Monday, June 13, 2016

నడిచేదేముడు యవత్తుభారతాన్ని పాదచారిగా రెండుమార్లు పర్యటించి తల్లి భారతని ఆమె పుత్రులని పునీతులనిగావించిన పరివ్రాజకాచార్యులు , చతుర్వేదములు ఒౌపాశన పట్టిన వేదమూర్తులు, పరమవైరాగ్య భావనతో సనాతన సంప్రదాయ వైభవాన్ని ప్రకటింపజేసిన ధర్మమూర్తులు, ఆర్తులైదరిచేరిన పామరపండితుల క్లేశములు చెప్పకుండానే గ్రహించి నివారణ యొనరించిన త్రికాలఙ్ఞలు , చారిత్రక పురావస్తు ఇతిహాస దృక్పధాలతో విశేషమైన విషయాలను అనేక ప్రాచీన దేవాలయాలలో దర్శించి భక్తులకు దిశానిర్ధేశం చేసిన ప్రాఙ్ఞులు, ఆర్షవాఙ్మయ వైఖరిలోపించిన ప్రజకు అపారమైన వివిధశాస్రములు సమన్వయ పరచి అనుగ్రహభాషణము లొసంగిన అపరశారదామూర్తులు, దీనజన ఉద్ధరణకై నిత్యచంద్రమౌళీశ్వర అర్చన జరిపిన తేజోమూర్తులు , సదాచార సంప్రదాయ ధర్మాల ద్వార సర్వజన సంక్షేమము ఎంత సులభముగా సిధ్ధిస్తుందో నిరూపించి స్వధర్మ భ్రష్టులని కాపాడిన తల్లికామాక్షీ వరప్రసాది, లవలేశమంత కలిప్రభావముశోకని  ఙ్ఞాని , ఆధునిక విద్యా భోగలాసతల మరియు వికృత ఆశయాల మాలిన్యంలో మసిబారిన బుద్ధులకి  అసలు గురువంటే ఎలా ఉండాలో ప్రపంచానికి ప్రకటించటం కోసం దేహదారులై భువికేతెంచిన         " శంకరాంశము " శ్రీశ్రీశ్రీ కాంచీపురయత్రీంద్రులు  గురువరేణ్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు  — నేడు మనకళ్ళెదుటే అగుపించే సత్యం దర్శించండి  ఆపదలో వున్న తనశిష్యుడు చేయుంచే హవనములో  పీఠాదిపత్య దండముతో ఇలా సహజముగా విచ్చేసి ఉధ్ధరింపజేసిన                ॐ ॐ బ్మ్రాహీభూతుల సాక్షాత్కారం ॐॐ — పరమాత్ముని పలుకులనాలకిధ్ధాం స్వాభిమాన సంపన్నులమౌదాం  అసలు " గురు" వని ఎవరిని పడితే వారిని సంభోదించవచ్చా ? కనీస విఙ్ఞతలోపిస్తున్న సమాజం మోసగాళ్ళ మాయగాళ్ళ అర్హతలేని శిఖామణుల వెంటపడటం ఎంతటి పాపమో అపచారమో కదా ఈజన్మకాదు ఉత్తర జన్మలకి కూడా వుద్ధరణలేకుండా పోతుంది ఇప్పటికైన గమనించి సరిద్ధికోండి ఈవైభవాన్ని అందరికీ చాటండి కొందరు యోగ్యులైన మార్గాన్ని దిద్ధుకుంటారు " జయ జయ శంకర హర హర శంకర " 

No comments:

Post a Comment

Total Pageviews