర్క్‌ ద్వారా నెల్లూరు రైల్‌ స్టేషన్‌ లలో  04.12.2021 తేదీన  మధ్యాహ్నం 1 గంటకు 60 మంది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు నెల్లూరు శ్రీ గొనుగుంట సుధాకర్‌ రావు గారు శ్రీ సత్యనారాయణ గారి సహాయంతో మరియు 05.12.2021 తేదీన ఒంగొలు రైల్‌ స్టేషన్‌ లలో 6 మంది భక్తులకు శ్రీ నేరెళ్ళ శ్రీనివాస్‌ గారి ద్వారా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. చేసింది చెప్పకూడదు అంటారు కానీ కొత్తగా అలోచించి ఇలా, కాశీ, తిరుపతి మొదలైన వివిధ తీర్ధయాత్రలు చేసే భక్త యాత్రీకులకు మనం ఇలా కల్పిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్‌ పెట్టడం జరిగింది. కావున నా విన్నపం ఏమనగా? వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌ దగ్గరలో వున్న సేవా భావం కలిగిన ఔత్సాహిక మిత్రులు వారి ఫోన్‌ నంబర్ల వివరాలు నా మెసేజ్‌ బాక్స్‌లొ ఇవ్వ మని మనవి. భవిష్యత్‌ కార్యాచరణకు వారి సహాయ, సహకారాలు అవసరం అయినప్పుడు వినియోగించ వచ్చు. 



శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతిచోటా పడిపూజలు నిర్వహించి అహారపదార్ధాల ప్రసాదం అందించడం సాధారణం 

అలా కాక కొత్తగా అలొచించి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్త యాత్రీకులకు మార్గ మధ్యంలో భోజన సదుపాయం కల్పించాలన్న నా సంకల్పానికి మిత్రులు రిటైర్డ్‌ జడ్జ్‌ శ్రీ మాల్యాద్రి గారు స్పందించి వారి విశ్వవ్యాప్త సేవా సంఘం నెట్వర్క్‌ ద్వారా నెల్లూరు రైల్‌ స్టేషన్‌ లలో  04.12.2021 తేదీన  మధ్యాహ్నం 1 గంటకు 60 మంది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు నెల్లూరు శ్రీ గొనుగుంట సుధాకర్‌ రావు గారు శ్రీ సత్యనారాయణ గారి సహాయంతో మరియు 05.12.2021 తేదీన ఒంగొలు రైల్‌ స్టేషన్‌ లలో 6 మంది భక్తులకు శ్రీ నేరెళ్ళ శ్రీనివాస్‌ గారి ద్వారా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. చేసింది చెప్పకూడదు అంటారు కానీ కొత్తగా అలోచించి ఇలా, కాశీ, తిరుపతి మొదలైన వివిధ తీర్ధయాత్రలు చేసే భక్త యాత్రీకులకు మనం ఇలా కల్పిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్‌ పెట్టడం జరిగింది. కావున నా విన్నపం ఏమనగా? వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌ దగ్గరలో వున్న సేవా భావం కలిగిన ఔత్సాహిక మిత్రులు వారి ఫోన్‌ నంబర్ల వివరాలు నా మెసేజ్‌ బాక్స్‌లొ ఇవ్వ మని మనవి. భవిష్యత్‌ కార్యాచరణకు వారి సహాయ, సహకారాలు అవసరం అయినప్పుడు వినియోగించ వచ్చు. 

నేనేమీ చెయ్యలేదు చేసినదంతయు ఆ సర్వేశ్వరుడే అని 

మా పెద్ద తాతగారు కీ.శే. బ్రహ్మశ్రీ విస్సా వేంకట రావు గారు రాసిన ఈ పద్యం నాకు ఎప్పుడూ గుర్తు వస్తుంది. 

      చేసితి దానధర్మములు చేసితి నెన్నియొ తీర్థయాత్రలన్

      చేసితి పుణ్యకార్యముల జేసితి నెన్నియొ దైవపూజలన్ 

      చేసితి నన్ని చేతినొక చిల్లియు గవ్వయు లేకపోయినన్ 

      చేసితినంటి గాని యవి చేసినదంతయు నీవెగా ప్రభూ!

అంతా మనం చేసాం అనుకుంటాము కానీ చేసేదంతా ఆ జగన్నాటక సూత్రధారి. మనమంతా పాత్రధారులమే, అందుకే ఏ పుణ్యకార్యం అయినా చివరలో శ్రీ కృష్ణార్పణం అనిపిస్తారు. కర్తా కారయితా చైవ ప్రేరక శ్చానుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారస్సమ భాగినః వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. 

భవదీయుడు 

సత్యసాయి విస్సా ఫౌండేషన్‌!

Wednesday, December 1, 2021

తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేకతలు

 తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ఆలయాలు:

అప్పనపల్లి వెంకన్నబాబు
అయినవిల్లి వినాయకుడు
ముక్తేశ్వరం శివాలయం
ర్యాలి జగన్మోహన స్వామి
ముమ్మిడివరం బాలయోగి
మురమళ్ళ నిత్య శివపార్వతీ కల్యాణం
జగ్గన్నతోట ప్రభలతీర్థం
వాడపల్లి వేంకటేశ్వర స్వామి
ద్రాక్షారామం భీమేశ్వరుడు
సామర్లకోట కుమార భీమేశ్వడు
అన్నవరం సత్యనారాయణ స్వామి
బిక్కవోలు సుబ్బారాయుడు
నవ జనార్ధనలు
మందపల్లి శని దేవుడు
పిఠాపురం కుక్కుటేశ్వరుడు
కోరుకొండ నరసింహుడు
అంతర్వేది నరసింహ స్వామి
సర్పవరం భావనారాయణుడు
చింతలూరు ధన్వంతరి స్వామి
ద్వారపూడి అయ్యప్ప
గొల్లాలుమామిడాడ సుర్యనారయణ
జిల్లా గ్రామదేవతలు:
కాకినాడ నూకాలమ్మ
తుని దగ్గర లోవ తలుపులమ్మ
పెద్దాపురం మరిడమ్మ
కాండ్రకోట నూకాలమ్మ
చింతలూరు నూకాలమ్మ
దేవి పట్నం గండిపోశమ్మ
కత్తిపూడి సత్తిమ్మ
గొల్లపాలెం ధనమ్మ
జిల్లా ప్రత్యేకం:
అమలాపురం అరటి తోటలు
కొత్తపేట కొబ్బరి తోటలు
అంబాజీపేట వంటాముదం
రావులపాలెం గోదావరి బ్రిడ్జి
రాజోలు రాజుల దర్జా
ముక్కామల పప్పుచెక్కలు
బెండమూర్లంక దోసకాయలు
ఎదుర్లంక బాలయోగి బ్రిడ్జి
కోటిపల్లి నావల రేవు
పుల్లేటికుర్రు చేనేత చీరలు
గంగలకుర్రు గంగా బొండాలు
ఆత్రేయపురం పూతరేకలు
పసలపూడి గోదారి కథలు
రామచంద్రపురం పంటపొలాలు
తాపేశ్వరం మడత కాజా
మండపేట బెల్లం గవ్వలు
బొబ్బర్లంక కొబ్బరుండలు
తుని తమలపాకులు
కత్తిపూడి కరకజ్జం
బెండపూడి బెల్లం జీళ్ళు
జగ్గంపేట జాంపళ్ళు
ప్రత్తిపాడు జొన్నపొత్తులు
రాజానగరం సీతాఫలాలు
రాజమండ్రి రైలు బ్రిడ్జి
ధవళేశ్వరం ఆనకట్ట
కడియం పూలతోటలు
ద్వారపూడి బట్టల సంత
అనపర్తి చేపల చెరువులు
సామర్లకోట పంచదార ఫాక్టరీ
పెద్దాపురం పాండవుల మెట్ట
పిఠాపురం అత్తరు సెంటు
గొల్లప్రోలు పచ్చమిర్చి
కాకినాడ కోటయ్య కాజా
ఉప్పాడ పట్టుచీరలు
మామిడాడ మామిడి తాండ్ర
తాళ్ళరేవు తాటి తాండ్ర
ఏలేశ్వరం వంకాయలు
వడిశలేరు చేగోడి
అడ్డతీగెల పనసకాయలు
గోకవరం మామిడి తోటలు
మారేడుమిల్లి అడవుల అందాలు
కాకినాడ హోప్ ఐలాండ
ఇవేగాక
కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు కాకినాడ. కాకినాడ 'యంగ్ మెన్స్ క్లబ్' నుంచి
రేలంగి, ఎస్వీ రంగారావు, అంజలీదేవి, నల్ల రామ మూర్తి , ఆదినారాయణ రావు, సత్యం (సంగీతం) మొదలగు వారు ఇక్కడి వారే.
చదువుల తల్లి సరస్వతీ నిలయం రాజమండ్రి:
వీరేశలింగం, పానుగంటి, చిలకమర్తి, మొక్కపాటి, శ్రీపాద, వేదుల, దేవులపల్లి, భమిడిపాటి, మునిమాణిక్యం వంటి లబ్ధప్రతిష్ఠులైన రచయితలు ఇక్కడి వారే!
ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారత రచనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే!
జయప్రద, రాజబాబు, అలీ మొదలగు వారు రాజమండ్రి ప్రాంతము వారే!
ఇలాంటివి ఇంకా ఎన్నో జిల్లా ప్రత్యేకతలు ఉన్నాయి.

Monday, November 29, 2021

అమ్మా శ్రీ మాత్రై నమ: అమ్మలా ఇలా ప్రదోష వేళ శివ శివానీ ఆరాధన మా తరమా! 1

అమ్మా శ్రీ మాత్రై నమ:




అమ్మలా ఇలా ప్రదోష వేళ శివ శివానీ ఆరాధన మా తరమా!
1) https://www.youtube.com/watch?v=CH_ur268TmQ

అమ్మ పూజలు లేని కార్తికం నమ్మ లేకుండా వుంది.
నింగీ, నేల, నీరు, నిప్పూ, గాలి,
గుళ్ళు, గోపురాలు, నదులు, సముద్రాలు
చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, రాయి, రప్ప, సకల జీవాల్లొ
సర్వే సర్వత్రా నిండివున్న ఆ సర్వేస్వరుణ్ణి ప్రార్ధించేందుకు
వయస్సు, వాతావరణం అడ్డంకి కాదు ఆవిడకి
నోములూ, పూజలు, వ్రతాలు, పండుగలు, పబ్బాలు
తెల్లవారు ఝామున చన్నీటి స్నానాలు, ఉపవాసాలు
మధు మేహం వున్నా, హృద్రోగం వున్నా దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినకుండా
ఇంటిలోను, పెరట్లో తులసికోటకు పూజలు అయినాక
రుబ్బురోలు కూడా శివ శివానీ స్వరూపమైపోతుంది పూజలందుకుంటుంది.
ఆ భక్తి సంకల్పం ముక్కోటి దేవతలూ ఆవిడ చేత
నిత్యనీరాజనల పూజలందుకుని ఆనందించి ఆవిడ కోరుకున్న
"పువ్వులా తీసుకు వెళ్ళిపోండి" అన్న ఆవిడ ప్రార్ధనలు
విని వారి సన్నిధిలో నిత్య కైంకర్యాలకు నియమించుకున్నారు.
చిన్నప్పటి నుంచి ఏ మాసమైనా,
ఏ పండుగైనా ఆవిడ హాడావుడి అవిడదే
అందరికీ సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానాలు అయిపోవాల్సిందే
ఎప్పుడూ మా అందరి క్షేమం కోసం అదుర్ధా పడే దానివి
అలా ఎలా వెళ్ళిపోగలిగావు, అనాయాసంగా
అర్ధాంతరంగా, నిర్దయగా,
మమ్మల్ని ఈ లోకంలో పడేసి
అయ్యో పిల్లలు ఏమైపోతారు అన్న బెంగ లేకుండా
అమ్మా శ్రీమాత్రై నమ:

మాతృదేవోభవ! అమ్మా నీ విలువ ఇప్పుడే తెలుస్తోంది. వెలుగు చూపిన అమ్మ అంటే ఎందుకో అంత చిన్న చూపు. అమ్మ జ్ఞాపకంగా మారిపోడం వ్యక్తి జీవనంలో అత్యంత దురదృష్టకరం. చిన్నప్పుడు ఆటపాటల్లో మురుస్తూ అమ్మను మరుస్తాం. అది తెలియని తనం పెద్దయ్యాక బతుకు తెరువుబాటలో మరోమారు అమ్మను మరుస్తాం అది తెలిసిన తనం. అమ్మేకదా అన్నచులకన భావం అమ్మ విలువ అమ్మ ఉండగా తెలుసు కోలేము తల మీద తైలం పెట్టి అమ్మ కడుపు చల్లగా అంటూ వెన్ను నిమురుతూ ఆశీర్వదించిన ఆ ఆ చెయ్యి, ఆ స్పర్స, ఆ సుస్వరం ఒక్కసారిగా మాయమై స్వర్గానికి చేరుకోవడం ఎంత దురదృష్టకరం శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష!! అన్న అభ్యంగన స్నానానంతర ఆశీర్వచన అనుభూతి అనిర్వచనీయం ఇక సదా స్మరణీయం! కోరితేగానీ, కోరినాగాని వరమీయడు ఆ దైవం కోరకుండానే ఎల్లప్పుడూ మన బాగుకోరే అమ్మే మన దైవం అమరపురికేగిన అమ్మ ఆశీర్వచనం మాత్రం అమరం మాతృదేవోభవ! అమ్మ కనుమరుగైన వేళ ఆదరంతో అనునయించిన బంధు మిత్రులందరికీ శతసహస్ర వందనాలు🙏🙏🙏🙏🙏🙏


Total Pageviews