Thursday, January 25, 2018

చిన్నప్పుడు విన్న కథలు.. మరొక్కసారి గుర్తుచేసుకొందాం!!!

తోటకూర నాడే...

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేదరాలు వుండేది. ఆమెకు ఒక్కడే కొడుకు. ఒక రోజు వాడు ఒకరితోటలో పెరిగిన తోటకూర మొక్కల్ని దొంగతనంగా పెళ్లగించుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లి కూరకు పనికివస్తుంది కదా అనుకొని సంతోషించింది. కానీ ఈ మొక్కలు ఎక్కడివి? ఎవరైనా దయతో ఇచ్చారా? లేక దొంగతనంగా తెచ్చావా అని కొడుకుని ప్రశ్నించలేదు.

అప్పటి నుంచి వాడుదొంగతనాలకుఅలవాటుపడ్డాడు.దురలవాట్లకు లోనయ్యాడు. క్రమంగా పెద్ద దొంగగా మరి దొంగతనాలు, దోపిడీలు చేసేవాడు. ఆ గొడవల్లో అనేకసార్లు దెబ్బలు తినేవాడు. ఆ దొంగతనాలు, దోపిడీలు చేసే సందర్భాలలో ఎదురు తిరిగిన కొందరిని చంపాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు నేరాలు రుజువైనాయి న్యాయమూర్తి అతనికి ఉరి శిక్ష విధించాడు.

ఉరి తీసేముందు " నీ కడసారి కోర్కె కోరుకోమని " తలరి చెప్పాడు "మా అమ్మతో ఒక్కసారి మాట్లాడనివ్వండి" అన్నాడు. కొడుకు ఏం చేబుతాడోనని తల్లి ఏడుస్తూ వచ్చింది. నీకు ఒక రహస్యం చెబుతా చెవిలో అన్నాడు. ఏమి రహస్యం చేబుతాడోనని ముందుకు వంగింది.అంటే కసుక్కున ఆమె చెవి కోరికేసాడు.ఆమె అమ్మో అని ఏడుస్తుండగా....నేను తోటకూర తెచ్చిననాడే నాకు బుద్ధి చెప్పివుంటే నాకు ఈరోజు ఈగతి పట్టేది కాదుగా అని భాధగా అంటాడు దొంగ.

*********************************************************************************

* అత్యాశ పనికిరాదు *
అనగనగా ఒక ఊర్లో వెంకన్న అనే అతను చేపలు పట్టి జీవనం సాగించేవాడు. అతడు చేపలు పట్టి జీవనం సాగించలేక ఒక తపస్సు చేసాడు. అతని తపస్సుకు మత్స్య దేవత సంతోషించి " వరం కోరుకో " అంటే అతడు ఆనందంతో ఏమి అడగాలో తెలియక ఇంటికివెళ్ళి నా భార్యను అడిగివస్తాను అని ఇంటికివెళ్ళి వస్తాడు.
ఏమి కావాలి అని మత్స్యదేవత అడగగా " నా భార్యకి ఒంటినిండా నగలు, పట్టుచీరలు కావాలని అడిగింది." అని చెపుతాడు. అదివిన్న దేవత '' తధాస్తు " అని నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నన్ను తలచుకో అని మాయమైపోతుంది.అయితే అంతరితో వెంకన్న భార్య తృప్తి చెందక "మన ఇల్లు మేడకావాలి, ఇంటినిండా నౌకర్లు ఉండాలి, ఏ లోటు లేకుండా కాలం గడిచిపోవాలి " అని దేవతను మల్లి అడిగిరమ్మని భర్తను పంపింది. వెంకన్న దేవతను తలచుకొంటే ప్రత్యక్షమై అతడు కోరిన వరం కుడా ఇచ్చింది.
కానీ అప్పటికీ తృప్తి చెందని వెంకన్న భార్య "ఈ దేశపు రాజు - రాణి మన ఇంట్లో ఊడిగం చెయ్యాలని దేవతను అడిగిరమ్మని మూడోసారి భర్తను దేవత వద్దకు పంపించింది. ఆ మాటలు విన్న దేవత కోపగించి " ఇలాంటి కోరిక కోరినందుకు మీ మేడ మళ్లీ గుడిసె అవుతుంది. నౌకర్లు,నగలు, చీరలు మాయమౌతాయి అన్నది.దేవత అన్నట్లే జరిగింది.
నీతి:- అత్యాశ పనికిరాదు.

No comments:

Post a Comment

Total Pageviews