Saturday, June 27, 2015

చింతామణి, సర్వరోగ నివారిణి అయిన వేపచెట్టు గురించి మంచివిషయాలను తెలుసుకొందామా !!!

వేపాకు, వేపచెట్టు - హిందూ సనాతన ధర్మంలో వేప కు ఒక విశిష్టమైన స్థానం వుంది. భారతీయ పురాణాల ప్రకారం వేపచేట్టును లక్ష్మీదేవి గా భావిస్తారు.
అంతటి ప్రాశస్త్యం  కలిగిన వేపచెట్టు గురించిన కొన్ని విషయాలు:

వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి అరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంటికి వాడే ద్వారబంద్రాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు తదితరవస్తువలన్నింటినీ ఈ వేపచెట్టు కాండంనుండే తయారు చేసుకుని వాడుకుంటున్నాడు. అలాగే వేపాకులను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు వేప, బెల్లం తినాలని శాస్త్రాలు చెపుతున్నాయి. అంటే వేప, బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది. వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. ఆయుర్వేదంలో పేర్కొన్న పిత్త- ప్రకోప లక్షణాలను నివారించడానికి వేప ఆకును ఉపయోగిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలో చరకుడు ఇలా చెప్పాడు.... "ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు". ఇన్ని సుగుణాలున్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా అభివర్ణించవచ్చు. భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు. వేపపువ్వు హిందువులు ఉగాది పచ్చడి లో చేదు రుచికోసం వాడతారు. వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేపనూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ లభించే మహత్తరమైన ఔషధి వేప. కాలుష్యాన్ని నివారించగల వేప సౌందర్య సాధనంగానూ పనికొస్తుంది. చర్మ రోగాలు, పేగుల్లో చేరిన పురుగులు, మధుమేహం వంటి వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. నేటి ఆధునిక కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో వేప బెరడును, ఆకులను వేసి రెట్టింపు పరిమాణం నీళ్లు చేర్చి, చిన్న సెగ మీద నీటి భాగం ఆవిరైపోయేలా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వారానికి ఒకసారి చొప్పున తలకు పట్టించాలి. చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు సాధారణ వైరల్ సంబంధ జ్వరాల్లో వేప చెక్కను కషాయంగా కాచి అరకప్పు మోతాదులో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. నులిపురుగులతో ఇబ్బందిపడేవారు చెంచాడు వేపాకు రసానికి అర చెంచా తేనె చేర్చి తీసుకోవాలి. చర్మ వ్యాధులు కలిగినవారు వేపచెక్క పొడిని త్రిఫల చూర్ణంతో కలిపి చెంచాడు మోతాదులో తీసుకోవాలి. ఆయుర్వేదిక్ ఉపయోగాలు రెండు కప్పుల నీటిలో నాలుగైదు వేపా కులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటిలో ముఖం కడు క్కుంటూ ఉంటే ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు సంతరించుకుంటుంది. మొటి మలు, మచ్చలు తగ్గుతాయి. వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండ చేసి మింగి, పావుకప్పు పెరుగుసేవిస్తుంటే కడుపు, పేగు ల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. మీజిల్స్, చికెన్పాక్స్లాంటి వైరస్ వ్యాధులు తగ్గుతాయి. వారానికి ఒకటి రెండుసార్లు వేప చిగు ళ్లకు రెట్టింపు చింత ఆకు కలిపి నూరి ఉండ చేసి పరగడుపున కరక్కాయ ప్రమాణంలో తీసుకుని పాలు తాగితూ పథ్యం చేస్తే కఠినమైన కామెర్ల వ్యాధి కూడా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గుతుంది. వేపాకు, నెయ్యి సమానంగా తీసుకుని నెయ్యిలో వేపాకు నల్లగా మాడిపోయేట్లు కాచి మొత్తమంతా కాలిపి నూరి నిలువ ఉంచుకోవాలి. రోజూ రెండు సార్లు దీనిని లేపనం చేస్తుంటే వ్రణాలు, దీర్ఘకాలిక పుళ్లు, దుష్ట వ్రణాలు తగ్గుతాయి. పావు స్పూను వేపచెక్క చూర్ణంలో తగినంత పంచదార కలిపి ఉదయం, సాయంత్రం పాలతో తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. మూత్రమార్గ ఇన్ఫెక్షన్ తగ్గి మూత్రమార్గంనుంచి చీము రావడం తగ్గుతుంది. పావు స్పూను వేపచెట్టు బెరడు చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో కలిపి రాత్రంతా నానించి, ఉదయం ఆ నీటిని వడబోసి స్పూను తేనె కలిపి తాగాలి. అలాగే ఉదయం నానబెట్టి సాయంత్రం తాగుతూ ఉంటే రక్త శుద్ధి జరిగి ఒంటి దురదలు, తామర, పుండ్లు, మచ్చలు, గుల్లలులాంటి వివిధ రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి. వేపబంక చూర్ణాన్ని రెండుపూటలా అరస్పూను చొప్పున సేవిస్తుంటే మూత్రాశయ కండరాలు బలోపేతమై అసంకల్పిత మూత్ర విసర్జన తగ్గుతుంది.వేపనూనె, నీరుడు విత్తుల తైలం ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు తీసుకుని వేడి చేసి అందులో ఇరవై అయిదు గ్రాముల వంట కర్పూరాన్ని కరిగించి వివిధ చర్మవ్యాధుల్లో ఉపయోగిస్తారు. నింబాది తైలంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆయుర్వేద ఔషధాన్ని పై పూత మందుగా కుష్టువ్యాధిలో ఎక్కువగా వాడుతారు. ఎండించిన వేపపండ్ల చూర్ణం, ఉప్పు, పొంగించిన పటిక సమంగా కలిపి దంతధావన చూర్ణంగా వాడవచ్చు. వేపపుల్లల బదులు ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు. అరస్పూను వేప గింజల చూర్ణాన్ని రోజూ ఉదయంపూట నీటితో సేవిస్తూ పై పూత మందుగా వేపపప్పును రెండింతలు నువ్వుల నూనెలో వేసి నల్లగా అయ్యేంత వరకూ మాడ్చి సల్లారిన తరువాత కొద్దిగా మైలుతుత్తం కలిపి నిలువ ఉంచుకుని లేపనం చేస్తుంటే మొలలు తగ్గుతాయి. ఒక వారంపాటు ఉదయం పరగడుపునే 5 వేపాలకులు, 5 మిరియాలు కలిపి నమిలి మింగితూ ఉంటే ఆ సంవత్సరమంతా వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్గున్యా వంటి వైరస్ వ్యాధులు తీవ్రరూపం దాల్చే తరుణంలో వాడుకో దగిన దివ్యౌష ధమిది. కాడలను తొల గించిన తాజా వేప పువ్వులను వెడ ల్పాటి పాత్రలో వేసి తగి నంత పంచదార లేదా పటికబెల్లం వేసి బాగా కలిపి ఒక గాజుపాత్రలో వేసి సూర్యరశ్మిలో ఒక నెలపాటు ఉంచితే అంతా కలిసిపోయి చక్కని ఔషధం తయారవు తుంది. వేపగుల్కందుగా పేర్కొనే ఈ ఔషధాన్ని రోజూ పరగడుపున ఒక స్పూను వంతున సేవిస్తుంటే ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు ఉండటం, ముక్కులోనుంచి రక్తం కారడం, ఆకలి మందగించడం, గొంతు ఎండిపోయి నట్లు ఉండటం, రక్త దోషాలు తగ్గిపోతాయి. పొంగించిన పటిక ఒక భాగం, వేపాకులు రెండు భాగాలు కలిపి నీటితో నూరి, కంది గింజంత మాత్రలు చేసుకుని మలేరియా వ్యాధిలో జ్వరం వచ్చే సమయానికి ఒక గంట ముందు, జ్వరం తగ్గిన ఒక గంట తరువాత రెండు రెండు మాత్రల చొప్పున సేవిస్తుంటే మలేరియా తగ్గుతుంది. వేపాకు బూడిదను రసికారే పుళ్లపై చల్లితే అవి త్వరగా మానిపోతాయి. ఈ బూడిదను నెయ్యితో కలిపి రాసుకుంటూ ఉంటే సొరియాసిస్ అనే చర్మవ్యాధిలో సుగుణం కనిపిస్తుందని అనుభవ వైద్యం చెబుతోంది.
భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు.
వేపపువ్వు ను హిందువులు (ఆంధ్రులు, కన్నడిగులు, మహారాష్ట్రులు)ఉగాది పచ్చడి లో చేదు రుచికోసం వాడతారు.
వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.
వేపనూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది.
వేపనూనె ను క్రిమిసంహారి గా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను వేపగింజల నుండి తయారు చేస్తారు.
అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు.
వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు.
ఈ చెట్టు నుండి లభించే కలప, తక్కువ ధరలో తలుపులు, కిటికీలు తయారు చేయటానికి వాడుతారు.వేపచెట్టు అంధ్రప్రదేష్ రాష్ట్రమునకు రాష్ట్ర వ్రుక్షముగా తీసుకోబడినది. వేప తెలుగు సంస్కృతిలో ఒక ముఖ్య భాగం గా వున్నది.ప్రతి సంవత్సరము తెలుగు సంవత్సరాది ఐన ఉగాది నాడు ఉగాది పచ్చడినందు వేప ఖచ్చితంగా ఉండవలసినదే.ప్రతి సంవత్సరము వేపకాయల కాలము నందు గ్రామాలలో చిన్నపిల్లలు మరియు వ్రుద్ధులు వెపకాయలను వేరి అమ్మడం మనం చూడవచ్చు.ప్రతి రైతు తన పొలమునందు ఖచ్చితంగా కనీసం ఒక వేపచెట్టైనా పెంచుకుంటారు.పొలం పని చేసి మధ్యలో వేపచెట్టు కిందే తలవాల్చి నిద్రిస్తాడు.మధ్యాహ్న సమయాన పొలం పని అయిన తరువాత వేపచెట్టు నీడలో కూర్చుని కూలీలు,రైతు,అందరు వాల్ల వల్ల చద్దిమూటలు విప్పి భోజనం చేస్తారు.కొన్ని గ్రామాలలోరచ్చ వేపచెట్టుని దైవంగా భావించి ప్రతి సుభకార్యమునందు మొదటగా వేపచెట్టునే పూజిస్తారు.ఇలా వేపచెట్టు మన సంస్కృతి లో ఒక ప్రధాన భాగమయింది.

No comments:

Post a Comment

Total Pageviews