Friday, December 29, 2017

వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.

Image result for వైకుంఠ ఏకాదశికలియుగ వైకుంఠమైన తిరుమల - శ్రీ వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహా వైభవంగా నిర్వహింపబడుతుంది. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని , మరునాడు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరుకూ శ్రీ వారి గర్భాలయానికి ఆనుకొనియున్న ముక్కోటి ప్రధక్షిన మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏకాదశీ , ద్వాదశీ రెండు రోజులూ శ్రీ వారి దర్శనాంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణామార్గంలో వెళ్తారు. ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని , ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణమని అంటారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినంనాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగుల విద్ద్యుద్దీపాలతో,పూలమాలలతో మనోహారంగ అలంకరింపబడుతుంది. శ్రీ స్వామి వారికి అత్యంత సమీపంలో ఉన్నఈ ప్రదక్షిణ మార్గంలో దర్శనాంతరం వెళ్ళిన భక్తులు ఒక ఆశ్చర్య దివ్యానుభూతిని అనుభవిస్తారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు మన అందరిపైనా ఎల్లవేళలా ఉండాలని కోరుకొంటూ ... సర్వేజనా సుఖినోభవంతు.

No comments:

Post a Comment

Total Pageviews