Saturday, July 26, 2014

పోతన భాగవత పద్యం.

పోతన భాగవత పద్యం.

జగదీశ్వరునకుం  జన్నిచ్చు తల్లిగా 
నేమి నోము నోచె నీ యశోద !
పుత్రుండనుచు నవని బోషించు తండ్రిగా 
o డేమి సేసె నందితాత్మ!

భావం:-    మహర్షీ!ఈ జగత్తుల కన్నింటికీ ప్రభువైన భగవంతునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి  ఈ యశోదాదేవి వెనుకటి జన్మలో ఏ నోములు నోచిందో? శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏ తపస్సులు చేసాడో ? కృష్ణ కధామృతం త్రాగి ఆనందించిన మహాత్ముడవు నీవు.

No comments:

Post a Comment

Total Pageviews