Monday, July 18, 2016

రేపు అనగా 19-07-2016న *గురుపూర్ణిమ*. ఈ సందర్భంగా గురుపూర్ణిమకు సంబందించిన కొన్ని విషయాలు మీఅందరితో పంచుకోవాలని అనుకుంటూ...మీ అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.

ఓం శ్రీ గురుభ్యోం నమహా: ఓం శ్రీ మహాగణేశాయ నమహా : ఓం శ్రీ సరస్వత్యై నమహా:
" గురుపూర్ణిమ " పర్వదిన సందర్భంగా గురుదేవులందరికీ, ముఖపుస్తక మిత్రులకు, బందువులకు, చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
గురుర్బ్రహ్మా గురువిష్ణు: గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమహా:
అంటూ పిల్లలకు విద్యాభ్యాసాన్ని ప్రారంబిస్తారు.పై శ్లోకం గురుదేవుడనే మాటకు అర్ధం చెపుతుంది.గురువు అంటే త్రిమూర్తులతో సమానమని ఉద్భోదిస్తోంది. మన " శ్రీ గురువు " కనులముందు కనిపించే మహానీయుడు. అందుకే ప్రతి శిష్యుడు గురువును దైవంగా పూజించాలి. మంచి విద్యాబుద్ధులు ప్రసాదించి, మంచి జీవితాన్నిచ్చిన గురువుకు శిరస్సు వంచి పాదాభి వందనం చేయాలని గుర్తు చేస్తోందీ గురు పూర్ణిమ.
మనిషి తన జీవితంలో తీర్చుకోలేనిది గురువు రుణం ఒక్కటే. అందువల్లనే " మాతృదేవోభవ " "పితృదేవోభవ " అన్న తరువాత " ఆచ్చార్యదేవోభవ " అని చెప్పి గురువు స్థానాన్ని తెలియచేసారు మన పూర్వీకులు. తల్లితండ్రి తరువాత స్థానం గురువుదే. దైవత్వాన్ని కుడా గురువు ద్వారానే దర్శించవలసి వుంటుంది.
ఈ సందర్భంగా గురువులకే గురువు, విజ్ఞాన ఖని, విశ్వ గురువు అయిన శ్రీ దత్తాత్రేయుడిని
జన్మ సంసార బన్ధఘ్నమ్స్వరూపానంద దాయకం
నిశ్రేయసప్రద వందే స్మర్త్రుగామీ నమావతు!
అని స్మరించుకుందాము. మహాభారత గ్రంధకర్త , మన పురాణాలలో పేర్కొన్న చిరంజీవులలో ఒకరైన వేదవ్యాసుడు జన్మించినది ఈరోజే. "వ్యాసో నారాయణో హరి:" అసలు ఈయన పేరు "కృష్ణద్వైపాయనుడు". భూత భవిష్య ధ్వర్తమానాల నెరిగిన మహా పౌరాణికుడు.ఋషులకే ఋషి, పండితులకే మహా పండితుడాయన.
"వ్యాసం వశిష్టనప్తారం శక్తే: పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాటం తపొనిధిమ్,
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే,
నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమహా:"
అని స్మరిసూ అదేవిధంగా ఆది గురువైన శంకరా చార్యులను, సదా శివుని స్వరూపమైన దక్షిణా మూర్తి ని స్మరిస్తూ ఆది నుండి ఈ నాటి గురువరేణ్యు లందరికీ శతసహస్ర పాదాభివందములు. గురు పూజోత్సవ శుబాకాంక్షలు.



No comments:

Post a Comment

Total Pageviews