Tuesday, January 30, 2018

సంపూర్ణ చంద్రగ్రహణం జనవరి 31- 2018.

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం: ఏ రాశులవారిపై ప్రభావం...

ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేదిసూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.

సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని, కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.

ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది...

చంద్ర గ్రహణం భారతదేశంతో సహ ఆసియా ఖండం, అమెరికా, యూరప్ ఈశాన్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతములందు చంద్ర గ్రహణం కనబడుతుంది.


ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక, సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది.

భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.

చంద్రగ్రహణం వేళలు ఇవీ...

సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం

సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణంరాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపురాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం )గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు.

సంపూర్ణ సూర్య బింబ దర్శన కాలం మొత్తం"76"నిమిషాలు.



గ్రహణ గోచారం ఇలా...

ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశిఅవటం చేత ఈ రెండు రాశులవారు మరియు పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది.

ఏ రాశివారిపై ఏ ప్రభావం

ధనస్సు-మేషం-కర్కాటక-సింహ రాశుల వారికి అధమ ఫలం.

వృశ్చిక-మకర-మీన-మిధున రాశుల వారికి మధ్యమ ఫలం.

కన్య-తుల-కుంభ-వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు.

గ్రహణం ఎవరికైనా గ్రహణమే కావునా ద్వాదశ రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది.

చంద్రగ్రహణ నిబంధనలు ఇవీ..

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు, టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భగవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.
👉 గర్భిణిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును, ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు
.గ్రహణ సమయంలో మల, మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు, అది వాస్తవం కాదు యదావిధిగా మల, మూత్ర విసర్జన చేయవచ్చు. .

ఆ వేళలో ఆహార పానీయ నియమాలు

అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.

గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.

ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు.

కారణము ఏమనగా గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పదార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి.

అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిధానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు.

శాస్త్రీయ పద్ధతి అవసరం

గ్రహణ సమయంలో శాస్త్రీయ పధ్ధతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి, జిజ్ఞాస ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలో ఫలితం లభిస్తుంది.

ముసలివారు, చిన్నపిల్లల్లు, గర్భిణిలు, అనారోగ్యంతో ఉన్నావారు చేయకూడదు. చేయనిచో ఏమో అవుతుందనే భయపడకండి.ఏమీ కాదు

తర్వాత ఇలా చేయాలి.

గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవున్ని శుద్ధి చేసుకోవాలి.

విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.

జంద్యం(గాయత్రి) వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.

ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోకంగా కూశ్మాండా (గుమ్మడికాయ)పూజ విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి.

మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు, పూజలు చేయించుకున్న తర్వత ఆవునకు తోటకూర, బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి, పేదలకు ఏదేని ఆహర, వస్త్ర, వస్తు రూపంలో దానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహబాధలు కొంతవరకు నివారణ కలిగి భగవదనుగ్రహం కలుగుతుంది.🙏🙏🙏

No comments:

Post a Comment

Total Pageviews