Tuesday, August 30, 2016

నిన్న పోలాలఅమావాస్య పూజకి సంబంధించిన విషయాలు 

తెలుసుకున్నాం కదా....కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.

వ్రత కథ.

ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములుండేవారు. వారికి పెళ్లిళ్లయి భార్యలు కాపురానికి వచ్చారు. చాలామంది పిల్లలతో వారంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. కొంతకాలానికి ఆ ఏడుగురు తోడికోడళ్లూ పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నించారు. కానీ అదేరోజు చివరి కోడలి బిడ్డ మరణించడంతో నోచుకోలేకపోయారు. ఆ విధంగా వారు ఆరేళ్లు నోము నోచుకునే ప్రయత్నాలు చేయటం, చివరి కోడలి బిడ్డ మరణించటమూ జరిగాయి. మిగిలిన ఆరుగురూ ఏడవ ఆమెను దుమ్మెత్తి పోయటం జరుగుతున్నది. అదేవిదంగా  ఏడవ ఏడాది కూడా అందరూ నోము నోచుకొనుటకు అన్ని ప్రయత్నములు చేసుకొన్నారు. పూర్వమువలె ఆఖరి ఆమె బిడ్డ మరణించేను.  అలాగే జరగటంతో చివరికి ఆమె భయపడి, తనని అందరూ తిట్టిపోయుదురని బయపడి  మరణించిన బిడ్డను  గదిలోపెట్టి తాళంవేసి, తక్కినవారితో కలసి నోము నోచుకున్నది వేడుక ముగిసి ఇంటికి తిరిగివచ్చి చివరి కోడలు, తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని ఏడుస్తూ ఊరి చివరికి వెళ్ళి అక్కడున్న పోలేరమ్మ గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవసాగింది.అంతలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి " ఎందుకేడుస్తున్నావు" అని అడిగెను. అందుకామె " అమ్మా! ఏడవక ఏమి చేయమంటావు? ఏడేళ్ళ నుంచి ఏడాది కొకరి  చొప్పున  ఈ పోలేరమ్మకు అప్పగిస్తున్నాను. ఈ  బిడ్డ నేటి ఉదయమే చనిపోయెను. కానీ ప్రతి ఏడు నా పిల్లలు చనిపోవుట.. నోము ఆగిపోవుట   నా తోడి కోడళ్ళు  నన్నుతిట్టుట జరుగుతుండడంతో ఈ ఏడు వారి నోము ఆపుట ఇష్టంలేక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి ,  వారితో కలసి నోమునోచుకొని  ఇప్పుడు శవమును తీసుకుని ఇక్కడకి వచ్చాను "  అన్నది. ఆమాటలను విని పోలేరమ్మ జాలి కలిగి ఆమెకు అక్షింతలను ఇచ్చి, వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట జల్లి.. పేర్లతో చచ్చినవారిని పిలువమని చెప్పి వెళ్ళిపోయెను. ఆమె అమ్మవారు చెప్పినట్లు తనపిల్లలను పాతిన గోతులు మీద అక్షతలను చల్లి , చచ్చినవారిని పేర్లతో పిలువగా ఆ పిల్లలందరూ సజీవులై బయటకి వచ్చిరి. అంట ఆమె సంతోషించి ఆ ఏడుగురు పిల్లలను వెంటపెట్టుకొని ఇంటికి వెళ్ళెను. తెల్లవారేసరికి ఆమె తోడికోడళ్ళు, ఊరిలోనివారు ఆ పిల్లలని చూసి " వీళ్ళు ఎక్కడనుండి వచ్చిరి ? " అని అడుగగా ఏడవకోడలు గతరాత్రి జరిగిన విశేషములను చెప్పెను. ఆమె చెప్పిన మాటలకు అందరూ ఎంతో ఆశ్చర్యపడి  ప్రతి సంవత్సరము " పోలాల అమావాస్య " నోమును  నోచుకొనుచు సుఖసంతోషాలతో ఉండిరి.

కథ చదివినవాళ్ళు, విన్నవాళ్ళు అమ్మవారికి ఈ క్రింది విధంగా దణ్ణం పెట్టుకుని 

"పోలేరమ్మనీ ఇల్లు పాలతోనేతితో అలుకుతానునా ఇల్లు మల,మూత్రాలతో  అలుకు", అంటారు.వినడానికి కొం వింతగావుంటుంది.కాని  అదివారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగాకనిపిస్తుంది  కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు. 

దీనికి ఉద్యాపన ఏమీ లేదు. ఇది అందరూ చేసుకోవచ్చు. ఈ " పోలాల అమావాస్య " నోమును నోచుకొనుట వలన సంతానంలేనివారికి సంతానం కలుగును. సంతానం ఉన్నవారికి కడుపుచలువ కలుగుతుంది.

కనుక మాతృత్త్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన, సౌభాగ్యాలు పొందాలి.

No comments:

Post a Comment

Total Pageviews