Tuesday, August 2, 2016

స్వామి పరిపూర్ణానంద స్వామి
వారితో TV 9 వారు ఎన్ కౌంటర్ కార్యక్రమం
చేసారు దానిలో చర్చ రథయాత్ర , అమ్మ ఒడి
కార్యక్రమాల గురుంచి . ఆ సమయంలో ఒక
క్రైస్తవ పాస్టర్ స్వామి వారితో పోన్ లో ఇలా
ప్రశ్నించాడు. క్రైస్తవ మిషనరీలు ఎన్నో సేవా
కార్యక్రమాలు చేస్తున్నాయు మీ హైందవ
సంస్థలు ఇలాంటివి చేయరు . మంచి
పనులు చేస్తున్న మాపై బురద ఎందుకు
చల్లుతున్నారు అని ఇంకా చాలా అన్నారు దానికి
స్వామి వారు ఇలా సమాదానం చెప్పారు , "అసలు
భారతదేశంలో ఇతర మతస్తులు అడుగు
పెట్టనంత వరకు ఈ దేశంలో పిల్లలకు
"తల్లిదండ్రుల యందు దయలేని
పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా, గిట్టదా!
విశ్వదాభిరామ వినురవేమ!" లేదా
"తల్లిదండ్రులను కావడి లో మోసి సాకిన
శ్రావణకుమారుని కథలు" ఇలాంటివి నేర్పేవారము
ఇంకా ఉమ్మడి కుటుంబాలు, అచార
వ్యవహారాలు ,అతిది మర్యాదలు, అన్ని
జంతువులను భగవత్ భావనతో చూడటం
చేసేవారము. ఎప్పుడైతే ఈ దేశంలోకి విదేశి పైశాచిక
మతాల ప్రవేశం జరిగిందో వారు అప్పటి నుంచి
హైందవ ధర్మాన్ని నాశనం చేస్తూ వచ్చారు .
మాలో మాకు గొడవలు పెట్టారు మతాల వారీగా
మమ్మల్ని విడగొట్టారు. కుటుంబ
వ్యవస్థను విలువలను పాడు చేసారు. అలా
జరగడం వల్ల పిల్లలు తల్లి తండ్రులను
గెంటేయడం , సమాజంలో ఎవరి స్వార్దం వారు
చూసుకోవడం లాంటివి ప్రవేశించి మీరు సేవ
చేయడానికి మనుషులు దొరుకుతున్నారు, కాని
ప్రాచీన హైందవ దేశంలో నువ్వు సేవా
చెద్దామన్నా నీకు మనిషి కనపడదు నీకే అందరు
అతిది సత్కారం చేస్తారు అలాంటి వ్యవస్థను
నాశనం చేసి ఏదో సేవ చేస్తున్నాము అని మీరు
చెప్పడం ఒక మనిషిని చావబాదుతూ మళ్ళి
మందు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని
చెప్పారు. విలువలు లేని జీవితాలు జీవిస్తూ
రోగం వచ్చాక మందు రాసుకునే వారు మీరు,
రోగాలు లేకుండా జీవించే వాళ్లం మేము అని
చాలా అద్బుతంగా అతనికి సమాదానం చెప్పారు
మన స్వామి వారు.

No comments:

Post a Comment

Total Pageviews