Thursday, June 30, 2016

భారత దేశీయ ఆవు పాలు: -
1.కొంచెం పలుచగా ఉంటాయి.
2.త్వరగా అరుగును.
3.చిన్న పిల్లలకు తల్లిపాలతో సమానం.
4.మనిషికి చలాకీని పెంచును.
5.ఉదర సంబంధమైన జబ్బులు తగ్గును.
ప్రేగులోని క్రిములు నశించును.
6.జ్ఞాపక శక్తిని పెంచును.
7.చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే
వ్యక్తులకు తెలివిని పెంచి వారిని
నిష్ణాతులను చేయును.
8.మనస్సును, బుద్ధిని
చైతన్యవంతం చేయును.
9.సాత్విక గుణమును పెంచును.
10.సాధువులు, రుషులు,
మునులు ఆవు పాలనే సేవిస్తారు.
11.యజ్ఞమునకు,
హొమమునకు ఆవుపాలను వాడుతారు.
12.దేవాలయాలలో పూజకు, అభిషేకానికి
ఆవుపాలు వాడుతారు.
13.కార్తీక పురాణములో ఆవునెయ్యితో దీపారాధన
చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని
చెప్పారు.
14.గోవు దేవతా స్వరూపము, కైలాసం దగ్గరలోని
గోలోకమునుండి వచ్చినది. ఆవుపాలు, ఆవునెయ్యి
సేవించిన మనకు దేవతా శక్తి వస్తుంది.
15.ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే
బంగారు తత్వముతో కూడిన విటమిన్ ఎ అధికముగా
కలిగిన కెసీన్ అనే ఎంజైమ్ ఉన్నది. దీని వలన ఆ
పాలు పచ్చగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని
బాగా పెంచుతుంది.
16.తెల్లఆవు పాలు వాతాన్ని, పిత్తాన్ని, నల్ల
(కపిల) ఆవు పాలు పిత్తాన్ని,
ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17.ఆవుపాలు సర్వలోగ నివారిణి.
18.… ఆవుపాలు వ్రుద్దాప్యాన్ని
దూరం చేస్తాయి.
19.ఘ్రుతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య
వర్ధనం.
ఆవునెయ్యి బుద్ది బలమును పెంచును.
ఆవుపాలు ఆయుష్షును పెంచును.
20.ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండంలో
చెప్పారు.
21.ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
22.మనం భుజించిన తేజో (అగ్ని) సంబందమైన
ఆవునెయ్యి, నూనె, వెన్న, వగైరాలలోని
స్ధూలభాగం శరీరంలోని ఎముకలుగా
మారుతుంది. మధ్యభాగము మజ్జ (మూలుగ) గా
మారుతుంది.
సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన
ఎముకలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికము,
శ్రావ్యము అయిన వాక్కు-వీటి కోసం ఆవునెయ్యి,
వెన్న తప్పక తినవలెను.
ఛాందోగ్య ఉపనిషత్ (6-5-3)
23.భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ
మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో
సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో
కూడిన 'స్వర్ణనాడి' (సూర్యకేతు నాడి) అనే
సూక్ష్మ నాడీ ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది.
సూర్యకిరణములు ఆవు మూపురముపై
పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై
సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో
కూడిన పసుపు పచ్చని 'కేసిన్' అనే
ఎంజైమ్ను తయారు చేసి దానిని ఆవు పాలలో
పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి,
వెన్న పసుపుపచ్చని పసిమి రంగులో ఉంటాయి
పాశ్చాత్య గోవులైన జర్సీ, H.F.వంటి
గోవులకు మూపురం ఉండదు. అవి
సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల
ప్రదేశములలో చలికి తట్టుకోనే విధంగా
పరిమాణాము చెందినవి.
వీటికి మన దేశీయ ఆవువలే సూర్యశక్తిని
గ్రహించగల స్వర్ణ నాడి ఉండదు. అందువలన
వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక
పాలఉత్పత్తికై యాంత్రిక జీవులుగా
మనము భావించవచ్చును.

No comments:

Post a Comment

Total Pageviews