Wednesday, February 3, 2016

కాకి ముట్టుకుంటేనే పిత్రు దేవతల కు సద్గతి ఎందుకు?

ఎటువంటి వారినైనా సరే భయపెట్టి తనకు అనుగుణంగా మార్చుకునే వాడు రావణుడు తనకంటికి నచ్చిన వస్తువు తనతోనే ఉండాలని కోరుకునే వాడు తన పని నెరవేరడం కోసం ఎన్ని మాటలైనా చెప్పగల మాయావి చివరి కి పంచభూతాలను సైతం గుప్పెట్లో పెట్టుకుని పాలించిన నియంత.

అలాంటి రావణుడు ఒకనాడు యమ ధర్మ రాజు మీద కోపంతో యముణ్ణి వధించడానికి వెళ్ళిపోయాడు ఆ క్షణం లో యముడు భయంతో ఏం చేయాలో తెలియక ఒక కాకి లో ప్రవేశించి ప్రాణం నిలుపుకున్నాడు ఇలా తన ప్రాణాలు కాపాడినందుకు ప్రతి గా ఒక వరం ఇచ్చారు.

పితృ దేవతల కొరకు వదిలిన పిండాలను కాకి ముట్టుకుంటేనే పిత్రు దేవతల కు సద్గతి కలుగుతుంది అని యముని వరం ఉన్న కారణంగా కాకి అంత ప్రాధాన్యత సంతరించుకుంది.
(రామాయణం ఉత్తర కాండ)

No comments:

Post a Comment

Total Pageviews