Sunday, February 7, 2016

ఒక ఊరిలో ఒక పరమ పండితుడు ఓ పెద్ద భవంతిలో ఉండే వాడు అదే ఇంటి ఎదురుగా ఓ వేశ్య ఓ చిన్న ఇంట్లో ఉండేదట ........ఇద్దరు కూడా మనుషులే కాని పరిస్థితుల్లో తేడాలు ధనిక బీద తనాల్లో తేడాలు ......
ప్రతి రోజు పండితుడు ఆ వేశ్యని ,ఆ ఇంటికి వచ్చేవాళ్ళని తిట్టుకుంటూ ఉండేవాడట ........కాని ఆ వేశ్య మాత్రం దేవుడా ఆ ముందింటి వాళ్ళలాగా నాకు ఓ మంచి జీవితాన్ని ఇచ్చి ఉంటే సదా నీ సేవలో ఉండేదాన్ని కదా అని రోజు కంట తడి పెట్టుకునేదట ........అందుకే అంటారు చేసే పని ఎలాంటిది నిబద్దతతో చెయ్యాలి ఎదుటివారిని ఎలాంటి పరిస్థితుల్లోను కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని ..........జ్ణానిగా ఉండాల్సిన పండితుడు దిగజారి మాట్లాడుతుంటే , అనుకోని పరిస్థితుల్లో చేయకూడని పని చేస్తూ కూడా తనని తన పరిస్థితిని తలచుకునే బాధ పడే ఆ పడతి నిజంగా మంచి మనిషే అని చెప్పుకోవాలి ...........
ఎంతో కష్టపడినా నీకు ఇక్కడ దొరకని అవకాశం అక్కడకు అంత దూరం వెళ్లి చదివేలా చేసాయి .........పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితిలోను మనసుకి మాలిన్యాన్ని తాకనీయకుండా జాగ్రత్త పడుతూ నీలో దాగి ఉన్న అంతర్గత శక్తిని ప్రతిభను వెలికి తీసుకునేందుకు నీకు ఇదే సరైన అవకాశం అనుకొని అన్ని విధాలా నీకు అనుకూలంగా మలచుకునేందుకు పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడంలో ఎన్నడు వెనకడుగు వేయవద్దు .నీ జీవితంలో ప్రాధాన్యతను బట్టి వాటికి కావలసిన ప్రణాళికలు వేసుకోవాలి.నీ బలహీనతలే నీ బంగారు భవితకు అవరోధాలనేది అక్షర సత్యం .
స్నేహం చేయడంలో తప్పులేదు కాని స్నేహం ముసుగులో మోసపూరితమైన ఆలోచనలు చేసే వాళ్ళను గమనించడం కూడా చాలా అవసరం .అలాగే సమస్యని బట్టి సాటి మనిషిగా నీ స్నేహితులకు సహాయపడటం కూడా ఓ మంచి సుగుణం .ప్రతి రోజులో ప్రతి సెకను చాలా అమూల్యమైనది ఆ సమయాన్ని దుర్వినియోగం చేసి తరువాత బాధ పడటంలో అర్ధమే ఉండదు.సమయం సాగిపోతూనే ఉంటుంది .ఆ సమయంతో పోటీ పడి పరుగులు తీస్తూ నలుగురికి ఉపయోగపడే నాణ్యమైన జీవితాన్ని అందుకోవాలని అప్పుడప్పుడు చెప్పాలని అనిపించే కొన్ని మంచి మాటలు
అందుకే అంటారు మనిషి జ్ఞానం ఓ దివ్వె లాంటిది అని .చీకటిలో పెడితే వెలుగుని ఇస్తుంది .దేవుని ముందు పెడితే దైవత్వాన్ని సంతరించుకుంటుంది .అదే దివ్వెను తీసుకు వెళ్లి చనిపోయిన మనిషి తలదగ్గర పెడితే ఆ మనిషి చనిపోయాడని సాక్ష్యమై కనిపిస్తుంది . తోటలో పడి ఉన్న ఎండిపోయిన ఆకుల మద్య పెడితే ఆ తోటనే కాల్చి వేస్తుంది అని .
మనలో ఉన్న జ్ఞానాన్ని ఇనుమడింప చేసుకోవాలి అనుకుంటే మహోన్నతమైన వ్యక్తుల మద్యనే ఉండేలా చేసుకోవాలి అప్పుడే అజ్ఞానమనే చీకట్లను పారద్రోలే జ్ఞాన దీపమై నలుగురికీ వెలుగుని పంచడానికి కావలసిన జ్ఞాన సంపదను పెంచుకునే వాళ్ళం అవుతాం..

No comments:

Post a Comment

Total Pageviews