Saturday, June 25, 2016

ఉదయం 9 గంటలు ...
హైదరాబాద్ లో ఒక కార్పోరేట్ హాస్పిటల్.
అంతిమ గడియల్లో ఒక వ్యక్తి తన భార్యా పిల్లల్ని పిలిచి చివరి మాటలు మాట్లాడుతున్నాడు.

"చూడండి జీవితంలో యేదీ శాశ్వతం కాదు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. యెవ్వరితోను గొడవలు పెట్టుకోవద్దు.
నా స్వయం శక్తితో ఎన్నో మేడలు ఇళ్ళు సంపాదించాను వాటిని జాగ్రత్తగా కాపాడండి.
పెద్ద కొడుకుని చూస్తూ ... నాయనా హిమాయత్ నగర్ లోని నా 15 బంగళాలు ఇక నీవే.
కూతురితో .. ఖైరతబాద్ లోని 14 బంగళాలు నువ్వు తీసుకో.
చిన్న కొడుకుని చూస్తూ ... నువ్వు చిన్నవాడివి నీ భవిష్యత్తు చాలా బాగుండాలి అందుకే దిల్ శుక్ నగర్ లో నాకున్న 20 కమర్షియల్ బిల్డింగులు నువ్వు తీసుకో.

పెళ్ళాం వైపు చూస్తూ .. రాజ్యం నేను లేను లోటు నీకస్సలు తెలియకూడదు.. అందుకే అందరు మన ఆత్మీయులే ఉండే నల్లకుంటలోని మన జనప్రియ అపార్ట్ మెంట్ లోని 15 ఫ్లాటులు నువ్వు తీసుకో అని చెప్పి తన కష్టపడీ సంపాదించుకున్న యావదాస్తిని సమానంగా పంచానన్న తృప్తితో  ప్రాణాలు విడిచి దైవలోకానికి ప్రయాణమయ్యాడు.

ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న నర్స్, మీరందరూ అదృష్టవంతులమ్మ ఇంత మంచి వ్యక్తి చివరి నిమిషంలో అందరినీ తృప్తి పరుస్తూ ఆఖరికి ఇంత పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ కి 5 లక్షల బిల్లు చేసి మరీ చనిపోయారు అంది...

అప్పుడా పెళ్ళాం అవునమ్మా...

!

!

!

!

!

!

!

!

!

!

!

!

వాడు పంచి ఇచ్చింది .....వాడు తెల్లారగట్ల నిద్రలేచి పాల పాకెట్ లు వేసే గిరాకీల కొంపలు..
ఇక మీ హాస్పిటల్ బిల్లు ఆరోగ్యశ్రీ కార్డు. తల్లీ...

నర్స్ స్పృహ కోల్పోయి కింద పడుంది.

No comments:

Post a Comment

Total Pageviews