Friday, July 6, 2018

*లంఖణం పరమౌషధం*

*లంఖణం పరమౌషధం*
అని చెప్పిన మన పూర్వీకులు.
నిన్న మొన్నటి వరకు మన పెద్దలు,
వైద్యులు చెప్పిన ఉపవాసం గురించి లంఖణం గురించి నేటి వైద్యవిధానం అనుసరించిన ఎందరో వైద్యులు, అభ్యుదయవాదులు ఇదంతా కేవలం అనాగరికం అని, మూర్ఖత్వం అని ఎద్దేవా చేసేవారు.
పూర్వం మనకు జ్వరాలు కానీ,
పెద్ద రుగ్మతలు వచ్చినప్పుడు
*లంఖణాలు చేయించే వారు*
దానివల్ల ఎలాగూ నీరస పడేవారు.
*అసలది అవసరం లేదని,
కేవలం ఆంటి బయోటిక్స్ మాత్రమే మందులని మనకు బాగా
తలకెక్కించారు.
ఈ మధ్య వైద్యంలో ప్రకటించిన నోబెల్ బహుమతి గురించి తెలుసుకుంటే ఒకసారి మనం ఆశ్చర్యపోతాము.
*జపాన్ సైంటిస్ట్
యోశినోరి ఒహ్సుమి కి
ఈ సంవత్సరం నోబెల్ బహుమతి ఆటోఫాగి (AUTOPHAGY) మీద ఆయన చేసిన పరిశోధనకు గాను ఇచ్చారు.
ఆటోఫాగి అంటే కణాల రీసైక్లింగ్ పద్ధతి అంటే? “స్వయం భక్షం”.
ఒక శరీరం ఆహారం తీసుకోకుండా వదిలేసినప్పుడు ఆ శరీరం తన లోపలి కణాలు, ఉపయోగించని ప్రోటీన్లను తిని తన అస్తిత్వం నిలుపు కుంటుంది.
ఈ ఆటోఫాగి పద్ధతిని శరీరం కోల్పోతే శరీరం రోగగ్రస్తం అవుతుంది.
మనకు వారానికి ఒక రోజు, ఏకాదశి, శివరాత్రి , కార్తీక సోమవారం లాంటి ఎన్నో పర్వదినాలలొ శరీరానికి ఉపవాసం చేయించే పద్ధతి ఉంది.
*ప్రతీ 15 రోజులకు వచ్చే ఏకాదశి నాడు. పూర్తిగా నిరాహారంగా వుండడం అనేది మనవారు ఎప్పటి నుండో అనుసరిస్తూ వస్తున్న పద్ధతి.
దైవచింతనతో, ఉపవాసం చెయ్యడం మన ఆధ్యాత్మిక పురోగతికి చెప్పిన ఒక పద్ధతి.
*ఈ పద్ధతి ద్వారా ఆటోఫాగి అన్న ప్రక్రియను మనం ఉపయోగించుకుని తద్వారా శారీరక సౌఖ్యాన్ని పొందుతూ వచ్చారు మన పూర్వీకులు.
దీని ద్వారా హానికర కణాలను ప్రక్షాళన చేసుకుని,శారీరక సౌఖ్యాన్ని పెంచి,
ఉపయోగించని ప్రోటీన్స్ ను
కొవ్వును కరిగించుకుని శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచుకునేవారు.
నేటి సైన్సు కొత్త విషయం అంటూ కనుగొన్నాము అంటే, దానికి మన పూర్వపు పద్ధతులకు ఒక లంకె కనబడుతుంది.
మన పూర్వీకులు పక్షంలో ఒక్క రోజు దేవుని స్మరిస్తూ,ఆయన గురించి చింతిస్తూ,ఉపవాసం చేస్తూ,ఆధ్యాత్మిక, శారీరక ఉన్నతిని పొందేవారు.
👇నోబెల్ లింక్:-
https://www.nobelprize.org/…/medi…/laureates/2016/press.html
*వరుసగా మూడు రోజులు నిరాహారంగా ఉండడం వలన శరీరం కొత్త స్టెమ్ సెల్స్ తయారు చేసి, తద్వారా తెల్ల కణాలను సృష్టించి
రోగనిరోధకశక్తిని అమితంగా పెంచు తుంది. అని సథరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మనకు పూర్వం మూడు రోజుల లంఖణాలు చేయించేవారు.
శరీరం నీరసబడ్డా రోగం,
రోగానికి కారణం అయిన
ఆ రోగ సెల్స్ సగమై,
తెల్లకణాలు ఇతోధికంగా పెరగడం వలను ఆ రోగం నయంఅవుతుంది.
👇దాని లింక్
http://www.telegraph.co.uk/…/fasting-for-three-days-can-re…/
కేవలం ఉపవాసం చేస్తే ఎప్పుడూ ఆహారం మీద దృష్టి ఉంటుంది.
కాబట్టి మనస్సుకు ఆలంబనగా భక్తి అనే పరమఔషధాన్ని జతచేసి మనస్సు దేవుని మీద లగ్నం చేయించి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించారు.
నిస్సందేహంగా మన పూర్వీకులు,
ఋషులు మానసిక, ఆధ్యాత్మిక,
శారీరక సంపూర్ణ వైద్యాన్ని నిర్దేశించడానికి ఇటువంటి పద్ధతులను
అనుసరించేవారు.
మనకు పూర్తి అవగాహన లేక ఇలా చాలావాటిని కోల్పోయాము.
వారికి త్రికరణ శుద్ధిగా తలవంచి,
పాదాభివందనం చేసి,
వారు చూపిన బాటలో పయనించడం మన తక్షణకర్తవ్యంగా భావించాలి.
సమస్త లోకాస్సుఖినో భవంతు!

No comments:

Post a Comment

Total Pageviews