Friday, July 7, 2017

ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న:

ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న:
నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం లేని ఆత్మ ఎలా ఉంటుంది?
దానికి గురువుగారు అన్నారు,
పాలు ఉపయేగపడేవే, కాని ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి.
పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది. పెరుగు మరొక రోజు వరకు ఉపయోగపడుతుంది.
కాని పెరుగు మరొక రోజుకి పాడైపోతుంది.
పెరుగును మదిస్తే వెన్న అవుతుంది.
వెన్న మరొక రోజు వరకే ఉంటుంది.
తరువాత అదికూడా పాడైపోతుంది.
ఆ వెన్నను మరిగిస్తే నెయ్య అవుతుంది.
ఈ నెయ్య ఎన్నటికి పాడవ్వదు.
ఒక్కరోజులో పాడైపోయే పాలలో, ఎన్నటికి పాడవ్వని నెయ్యి దాగివుంది.
అలాగే అశాశ్వతమైన ఈ శరీరమునందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది.
మానవ శరీరము పాలు
సంకీర్తన మజ్జిగ
సేవ వెన్న
సాధన నెయ్యి.
మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే
ఆత్మ పవిత్రత పొందుతుంది

No comments:

Post a Comment

Total Pageviews