Sunday, February 28, 2016

”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం 

భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం వహించునది గాయత్రి,
 సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ 
త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు 
తొమ్మిది వర్ణనలున్నాయి.
1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య
ప్రతిపదార్ధం :

ఓం : ప్రణవనాదం 

భూః : భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, 
మెటీరియలైజేషన్‌

భూవః : రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌ 

సువః : స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌ ఈ మూడు లోకములు మన 
శరీరములోనే వున్నవి. 

తత్‌ : ఆ 

సవితుర్‌ : సమస్త జగత్తును 
వరేణ్యం : వరింపదగిన 
భర్గో : అజ్ఞానాంధకారమును తొలగించునట్టి 
దేవస్య : స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను 
ధీమహి : ధ్యానించుచున్నాను 
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే 
లీనమై ఉన్నవి.

No comments:

Post a Comment

Total Pageviews