Thursday, July 13, 2017

బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు

*శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు:
1⃣ మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం - 1854(వేప చెట్టు - ప్రస్తుత గురుస్థానం)
షుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం ఖండోబా ఆలయం మఱ్ఱి చెట్టు దగ్గర
2⃣ శరీరం విడిచి మూడు రోజుల తర్వాత గదాధరుని (శ్రీ రామకృష్ణ పరమహంస) అవతారకార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం - Aug 18,1886
3⃣ మహాసమాధి చెందిన సంవత్సరం - Oct 15,1918 ,బూటి వాడాలో మహ సమాది
*షిరిడి లో సాయి బాబావారి" దినచర్య*
శ్రీ సాయిబాబా వారిదినచర్య క్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది.....
1) ప్రతి రోజు ప్రాత:కాల సమయంలో అయిదు గంటలకు ముందే మశీదులో " దుని " అనబడే పవిత్ర అగ్నికి దగ్గరగా సాయి కూర్చూనే వారు.
2) అయిదు గంటల తర్వతకాలకృత్యములను తీర్చుకొని దీనికి దగ్గరగా నిశబ్దముగా కూర్చోనే వారు. భక్తులకు బోధ చేసేవారు.
3) బాబా వారు బోధ కేవలం వాచికంగా అంటే నోటిమాటగా సాగేది. చేతి వేళ్ళసంజ్ఞలతో "యాదే హఖ్" అనుచు తెలియజేసే వారు
4) బాబా వారు ఉ॥8 గం॥లకు గ్రామంలోని ఐదు ఇళ్ళకు బిక్షకై వెళ్లేవారు.
5) బిక్షాన నుండి వచ్చి నాక కొంత ఆహారమును
బక్తులకు, పక్షులకు, జంతువులకు సైతం ఆహరం
పెట్టేవారు.
6) ఉ॥9-30ని॥లకు బాబావారు అబ్దుల్ వెంటరాగా
"లెండి " తోట కు వెళ్లేవారు అక్కడ ఒక గంట గడిపేవారు.
7) అక్కడ నుండి వచ్చి మ॥2 - గం||ల వరకు మశీదులోనే ఉండేవారు, అటైములో భక్తులు హరతి ఇచ్చేవారు.
8) హరతి అనంతరం బాబా ఒంటరిగా కూర్చుని
ఒక చిన్న సంచి బయటకు తీసి 1 పైసా, 1 అణా
బేడా, 4 అణాలు (పావలా), అర్ద 8 అణాలని, బయటకు తీసివేళ్ళతో రుద్ది సంచిలో భక్తుల పేర్లతో మరలా దాచేవారు. ఈ తతంగం అంతాభక్తుల క్షేమం కోసం అనేవారు.
9) బాబా రోజు మొత్తం మీద ఉ॥8-30 - 9 -30
మధ్య, మ॥10-30-11-30లకు, సా॥5-00-6-30
గంటల మధ్య మూడు సమావేశాలు నిర్వహించే వారు అపుడు భక్తులతో మాట్లాడేవారు.
10 ) భక్తుల సందేహాలను తీర్చేవారు.వీరికి అర్దమగు రీతిలో సమాదాన పరచేవారు.
11)రాత్రి కాగానే బాబావారు, చూరుకు ఒకటి లేదా ఒకటిన్నర అడుగుల క్రింద గా నేల నుంచి ఏడు ఎనిమిది అడుగుల ఎత్తులో ఆరడుగుల పొడవు ఒక అడుగు వెడల్పు కలిగిన చక్క బల్ల చినిగిన గుడ్డపేలికలతో వేలాడదీసి దానిపై నిదురించే వారు.
12) ఈ బల్లమీద విశ్రమించడం వింతగా భక్తులు చూసేవారు, దీనికి బాబా వారు విసికి దానిని విరగ
కొట్టి దునిలో పడేసారు.
13) బాబా వారు ఎల్లపుడు శారీరకంగాను, మానశికంగాను, ఉత్సా హంగా మెలుకువగా
అప్రమత్తంగా ఉండేవారు.

No comments:

Post a Comment

Total Pageviews